Poultry Industry
-
ఉపాధికి ‘బర్డ్ ఫ్లూ’ దెబ్బ!
సాక్షి, అమరావతి: ‘బర్డ్ఫ్లూ’ వ్యాధి పౌల్ట్రీ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. వేలాది కార్మికుల కుటుంబాలు జీవనోపాధిలేక రోడ్డున పడ్డాయి. ఈ వ్యాధి ప్రభావంతో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడడంతో పెద్ద సంఖ్యలో పౌల్ట్రీ ఫారాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఐదు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం.. రాష్ట్రంలో 1,200కు పైగా పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి. ఇందులో వెయ్యికి పైగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిల్లో 5.60 కోట్ల కోళ్లున్నాయి. ప్రతిరోజూ 4.75 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి ఫామ్లోనూ 10–25 మంది ఉపాధి పొందుతుంటారు. వీరంతా ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే. వీరు ఫామ్స్ వద్దే ఉంటూ వాటి నిర్వహణను చూసుకుంటుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, ఏలూరు జిల్లా బాదంపూడి, ఎన్జీఆర్ జిల్లా గంపలగూడెంతో పాటు కర్నూలు జిల్లా ఎన్ఆర్ పేటలలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి లక్షలాది కోళ్లు, బాతులు మృత్యువాతపడ్డాయి. ఈ ఐదు గ్రామాల్లోని కోళ్ల ఫారాల పరిధిలో కిలోమీటరు ప్రాంతాన్ని రెడ్ జోన్గా.. 10 కి.మీ. వరకు అలెర్ట్ జోన్గా ప్రకటించారు. రెడ్జోన్ పరిధిలో సుమారు 30కి పైగా ఫామ్స్ మూసివేసి వాటిలో ఉండే సుమారు ఆరున్నర లక్షలకు పైగా కోళ్లను చంపి పాతిపెట్టేశారు. లక్షల సంఖ్యలో కోడిగుడ్లను కూడా ధ్వంసం చేశారు. పది కిలోమీటర్ల పరిధిలో కూడా పదుల సంఖ్యలో కోళ్ల ఫారాలను మూసివేశారు. అలాగే, సరై్వలెన్స్ జోన్ పెట్టి 24 గంటలూ వాటిల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తున్నారు. వివక్షకు గురవుతున్న కార్మికులు.. ఇక బర్డ్ ఫ్లూ ప్రభావం రెడ్, అలెర్ట్ జోన్ పరిధిలోని సుమారు 10–15 వేల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెడ్ జోన్లో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్లో పనిచేసే కార్మికుల రక్తనమూనాలు సేకరిస్తుండడంతో చుట్టుపక్కల ప్రజలు వారిని దూరంపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. వీరిలో ఏ ఒక్కరికీ వైరస్ లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించినప్పటికీ వివక్షకు గురవుతున్నారు. అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో.. చేసేదిలేక కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లిపోతుండగా, పొరుగు జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు తిరుగుముఖం పడుతున్నారు.ప్రోత్సాహమివ్వని ఏపీ సర్కారు..ఇదిలా ఉంటే.. బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూసిన జిల్లాల్లో రెడ్, అలెర్ట్ జోన్ పరిధిలోని పౌల్ట్రీ ఫారాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్మికుల్లేక వెలవెలబోతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో.. మేత ధరలు అమాంతం పెరిగిపోవడంతో అవి 75 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. మరోపక్క.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్డుకు ధరలేకుండా చేస్తున్నారు. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండగా ఏపీలో మాత్రం ప్రభుత్వం తీరు పౌల్ట్రీ పరిశ్రమకు శాపంగా తయారైంది. దీంతో రాష్ట్రంలో ఈ రంగం మరింత కుదేలవుతుంది. -
వేడికి ‘కోడి’ విలవిల!
సాక్షి, భీమవరం: మండుతున్న ఎండలు పౌల్ట్రీ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక ఫారాల వద్ద వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోట్లలో నష్టం వాటిల్లి పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కోస్తాలోని ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుడ్లు పెట్టే లేయర్ కోళ్లు నాలుగు కోట్ల వరకు ఉండగా, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కోటి వరకూ ఉన్నాయి. గుడ్లు పెట్టే దశకు చేరువలోని బ్రోయర్, చిక్స్ మూడు కోట్ల వరకు ఉంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో సాధారణంగా రోజుకు 60 నుంచి 80 కోళ్లు వరకు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య 450 నుంచి 500 వరకు చేరింది. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ తట్టుకుంటాయి. గత మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది కోళ్ల మరణాలు పెరిగాయి. కోస్తా ప్రాంతంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకు నష్టం వాటిల్లుతుంది.. ఈ మేరకు గత మూడు రోజుల్లో రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల కోళ్లు చనిపోగా పరిశ్రమకు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. పడిపోయిన గుడ్ల ఉత్పత్తి ఎండల తీవ్రత వల్ల గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు 4.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా వడగాలుల తీవ్రతకు ఆ ఉత్పత్తి 3.49 కోట్లకు తగ్గిపోయింది. డ్రాపింగ్ కారణంగా రోజుకు 61.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.4.85 ఉండగా.. రోజుకు రూ.2.98 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.8.95 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లకు ఉపశమన చర్యలతో ఖర్చులు పెరిగిపోయాయి.వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులివ్వడం, ఫారాల్లో వాతావరణాన్ని చల్లబర్చేందుకు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు.. పెరిగిన మేత ధరలు, కూలి రేట్లతో నిర్వహణ భారం మారిందని కోళ్ల రైతులంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా లేక స్థానిక వినియోగం తగ్గి గుడ్డుకు రైతు ధర పతనమవుతోందని చెబుతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎండల తీవ్రతకు కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రభుత్వం ఆదుకోకుంటే కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. ఎఫ్సీఐ, సివిల్ సప్లయిస్ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు ప్రభుత్వం అందజేయాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
Chicken: చికెన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
ఖమ్మం: చికెన్కు డిమాండ్ పెరిగింది. నిన్న, మొన్నటి వరకు కిలో రూ.220 నుంచి రూ.250 వరకు ఉన్న చికెన్ ధర ఆదివారానికి ఒక్కసారిగా పెరిగింది. ప్రాంతం, డిమాండ్ ఆధారంగా కిలో చికెన్ రూ.300 పైగానే విక్రయిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్ కావటంతో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగానికి తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. దాణా ధరలు, కోడిపిల్లల ధరలు పెరగటం, వేసవిలో నిర్వహణ ఖర్చులు పెరగటం కూడా చికెన్ ధరలు పెరగటానికి కారణాలుగా కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్పత్తి పడిపోయింది.. ప్రస్తుతం చికెన్కు ఉన్న డిమాండ్కు తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి జరగటం లేదు. మార్కెట్లో వ్యాపారుల నుంచి ఆర్డర్లు పెరగటంతో అందుకు అనుగుణంగా ఉత్పత్తులు లేకపోవటంతో కంపెనీలు రేట్లు పెంచుతున్నాయి. పరిశ్రమల వద్ద లైవ్ బర్డ్ ధర పెరగటంతో దాని ప్రభావం చికెన్ ధరపై పడుతోంది. నెల రోజుల కిందట తెలంగాణ కుంభమేళాగా జరిగిన మేడారం జాతరతో కోళ్లు, చికెన్ ధరలు పెరిగాయి. జాతర తరువాత తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. నెల రోజులకు పైగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుండటంతో మాంసాహారాల వినియోగం బాగా పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో నిత్యం 80 నుంచి 90 టన్నుల వరకు చికెన్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా. ఒక్క ఖమ్మం నగరంలోనే దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు వినియోగం ఉన్నట్లు వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో 60 లక్షలకు పైగా కోళ్లను పెంచేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత అనుభాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం 40 నుంచి 45 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగానికి తగిన విధంగా ఉత్పత్తి లేకపోవటంతో ధర ౖపైపెకి పోతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లతో.. ప్రస్తుతం హిందూ, ముస్లింల పండుగలైన ఉగాది, రంజాన్లు ఓ వైపు, మరో వైపు పెళ్లిళ్ల సీజన్ కావటంతో చికెన్కు బాగా డిమాండ్ పెరిగింది. మంగళవారం ఉగాది పండుగ, గురు, శుక్రవారాల్లో రంజా న్ పండుగ ఉండటంతో చికెన్కు వ్యాపారుల నుంచి ఆర్డర్లు బాగా పెరిగాయి. ఇదే తరుణంలో పెళ్లిళ్లు ఉండటంతో ఆ డిమాండ్ కూడా కొనసాగుతోంది. శుభ ముహూర్తాల కాలం కావటంతో ప్రతి ఇంటా ఉప్పలమ్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో చికెన్కు ధరలు పెరుగుతున్నాయి. మొక్కజొన్న వంటి పంటల ఉత్పత్తి తగ్గిపోవటంతో దాణా ధర పెరిగింది. ఇక హేచరీస్లో కోడి పిల్లల ధర పెరిగింది. రూ.25 నుంచి రూ.30 ఉన్న కోడి పిల్ల ధర ప్రస్తుతం రూ.53గా పలుకుతోంది. ఇక నిర్వహణ ఖర్చులు పెరిగాయి. వేసవిలో కోళ్ల పరిశ్రమల నిర్వహణకు అదనంగా ఖర్చవుతుంది. ఏసీల వినియో గం పెరగటంతో నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఇక ప్రస్తుతం 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్లు తట్టుకోలేవు. ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కాలం కావటంతో కోళ్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని భావించి నిర్వాహకులు, రైతులు కోళ్ల పెంపకానికి వెనుకంజ వేస్తున్నా రు. ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోతే కోలుకోలేని దెబ్బ పడుతుంది. కోళ్లు సాధారణంగా 40 రోజుల్లో 2.3 కిలోల బరువు పెరుగుతుంది. కానీ, వేసవిలో 48 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఒక కోడి పెంపకానికి రూ.125 నుంచి రూ.135 వరకు ఖర్చవుతోంది. కంపెనీలు ప్రస్తుతం రూ.140 వరకు విక్రయిస్తున్నాయి. దీంతో రిటైల్గా స్కిన్లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిండగా, విత్స్కిన్ రూ.280 గా, లైవ్కోడి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తి లేకనే.. కోళ్ల ఉత్పత్తి లేకనే చికెన్ ధరలు పెరిగాయి. వివిధ కారణాలతో కోళ్ల పెంపకం తగ్గింది. వేసవిలో కోళ్ల పెంపకం భారంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. కోడిపిల్ల ధర బాగా పెరిగింది. వేసవిలో పెంపకం ఇబ్బందిగా ఉంటుంది. నిర్వహణ ఖర్చులు పెరిగాయి. డిమాండ్ తగిన ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెంచడం అనివార్యమైంది. – రావి బాబూరావు, పౌల్ట్రీ పరిశ్రమ యజమాని, ఖమ్మం చికెన్ ధర ప్రియం చికెన్ ధర ప్రియంగా మారింది. గతంతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు ధరకు చేరింది. కిలో చికెన్ ధర రూ.300 కావటంతో వినియోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. ప్రతి ఆదివారం చికెన్కు రూ.200 నుంచి రూ.220 వరకు వెచ్చిస్తాం. అలాంటిది రూ.300 పెట్టినా కేజీ రావటం లేదు. మటన్ ధరతోపాటు చికెన్ ధర కూడా అందుబాటులో లేకుండా పోతోంది. – శీలం కార్తీక్, నాయుడుపేట, ఖమ్మం -
Egg Prices: అ‘ధర’హో.. రూ.6 పలికిన గుడ్డు .. ప్రస్తుతం 3.65
గుడ్డు.. అ‘ధర’గొడుతోంది.. ధర నిలకడగా సాగుతూ పరిశ్రమకు ఊతమిస్తోంది.. కోవిడ్ కాలంలో వచ్చిన వదంతులతో సంక్షోభంలో చిక్కుకున్నా.. ఆ తర్వాత కోలుకుని ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 250 వరకు పౌల్ట్రీలు ఉండగా వాటిలో సుమారు 1.20 కోట్ల మేర కోళ్లు పెరుగుతున్నాయి. వీటి ద్వారా రోజుకు కోటి గుడ్లు వరకు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో 80 శాతం మేర కోడిగుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం, బిహార్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిన 20 శాతం స్థానికంగా వినియోగిస్తుంటారు. తణుకు (పశ్చిమ గోదావరి): కరోనా విపత్తు నుంచి జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ బయటపడుతోంది. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. చికెన్, గుడ్డు వినియోగం తగ్గింది. దీంతో ఒక్కసారిగా పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పట్లో చికెన్ ధర పతనం కాగా గుడ్డు ధర సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.2.25కు పతనమైంది. అయితే కరోనా కట్టడిలో పౌష్టికాహారం అయిన కోడిగుడ్లు, చికెన్ ప్రాధాన్యం పెరగడంతోపాటు ప్రభుత్వం, వైద్యులు సైతం అవగాహన పెంచడంతో పౌల్ట్రీకు కలిసి వచ్చింది. అనంతర కాలంలో గుడ్డు, చికెన్ వినియోగం పెరగడంతో వాటి ధరలు సైతం గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఏడాదిగా కోడిగుడ్డు నెక్ ధర రూ.5 పైగా పలుకుతూ వస్తోంది. ఇటీవల బహిరంగ మార్కెట్లో రూ.6 ధర ఉండగా ప్రస్తుతం నెక్ ధర రూ.3.65 వద్ద కొనసాగుతోంది. తగ్గిన ఉత్పత్తి జిల్లాలో 250 వరకు పౌల్ట్రీలు ఉండగా వీటిల్లో సుమారు 1.20 కోట్లు కోళ్లు పెరుగుతున్నాయి. వీటి ద్వారా రోజూ కోటి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో 80 శాతం మేర కోడిగుడ్లు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. 20 శాతం స్థానికంగా వినియోగిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లుగా రైతులు పెద్ద సంఖ్యలో కోళ్లు వదిలించుకుని చేతులు దులుపుకున్నారు. తర్వాత బ్యాచ్లు వేయకపోవడంతో దాదాపు సగం మేర కోళ్ల ఫారాలు ఖాళీ అయ్యాయి. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి సైతం సగానికి పైగా పడిపోయింది. మరోవైపు కరోనా వదంతులతో ఎగుమతులు నిలిచిపోవడంతో స్థానికంగా వినియోగం కూడా భారీగా తగ్గింది. ఈ పరిస్థితుల్లో 2020 మార్చిలో గుడ్డు ధర రూ.2.25 కనిష్ట స్థాయికి దిగజారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కోగుడ్డు ఉత్పత్తి ధర రూ.3.75 అవుతుంది. ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకోవడంతో గుడ్ల ఉత్పత్తి పెరిగింది. మరోవైపు నెక్ ప్రకటించిన ధరకు వ్యాపారులు తమ వద్ద నుంచి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసిన కృషితో పౌల్ట్రీ పరిశ్రమ మరోసారి నిలదొక్కుకుంది. కోవిడ్ కారణంగా సంక్షోభంలోకి వెళ్లిన పౌల్ట్రీ పరిశ్రమను గట్టెక్కించేందుకు పౌల్ట్రీ అసోసియేషన్తో కలిసి గతంలో చికెన్, ఎగ్ మేళాలను ప్రభుత్వం నిర్వహించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం తగ్గింది. మరోవైపు స్థానికంగా గత నెలలో ఎండలు పెరుగడటంతో కోళ్లు మేతతో పోల్చితే నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కోడిగుడ్డు పెంకు పటిష్టత తగ్గుతోంది. దీంతో గుడ్డు నాణ్యత తగ్గి ఎగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇదే వంకతో పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారులు గుడ్డు ధరను తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్డు ధర రూ.4 ఉంటేనే గత నష్టాలను భర్తీ చేసుకునే వీలుంటుందని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. మరోవైపు పౌల్ట్రీ రైతులకు వడ్డీ రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం రెండేళ్ల క్రితం కోవిడ్ కారణంగా కోళ్ల పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అయితే ఇటీవల కాలంలో గుడ్డు వినియోగం పెరగడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. గుడ్డు ధర నిలకడగా ఉంటే నష్టాల నుంచి గట్టెక్కుతాం. పౌల్ట్రీ రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – పెన్మత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, కావలిపురం, ఇరగవరం మండలం -
పౌల్ట్రీలకు వడదెబ్బ.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
మండపేట(కోనసీమ జిల్లా): మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కోళ్ల రైతుల పరిస్థితి. ఎగుమతులకు ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీ, పెరిగిన మేత ధరలతో కుదేలైన కోళ్ల పరిశ్రమను మండుతున్న ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక రోజుకు దాదాపు లక్ష కోళ్లు మృత్యువాత పడుతుండగా, 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమకు రోజుకు రూ.2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. చదవండి: ప్రమాదాలకు చెక్.. వాటేన్ ఐడియా.. డ్రైవర్ రాజా..! నష్టాల మోత తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకూ ఉండగా, మిగిలిన దశల్లోని కోళ్లు 1.2 కోట్ల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 23 వేల నుంచి 25 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత తట్టుకుంటాయి. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవడంతో కోళ్ల మరణాలు పెరగడంతో పాటు గుడ్లు ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఎండలతో కోళ్ల మరణాలు మూడు రెట్లు పెరిగినట్టు పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 93.5 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని రైతులు అంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సగటున సుమారు రూ.150 మేర నష్టపోవాల్సి వస్తోంది. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం నెక్ ప్రకటిత రైతు ధర రూ.3.15 ప్రకారం చూస్తే.. 16.5 లక్షల గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వలన రైతులు రూ.51.98 లక్షల మేర నష్టపోవాల్సి వస్తోంది. కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ. 2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. నిర్వహణ తడిసి మోపెడు.. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసి మోపెడవుతోందని రైతులంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా వాటికి ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా షెడ్లు చుట్టూ గోనె సంచులు కట్టి, వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో జిల్లా ఎగుమతులకు డిమాండ్ పడిపోయింది. మరోపక్క మేత ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గుడ్డు ధర గిట్టుబాటు కాక ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అధిక ఎండలతో గుడ్ల డ్రాపింగ్, కోళ్ల మరణాలు పరిశ్రమను మరింత నష్టాల పాలు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభంలో కూరుకుపోతోంది.. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు నాలుగు రెట్లు పెరిగిపోయాయి. 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. వడ్డీ రాయితీ, ఎఫ్సీఐ నుంచి సబ్సిడీపై మేతలు అందించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కర్రి వెంకట ముకుందరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్, కొమరిపాలెం ప్రభుత్వం గట్టెక్కించాలి ఇటీవల ఒడిశాలో ఏపీ గుడ్ల ఎగుమతులను అక్కడి ట్రేడర్స్ అడ్డుకున్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అదే విధంగా ప్రస్తుత సంక్షోభం నుంచి పరిశ్రమ గట్టెక్కేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -పడాల సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌల్ట్రీ ఫెడరేషన్, అర్తమూరు -
పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోండి: నెక్
హైదరాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న ఫీడ్ ధరలతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ (నెక్) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు మానవ వినియోగానికి పనికిరాని 2 మిలియన్ టన్నుల మొక్క జొన్న, గోధుమ, సొయా వంటి కోళ్ల దాణాను పరిశ్రమకు కేటాయించాలని అభ్యర్ధించింది. -
గుడ్డుకు గడ్డు కాలం.. రోజుకు రూ.1.05 కోట్లు నష్టం
మండపేట(తూర్పుగోదావరి): పౌష్టికాహారాన్ని అందించే గుడ్డు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో జిల్లా ఎగుమతులకు డిమాండ్ లేక రైతు ధర పతనమవుతోంది. కోడి మేత ధరలు పెరిగిపోగా, గుడ్డు ధర గిట్టుబాటు కాక పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. గుడ్డు ధర రూపంలో జిల్లాలోని పరిశ్రమకు రోజుకు దాదాపు రూ.1.05 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. మరోపక్క ముదురుతున్న ఎండలు కోళ్ల రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీ ఫాంలు ఉండగా వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు దాదాపు 1.4 కోట్లు వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. చదవండి: AP: మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ గుర్తింపు ఎగుమతులే పౌల్ట్రీకి ప్రధాన వనరుగా ఉన్నాయి. 60 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా పశి్చమ బెంగాల్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించడం జిల్లా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. అక్కడి పౌల్ట్రీల నుంచి ఎదురవుతున్న పోటీతో అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిలో కోళ్ల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి ట్రేడర్లు గుడ్డు ధరను మరింత తగ్గించేస్తున్నారు. నెక్ ప్రకటిత ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తున్నారు. పౌల్ట్రీకి సీజన్గా భావించే శీతాకాలంలోనూ రైతు ధర ఈ ఏడాది రూ.5 దాటకపోవడం పౌల్ట్రీ దుస్థితికి అద్దం పడుతోంది. చుక్కల్లో మేత ధరలు కోడి మేతకు వినియోగించే మేతల ధరలు చుక్కల్లో చేరాయి. రెండు నెలల క్రితం రూ.38గా ఉన్న సోయా రూ.110కి చేరుకోగా, జీఎన్ కేకు రూ.35 నుంచి రూ. 110కి, మొక్కజొన్న రూ.14 నుంచి రూ. 25కు, డీఓబీ రూ.9 నుంచి రూ.18కి, ఎండు చేప రూ.30 నుంచి రూ.60కి, నూకలు రూ.13 నుంచి రూ.20కి పెరిగిపోయాయి. గుడ్డు రైతు ధర పతనమవుతుండగా పౌల్ట్రీల నిర్వహణ వ్యయం పెరిగిపోవడం పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేస్తుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుడ్డు ఉత్పత్తికి దాదాపు రూ.4.75 వ్యయమవుతుండగా నెక్ ప్రకటిత రైతు ధర రూ.3.79 మాత్రమే. ఈ మేరకు రోజుకు రూ.1.05 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. వేసవి మొదలు కావడంతో ఇప్పటికే సాధారణ స్థాయికి మించి కోళ్ల మరణాలు సంభవిస్తుండగా, గుడ్ల ఉత్పత్తి తగ్గనుంది. ఎండలు ముదిరేకొద్ది గుడ్డు రైతు ధర, కోళ్ల మరణాల రూపంలో నష్టాలు పెరిగి కోళ్ల పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ దృష్టికి పౌల్ట్రీ సమస్యలు పౌల్ట్రీ సమస్యలపై ఇటీవల అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కేవీ ముకుందరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, ఆదుకొనేందుకు రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని, సబ్సిడీపై మేతలు అందజేయాలని, విద్యుత్లో రాయితీ ఇవ్వాలని, ఇతర సదుపాయలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూల స్పందన పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డితో కలిసి సీఎం జగన్ను కోరగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు. సమస్యపై నివేదికను అందజేయాలని సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. – కేవీ ముకుందరెడ్డి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు, కొమరిపాలెం. సంక్షోభంలో కూరుకుపోతోంది మేత ధరలు పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవక కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న సీఎం జగన్, ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. – పడాల సుబ్బారెడ్డి, నెక్ జాతీయ కమిటీ సభ్యులు, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
పాడి, పౌల్ట్రీ రంగాలకు విద్యుత్ సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: పాడి, పౌల్ట్రీ రంగాలను అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ప్రకటించింది. విజయ డెయిరీ విద్యుత్ చార్జీలపై యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇవ్వనుంది. ఈ మేరకు పాడి, పశు సంవర్ధక, మత్స్యశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని డెయిరీ ఫారమ్లు, డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు, లేయర్ ఫారమ్లు, బ్రాయిలర్ ఫారమ్లు, హ్యాచరీస్, ఫీడ్ మిల్స్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఒక్కో యూనిట్ విద్యుత్పై రూ.2 చొప్పున సబ్సిడీ పొందడానికి అర్హులను తెలిపింది. అర్హులైన డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లు https://elaabh telangana gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించింది. -
చికెన్ కేజీ ధర సగం తగ్గింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 దెబ్బతో పౌల్ట్రీ పరిశ్రమ కష్టాల కడలి ఈదుతోంది. కరోనా వైరస్ వ్యాప్తికి చికెన్ కారణమంటూ గత ఏడాది ప్రారంభంలో పుకార్లు వచ్చిన కారణంగా అమ్మకాలు 75 శాతం పడిపోయి ధర కిలోకు రూ.30కి చేరిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల తర్వాత పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో సెకండ్వేవ్ రూపంలో దెబ్బతీసింది. ఇప్పటికే చికెన్ వినియోగం 30 శాతం తగ్గింది. తాజాగా కర్ఫ్యూ, లాక్డౌన్లతో పరిశ్రమకు కొత్త సవాల్ విసిరింది. కిలోకు రూ.40 దాకా నష్టం.. గతేడాది ఫామ్ గేట్ వద్ద బ్రాయిలర్ కోడి కిలోకు ధర సగటున రూ.85 నమోదైంది. ప్రస్తుతం ఇది రూ.60–65 మధ్య ఉంది. ఉత్పత్తి వ్యయం ఏడాదిలో కిలోకు రూ.20–25 అధికమై ఇప్పుడు రూ.95–100కు చేరిందని స్నేహా ఫామ్స్ సీఎండీ డి.రామ్రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ లెక్కన కిలో కోడికి రైతుకు రూ.40 దాకా నష్టం వాటిల్లుతోందని చెప్పారు. గతేడాది నుంచి పరిశ్రమ నష్టాలను మూటగట్టుకుంటోందని వెల్లడించారు. ‘మొక్కజొన్న టన్నుకు ఏడాదిలో రూ.15,000 నుంచి రూ.17,000కు, సోయా రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది. దీంతో దాణా వ్యయం అదే స్థాయిలో అధికమైంది. కోళ్లకు వాడే మందులు రష్యా, చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. వీటి ధరలు 30 శాతం పెరిగాయి’ అని వివరించారు. క్రమంగా తగ్గుతున్న వినియోగం.. సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రోజుకు 15–16 లక్షల కోళ్లు అమ్ముడవుతాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ వాటా 6 లక్షలు. ఇప్పుడీ వినియోగం 12 లక్షల కోళ్లకు వచ్చి చేరింది. కోవిడ్ ముందు వరకు మొత్తం చికెన్ అమ్మకాల్లో హోటళ్లు, ఫంక్షన్ల వాటా 25 శాతం ఉండేది. ప్రస్తుతం ఇది 5 శాతానికి వచ్చింది. వైరస్ ఉధృతితో శుభకార్యాలు దాదాపుగా వాయిదా పడ్డాయి. కొద్ది రోజుల క్రితం వరకు జరిగినా పరిమిత సంఖ్యలో అతిథులతో వేడుకలు కొనసాగాయి. ఇప్పుడు లాక్డౌన్ తోడు కావడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. కేజీ ధర సగం తగ్గింది.. రిటైల్లో స్కిన్లెస్ చికెన్ ధర ఈ ఏడాది కిలోకు కనిష్టంగా రూ.140 పలికితే.. గరిష్టంగా రూ.300 వరకు వెళ్లింది. ప్రస్తుతం రూ.150–180 మధ్య ఉంది. అంటే ఈ ఏడాది అమ్ముడైన గరిష్ట ధరతో పోలిస్తే కిలోకు దాదాపు సగం తగ్గిందన్న మాట. 2019లో ధర రూ.340 దాకా పలికిందని హైదరాబాద్లోని విజయనగర్ చికెన్ సెంటర్ యజమాని బండి సాయి కిరణ్ తెలిపారు. కోవిడ్కు చికెన్ కారణమంటూ పుకార్లు రావడంతో గతేడాది ఫిబ్రవరి–మార్చిలో కిలో ధర రూ.30కి పడిపోయిందని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా రూ.260 వరకు వెళ్లిందన్నారు. వైరస్ భయంతో ప్రస్తుతం జనాలు బయటకు రావడం లేదని, హోటళ్ల వ్యాపారం తగ్గడంతో చికెన్ అమ్మకాలు క్షీణించాయని చెప్పారు. విలువ రూ.90,000 కోట్లు భారత పౌల్ట్రీ పరిశ్రమ విలువ రూ.90,000 కోట్లు. ఈ పరిశ్రమకూ కోవిడ్–19 ముప్పుగా పరిణమించింది. పరిశ్రమలో దక్షిణాది వాటా ఏకంగా 70%. సగటు చికెన్ వినియోగం దేశంలో 4.5 కిలోలుంటే దక్షిణాదిన ఇది 8 కిలోలు ఉంది. ఇక పౌల్ట్రీలు ఏర్పాటు చేసి సొంతంగా మార్కెట్ చేసుకునేవారు తెలుగు రాష్ట్రాల్లో 25 శాతముంటారు. మిగిలిన వారంతా కాంట్రాక్ట్ వ్యాపారంలో ఉన్నవారే. అంటే రైతుల నుంచి కోళ్లను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ వ్యాపారంలో 100 వరకు కంపెనీలు ఉన్నట్టు సమాచారం. -
చికెన్ ధర ఆల్టైమ్ రికార్డు.. పౌల్ట్రీ చరిత్రలో అత్యధికం
సాక్షి, అమరావతి: చికెన్ ధర సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో రూ.306కు చేరి ఆల్టైం రికార్డు నెలకొల్పింది. ఇంతటి ధర దేశంలోనే ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాలులకు తోడు కోళ్ల కొరత వల్ల చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాది కోవిడ్కు ముందు వరకు చికెన్ రేటు అధికంగానే (కిలో రూ.270 వరకు) ఉండేది. కోవిడ్ ఉధృత రూపం దాల్చిన తర్వాత వచ్చిన రూమర్స్తో నాలుగైదు నెలల పాటు చికెన్ ధర గణనీయంగా పడిపోయింది. ఒకానొక దశలో మూడు కిలోల చికెన్ను రూ.100కే విక్రయించారు. ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా బయటపడింది. క్రమేపీ చికెన్ ధర పెరగడం మొదలైంది. విజయవాడ జోన్లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. బర్డ్ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో చికెన్ రేటు మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి దిగివచ్చింది. దాన్ని కూడా అధిగమించి.. చికెన్ ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న కిలో రూ.200 ఉన్న ధర.. మార్చి 31వ తేదీకి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 3న రూ.296కు పెరిగింది. తాజాగా ఆదివారం రికార్డు స్థాయిలో కిలో రూ.306కి చేరింది. కోళ్ల కొరత వల్లే.. కొన్నాళ్ల నుంచి బ్రాయిలర్ కోళ్లకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఎండలు, వడగాలుల వల్ల కోళ్లు చనిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా చికెన్ ధర పెరగడానికి ఇదే కారణం. ఈ స్థాయిలో ధర పెరగడం పౌల్ట్రీ చరిత్రలో ఇదే ప్రథమం. – కాజా వెంకటేశ్వరరావు (నాని), ప్రెసిడెంట్, అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఎండ దెబ్బ.. వేసవికాలంలో కోళ్ల ఎదుగుదల తగ్గుతుంది. మేత అధికంగా తింటే ఎండల ధాటికి తట్టుకోలేక చనిపోతాయని పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్లకు ఉదయం పూట మేత పెట్టరు. పైగా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కోళ్లు సరిగ్గా తిండి కూడా తినలేవు. ఫలితంగా కోళ్లు ఎదుగుదల తగ్గి బరువు పెరగవు. అదే సమయంలో వడగాలులకు ఫారాల్లో పెరుగుతున్న కోళ్లు 10 నుంచి 15 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి. అలాగే ఏటా కోళ్ల విక్రయాల పెంపును దృష్టిలో ఉంచుకుని హ్యాచరీలు వారంపాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తాయి. ఆ సమయంలో పౌల్ట్రీలకు హ్యాచరీల వాళ్లు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెల కిందట తెలుగు రాష్ట్రాల్లో క్రాప్ హాలిడే అమలు చేశారు. ఇవన్నీ వెరసి ఇప్పుడు డిమాండ్కు సరిపడినన్ని కోళ్లు లభ్యం కావడం లేదు. ఫలితంగా చికెన్ ధర గణనీయంగా పెరిగిపోయింది. మరో రెండు వారాలకు కోళ్ల లభ్యత పెరుగుతుందని, ఆ తర్వాత చికెన్ ధర దిగివస్తుందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. -
పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం వద్దు
న్యూఢిల్లీ: బర్డ్ఫ్లూ(ఎవియన్ ఇన్ఫ్లూయెంజా) కారణంగా మహారాష్ట్ర, హరియాణాలో పౌల్ట్రీ కోళ్ల వధ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబైలో, మధ్యప్రదేశ్లోని మాందసౌర్లో కొత్తగా బర్డ్ఫ్లూ కేసులు బయటపడ్డాయని తెలిపింది. ఇప్పటివరకు ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, హరియాణా, గుజరాత్లో బర్డ్ఫ్లూ నిర్ధారణ అయ్యింది. పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం సరికాదని, దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వ్యాధి ప్రభావం లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పశు సంవర్థక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బర్డ్ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో కోళ్లలోనే కాకుండా కాకులు, గుడ్లగూబలు, పావురాలలో ఈ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయని పేర్కొంది. బర్డ్ఫ్లూపై అనుమానం ఉంటే సమాచారం అందించడానికి మహారాష్ట్ర పశు సంవర్థక శాఖ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం బర్డ్ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తోంది. ఈ వ్యాధిపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, గందరగోళానికి గురికావొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ కోరింది. తప్పుడు ప్రచారం వల్ల పౌల్ట్రీ పరిశ్రమతోపాటు రైతులు సైతం నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. -
బర్డ్ ఫ్లూ: చికెన్ అమ్మకాలపై నిషేధం
న్యూఢిల్లీ: దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. దేశ రాజధానిలో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పౌల్ట్రీ షాపులు, మాంసం దుకాణాలు, ప్రాసెసింగ్ యూనిట్లు అమ్మకాలు జరుపకూడదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఎన్డీఎంసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్డీఎంసీ సైతం.. ‘‘బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ హోల్సేల్ మార్కెట్లు మూసివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాం. చికెన్, కోడిగుడ్లతో కూడిన వంటకాలు వడ్డించకూడదని రెస్టారెంట్ల యజమానులకు స్పష్టం చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించిన వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం’’ అని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కాగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో ఉడికిన మాంసం, గుడ్లు తినవచ్చని ఆరోగ్య శాఖ నేడు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. (చదవండి: బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?) ఈ క్రమంలో తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇక ఢిల్లీలో ఎనిమిది బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూసినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. మయూర్ విహార్ ఫేజ్ 3, సంజయ్ లేక్, ద్వారక నుంచి సేకరించిన నమూనాల్లో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా పాజిటివ్గా నిర్ధారణ అయ్యినట్లు ప్రకటించింది.(చదవండి: 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ పంజా) -
కొండెక్కిన కోడిగుడ్డు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కోడిగుడ్డు ధర కొండెక్కింది. మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర ఏకంగా రూ. 6కు ఎగబాకి ఆల్టైమ్ రికార్డు సృష్టిస్తోంది. కరోనా లాక్డౌన్ ముందు వరకు రూ. 4 నుంచి రూ. 4:50 వరకు పలికిన ధర గత కొన్ని రోజు లుగా రూ. 5 పలుకుతోంది. తాజాగా రూ. 6కు పెరిగింది. 2017 సెప్టెం బర్లో అత్యధికంగా రూ. 5.35 ధర పల కగా ఇప్పుడు దాన్ని మించి ధర నమోదు కావడం గమనార్హం. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక విక్రయాల్లో ముందు వరుసలో ఉన్నది కోడిగుడ్డే. రోగ నిరోధకశక్తిని పెంచు కొనే క్రమంలో రోజుకొక కోడిగుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుండటంతో గుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి తగ్గింది. దీంతో కోడిగుడ్డు ధర పెరిగిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. డిమాండ్ పెరిగి... ఉత్పత్తి తగ్గి... దక్షిణాధి రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లు, లైవ్ బర్డ్స్లో సగం ఇతర రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి. అయితే కరోనా లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు కొంతకాలం వరకు కొత్తగా బర్డ్స్ వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది. రాష్ట్రంలో రోజుకు సగటున 3.65 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 2.80 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గుడ్లలోనూ సగం పొరుగు రాష్ట్రలకు ఎగుమతి అవుతుండటంతో రాష్ట్రంలో నిత్యం 1.4 కోట్ల కోడిగుడ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు కోడిగుడ్లను తినాలన్న వైద్యుల సూచనతో గుడ్ల వినియోగం రోజుకు 1.3 కోట్ల నుంచి 2 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో డిమాండ్కు తగిన ఉత్పత్తి లేక ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఆహారానికి సంబంధించిన ముడిసరుకు, రవాణా చార్జీలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చిన్నారులకు బంద్... కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రభావం అంగన్వాడీ కేంద్రాలపై పడింది. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ ఒక గుడ్డును ఇస్తుంటారు. ఇందుకోసం ఏటా టెండర్ల పద్ధతిలో డీలర్లను ఎంపిక చేసి రోజుకు సగటున 8 లక్షల కోడిగుడ్లు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో తమకు గిట్టుబాటు కావట్లేదనే సాకుతో డీలర్లు 10 రోజులుగా పంపిణీని నిలిపివేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు గుడ్లను అందించలేకపోతున్నారు. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాబార్డ్ చేయూత
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ రుణ వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. నాబార్డ్ సీజీఎం వైకే రావుతో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో నాబార్డ్ భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై మంత్రి చర్చించారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అవుతుండటంతో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఐటీ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగు పరిచడం ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అది అందుబాటులోకి వస్తే వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఫైబర్ గ్రిడ్కు రుణసాయం అందించాల్సిందిగా కోరారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించండి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు నాబార్డ్ ఇస్తున్న రుణాలను మరింత విస్తృతం చేయాలని కేటీఆర్ కోరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాల్లో అర్హులైన వారికి పాడి పశువులు అం దించేందుకు నాబార్డు ముందుకు వస్తే తాము సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో నిర్మించే 500 గోదాములకు ఆర్థిక సాయం అందించాలని నాబార్డ్ సీజీఎంకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతుబంధు కమిటీలను బలోపేతం చేస్తున్నందున వీటి ద్వారా వ్యవసాయ రంగానికి రుణాలను అందించే విషయాన్ని పరిశీలించాలన్నారు. నాబార్డు స్ఫూర్తికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యక్ర మాలు ఉన్నాయని బ్యాంకు సీజీఎం వైకే రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీజీఎం వివి ధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పాల్గొన్నారు. -
పౌల్ట్రీ విలవిల!
సాక్షి, హైదరాబాద్: పౌల్ట్రీ పరిశ్రమ సంకటంలో పడింది. క్షేత్రస్థాయిలో ధరలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఫారం వద్ద కొనుగోళ్లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడం.. మరోవైపు శుభకార్యాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడటంతో వాణిజ్య పరంగా డిమాండ్ తగ్గిపోవడంతో పౌల్ట్రీ రైతు కుదేలవుతున్నాడు. రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమలో 85.10 కోట్ల కోళ్లున్నాయి. ఇందులో లేయర్స్ (గుడ్లు పెట్టేవి) 53.4 కోట్లు, బాయిలర్స్ (మాసం కోసం పెంచేవి) 31.70 కోట్లున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉంది. తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు బాయిలర్ కోళ్లు, గుడ్లు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ అతలాకుతలమవుతోంది. ఇక్కడ తక్కువ.. అక్కడ ఎక్కువ! దూర ప్రాంతాలకు కోళ్లు, గుడ్లు సరఫరా బంద్ కావడంతో వ్యాపారం అంతా స్థానిక మార్కెట్పై ఆధారపడింది. కరోనా నేపథ్యంలో డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ.. క్షేత్రస్థాయిలో రిటైల్ వ్యాపారులు ధరలు మాత్రం తగ్గించలేదు. రిటైల్ వ్యాపారులు పౌల్ట్రీ ఫాం వద్ద కిలోకు రూ.35 నుంచి రూ.45 చొప్పున బాయిలర్ కోళ్లు (లైవ్ బర్డ్) కొనుగోలు చేస్తున్నారు. అలాగే కోడి గుడ్డు ఒక్కింటికి రూ.1 నుంచి రూ.1.50 చొప్పున కొనుగోలు చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో రిటైల్ వ్యాపారులు కిలో చికెన్ (స్కిన్ లెస్) ధర రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. రెండో రకం కింద కిలో చికెన్ (విత్ స్కిన్) రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక గుడ్డు ఒక్కింటికి రూ.5 చొప్పున అమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో ధరలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. పౌల్ట్రీ రైతుల వద్ద మాత్రం సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మరోవైపు కోళ్లను ఎక్కువ రోజులు ఫారంలోనే ఉంచుకుంటే దానా వేయడం భారమవుతుందనే భావనతో ధర తక్కువైనా స్టాక్ను వదిలించుకోవల్సిన పరిస్థితి తలెత్తింది. పెరిగిన అంతరం.. బాయిలర్ కోళ్ల పరిశ్రమలో కోడి పిల్లలను తెచ్చిన రోజు మొదలు 42 రోజుల్లో పెరిగి పెద్దవవుతాయి. దీంతో వాటిని లిఫ్ట్ చేసి చికెన్ మార్కెట్కు తరలిస్తారు. అలా లిఫ్ట్ చేసిన తర్వాత ఫారంను పక్షం రోజుల పాటు ఖాళీగా ఉంచి తిరిగి పిల్లలను తెచ్చి పెంచడం ప్రారంభిస్తారు. ఫారంలో ఇన్ఫెక్షన్లు ఇతర ఇబ్బందులు తొలగిపోయేందుకు ఈ అంతరం అవసరమనే నిబంధన ప్రకారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంతరం 20 నుంచి 25 రోజులకు పెరిగింది. లాక్డౌన్, కరోనా వైరస్ ప్రభావంతో మార్కెట్ కాస్త మందగమనంలో ఉండటంతో రైతులు ఈ దిశగా గ్యాప్ పాటిస్తున్నారు. అయితే కొందరు పౌల్ట్రీ నిర్వాహకులు మాత్రం కొత్త పిల్లలు పెంచేందుకు నిరాకరిస్తున్నారు. రెండు, మూడు నెలల పాటు వేచిచూసేందుకే మొగ్గుచూపుతున్నారు. 2 నెలల్లో అరకోటి నష్టం.. 90 వేల లేయర్ బర్డ్స్తో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నా. పెట్టుబడి భారీగా అయ్యింది. లాక్డౌన్ కారణంగా పౌల్ట్రీ రంగంలో తీవ్ర నష్టాలే ఎదురవుతున్నాయి. గత ఐదు నెలలుగా గుడ్లు, చికెన్ సేల్స్ మందగించాయి. తర్వాత కాస్త కోలుకుంటున్న సమయంలో దేశవ్యాప్త లాక్డౌన్తో పరిశ్రమ కుదేలైంది. అంతర్రాష్ట్ర రవాణా నిలిచిపోవడంతో సరఫరా ఆగిపోయింది. దీంతో గుడ్ల డిమాండ్ తగ్గడంతో ధర భారీగా పడిపోయింది. క్షేత్రస్థాయిలో రిటైలర్స్ సంతృప్తికరమైన ధరకే విక్రయిస్తున్నా.. మావద్ద మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు లేయర్ కోళ్లకు ఇచ్చే దానా ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో కిలో దానా రూ.12 నుంచి రూ.16 మధ్యలోఉండేది. ప్రస్తుతం ఈ ధర రూ.20కి పెరిగింది. మొత్తంగా గణిస్తే ఒక గుడ్డుపై సగటున రూ.1.50 నష్టం వస్తోంది. గడిచిన రెండు, మూడు నెలల్లో రూ.50 లక్షల వరకు నష్టం వచ్చింది. – ఎడమ నరేందర్రెడ్డి, మంచాల, రంగారెడ్డి జిల్లా ఆలస్యంతో లాభాలు ఆవిరి... 12 వేల బర్డ్స్తో బాయిలర్ పౌల్ట్రీ నిర్వహిస్తున్నా. సాధారణంగా ఒక కోడి పిల్ల పెరిగేందుకు 40 నుంచి 42 రోజులు పడుతుంది. ఎక్కువ శాతం 42వ రోజు బర్డ్స్ లిఫ్ట్ చేస్తాం. ఈ లెక్క ప్రకారం బర్డ్స్ లిఫ్ట్ చేస్తేనే ఆదాయం వస్తుంది. 42 రోజుల పాటు ఎదిగిన కోడి తినే ఆహారం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఒక్క రోజు ఆలస్యమైనా అంతే సంగతి. ఆ తర్వాత బర్డ్స్కు ఫీడ్ ఇచ్చినప్పటికీ కనీసం 10 గ్రాముల బరువు కూడా పెరగదు. కచ్చితంగా నిర్దేశించిన రోజుల్లో తీసేయాలి. లాక్డౌన్ కారణంగా రవాణా గందరగోళంగా మారింది. దీంతో బర్డ్స్ లిఫ్ట్ చేయడానికి ఎక్కువ రోజుల సమయం పడుతోంది. దీంతో బర్డ్స్కు ఫీడ్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో వచ్చే లాభం కాస్త ఆవిరవుతోంది. – జూలూరు పాండు, కుమ్మెర, చేవెళ్ల -
కరోనా ఎఫెక్ట్ : వేల కోళ్లు సజీవ సమాధి
బెంగళూరు : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో పలు పరిశ్రమలు నష్టాలు చవిచూస్తున్నాయి. ముఖ్యంగా చికెన్ తింటే కరోనా విస్తరిస్తుందనే వదంతులు ప్రచారం జరగడంతో.. ఆ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ పౌల్ట్రీ నిర్వాహకుడు ప్రాణాలతో ఉన్న వేలాది కోళ్లను సజీవంగా పూడ్చిపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బెలగావిలోని గోకాక్కు చెందిన నజీర్ అహ్మద్ అనే పౌల్ట్రీ నిర్వాహకుడు చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో ఆవేదన చెందాడు. కోళ్ల పెంపకపు ఖర్చులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పౌల్ట్రీలోని 6 వేల కోళ్లను ఓ ట్రక్లో తరలించి పెద్ద గుంత తీసి అందులో పూడ్చిపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించి నజీర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్లతో కరోనా వస్తుందనే వదంతుల కారణంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయని తెలిపారు. కోళ్ల పెంపకానికి రూ. 6 లక్షల ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెట్టుబడి రాకపోగా.. నష్టాలు వచ్చే అవకాశం ఉన్నారు. అందుకే కోళ్లను పూడ్చిపెట్టినట్టు వెల్లడించారు. (చదవండి : కోడికి కరోనా బూచి) A dejected farmer Nazeer Makandar from Lolasoora village in #Gokak, #Belagavi decided to bury #chicken from his #poultry farm, following steep fall in price due to #CoronavirusOutbreak. @DeccanHerald @CMofKarnataka @mani1972ias #Coronavid19 Nazeer Makandar pic.twitter.com/OExEPM39ay — Niranjan Kaggere (@nkaggere) March 10, 2020 -
పౌల్ట్రీకి 1,750 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: చికెన్ వల్ల కరోనా వైరస్ (కోవిడ్–19) ప్రబలుతోందన్న వదంతుల మూలంగా పౌల్ట్రీ పరిశ్రమ గణనీయంగా దెబ్బతింది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 1,750 కోట్ల మేర నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో తక్షణం సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖకు పౌల్ట్రీ రంగం విజ్ఞప్తి చేసింది. చికెన్కు డిమాండ్ తగ్గిపోవడంతో కోళ్ల ధరలు కేజీకి రూ. 10–30 స్థాయికి (ఫాం గేట్) పడిపోయినట్లు అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (ఏఐపీబీఏ) వెల్లడించింది. మరోవైపు సగటు ఉత్పత్తి ధర కేజీకి రూ. 80గా ఉంటోందని వివరించింది. ‘సోషల్ మీడియాలో పదే పదే వదంతులు వ్యాప్తి కావడంతో.. చికెన్పై వినియోగదారుల నమ్మకం సడలింది. చికెన్ ఉత్పత్తుల డిమాండ్ పడిపోయింది’ అని ఏఐపీబీఏ చైర్మన్ బహదూర్ అలీ తెలిపారు. దీంతో జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి మూడో వారం మధ్య కాలంలో బ్రాయిలర్ రైతులు, బ్రీడింగ్ సంస్థల నష్టాలు దాదాపు రూ. 1,750 కోట్లకు చేరాయని ఆయన వివరించారు. ఈ భారీ సంక్షోభంతో పౌల్ట్రీ రంగం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగిన పక్షంలో ప్రతి నెలా రూ. 1,750 కోట్ల నష్టాల భారం పడుతుందన్నారు. దేశీ పౌల్ట్రీ లో 10 లక్షల మంది పైగా రైతులు ఉపాధి పొందుతున్నారు. దేశీయంగా జొన్న, సోయాబీన్ల వినియోగం ఎక్కువగా పౌల్ట్రీ రంగంలోనే ఉంటోందని.. ఇది గానీ దెబ్బతిందంటే ఆయా రైతులకూ కష్టం తప్పదని అలీ తెలిపారు. -
ముఖ్యమంత్రితో సహా అంతా రోజూ చికెన్ తింటాం
ఖైరతాబాద్: రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిలో ఏ ఒక్కరికీ చికెన్, గుడ్డుతో ఆరోగ్యపరమైన సమస్యలు రాలేదని.. దుష్ప్రచారాలు, అపోహలు, అనుమానాలతో జరుగుతున్న వైరల్ క్యాంపెయిన్ తప్పని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. చికెన్, ఎగ్తో కరోనా వైరస్ రాదని, ఆరోగ్యానికి మంచి పౌష్టిక విలువలు లభిస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ అండ్ ఎగ్ మేళాను ఆయన ప్రారంభించారు. మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్లతో కలసి ఆయన చికెన్ తిని చూపించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుడ్డు, చికెన్లో ఉన్న పోషక విలువలు ఏ ఆహార పదార్థంలో లేవన్నారు. మనదేశంలో అధిక మంటపై ఉడికించి తినే వంటలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు లేవన్నారు. చికెన్, గుడ్డు తినడంతో కోవిడ్ వ్యాపిస్తుందన్న వదంతులు నమ్మవద్దని, ఆరోగ్య శాఖ మంత్రే వచ్చి చికెన్, గుడ్డు తినడంతో ఎలాంటి హాని జరగదని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇంకా అపోహలు పెట్టుకోవదన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లాల్లో కూడా చేయాలని.. దీనికోసం నటులు, డాక్టర్లు ముందుకు రావాలన్నారు. తమ కుటుంబంలో ముఖ్యమంత్రితో సహా అంతా రోజూ చికెన్ తింటామని కేటీఆర్ తెలిపారు. త్వరలో తెలంగాణ పౌల్ట్రీ పాలసీ కూడా రాబోతుందని వివరించారు. అనారోగ్య సమస్యలు రావు... మన ఆహారపు అలవాట్లకు కోవిడ్ వైరస్ వచ్చే అవకాశం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేరళలో 3 కేసులు నమోదయ్యాయి తప్ప, మన రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదన్నారు. మన వద్ద సగం ఉడికించి తినే ఆహారపు అలవాటు లేదన్నారు. వైరల్ వార్తల కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైందన్నారు. 2 నెలల కాలంలో రూ.500 కోట్ల పైచిలుకు నష్టపోయిందన్నారు. వదంతులు నమ్మవద్దని, కరోనా వైరస్కు చికెన్కు ఎలాంటి సంబంధం లేదని తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. చికెన్ అండ్ ఎగ్ మేళాలో 6,200 కిలోల వివిధ రకాల చికెన్ వంటకాలు, 22వేల గుడ్లు నగరవాసులకు ఉచితంగా అందజేశారు. ఎంపీ రంజిత్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్కుమార్రావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, సురేందర్, ఫౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు, రైతులు, నగరవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుదీప్, లిప్సిక, లిటిల్ సింగర్ సాయివేద పాటలతో అలరించగా, బిత్తిరి సత్తి మాటలతో ఆకట్టుకున్నారు. -
‘సీఎం కేసీఆర్ కూడా చికెన్ తింటారు’
-
‘సీఎం కేసీఆర్ కూడా చికెన్ తింటారు’
సాక్షి, హైదరాబాద్: సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందనే అసత్య వార్తల్ని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా తన కుటుంబమంతా చికెన్ తింటున్నామని, ఎప్పుడూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని చెప్పారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే ఆసత్య ప్రచారాలను తిప్పికొంట్టేందుకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ ఎగ్స్ మేళాను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పలువురు అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, సినీ నటి రష్మిక మంధాన పాల్గొన్నారు. చికెన్ ఒక ప్రొటీన్ ఆహారమని.. దానికీ కరోనా వైరస్కు సంబంధం లేదని రష్మిక పేర్కొన్నారు. చికెన్ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. -
‘ముక్క’ ముట్టడం లేదు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు నెల రోజుల్లో 50 శాతానికి పడిపోయాయి. ఫాం గేట్ ధర 70 శాతం తగ్గింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని గోద్రెజ్ అగ్రోవెట్ ఎండీ బి.ఎస్.యాదవ్ తెలిపారు. వారానికి 6 లక్షల కోళ్లు విక్రయించేవారమని, నెల రోజుల్లో 40 శాతం అమ్మకాలు తగ్గాయని చెప్పారు. వదంతులు ఆగిపోయి తిరిగి అమ్మకాలు రెండు మూడు నెలల్లో పుంజుకున్నాక చికెన్ కొరత ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే ధరలు పెరుగుతాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రతి వారం 7.5 కోట్ల కోళ్లు అమ్ముడవుతున్నాయని, ఇది 3.5 కోట్ల కోళ్లకు వచ్చిందని గుర్తుచేశారు. కాగా, హైదరాబాద్ మార్కెట్లో కొద్ది రోజుల క్రితం స్కిన్లెస్ చికెన్ మాంసం రూ.250 దాకా దూసుకెళ్లింది. గత వారం రూ.110కి దిగొచ్చి ప్రస్తుతం రూ.130 పలుకుతోంది. ఇక్కడ సాధారణ స్థితికి.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. రెండు వారాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు సాధారణ స్థితికి వచ్చాయని స్నేహ ఫామ్స్ సీఎండీ డి.రామ్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 30 శాతం అమ్మకాలు పడిపోయాయి. చికెన్ ఫాం గేట్ ధర రూ.80 నుంచి రూ.35 వరకు వెళ్లింది. ఇప్పుడు రూ.42కు వచ్చింది. వారానికి సరిపడ నిల్వలు పౌల్ట్రీల వద్ద మిగిలిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాంసాహారం ఎక్కువ తింటారు కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వదంతుల ప్రభావం తక్కువగా ఉంది. సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వినియోగం సాధారణ స్థితికి వచ్చింది. ధరలు రోజురోజు కూ పెరుగుతున్నాయి. చికెన్కు కరోనాకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి’ అని వివరించారు. నష్టం రూ.7,000 కోట్ల పైనే..! కరోనా వదంతుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పౌల్ట్రీ పరిశ్రమ రూ.700 కోట్ల వరకు నష్టపోయిందని రామ్ రెడ్డి వెల్లడించారు. కోడి ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.80 అవుతోందని, విక్రయ ధర సగానికి పడిపోవడంతో పౌల్ట్రీ సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయని చెప్పారు. ఈ నష్టం దేశవ్యాప్తంగా ఎంత కాదన్నా రూ. 7,000 కోట్ల పైచిలుకు ఉంటుందని ఆ యన అంచనా వేశారు. తమకు సం బంధం లేకపోయినా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బ్యాచ్ వేయడానికి రైతుల వద్ద మూలధనం లేదన్నారు. వాస్తవానికి సాధారణ రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రోజుకు 15–20 లక్షల కోళ్లు అమ్ముడయ్యేవి. -
పెరట్లో వన రాజా కోళ్ల పెంపకం
గత రెండు దశాబ్దాలుగా కోళ్ల పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మాంసం, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటానికి ఇదే కారణం. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతోపాటు ఇతర కుటుంబాలు కూడా పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, పెట్టుబడి పెట్టిన కొద్ది కాలంలోనే లాభాలు రావటం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడటం వంటి అనేక కారణాలున్నాయి. నాటు కోళ్లకు గిరాకీ పెరుగుతుండడంతో పెరటి కోళ్ల పెంపకానికి ఈ మధ్య రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పెరట్లో పెంపకానికి వనరాజా కోళ్లు అనువైనవన్న సంగతి తెలిసిందే. వనరాజా కోళ్ల విశిష్టతలు ► వివిధ రంగుల ఈకలు ఉండటం వలన నాటు కోళ్లను పోలి ఉంటాయి. ► వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. ► పొడవైన కాళ్లు ఉండటం వలన త్వరగా కదలగలవు. కుక్కల బారి నుంచి తప్పించుకోగలవు. ► గుడ్ల ఉత్పత్తికి, మాంసం ఉత్పత్తికి పనికివస్తాయి. వనరాజా కోళ్ల సామర్థ్యం ► మొదటి గుడ్డు పెట్టే రోజు నుంచి 175–180 రోజుల వరకు గుడ్లు పెడతాయి. 160 గుడ్లు పెడతాయి. ► 6వ వారంలో శరీర బరువు 2,000–2,200 గ్రాములు. ► గుడ్ల బరువు 28వ వారంలో 48–50 గ్రాములు. 40వ వారంలో 52–58 గ్రాములు. ► మొదటి 6 వారాల వరకు మరణాల శాతం 2 శాతం కంటే తక్కువ. ► ఎక్కువ సంఖ్యలో వనరాజా కోడి పిల్లలను పెంచేటప్పుడు శాస్త్రీయ పద్ధతిలో బ్రూడర్స్ను ఏర్పాటు చేయాలి. పిల్లలు షెడ్లకు రాక ముందు 2–3 అంగుళాల వరకు వరి పొట్టు / రంపపు పొట్టు లిట్టరు లాగా పోయాలి. అది మేయకుండా కాగితాలు పరవాలి. బ్రూడర్స్ చుట్టూ నీటి, మేత తొట్టెలను అమర్చాలి. కరెంటు బల్బులలతో ప్రతి కోడికి 2 వ్యాట్ల చొప్పున వేడినివ్వాలి. ► మేతలో 2,400 కేలరీల శక్తి , 16 శాతం ప్రొటీన్లు, 0.77% లైసిన్, 0.36% మిధియోనిన్, 0.36% భాస్వరం, 0.7% కాల్షియం ఉండాలి. ► ఆరువారాల వయస్సు దాటిన తర్వాత వాటిని పెరట్లో విడిచి పెట్టాలి. పెరట్లో లభించే చిన్న చిన్న మొక్కలు, నిరుపయోగ ధాన్యాలు, క్రిమి కీటకాలు, గింజలు మొదలైన వాటిని తింటూ పగలంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తాయి. ► వివిధ జబ్బుల నుంచి రక్షించుకోవడానికి పిల్ల పుట్టిన ఒకటో రోజున, 7వ రోజున, 14వ రోజున, 28వ రోజున, 36–42 రోజుల మధ్య, 8వ వారంలో టీకాలను విధిగా వేయించాలి. ► ఆర్థిక లాభాల కోసం కోడి పెట్టలను ఒకటిన్నర సంవత్సరం, కోడి పుంజులను 14 లేదా 16 వారాల వయస్సు వచ్చే వరకు పెంచాలి. ఒక్కో పెట్ట 160 గుడ్లు పెడుతుందనుకుంటే రూ. 5 చొప్పున రూ. 800ల ఆదాయం పొందవచ్చు. ► దాణాను అధిక ధరకు కొనుగోలు చేయడం కన్నా రైతు తన దగ్గర ఉన్న దాణా దినుసులతో చౌకగా తయారు చేసుకుంటే, గుడ్ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ , (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవస్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
రూ.100 కోట్లతో స్నేహా ఫామ్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగ సంస్థ స్నేహా ఫామ్స్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రాసెసింగ్ కెపాసిటీ గంటకు 6,000 బర్డ్స్ నుంచి 12,000లకు చేర్చనుంది. అలాగే కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం ప్రస్తుతం 2,000 టన్నులుంది. దీనికి 3,000 టన్నులకు పెంచనున్నారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ వద్ద కంపెనీకి ప్రాసెసింగ్ ప్లాంటుతోపాటు శీతల గిడ్డంగి ఉంది. సంస్థ ఇప్పటికే ప్రాసెస్డ్ చికెన్, ఫ్రెష్ చికెన్ విక్రయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తొలి స్థానంలో నిలిచింది. అలాగే ప్రాసెసింగ్ కెపాసిటీ పరంగా దేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎనిమిది నెలల్లో ఈ విస్తరణ పూర్తి అవుతుందని స్నేహా ఫామ్స్ ఎండీ డి.రామ్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. నూతన విభాగాల్లోకి ప్రవేశించేందుకు తాజా విస్తరణ దోహదం చేస్తుందన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మెగా ప్రాజెక్టు కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి పొందామని చెప్పారు. కొత్త విభాగాల్లోకి స్నేహా... స్నేహా ఫామ్స్ త్వరలో నగ్గెట్స్, లాలీపాప్స్ వంటి రెడీ టు కుక్, చికెన్ కర్రీ వంటి ఉత్పత్తులతో రెడీ టు ఈట్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే అయిదారు ఉత్పత్తులతో ట్రయల్స్ నిర్వహించామని రామ్రెడ్డి తెలిపారు. ‘ఫ్రోజెన్ చికెన్ విభాగంలోకి కూడా వస్తున్నాం. రెడీ టు ఈట్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తాం. ఇప్పటికే దాణాను ఎగుమతి చేస్తున్నాం. సఫల బ్రాండ్ కింద సోయా, రైస్ బ్రాన్ ఆయిల్స్ దేశీయంగా విక్రయిస్తున్నాం. 80,000 కిలోల ప్రాసెస్డ్ చికెన్, 2.5 లక్షల బ్రాయిలర్ కోళ్లు ప్రతిరోజు అమ్ముతున్నాం. గ్రూప్ టర్నోవర్ రూ.3,000 కోట్లుంది. ఇందులో స్నేహా ఫామ్స్ వాటా రూ.2,500 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్లో 15–20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణతో కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. -
కోడిగుడ్లతో ఏటా 7,500 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రెసిడెంట్ చక్రధర రావు పొట్లూరి చెప్పారు. గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానం మనదే అయినా... సరైన ప్రోత్సాహం లేక కోళ్ల ఫామ్స్ని మూసేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ నెల 27–29 తేదీల్లో హెచ్ఐసీసీలో 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం.. దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ వార్షిక పరిమాణం ప్రస్తుతం రూ.1.1 లక్షల కోట్లు. వృద్ధి రేటు 7 శాతం. పరిశ్రమలో తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం వరకూ ఉన్నట్లు వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజీ ఆనంద్ చెప్పారు. దేశంలో రోజుకు 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయితే... దాన్లో 4 కోట్లు తెలంగాణలో, 4.5 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలో 2 వేల మంది గుడ్ల ఉత్పత్తిదారులు, లక్ష మంది బ్రాయిలర్ రైతులు ఉన్నారని, రోజుకు 2 కోట్ల బ్రాయిలర్స్ ఉత్పత్తి అవుతున్నాయని తెలియజేశారు. అమెరికన్ కాళ్లను దించొద్దు.. అమెరికాలో అమ్ముడుపోని, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న చికెన్ లెగ్స్ను భారత్కు పంపేందుకు యూఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని చక్రధర రావు చెప్పారు. దీన్ని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘గతంలో అమెరికా.. పక్కనే ఉన్న హైతీ దేశంలోకి చికెన్ లెగ్స్ను ఎగుమతి చేసింది. దీంతో హైతీ పౌల్ట్రీ పరిశ్రమ 70 శాతం వరకు కనుమరుగైపోయింది. భారీగా చికెన్ లెగ్స్ను తక్కువ ధరకు పంపితే స్థానిక కంపెనీలు పోటీని తట్టుకోలేవు. ఈ పరిస్థితి మనకూ వస్తుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
వ్యవసాయానికి వెన్నెముకగా కోళ్ల పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: దేశంలో వ్యవసాయ అనుబంధంగా కోళ్ల పరిశ్రమపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ పేదలకు మాంసం, గుడ్ల రూపంలో పౌష్టికాహారం అందిస్తున్నాయని కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఓపీ చౌదరి పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కోళ్ల రంగం ఏటికేటికీ వృద్ధి సాధిస్తున్న దృష్ట్యా.. మరింత అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న కీలక వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్–ఐపీఈఎంఏ ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా–2018ను ఆయన ప్రారంభించారు. హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 5 డూమ్ల్లో 326 వరకు స్టాళ్లు కొలువు తీరాయి. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పౌల్ట్రీ పరిశ్రమలు, ఫీడ్, క్లీనింగ్, ఔషధ పరిశ్రమలు తమ ఉత్పత్తులు పదర్శిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ రంగంలో వస్తున్న అనూహ్యమైన మార్పులకు అనుగుణంగా విజ్ఞానం, అంతర్జాతీయస్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ యంత్రాలు, పనిముట్లు ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు పెద్దసంఖ్యలో సందర్శకులు, పౌల్ట్రీ రైతులు, యువత, ఔత్సాహికుల తాకిడి కనిపించింది. ఉత్పత్తి, ఉత్పాదకత వ్యయం తగ్గించుకుంటూ ముందుకు వెళితే నికర లాభాలు ఆర్జించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. తెలంగాణలో పౌల్ట్రీ అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్న భారత్.. రాబోయే రోజుల్లో రెండో స్థానానికి వెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్– ఐపీఈఎంఏ అధ్యక్షుడు హరీశ్ గర్వార్ స్పష్టం చేశారు. దక్షిణాసియా స్థాయి ప్రదర్శనలో నాఫెడ్ సంస్థ డైరెక్టర్ అశోక్కుమార్ ఠాకూర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇంటర్నేషనల్ ఎగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేశ్ చిట్టూరి రాయుడు, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్– ఐపీఈఎంఏ కార్యదర్శి చక్రధర్, రాష్ట్ర బ్రీడర్స్ అసోసియేషన్ చైర్మన్ జి.రంజిత్రెడ్డి, నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు, తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కోళ్ల పరిశ్రమకు డిజిటల్ టచ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోళ్ల పరిశ్రమ అనగానే సీజనల్ బిజినెస్ అంటారు. గుడ్ల నుంచి మొదలుపెడితే కోడి పిల్లల పెంపకం, ఫీడింగ్, కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా ప్రతి దశలోనూ ఉష్ణోగ్రత, స్థానిక వాతావరణ ప్రభావితం చేస్తుంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నష్టాలే. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ కోళ్ల పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎందుకా అనిపించింది హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్–అర్చన దంపతులకు. అప్పటికే చేస్తున్న ఐటీ ఉద్యోగాలకు గుడ్బై కొట్టేసి ఎంఎల్ఐటీని ప్రారంభించారు. ఇదేంటంటే.. పొదుగు, కోడి పిల్లల ఉత్పత్తి, ఆహారం, శీతలీకరణ కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా కోళ్ల పరిశ్రమలో ప్రతి దశలోనూ టెక్నాలజీ అందిస్తుంది. మరిన్ని వివరాలు ఎంఎల్ఐటీ కో–ఫౌండర్ అర్చన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది హైదరాబాద్. కస్తూర్బాలో ఎంఎస్సీ పూర్తయింది. పెళ్లయ్యాక ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాం. ఏడేళ్ల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి కుటుంబ వ్యాపారమైన ఇండస్ట్రియల్ పరికరాల తయారీలో భాగస్వామినయ్యా. నట్లు, బోల్ట్ల వంటి ప్రతి ఉత్పత్తి తయారీని ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన అవసరం లేకుండా ఉత్పత్తుల తయారీ, నియంత్రణ, నిర్వహణ సులువుగా ఉండేలా ఐఓటీ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేశా. ఈ ఐవోటీ పరికరం... ఉత్పత్తుల తయారీ సమయంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి, వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే.. క్వాలిటీ మేనేజర్ పనంతా ఈ ఐఓటీ పరికరమే చేసేస్తుందన్నమాట! ఓ రోజు మా కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు సంబంధించిన ఓ హేచరీస్ ఇంక్యుబేటర్లో ఉష్ణోగ్రత పెరిగి గుడ్లు పాడైపోయాయని ఫోన్ వచ్చింది. దీన్ని మాతో చెబుతు నట్లు, బోట్ల తయారీలో ఉష్ణోగ్రతలను నియంత్రించినట్లే పౌల్ట్రీ పరిశ్రమలోనూ ఉంటే బాగుండనని అన్నారాయన. అలా ఎంఎల్ఐటీ కంపెనీకి పునాది పడింది. 2016లో రూ.60 లక్షల పెట్టుబడితో టీ–హబ్ కేంద్రంగా ప్రారంభించాం. కన్సైట్, పౌల్ట్రీమాన్ రెండు పరికరాలు.. ప్రస్తుతం ఎంఎల్ఐటీ నుంచి రెండు ఉత్పత్తులున్నాయి. మొదటిది కన్సైట్. దీన్ని బిగ్ డేటా, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేశాం. కోళ్ల పరిశ్రమలో ఉష్ణోగ్రతల నియంత్రణతో పాటు ఫామ్ నిర్వహణ, విశ్లేషణ సేవలందించడం దీని ప్రత్యేకత. ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అన్ని ఫామ్లను రియల్ టైమ్లో నిర్వహించుకునే వీలుంటుంది. ధర రూ.60 వేలు. రెండోది పౌల్ట్రీమాన్. సెన్సార్లు, క్లౌడ్ టెక్నాలజీ అనుసంధానిత పరికరమిది. దీన్ని హేచరీలో అనుసంధానం చేస్తాం. మొబైల్ అప్లికేషన్స్తో ఎప్పటికప్పుడు ఇంక్యుబేటర్లోని ఉష్ణోగ్రత నివేదికలను చూడొచ్చు. ఏమాత్రం తేడా వచ్చిన అలెర్ట్ చేస్తుంది. ఏ దశలో సమస్య ఉందో కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. దీంతో నేరుగా సమస్యను పరిష్కరించవచ్చు. ధర రూ.15 వేలు. వార్షిక నిర్వహణ రుసుము 12 శాతం. పౌల్ట్రీమాన్కు పేటెంట్ ఉంది. సెప్టెంబర్ నుంచి సుగుణలో సేవలు.. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సేవలందిస్తున్నాం. దాదాపు 10 సంస్థలు మా సేవలు వినియోగించుకుంటున్నాయి. వీటిల్లో వంద వరకు ఇంక్యుబేషన్స్ ఉంటాయి. పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నాం. సుగుణ కంపెనీలో అన్ని విభాగాల్లోనూ పౌల్ట్రీమాన్, కన్సైట్ నిర్వహణ సేవలు సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరు, కోయంబత్తూరు, కోల్కతాలకు విస్తరించనున్నాం. గతేడాది రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని, పౌల్ట్రీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్ వాటాను లకి‡్ష్యంచాం. మా సంస్థలో ప్రస్తుతం 8 మంది ఉద్యోగులున్నారు. టెక్నాలజీ, సేల్స్ విభాగంలో మరో నలుగురిని తీసుకుంటున్నాం. దేశంలోని ప్రముఖ అగ్రిటెక్ వెంచర్ క్యాప్టలిస్ట్ నుంచి రూ.7 కోట్ల నిధులను సమీకరించనున్నాం. డీల్ 2 నెలల్లో పూర్తవుతుంది’’ అని అర్చన వివరించారు. -
అమ్మో ! అమెరికా ‘కోళ్ల కాళ్లు’ నడిచొస్తున్నాయ్
సాక్షి, న్యూఢిల్లీ : ‘అమెరికన్ చికెన్ లెగ్స్ సూన్ బీ వాకింగ్ ఇన్ టూ ఇండియన్ స్టోర్స్ (అమెరికా కోళ్ల కాళ్లు త్వరలో భారతీయ షాపుల్లోకి నడిచి వస్తాయి)’ సరదాగానో, ఆందోళనతోనో చేసిన ఈ వ్యాఖ్య త్వరలో నిజం కాబోతోన్నది. శీతలీకరించిన కోళ్ల కాళ్ల కంటేనర్ను భారత్కు షిప్పింగ్ చేస్తున్నట్లు భారత ప్రభుత్వం నుంచి తొలి పర్మిట్ను దక్కించుకున్న ‘యూఎస్ఏ పౌల్ట్రీ అండ్ ఎగ్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్’లో సభ్యత్వం కలిగిన అమెరికాలోని ‘గ్లోబల్ ఇంటర్నేషనల్’ కంపెనీ ప్రకటించింది. కోళ్ల కాళ్ల (చికెన్ లెగ్స్)ను అమ్మేందుకు గత దశాబ్దకాలంగా అమెరికా కంపెనీలు చేస్తున్న పోరాటాన్ని మన భారతీయ కోళ్ల పరిశ్రమలు అడ్డుకుంటు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో గతేడాది జూలై నెలలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లూటీఓ) ముందు భారత్ ఓడిపోయింది. ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలు దాటిన భారతీయ కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు అమెరికా నుంచి కోళ్లు, ముఖ్యంగా కాళ్లు దిగుమతిని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. అందుకు భారత్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థరహితమంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ గతేడాది నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. దిగుమతులను అనుమతించేందుకు సరైన మార్గదర్శకాలతో ముందుకు రావాల్సిందిగా ఆదేశిస్తూ 18 నెలల గడువును ప్రసాదించింది. ఈ గడువు మరో తొమ్మిది నెలలు ఉండగానే ప్రభుత్వం మొదటి పర్మిట్ను ఎందుకు జారీ చేసిందో తెలియదు. అమెరికా నుంచి కోళ్ల కాళ్లను అనుమతించాలనుకుంటే కఠినమైన నిబంధనలను అమలు చేయాలంటూ ‘పౌల్ట్రీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు రమేశ్ ఖత్రి ఇటీవలనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. శీతలీకరించిన కోడి కాళ్లు మూడు నెలల ముందు సంహరించిన కోడిది కాకూడదని, జన్యు మార్పిడి విత్తనాలతో పండించిన మొక్కజొన్న, సోయాను కోళ్లకు ఆహారంగా పెట్టరాదని, జంతువుల కొవ్వు, ముఖ్యంగా పంది కొవ్వును కోళ్లకు దాణాగా వేయరాదని ఆ లేఖలో ఖత్రి సూచించారు. అమెరికాలో కోళ్ల ఎదుగుదల కోసం మొక్కజొన్న, సోయా, పంది కొవ్వునే దాణాగా ఉపయోగిస్తారు. వీటిని వద్దంటే అమెరికా నుంచి దిగుమతులను వద్దనడమే. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం వారం క్రితమే స్పందించి తొలి పర్మిట్ను మంజూరు చేసింది. కోళ్ల కాళ్లే ఎందుకు దిగుమతి? అమెరికా నుంచి ఏ కోళ్ల పరిశ్రమైనా కోడి కాళ్లనే దిగుమతి చేయాలని కోరుకుంటుంది. ఎందుకంటే అమెరికన్లు ఎక్కువగా కోడి బ్రెస్ట్నే తింటారు. కోడి కాళ్లను తినడానికి అసలు ఇష్టపడరు. భారతీయులు కోడి కాళ్లను అమిత ఇష్టంగా తింటారు. ఇందుకు పలు కారణాలు చెబుతారు. తెల్ల అమెరికన్లు కోడిలో తెల్లటి భాగం, అంటే బ్రెస్ట్ను తినడం మొదటి నుంచి అలవాటు చేసుకున్నారట. ఆఫ్రికన్ అమెరికన్లు కాళ్లను తినడం అలవాటు చేసుకున్నారట. అమెరికన్లు ఎవరైనా నైఫ్, ఫోర్క్ ఉపయోగించి తింటారు. వీటి ద్వారా కోడి కాళ్ల నుంచి మాంసాన్ని వేరు చేసి తినడం కొంత ఇబ్బంది. అందుకని వారు వాటిని అంతగా ఇష్టపడరట. కోళ్లలో కొవ్వు ఎక్కువగా కాళ్లలో పేరుకుంటుందని, ప్రొటీన్లు బ్రెస్ట్లో ఉంటాయని ఇప్పుడు కొత్త వాదన మొదలైంది. ఈ వాదన భారత్లో కూడా ప్రచారంలోకి రావడంతో జిమ్ములకెళ్లే జిమ్మీలు కోడి బ్రెస్ట్నే కోరుకుంటున్నారు. అందుకనే అవకాశం ఉంటే అమెరికన్ రైతులు ‘రెండు బ్రెస్ట్లు ఒక కాలు మాత్రమే ఉండే’ కోళ్లను పెంచుతారన్న మాట పలుకుబడిలో ఉంది. ఇక భారతీయులు ఎక్కువ వరకు చేతులతోనే భోజనం చేస్తారు కనుక కోడి కాళ్లను చేతులతో నోట్లో పెట్టుకొని కరకర నమిలేస్తారు. ‘తంగ్డీ కబాబ్’ పట్టుకుంటే నోట్లో నీళ్లూరడం ఖాయం. అమెరికాలో ఎలాగూ ఎక్కువగా కోళ్ల కోళ్లను తినరు కనుక అక్కడి కోళ్ల పరిశ్రమలు అతి తక్కువ ధరకు భారత్కు దిగుమతి చేస్తాయని, తద్వారా తాము తీవ్రంగా నష్టపోతామని భారతీయ కోళ్ల పరిశ్రమదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడి వేళ్లు చైనాకు.... కోడి కాళ్లను (అంటే పిక్క నుంచి మోకాలి వరకు) మనకు విక్రయించాలనుకుంటున్న అమెరికా కోళ్ల పరిశ్రమలు, కాలి వేళ్లను (మోకాలు నుంచి వేళ్ల వరకు) చైనాకు ఇప్పటికే జోరుగా విక్రయిస్తోంది. కోడి వేళ్లలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయన్నది చైనా ప్రజల వాదన. అందుకనే వాటిని వారు ఎక్కువగా తింటారు. మాంసం, కోడి ఒకటే రేటు ఒకప్పుడు భారత్లో మేక మాంసం, కోడి కూర ఒకటే ధరకు లభించేవి. కోళ్ల పరిశ్రమ బాగా పుంజుకోవడంతో కోడి కూర ధరలు తగ్గుతూ వచ్చాయి. కోళ్లలాగా మేకలను కూడా ఓ పెద్ద పరిశ్రమలాగా (పాశ్యాత్య దేశాల్లోలాగా) భారత్లో పెంచడం లేదు. కారణం మేకల పెంపకానికి పెద్ద స్థలం కావాలి. ఫలితం కోసం చాలాకాలం నిరీక్షించాలి. 1975లో మన దేశంలో ఏటా 26. 90 కోట్ల మేక మాంసం ఉత్పత్తికాగా, పది కోట్ల కిలోల కోడి కూర ఉత్పత్తి అయ్యేది. 1990 నాటికి మాంసం ఉత్పత్తి 45.80 కోట్ల కిలోలలకు, కోడి కూర 52.70 కోట్ల కిలోలకు చేరుకుంది. అంటే మొదటిసారి మేక మాంసాన్ని కోడి కూర దాటి పోయింది. ప్రస్తుతం దేశంలో 95 కోట్ల కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంటే, 180 కోట్ల కిలోల కోడి కూర ఉత్పత్తి అవుతుంది. అంటే దేశంలో మేక మాంసం మూడున్నర రెట్లు పెరగ్గా, కోటి మాంసం 18 రెట్లు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి కోడి కాళ్లు దిగుమతి అయితే తమ గతేమికానని కోళ్ల పరిశ్రమదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కిలో కోడి కాళ్ల ధర 200 రూపాయలని, స్థానికంగా కిలో కోడి కాళ్లు 130 రూపాయలని, అంతేకాకుండా శీతలీకరించిన మాంసం కన్నా తాజా మాంసం తినడమే భారతీయులకు ఎక్కువ అలవాటు కనుక కోడికాళ్ల దిగుమతిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. ఈ అడ్డుంకులను దాటుకొని ‘కోడి కాళ్లు మన వంటిట్లోకి నడిచి వస్తాయా’ వేచి చూడాలి. -
ఇండియాలోకి అమెరికా చికెన్ లెగ్స్ దిగుమతి ?
-
పౌల్ట్రీకి రోజుకు 100 కోట్ల నష్టం..
• పెద్ద నోట్ల రద్దుతోనే సమస్య • 10 లక్షల మందికి జీతాలే లేవు • మీడియాతో పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు • నేటి నుంచే హైటెక్స్లో పౌల్ట్రీ సదస్సు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాలుగేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటున్న పౌల్ట్రీ రంగానికి 2016 కూడా కలిసి రాలేదు. ఈ ఏడాదైనా నష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్న పరిశ్రమకు పెద్ద నోట్ల రద్దు రూపంలో అవాంతరం వచ్చి పడిందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రంజిత్ రెడ్డి చెప్పారు. చిల్లర సమస్యతో కొనుగోలుదార్లు లేక గుడ్లు, చికెన్ అమ్మకాలు ప్రస్తుతం 50-60 శాతానికే పరిమితమయ్యాయని సోమవారమిక్కడ మీడియాకు తెలియజేశారు. ‘‘నోట్ల రద్దు తర్వాత మొదటి రెండు రోజులు అమ్మకాలు 30 శాతమే నమోదయ్యారుు. పౌల్ట్రీకి అత్యంత కీలకమైన నవంబరు-డిసెంబరులో అమ్మకాలు పడిపోవడం కోలుకోలేని దెబ్బ’’ అని చెప్పారాయన. ప్రస్తుతం రోజుకు దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల నష్టం వాటిల్లుతోందని చక్ర గ్రూప్ ఎండీ పి.చక్రధర్రావు వెల్లడించారు. తెలంగాణలో ఈ నష్టం రోజుకు రూ.20 కోట్లపైనే ఉందన్నారు. దేశంలో రోజుకు 21 కోట్ల గుడ్లు, 2 కోట్ల కిలోల చికెన్ ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమలో ఏటా రూ.1 లక్ష కోట్ల వ్యాపారం జరుగుతోంది. జీతాలు చెల్లించలేం..: దేశవ్యాప్తంగా పౌల్ట్రీ విపణిలో లక్ష మంది రైతులున్నారు. 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఆధారపడ్డారు. ఒక్క తెలంగాణలోనే 25 వేల మంది రైతులున్నారు. పౌల్ట్రీ ఉత్పాదనలో అగ్రగామిగా ఉన్న ఈ రాష్ట్రంలో రోజూ 4 కోట్ల గుడ్లు, 15 లక్షల కిలోల చికెన్ ఉత్పత్తి అవుతున్నారుు. ఏటా రూ.10,000 కోట్ల వ్యాపారం నమోదవుతోంది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు, చిల్లర దొరక్కపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నట్లు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు చెప్పారు. కోళ్లకు దాణా పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. పౌల్ట్రీ రైతులు, ఈ రంగంలోని కంపెనీల రుణాలను ఏడాది పాటు రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ పౌల్ట్రీ సదస్సు.. హైదరాబాద్లోని హైటెక్స్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకూ (22-25) పౌల్ట్రీ సదస్సు జరుగనుంది. 200 భారతీయ, 50 విదేశీ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారుు. 20 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా. అంతర్జాతీయ స్థారుులో దీనిని నిర్వహిస్తున్నామని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీష్ గర్వారే తెలిపారు. పౌల్ట్రీ రంగంలో వచ్చిన అధునాతన టెక్నాలజీని తెలుసుకునేందుకు ప్రదర్శన ఉపకరిస్తుందని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సభ్యులు కె.మోహన్ రెడ్డి చెప్పారు. భారత్తో పాటు దక్షిణాసియాకు చెందిన 800 మంది నిపుణులు నేడు (మంగళవారం) జరిగే నాలెజ్డ్ డేలో పాల్గొంటున్నారు. -
పౌల్ట్రీ... పల్టీ
రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఉత్పత్తి వ్యయం అంతకంతకూ పెరిగిపోతుండడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. కొన్నేళ్లుగా మొక్కజొన్న అధికంగా పండే రాష్ట్రాల్లో కరువు తాండవిస్తుండడంతో కోళ్లకు వేసే మేత ధర రెట్టింపైంది. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయింది. దాణా ఉత్పత్తిలో కార్పొరేట్లు సిండికేట్ అవడంతో పౌల్ట్రీ రైతుల కష్టాలు వర్ణనాతీతం. ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమపై శీత కన్నేయడంతో చిన్నరైతులు దివాలా తీస్తున్నారు. సాక్షి, చిత్తూరు: ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పౌల్ట్రీ పరిశ్రమను నిండా ముంచేస్తున్నాయి. పౌల్ట్రీని వ్యవసాయ కేటగిరీ కిందlమార్చాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. దీంతో పౌల్ట్రీకి వ్యవసాయ రైతులకు ఇచ్చే సబ్సిడీలు వర్తించడం లేదని వాపోతున్నారు. చిన్నతరహా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకతి కనికరించకపోవడంతో కోళ్ల మేత ఖర్చులు కూడా 25 శాతం వరకు పెరిగాయి. దీంతో ఉత్పత్తి ఖర్చులు రెట్టింపయ్యాయి. చికెన్, గుడ్డు ధరలు మాత్రం ఆశించినంత పెరగడం లేదు. గోడౌన్లలో పంపిణీ కాకుండా మగ్గిపోయి వథా అవుతున్న గోధుమలు, బియ్యాన్ని పౌల్ట్రీకి కేటాయించాలని కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాపారులు అంటున్నారు. నష్టాల బాట.. ఫారాల మూత రాష్ట్రంలో దాదాపు 10 వేల వరకు కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఏటేటా నష్టాలు పెరుగుతుండడంతో ప్రతి సంవత్సరం వందకు తక్కువ కాకుండా ఫారాలను మూతపడుతున్నాయి. రాష్ట్రంలో కోడి మాంసం వినియోగం ప్రతి సంవత్సరం పెరుగుతున్నా.. ఉత్పత్తి వ్యయం పెరుగుతుండడంతో నష్టాలు పెరుగుతున్నాయి. దీంతో ఫారాలు మూసివేస్తున్నారు. దాణా దిగుమతికి ప్రభుత్వం అంగీకరించకపోవడం పరిశ్రమను మరింత కుంగదీసింది. స్థానికంగా కరువు పరిస్థితులు ఏర్పడడం.. దాణాను ఉత్పత్తి చేసే వ్యాపారులు సిండికేట్ అవడంతో ఉత్పత్తి ధర అమాంతం పెరిగింది. రాష్ట్రంలో 1.30 కోట్ల టన్నుల దాణా పరిశ్రమకు అవసరం అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 5 లక్షల టన్నుల దాణా దిగుమతికే అనుమతి ఇచ్చింది. దీని వల్ల స్థానికంగా ఉన్న అ«ధిక రేట్లతోనే దాణాను కొనుగోలు చేస్తున్నారు. పొంచి ఉన్న అమెరికా ముప్పు అమెరికా నుంచి కోడి మాంసాన్ని దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఉత్పత్తి అధికంగా ఉన్నా.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు దేశంలో అతి పెద్ద పరిశ్రమను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక వేళ తప్పని సరి పరిస్థితి అయితే 108 శాతం సుంకం విధించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. 5 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్లో ఉంచిన మాంసాన్ని అమెరికా ప్రభుత్వం మనకు అంటగట్టాలని చూస్తోందని వారు వాపోతున్నారు. రాయితీలు ఇవ్వాలి మిగతా పరిశ్రమలకు ఇచ్చే మాదిరిగానే పౌల్ట్రీకి కూడా ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. రాష్ట్రంలో తలసరి గుడ్ల వినియోగం చాలా తక్కువగా ఉంది. దీన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం తరహాలో హైస్కూల్ పిల్లలకు కూడా వారానికి ఆరు గుడ్లు ఇవ్వాలి. దీని వల్ల పిల్లలకు కూడా పౌష్టికాహారం అందించినట్లవుతుంది. – మధుసూదన్రెడ్డి, చైర్మన్, రాయలసీమ పౌల్ట్రీ రీజియన్ -
గడ్డు కాలం
* ఇతర రాష్ట్రాల్లో తగ్గిన గుడ్డు వినియోగం * స్థానిక ఎగుమతులపై ప్రభావం * రైతు వద్ద రూ.2.78లకు తగ్గిన ధర * వేసవితో 8 శాతం క్షీణించిన ఉత్పత్తి * రోజుకు సుమారు రూ.87.2 లక్షల నష్టం * మునుముందు మరింత గడ్డుకాలం మండపేట : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి. సీజన్లో గుడ్డు ధర తీవ్ర నిరాశపరిస్తే తాజాగా పరిశ్రమకు వేసవి బెడద పట్టుకుంది. గుడ్డు ధర పతనమవుతోంది. వేసవి గుబులుతో గుడ్ల ఉత్పత్తి ఎనిమిది శాతం మేర పడిపోయింది. మునుముందు 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కానుండటంతో మరింత కష్టకాలం తప్పదని పౌల్ట్రీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తగ్గిన ఉత్పత్తి, పతనమవుతున్న ధరల రూపంలో కోళ్ల పరిశ్రమకు రోజుకు సుమారు రూ.87.2 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. జిల్లాలో సుమారు 1.30 కోట్ల కోళ్లు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 60 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. శీతల ప్రభావంతో ఎగుమతులకు డిమాండ్ పెరిగి గుడ్డు రైతు ధర జనవరిలో రూ.4.07 పైసలకు చేరి సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే కోళ్ల రైతుల ఆశలను ఆవిరి చేస్తూ ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత మొదలవడంతో వినియోగం తగ్గి స్థానిక ఎగుమతులకు డిమాండ్ తగ్గిపోయింది. బరవాలా, పంజాబ్, తమిళనాడులోని నమ్మక్కల్ ప్రాంతాల నుంచి ఎదురవుతున్న పోటీ స్థానిక ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. జనవరిలో కోస్టల్ ఏరియాలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా నుంచి రోజుకు సుమారు 160 లారీల గుడ్లు ఎగుమతి కాగా అనేక కారణాలతో క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 130 లారీల గుడ్లు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. దీంతో పౌల్ట్రీల్లో గుడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి గుడ్డు రైతు ధర పతనమవుతూనే వస్తోంది. జనవరి నెలాఖరు నాటికి రూ.4.05 పైసలు ఉన్నరైతు ధర పలు ఒడిదుడుకులకు గురై ప్రస్తుతం రూ.2.78 పైసలకు తగ్గిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధర మరింత తగ్గుతుందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రతి గుడ్డుపై 62 పైసల నష్టం ఎండలు మండుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా జిల్లాలో గుడ్ల ఉత్పత్తి సుమారు ఎనిమిది శాతం మేర తగ్గినట్టు పౌల్ట్రీవర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో సుమారు 1.01 కోట్లు గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుత గుడ్డు ధర మేరకు తగ్గిన ఉత్పత్తి రూపంలో రోజుకు సుమారు రూ.24.46 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. మరోపక్క తెగుళ్ల నివారణ కోసం మందుల వాడకం, మేత, కూలీల ఖర్చులు పెరిగిపోవడం, వేసవి ఉపశమన చర్యలు తదితర కారణాలతో పౌల్ట్రీల నిర్వహణ భారంతో గుడ్డు రైతు ధర రూ.3.40 పైసలు ఉంటేనే గిట్టుబాటు కాదని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత రైతు ధర రూ.2.78 ధర మేరకు రోజుకు ఒక్కో గుడ్డు రూపంలో 62 పైసల వరకు కోళ్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. గిట్టుబాటు కాని ధర రూపంలో పరిశ్రమకు రోజుకు సుమారు రూ.62.74 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు పరిశ్రమ వర్గాలంటున్నాయి. మునుముందు ఎండలు, వేడిగాలుల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గిపోవడంతో పాటు కోళ్ల మరణాలు పెరిగి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలతో మరింత సంక్షోభం ఎండల తీవ్రతతో ఇప్పటికే పరిశ్రమకు వేసవి కష్టాలు మొదలయ్యాయి. ఎగుమతులకు డిమాండ్ లేక ధర తగ్గిపోతోంది. ఎండలు మరింత ముదిరితే వడదెబ్బతో కోళ్ల మరణాలు పెరుగుతాయి. గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గి ఆ మేరకు కోళ్ల రైతులు నష్ట పోవాల్సి వస్తుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఈ ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయి. - పడాల సుబ్బారెడ్డి, జిల్లా నెక్ చైర్మన్, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
కోళ్లు కుతకుత
♦ ఎండ వేడిమికి విలవిల ♦ ఎక్కడికక్కడ మృత్యువాత ♦ పౌల్ట్రీ రైతుల కుదేల్ ♦ మూతపడ్డ పరిశ్రమలు భానుడి ప్రతాపంతో పౌల్ట్రీ విలవిల్లాడుతోంది. వడ దెబ్బకు కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. కోడి ఎదుగుదల లేక.. ధర రాక రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికే చాలా పౌల్ట్రీ ఫారాలు మూతపడ్డాయి. చేసిన అప్పులు మిగిలి పోయాయి. పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన రైతన్న సర్కార్ సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నాడు. - మెదక్ ఎండ దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. భానుడి భగభగలకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే కరువుతో వ్యవసాయం మూలనపడటంతో కొందరు రైతులు ఫారాలు ఏర్పాటుచేసుకున్నారు. వాటి నిర్వాహకులు దిక్కుతోచని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ఫారాల్లో ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి చల్లటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అయినా రైతుల కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. ఎండను తట్టుకోలేక కోళ్లు చనిపోతూనే ఉన్నాయి. మిగిలిన కోడి పిల్లల్లో ఎదుగుదల లేక రైతన్న లబోదిబోమంటున్నాడు. కోళ్ల బరువు ఆధారంగా పౌల్ట్రీ రైతులకు కమీషన్ వస్తుంది. వేసవి కారణంగా ఎండ తీవ్రతకు కోళ్లలో పెరుగుదల నిలిచిపోయింది. ఫలితంగా వా రికి వచ్చే లాభం పూర్తిగా తగ్గిపోతోంది. చేసిన కష్టానికి ఫలితం దక్కడం లేదు. ఫలితంగా అనేక కోళ్లఫారాళ్లు మూతపడ్డాయి. ఒక్క ఫారాన్ని నడపాలంటే కనీసం ముగ్గురు పనివాళ్లు ఉండాలి. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల చొప్పున ముగ్గురికి రూ.30 వేల జీతాలు ఇవ్వాలి. ఒక్కో బ్యాచ్ ను 45 రోజులపాటు పెంచుతారు. ఫారం అడుగు భాగాన వడ్ల చిట్టు(పొట్టు) వేయాలి. దానికి రూ.10 వేల వరకు వెచ్చించాలి. ఇక కరెంట్ మీటర్లు వ్యాపారం కింద కేటగిరి -2 కింద బిగించటంతో నెలకు రూ.3 వేల వరకు బిల్లు వస్తుంది. ఇవన్నీ ఖర్చులు భరించాలం టే కోళ్లు ఏపుగా పెరిగి ఒక్కో కోడి 2.30 కిలోల నుంచి 3కిలోల బరువు పెరిగితేనే రైతుకు కొంత లాభం వస్తుంది. గత రెండు నెలలుగా కేవలం 1.50 కిలోలకు మించి బరువు పెరగడం లేదని, దీంతో పనివాళ్లకు జీతాలు ఇచ్చేపరిస్థితి లేకుండా పోయిం ది. ఇప్పటికే జిల్లాలో అనేక పౌల్ట్రీలను మూసివేశారు. పౌల్ట్రీల ఏర్పాటు కోసం రైతులు బ్యాంకుల్లో లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఎండ తీవ్రత కారణంగా తీవ్రనష్టం వస్తుండటంతో అవి మూత పడుతుండగా బ్యాంకు రుణాలు ఎలా తీర్చాలో తెలియక జిల్లాలోని అనేక మంది పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. మిగిలింది అప్పులే.. రెండు నెలలుగా ఎండ తీవ్రతతో కోళ్ల బరువు పెరగడంలేదు. అదీగాక ఎండకుతట్టుకోలేక కోళ్లు చనిపోతున్నా యి. ఫారం నిర్మాణానికి రూ.4 లక్షల అప్పులు చేశా. నెలన్నరపాటు ఒక్క బ్యాచిని పెంచితే నష్టం తప్ప లాభం రాలేదు. కోళ్లఫారాల్లో ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయటంతో కరెంట్ బిల్లు నెలకు రూ.3వేలపైనే వస్తుంది. పౌల్ట్రీ పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలి. - గందె శ్రీనివాస్, పౌల్ట్రీ రైతు, ఔరంగాబాద్ -
కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ
* యూనిట్కు రూ.2 రాయితీ * గత డిసెంబర్ 1 నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వనున్నారు. యూనిట్కు రెండు రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సబ్సిడీ గత డిసెంబర్ 1 నుంచి అమలుచేస్తారు. కోళ్ల పరిశ్రమలు వినియోగించే కరెంటులో యూనిట్కు అయ్యే ఖర్చులో రూ.రెండు సబ్సిడీ ఇస్తారు. అన్ని లేయర్ ఫారాలు, బ్రాయిలర్ ఫారాలు, హేచరీస్, పౌల్ట్రీ ఫీడ్ మిల్స్లకూ సబ్సిడీ వర్తిస్తుంది. కోళ్ల పరిశ్రమకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ల జాబితాను తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ పశుసంవర్థక శాఖకు ఇస్తుంది. పశుసంవర్థక శాఖ, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సంయుక్తంగా ప్రతీ విద్యుత్ కనెక్షన్ను పరిశీలించి ఏ రకమైన కోళ్ల పరిశ్రమో గుర్తించి... సబ్సిడీకి అర్హత ఉందో లేదో తేలుస్తారు. అనంతరం పశుసంవర్థక శాఖ అధికారులు సబ్సిడీకి అర్హత ఉన్న కోళ్ల పరిశ్రమల కనెక్షన్ల వివరాలతో జాబితా తయారుచేసి డిస్కంలకు అందజేస్తారు. అందుకు అనుగుణంగా సబ్సిడీ పొందేందుకు ఇన్వాయిస్లను డిస్కంలు ఇస్తాయి. ప్రస్తుతం కోళ్ల పరిశ్రమ వ్యాపారులు కరెంటు చార్జీల కింద యూనిట్కు రూ. 6.08 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం యూనిట్కు రూ. 2 రాయితీ ఇస్తే వ్యాపారులు రూ. 4.08 చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ప్రభుత్వంపై నెలకు రూ. 4 కోట్ల భారం పడనుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో 2 వేల లేయర్ కోళ్ల పరిశ్రమలున్నాయి. వాటిల్లో 4.5 కోట్లు గుడ్లు పెట్టే కోళ్లుంటాయి. అలాగే 6 వేల బాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. -
‘పౌల్ట్రీ’కి ఎండదెబ్బ!
అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతలు నిత్యం వందలాది కోళ్ల మృత్యువాత ఆందోళనలో పౌల్ట్రీఫాంల యజమానులు యాచారం : రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. వేడిగాలులు, ఎండదెబ్బతో నిత్యం వందలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వారం రోజులుగా వేసవి తీవ్రత ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో కోళ్లు వేడిని తట్టుకోలేకపోతున్నాయి. వాటిని రక్షించుకోవడానికి పౌల్ట్రీఫాంల యజమానులు శతవిధాలుగా చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండాపోతుంది. అప్పులపాలు కాకతప్పదని వారు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలో పలు గ్రామాల్లో సన్న, చిన్నకారు రైతులు మాల్ ఆంధ్రా బ్యాంకు, యాచారం పీఏసీఎస్, ఎస్బీహెచ్లలో అప్పులు తీసుకొని పౌల్ట్రీఫాంలు ఏర్పాటు చేశారు. తమ్మలోనిగూడ, చౌదర్పల్లి, నక్కర్తమేడిపల్లి, మొండిగౌరెల్లి, యాచారం, చింతుల్ల తదితర గ్రామాల్లో దాదాపు 200 మంది రైతులు ఆయా బ్యాంకుల్లో రూ. లక్షలాది రుణాలు పొందారు. వ్యవసాయానికి తోడుగా పౌల్ట్రీఫాంలను నిర్వహిస్తే మంచి ఆదాయం పొందవచ్చని ఆశించారు. ప్రస్తుతం వారి కలలు కల్లలయ్యే దుస్థితి దాపురించింది. లాభాల మాటేమోగాని నష్టాలు చవిచూడకుండా ఉంటే చాలని రైతులు పేర్కొంటున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వేలాది కోళ్లు వేసవి తాపానికి అస్వస్థతకు గురికావడం, నీళ్లు చల్లినా, అవసరమైన మందులు అందిస్తున్నా క్షణాల వ్యవధిలోనే మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండలంలోని పలు గ్రామాల్లో పౌల్ట్రీఫాంలను నిర్వహిస్తున్న రైతులు వివిధ బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఇంటిగ్రేషన్ పద్ధతిన కోళ్ల పెంపకం చేపడుతున్నారు. స్నేహ, సుగుణ, శ్రీ వెంకటేశ్వర తదితర కంపెనీల నుంచి కోడిపిల్లలను తీసుకువచ్చి పెంచుతున్నారు. నిబంధనలు, ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే నిర్వహణ డబ్బులు చెల్లిస్తాయి. కోడిపిల్లలను అందజేసిన 35 నుంచి 38 రోజుల్లోనే ఆయా సంస్థలే కోళ్లను తీసుకెళ్తాయి. ప్రస్తుతం చికెన్ ధరలు బాగానే ఉన్నప్పటికి, కోళ్లు మృత్యువాత పడుతున్న దృష్ట్యా ఇంటిగ్రేషన్ సంస్థలు 45 రోజులు దాటినా కోళ్లను తీసుకెళ్లడంలేదంటున్నారు రైతులు. కోళ్లు రోజురోజుకూ బరువు పెరుగుతుండటంతో పాటు దాణా రెండింతలు తింటున్నాయి. సకాలంలో కోళ్లను తరలించకపోవడం, దాణా ఖర్చులు భారంగా మారడంతో రైతులకు పెంపకం ఖర్చులు భారంగా మారాయి. దీనికి తోడు వారంరోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో వేసవి తాపానికి కోళ్లు మృతిచెందుతున్నాయి. దీంతో తాము అప్పుల్లో కూరుకుపోయే దుస్థితి దాపురించిందని పౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
'కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలి'
న్యూఢిల్లీ: తెలంగాణలో బర్డ్ ఫ్లూతో ఇబ్బందుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్రాన్ని కోరారు. బర్డ్ఫ్లూతో ఇటీవల రెండు లక్షల కోళ్లు చనిపోయాయని, ఈ పరిశ్రమకు గుర్తింపునిచ్చి వ్యవసాయ రంగంతో సమానంగా రుణాలు లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ పిల్లలు, గర్భిణులకు గుడ్లను పంపిణీ చేయాలన్నారు. కోళ్ల పరిశ్రమలో పనిచేసే కార్మికులకు బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులతో సమానంగా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. -
యంత్ర మర్మం తెలిసింది
మహిళా విజయం: ఆటో మొబైల్రంగం అనగానే... యంత్రాల మోతలు, గుర్తొస్తాయి. వాటితో పని చేసే గరుకు చేతులు కళ్ల ముందు మెదలుతాయి. అందుకు భిన్నంగా... రెండు సున్నితమైన చేతులు ఈ యంత్రాంగాన్ని నడిపిస్తున్నాయి. మన పక్కింటమ్మాయిలా కనిపించే సునీత చేస్తున్న సాహసం ఇది. మా కుటుంబంలో తొలితరం పారిశ్రామికవేత్త మా అమ్మ. ఆమె మా నాన్న స్థాపించిన పౌల్ట్రీ పరిశ్రమను నడిపింది. నేను ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టడం సాహసోపేతమైన నిర్ణయం అనుకోవడం లేదు. మా అమ్మానాన్నలు నాకు ‘ఆడపిల్ల కాబట్టి...’ అంటూ పరిధులు విధించలేదు. మాది విజయవాడ దగ్గర సూరంపల్లి. ‘నున్న’లో మా కోళ్లఫారాలుండేవి. అమ్మానాన్నలు ఇతర పనుల్లో ఉన్నప్పుడు నేను లూనా మీద వెళ్లి కోళ్లఫారం పనులు చూసేదాన్ని. బీకామ్ పూర్తవగానే పెళ్లి చేశారు. అలా హైదరాబాద్కొచ్చాను. మావారు మెకానికల్ ఇంజనీర్. నాలో వ్యాపార లక్షణాలున్నాయంటూ ఎంబీఏ చేయమన్నారు. ‘నేను చేయగలను’ అని నిరూపించుకోవాలనే తపన నాలో చాలా ఉండేది. ఎంబీఏ కాగానే 2008లో ఈ యూనిట్ని స్థాపించాను. మొదట్లో చేతులతోనే... మొదట్లో మిల్లింగ్ మెషీన్తో చిన్న చిన్న కాంపోనెంట్స్ తయారు చేశాం. తర్వాత నానోబోరింగ్ ద్వారా బ్లాక్ సిస్టమ్ చేశాం. హారిజాంటల్ బోరింగ్, మూసపోత వంటివన్నీ చేత్తోనే చేయాల్సి వచ్చేది. 2010 నాటికి నాణ్యమైన దేశీయ, విదేశీ యంత్రాలతో పరిశ్రమ స్థాయి పెంచాను. మాన్యువల్గా చేసినప్పుడు నెలకు పాతిక- ముప్పై వేల రూపాయల పనులు చేసేవాళ్లం. ఇప్పుడది ఏడాదికి అరవై లక్షల టర్నోవర్కి చేరింది. సోలార్ స్ట్రింగింగ్ జిగ్స్ తయారీలో దక్షిణ భారతదేశంలో మొదటిస్థానంలో ఉన్నాం. ప్రోగ్రామింగ్, మార్కెటింగ్ నేను, రోజువారీ పనులు మావారు చూసుకుంటున్నాం. శిక్షణ ఇచ్చే స్థాయికి... ఇంజనీరింగ్లో ప్రాథమిక సూత్రాలను మా వారు నేర్పించారు. ఆ తర్వాత మొత్తం కంప్యూటర్ ద్వారా రూపొందించడానికి 2డి, 3డి ఆపరేషన్స్ నేర్చుకున్నా. ఒక వస్తువు రూపొందాలంటే అనేక విడిభాగాలు తయారు చేసుకుని వాటిని కరెక్టుగా అసెంబుల్ చేయాలి. ప్రతి విడిభాగానికీ ముందు ఒక మూసను తయారుచేయాలి. మేము ఆ మూసలను, విడిభాగాలను తయారు చేస్తాం. 24 కట్టర్స్ ఆధారంగా కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేస్తే యంత్రాన్ని ఆన్ చేయగానే ఎప్పుడు ఏ కట్టర్ పని చేయాలో అది ఆ పని చేసుకుపోతుంది. టూ వీలర్ తయారు కావాలంటే వందలాది విడిభాగాలు కావాలి, కారుకైతే వెయ్యి విడిభాగాలుంటాయి. నేను ఇందులో ప్రత్యేకంగా కోర్సు చేయలేదు కానీ, సబ్జెక్టు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. నేనిప్పుడు మాకు వచ్చిన ఆర్డర్లకు స్వయంగా డిజైన్ చేసుకోవడంతోపాటు ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేట్లకు వారు చదివిన విషయాన్ని పనిలో ఆచరించడానికి తగిన శిక్షణ ఇవ్వగలను. పరిశ్రమకు ముందు... యంత్రాల మధ్య సమన్వయం కుదిర్చి పనిచేయడం అసాధ్యమేమీ కాదు అని నమ్మాకే ఇందులోకి దిగాను. నాకేం కావాలో తెలుసుకున్న తర్వాత నేర్చుకోవడం కష్టం కాలేదు. పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చెందిన సాంకేతికరంగంలో యంత్రాల విడిభాగాల తయారీ చేస్తున్న ఏకైక తెలుగు మహిళను అని గర్వంగా చెప్పగలను. ఆ నిబంధన ఉండాలి మన దగ్గర మెటల్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం తక్కువ. గుజరాత్లో బాగుంది. వ్యవస్థను నడిపించే శక్తి మహిళలకు ఉంది. పరిశ్రమ స్థాపనతోపాటు, మార్కెటింగ్లో కూడా మహిళలకు ప్రభుత్వం నుంచి ఆసరా ఉంటే మరింత మంది ఈ రంగంలోకి రాగలుగుతారు. ప్రభుత్వ అధీనంలో నడిచే భారీ పరిశ్రమలకు అవసరమయ్యే విడిభాగాల ఆర్డర్లు మహిళలు నిర్వహించే పరిశ్రమలకు ఇవ్వాలనే నిబంధన పెడితే బావుంటుంది. - జె. సునీత, ఎం.డి, ఎస్.ఎల్.పి. ఇంజినీర్స్ (సీఎన్సీ కాంపోనెంట్స్, సబ్ అసెంబుల్స్) ఫోన్: 9441549202 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి ఫొటో: రాజేశ్ -
ప్రణాళికాబద్ధంగా సాగితే.. పౌల్ట్రీ లాభమే!
మోమిన్పేట: కోళ్ల పెంపకం వైపు గ్రామీణ ప్రాంతాల్లోని యువరైతులు దృష్టి సారిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో 40 రోజుల్లోనే లాభాలు పొందవచ్చంటున్నారు. ప్రణాళిక ప్రకారం చేస్తే ఎంత లాభం వస్తుందో ప్రణాళిక లేకుండా పెంపకం చేపడితే అంత నష్టం వస్తుందంటున్నారు. కోడిపిల్లలు, మందులు, దాణాలను పలు కంపెనీలు రైతులకు అందజేస్తున్నాయి. కేవలం పెంపకం బాధ్యతలనే రైతులకు అప్పగిస్తున్నాయి. వాటిపై కమీషన్ కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారు.మండల పరిధిలోని చీమల్దరి, టేకులపల్లి, ఏన్కతల, మల్రెడ్డిగూడెం, ఎన్కేపల్లి, కేసారం, మోమిన్పేట, దుర్గంచేర్వు, బూర్గుపల్లి తదితర గ్రామాలలో ఇప్పటికే సుమారు 26 మంది యువ రైతులు కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. బ్యాంకులు రుణ సౌకర్యాన్ని కల్పిస్తే ఎక్కువ మొత్తంలో పెంపకాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. షెడ్ల నిర్మాణం.. మూడు వేల బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి శాశ్వత షెడ్డు నిర్మాణానికి దాదాపు రూ.5.50 లక్షలు అవసరమవుతాయి. మరో రూ.లక్షతో నీటి తొట్లు తదితర సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కోడి పిల్లల కొనుగోలు మూడు వేల కోడి పిల్లల కొనుగోలుకు మార్కెట్ను బట్టి రూ.90 వేలు అవసరమవుతాయి. ఒక్కో కోడిపిల్ల సగటున మూడు కిలోల నుంచి నాలుగు కిలోల దాణా తింటుంది. కిలో దాణా రూ.35. కాగా కోడి ఒక్కటి 40 రోజుల్లో రూ.180 నుంచి రూ.190 వరకు దాణా తింటుంది. మందులు, కూలీలు, విద్యుత్ బిల్లులతో పాటు ఒక్కో కోడికి 40 రోజులలో సగటున రూ.210 ఖర్చవుతాయని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్లో కిలో కోడి రూ.90కి అమ్ముడు పోతే మంచి లాభాలు వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. 40 రోజులు దాటితే దాణా ఖర్చు పెరిగి నష్టాలు వస్తాయని రైతులు తెలిపారు. మార్కెటును దృష్టిలో పెట్టుకొని రైతులు వెంకటేశ్వర, సుగుణ కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. దాణా, మందులు, కోడిపిల్లలు కంపెనీ వారు ఇస్తే కూలీలు, విద్యుత్ బిల్లులను యజమాని భరించాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వడం బాగానే ఉందని రైతులు పేర్కొంటున్నారు. -
కోళ్ల ఫారాలకు కోలుకోలేని దెబ్బ!
తుపాన్తో ఉత్తరాంధ్రలో 25 లక్షల కోళ్ల మృతి (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఉత్తరాంధ్రలో ఫౌల్ట్రీ పరిశ్రమ హుదూద్ తుపాను దెబ్బకు కోలుకోలేని విధంగా నష్టపోయింది. విషపు గాలుల తీవ్రతకు తుపాను ప్రభావిత నాలుగు జిల్లాల్లో 25 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ కోళ్ల ఫారాలు సుమారు 200 దాకా ఉన్నాయి. విశాఖ జిల్లా యలమంచిలి నుంచి భోగాపురం వరకూ, విజయనగరంలోని జిల్లాలోని బొబ్బిలి, శృంగవరపుకోట, పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పార్వతీపురం, ఆముదాలవలస ప్రాంతాల్లో ఫౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరూ రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల మేర పెట్టుబడులు పెట్టారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకూ పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. మేత, నీరు అందక రోగాల బారిన పడ్డాయి. షెడ్లకున్న రేకులు, తాటాకులు గాలుల తీవ్రతకు ఎగిరిపోయి కోళ్లు వర్షంలో తడిసి అనారోగ్యం బారిన పడ్డాయి. తీరని కష్టమిది.... తుపాను వల్ల ఫౌల్ట్రీ పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది. రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు రావాలి. - జీ రామకృష్ణ చౌదరి, విశాఖ జోనల్ చైర్మన్, నెక్ -
కోడితో రాబడి
నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గతంలో గ్రామానికి సర్పంచ్గా పనిచేశాను. మూడేళ్ల క్రితం కోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఆలోచన తట్టింది. నాకున్న వ్యవసాయ పొలంలోనే చిన్నపాటి షెడ్డు నిర్మించి కోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టాను. మొదట వెయ్యి కోళ్లతో ప్రారంభించా. ఆ తర్వాత రూ. ల క్ష బ్యాంకు రుణంతో మరో షెడ్డు నిర్మించుకున్నాను. బ్యాంకు రుణం సక్రమంగా చెల్లిస్తూ క్రమక్రమంగా 13వేల కోళ్ల సామర్థ్యం గల షెడ్లను ఏర్పాటు చేసుకున్నా. ప్రస్తుతం కూలీలపై ఆధారపడకుండా కుటుం బ సభ్యుల సహకారంతో కోళ్లను పెంచుతూ మంచి లాభం పొందుతున్నా. రెండెకరాల పొలంలో షెడ్లు నిర్మించుకుని ఏడాదికి రూ.5లక్షలకు పైగానే ఆదాయం ఆర్జిస్తున్నా. కేవలం ఎనిమిది రోజులు శ్రద్ధ పెట్టాలి కేవలం ఎనిమిది రోజులు కోడిపిల్లలపై శ్రద్ధ పెడితే చాలు. చలికి తట్టుకునే విధంగా షెడ్ల ఉష్ణోగ్రతను పెంచడానికి హైఓల్టేజీ విద్యుత్ బల్బులు వేయడం, కరెంట్ లేని సమయంలో ఇనుప డబ్బాలకు రంధ్రాలు చేసి బొగ్గుల కుంపట్లు పెట్టి కోడి పిల్లలకు సరిపడా ఉష్ణోగ్రత ఉండేవిధంగా చూసుకోవాలి. ఆ పది రోజుల పాటు పిల్లలను గుంపులు కట్టి పడుకోకుండా అప్పుడప్పుడూ కదిలిస్తే సరిపడా దాణా తిని ఎదుగుదల ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఫీడర్ల నిండా దాణా పోసి మధ్యాహ్నం కొంతసేపు మేత ఆపాలి. గంటకోసారి షెడ్డులో తిరిగి చూసుకోవాలి. 5-12 రోజుల సమయంలో కళ్లలో మందులు వేయాలి. అప్పుడప్పుడూ వ్యాధులను బట్టి మిగతా మందులను తాగునీటిలో కలిపి అందించాలి. ఇంటిల్లిపాదీ కష్టపడతాం నాతో పాటు మా తమ్ముడు శ్రీను, కుటుంబ సభ్యులందరం కష్టపడి పనిచేస్తాం. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంపై ఆధారపడితే పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రస్తుతం ఉన్నంతలో వ్యవసాయ పనులు చేసుకుంటూనే మూడేళ్లుగా పౌల్ట్రీఫాంను నడిపిస్తున్నాం. కోడి ధరను బట్టి ప్రతి బ్యాచ్కు రూ.50వేలకుపైగా ఆదాయం వస్తుంది. -
కోళ్లకు ‘యాంటిబయాటిక్స్’ అవాస్తవం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోళ్లకు రోగాలు వచ్చినప్పుడు మినహా సాధారణ పరిస్థితుల్లో యాంటిబయాటిక్స్ వాడడం లేదని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల సెంటర్ ఫర్ సైన్స్, ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఢిల్లీ ప్రాంతంలో చేపట్టిన అధ్యయనంలో కోళ్లలో యాంటిబయాటిక్స్ అవశేషాలు ఉన్నాయని తేలిన సంగతి తెలిసిందే. అయితే రిపోర్టులో ఉన్న అవశేషాల స్థాయి యూరోపియన్ ప్రమాణాలకు లోబ డే ఉందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రంజిత్ రెడ్డి వెల్లడించారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి.హర్షవర ్ధన్రెడ్డి, జనరల్ సెక్రటరీ జి.రమేష్బాబు, జాయింట్ సెక్రటరీ సి.మధుసూధన్రావు, పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డి.సుధాకర్, జనరల్ సెక్రటరీ కేఎస్ రెడ్డి, నెక్ హైదరాబాద్ జోన్ వైస్ చైర్మన్ కేవీఎస్ సుబ్బరాజు, వీహెచ్ గ్రూప్ జీఎం ఎస్.బాలసుబ్రమనియన్తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడ అప్రాధాన్యం..: లక్షల టన్నుల్లో చికెన్ లెగ్స్ అమెరికా గిడ్డంగుల్లో 5 ఏళ్లపైబడి నిల్వ ఉన్నాయి. వీటిని కిలోకు రూ.24-48లకే వివిధ దేశాలకు అమెరికా ఎగుమతి చేస్తోందని పౌల్ట్రీ ప్రతినిధులు తెలిపారు. భారత్కు చికెన్ లెగ్స్ దిగుమతి నిర్ణయం గనక అమలైతే దేశీయ కోళ్ల పరిశ్రమ కుదేలవడం ఖాయమని అన్నారు. దిగుమతయ్యే చికెన్పై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని వారు డిమాండ్ చేశారు. మూడేళ్లుగా గిట్టుబాటు ధర రావడం లేదని పేర్కొన్నారు. ధాన్యం ధరలు పెరగడంతో కిలో కోడికి రూ.10 నష్టపోతున్నామని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికిగాను ఒక్కో కోడిపైన రూ.6 దాకా పౌల్ట్రీ యజమానులు వడ్డీ చెల్లిస్తున్నారన్నారు. -
పౌల్ట్రీకి వ్యవసాయ హోదా!
హైదరాబాద్: కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు. తెలంగాణలో 25 వేల మందికిపైగా కోళ్ల పరిశ్రమలను నిర్వహిస్తున్నట్టు తనవద్ద సమాచారం ఉందన్నారు. కోళ్ల పరిశ్రమ యజమానుల సంఘం అధ్యక్షుడు రంజిత్రెడ్డి నాయకత్వంలో పలువురు ప్రతినిధులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ను కలి శారు. కోళ్ల పరిశ్రమకు విద్యుత్, మొక్కజొన్న సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయహోదా ఇచ్చే అంశాన్ని కూడా పరిశీ లించాలని చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. భేటీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కూడా పాల్గొన్నారు. పోలీసు వాహనాలను పరిశీలించిన సీఎం పోలీసు శాఖకు కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్న ఇన్నోవా, ద్విచక్ర వాహనాల నమూనాలను ఆదివారం తన నివాసంలో సీఎం కేసీఆర్ పరిశీలించారు. డీజీపీ అనురాగ్శర్మ రెండు ఇన్నోవా, ఒక ద్విచక్ర వాహనాన్ని సీఎంకు చూపించారు. వాటిల్లో పోలీసులకు అవసరమైన ఏర్పాట్లను, వాహనాల డిజైనింగ్ను సీఎంకు వివరించారు. ఇన్నోవా లోపల ఉన్న పోలీసు లోగోను ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్థానం నుంచి అందరికీ కనిపించేలా పక్కకు జరపాలని, వాహనం ముందు భాగంలో రాసిన అక్షరాల సైజును పెంచాలని సీఎం సూచించారు. ద్విచక్రవాహనంలో కూడా చిన్న మార్పులను సూచించారు. సైగ్నస్ ఆస్పత్రిని ప్రారంభించిన కేసీఆర్ హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ సర్దార్ పటేల్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సైగ్నస్ గ్యాస్ట్రోఎంటరాలజీ హస్పిటల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఆసుపత్రి చైర్మన్ శ్రీవేణు, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే లు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కూకట్పల్లి టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొన్నారు. -
పుంజు చూడు, పుంజందం చూడు...
వర్ణం: టేబుల్ మీద ఠీవిగా, ఛాతీ విరుచుకుని నడిచి, న్యాయమూర్తే అవాక్కయ్యేలా చేసిందీ కోడిపుంజు. సంగతేమిటంటే, మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ‘సెరెమా’ రకం కోళ్లమధ్య అందాల పోటీలు జరుగుతాయి. అరకిలో కూడా తూగని ఈ స్థానిక చిన్నరకం జాతికి ఆ దేశంలో బాగా ఆదరణ ఉంది. ఐరోపాకు కూడా ఇవి ఎగుమతి అవుతుంటాయి. పౌల్ట్రీ ప్రమోషన్లో భాగంగా జరిగే ఈ పోటీల్లో ఫొటోలోని పుంజు సుమారు ఆరులక్షల రూపాయల ప్రైజ్మనీ గెలుచుకుంది. ‘దీన్ని కొంటామని చాలామంది అడిగారు, కానీ అమ్మను. ఇది నా కుటుంబంలో భాగం,’ అని మురిసిపోతాడు యజమాని మహమ్మద్ హత్తా. మొరాకో ఘాట్ ఫొటోలోనిది ప్రపంచంలోనే పాతదిగా పేరొందిన ‘చర్మకారశాల’! సుమారు 900 ఏళ్ల నాటిది! గొప్ప నైపుణ్యం కనబరిచే చర్మతీతకారులకు మొరాకోలోని పాతనగరం ఫెజ్ ప్రసిద్ధి. అవసరమైన రసాయనాలు, రంగులు ఇలా గుంటల్లో పోసివుంచుకుంటారు. చనిపోయిన గొర్రెలు, మేకలు, ఒంటెల చర్మాలు ఇక్కడ ఒలుస్తారు. ఒలిచిన జంతుచర్మాలు బ్యాగులు, కోట్లు, బూట్లు, స్లిప్పర్లు లాంటి ఉత్పత్తుల తయారీకి తరలుతాయి. అందం?- ఆరోగ్యం? 100 మీటర్ల హైహీల్స్ పరుగుపందేనికి సిద్ధంగా కూర్చున్న యువతుల్ని ఈ ఫొటోలో చూడవచ్చు. అయితే, ఇది పందెం గురించి మాట్లాడుకునే సందర్భం కాదు. రష్యాలో మితిమీరిన ఫ్యాషన్స్ను అదుపు చేయాలన్న చర్చలు సాగుతున్నాయి. చాలా వంపుగా ఉండే హై హీల్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివికావనీ, వీటి గురించి ఏమైనా చేయాల్సిన సమయం ఆసన్నమైందనీ శాసనకర్త ఒలెగ్ మిఖాయెవ్ చెబుతున్నారు. అదే జరిగితే హీల్స్ మీద నిషేధం విధించే అవకాశం ఉంది. ట్రైనర్స్, బ్యాలె ఫ్లాట్స్, మగవాళ్లు ధరించే లోఫర్స్ కూడా ‘అనారోగ్య’ జాబితాలో ఉన్నాయి. -
‘పౌల్ట్రీ’కి ప్రోత్సాహం.. రైతుల్లో ఉత్సాహం
యాచారం: మండలంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రగతి కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) విరివిగా రుణాలు అందించేందుకు సంసిద్ధమైంది. పౌల్ట్రీఫాంల అభివృద్ధి కోసంనెదర్లాండ్కు చెందిన రోబో బ్యాంకు డీసీసీబీ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే జిల్లాలోనే యాచారం మండలంలోని రైతులకు విరివిగా రుణాలిచ్చి పౌల్ట్రీఫాంలను అభివృద్ధిపరిచేందుకు సంకల్పించింది. మూడు నెలల క్రితం నెదర్లాండ్కు చెందిన రోబో బ్యాంకు ప్రతినిధులు మండలంలో పర్యటించారు. పౌల్ట్రీ రైతులు జీవన స్థితిగతులు, కోళ్ల పెంపకంతో వచ్చే ఆదాయం, రైతుల ఆసక్తి, బ్యాంకు రుణాల వివరాలు, బకాయిల చెల్లింపు తదితర విషయాలను అధ్యయనం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా యాచారం మండలంలోని చిన్న, సన్నకారు రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం, షెడ్ల నిర్మాణం చేపట్టి 5 వేలనుంచి 10 వేలకుపైగా కోళ్ల పెంపకానికి వివిధ కంపెనీలతో ఇంటెగ్రేషన్ పద్ధతిన లాభాలు పొందుతున్న విషయం తెలుసుకున్నారు. జిల్లాలో మిగతా మండలాల రైతులు అంతగా ఆసక్తి చూపకపోవడం గుర్తించి మండలాన్ని దత్తతగా తీసుకోవడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగానే మండలంలో పలు గ్రామాల్లో పౌల్ట్రీఫాంల ఏర్పాటుపై ఔత్సాహిక రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడానికి నిర్ణయించారు. రూ.6 కోట్ల ప్రతిపాదనలు మండలంలోని పలు గ్రామాల రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడానికి డీసీసీబీ ఉన్నతాధికారుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం (పీఏసీఎస్) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కొద్ది రోజులు క్రితం డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సీఈఓ రాందాసు స్వయంగా ఇక్కడికి వచ్చి రైతులతో సమావేశమయ్యారు. రుణాల విషయంలో హామీ సైతం ఇచ్చారు. గతంలో పీఏసీఎస్ల ద్వారా 42 మంది రైతులు పౌల్ట్రీ పరిశ్రమ కోసం రూ.2 కోట్ల వరకు రుణాలు ఇచ్చారు. రుణాలు పొందిన 42 మంది రైతుల్లో మళ్లీ కొత్తగా పౌల్ట్రీ షెడ్లు నిర్మించుకుంటే రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. వీరిలో ఇప్పటికి 30 మంది రైతులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే పౌల్ట్రీ పరిశ్రమలో ఎటువంటి అనుభవం లేని రైతులకు సైతం పీఏసీఎస్ నుంచి రుణాలు ఇవ్వడానికి నిర్ణయించారు. గతంలో పౌల్ట్రీఫాంల కోసం పీఏసీఎస్ నుంచి కేవలం రూ. 5 లక్షలు మాత్రమే రుణాలిచ్చేవారు. కానీ ప్రస్తుతం రూ. 10లక్షలపైనే ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. కొత్త రైతులు ఇప్పటి వరకు 18 మంది అర్జీలు పెట్టుకున్నారు. నిబంధనలు పూర్తి చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రుణాలు విరివిగా అందజేస్తుండడంతో ఔత్సాహిక రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రానున్న రోజుల్లో మండలంలో పౌల్ట్రీఫాంల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. -
నవ్వింత: మా రాంబాబుగాడి కోడిప్రియత్వం
మొదట్నుంచీ మా రాంబాబు కోడి ప్రియుడు. వాడిదంతా ఓ విచిత్ర ధోరణి. ఈ జాతికి కోడిమాతల్లి చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావురా అంటుంటాడు. కోడీశ్వరార్చన చేయందే ఎవడూ చికెన్ తినకూడదన్నది వాడి సిద్ధాంతం. ఓ రోజు వాడు కోడిని తన మీదకు ఆవాహన చేసుకుని, కోడిని కీర్తిస్తూ ఓ పాట పాడుకుంటూ వస్తున్నాడు. ‘‘ఈ వృకోదరుల బకాసురుల కడుపాకలి లోకంలో/ రక్తంతో రాస్తున్నా కోడిమహాభారతం/ పుడుతూనే చికెను కేడ్చి, పుట్టీ తందూరికేడ్చి/ పెరిగిపెద్ద కాగానే లంచూ డిన్నర్లకేడ్చి/ ఇలా ఇలా మీరంతా ఏడుస్తూ పోతే / మీ కండలు పెంచింది ఈ కండలతో కాదా...’’ వాణ్ని ఆపి ‘‘ఏంట్రా ఇదీ’’ అన్నా. ‘‘వేటూరికి దీటుగా రాసేశా పాట. కాబట్టి వేటూరికి దీటూరిని నేనేరా’’ అన్నాడు రాంబాబు. ‘‘నేను మాట్లాడేది పాట గురించి కాదు... నీ కోడి పిచ్చి గురించి’’. ‘‘కోడి అంటే ఏమనుకున్నావ్ గురూ... ‘రక్తం చిందిస్తాం. రక్తం చిందిస్తాం. మా తుది రక్తపు బొట్టు వరకు మీ సంక్షేమం కోసం పోరాడుతాం’ అని ప్రజాసేవకుల్లా పోజు కొట్టే ఎందరో అంటుంటారు గానీ... నిజానికి అవన్నీ చేసేది కోడేరా. తన స్వార్థం చూసుకోకుండా రక్తమాంసాల్ని జాతిజనులకు తినబెట్టి వాళ్ల రక్తమాంసాల్ని వృద్ధి చేసే నిజమైన కమ్యూనిస్టు కోడేరా’’ ‘‘కోడి కమ్యూనిస్టా?’’ ‘‘మామూలుగానా? ఎర్రజెండైండైండెన్నీయలో అంటూ నిత్యం తురాయి రూపంలో తన నెత్తిమీద నిత్యం ఎర్రజెండాను మోసే నిజమైన కమ్యూనిస్టు రా బాబు. కమ్యూనిస్టుల్లా జాతిని మామూలుగానే కాదు... గడియారం కనిపెట్టకముందే తొలితరం అలారంలా జాతిని జాగృతం చేసిన పుంజన్న అలియాస్ కోడీశ్వరన్ మనకు నిజమైన అన్నరా. అసలు మనం సంక్రాతిని జరుపుకుంటున్నది కొత్త పంట వచ్చినందుకు కాదురా... కొత్త కోడిని కోసుకునేందుకు. అందుకేరా ఈ కోడిపందేల సంస్కృతి సంక్రాంతినాడు వెలసిందనుకుంటా. కోడి అంటే మరెవరో కాదు... టైసన్లు మహ్మదలీలూ పుట్టకముందు... అల్నాటి పల్నాటినాటి నుంచీ కోడిపుంజేరా మన టైసన్లకూ, బైసన్లకూ ఆద్యురాలు’’ అంటూ కొద్దిగా ఆవేశపడ్డాడు మా రాంబాబు. ‘‘ఇదేదో కొత్త సంగతి చెబుతున్నావేంట్రా?’’ ‘‘నిజమే. ఎలాగ కొత్త పంటతో పొంగలి చేసుకుంటామో... అలాగ కొత్తకోడితో కూర చేసుకోవడం కోసమేనేమోరా ఈ పందేలూ... ఇలా ఏరకంగా చూసినా కోడి కోడే. దాని ఈక ఈకే’’ ‘‘కోడికే కాక దాని ఈకకూ అంత వ్యాల్యూనా?’’ అన్నా. ‘‘దాని ఈక ఎంత గొప్పదంటే... ఆ ఈక ఒక చివరను కుంచె చేసి వాడిన తొలి ఈఎన్టీ నిపుణులు మన తెలుగువాళ్లేరా. ఇలా చూసినా వైద్యరంగానికి కోడి చేసిన సేవలు మరవలేం. ఒక్క వైద్యరంగానికేనా... సినీరంగానికీ కోడి చేసిన సేవలు అమోఘం’’ ‘‘సినీరంగానికి కోడి సేవలా?’’ ‘‘తెలుగు సినీసాహిత్యపు పాటల కిరీటంలో కోడి తురాయే... ఓ కలికితురాయి. ఎన్నో అనర్ఘరత్నాల్లాంటి పాటలకు కోడిమాతల్లే ఇన్స్పిరేషన్రా. ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ...’ కోడివల్లే సూపర్హిట్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. ఇదేదో కొత్తసినిమా సాహిత్యం అని కొట్టిపారేయకు. అపాతమధురమైన అనేక పాతపాటలకూ కోడి ఒక సబ్జెక్టు. ‘కోడి ఒకా కోనలో... పుంజు ఒక కోనలో... పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో...’ లాంటి కడు కరుణరసభరితమైన పాటల్లోనూ కోడి ఒక కరుణరసాభరితమూర్తికి ప్రతీక. కవి ఈ పోలికను ఎంచుకున్నాడంటే తద్వారా నీకు అర్థమవుతున్నదేమిటి...? కవిరుద్ర ఆరుద్ర ఒక కోడికి ఇచ్చిన ప్రాధాన్యమూ తక్కువేమీ కాదు’’ ‘‘అయితే ఇప్పుడేమంటావ్?’’ ‘‘అందుకే నేనొకటి చేయాలనుకుంటున్నా. మన కోడిమాతల్లి రుణం తీర్చుకోవడం కోసం ‘కోడిపూర్తి’ ఫంక్షన్ను రూపొందిస్తున్నా. కోడినామాన్ని కోటిసార్లు రాయడాన్ని ‘కోడికోటి’ అనాలి. ఇలా కోటిసార్లు రాసినవాళ్లు కోడిపూర్తి చేయాలన్నమాట. ఈ సందర్భంగా జరిగే వేడుకలో ఓ కోడి ఫొటో పెట్టి, దాని ముందు పుష్పగుచ్ఛాలు ఉంచాలి. ఈ సందర్భంగా పౌల్ట్రీరంగానికి ఇతోధిక సేవలు చేసిన వాళ్లకు సన్మానం చేయించాలి. కోటి కోళ్లకు దాణా దానం చేయాలని కూడా నా సంకల్పం. మనకోసం అమరులైన కోళ్లకు నివాళులర్పించే కార్యక్రమం కూడా ఉండాలి. కోడినామ సంకీర్తనలతో అక్కడంతా దద్దరిల్లాలి. ఇలా ఓ సరికొత్త సంప్రదాయోదయానికి, ఒక తొలిపొద్దుకు తొలికూత కూయాలన్నదే నా సంకల్పంరా’’ అన్నాడు వాడు. ‘‘ఏంతైనా నీది కోడి బ్రెయినురా’’ అంటూ మావాణ్ణి అభినందించకుండా ఉండలేకపోయా. - యాసీన్ ప్రియుడు: మాట తప్పి, నన్ను మోసం చేశావు ప్రియురాలు: నేనేం చేశాను. ప్రియుడు: జీవితాంతం ప్రేమించమన్నావు కదా, మరిపుడు పెళ్లి చేసుకోమంటున్నావు. పంచ్ పండింది లెక్చరర్: వినయ్, లేటెస్ట్ కొటేషన్ చెప్పు స్టూడెంట్: మైండ్ జిమ్కు పోదామంటే, బాడీ బజ్జుందామంటుంది. ఇంటర్నెట్ జోకు అబ్బాయిలు ఈమెల్స్ చూడరు, రిప్లై ఇవ్వరు! అమ్మాయిలు మెయిల్ ఓపెన్ చేస్తారు, చూడకుండా డిలీట్ చేస్తారు. తండ్రికి తగ్గ కొడుకు తండ్రి: తిరుగుబోతులా తయారయ్యావు, ఉద్యోగం వచ్చే వరకు నా ఇంటి గుమ్మం తొక్కకు కొడుకు: అప్పుడెలాగూ రావాల్సిన అవసరం లేదులే! ఆహా.. ఏం పతిభక్తి! రమ్య: పొద్దున మీ ఆయనతో గొడవ పడుతున్నావెందుకు? సుమ: సినిమా చూస్తుంటే ఛానెల్ మార్చాడు రమ్య: ఏ సినిమా? సుమ: పతియే ప్రత్యక్ష దైవం. మాన్పించాడు సత్య: నేను వంద మందితో మందు మాన్పించాలని నిర్ణయించుకుని దానికోసం తీవ్రంగా కృషిచేస్తున్నా. నిత్య: గ్రేట్, ఇప్పటికి ఎంతమందయ్యారు? సత్య: 99 మంది. నిత్య: ఇంకొక్కటేగా మిగిలింది, అది త్వరగా చెయ్ సత్య: అదే ఆలోచిస్తున్నా, నేను మానేస్తే వంద అవుతుంది కదా అని!! -
సహజంగా కోళ్ల పెంపకంతో..
ఆరోగ్యం.. ఆదాయం డా. చోహన్క్యూ విధానంలో వ్యాక్సిన్లు, హార్మోన్లు వాడకుండానే కోళ్ల పెంపకం తక్కువ ఖర్చుతో.. రైతే సొంతంగా దాణా తయారు చేసుకోవచ్చు షెడ్డు నుంచి దుర్వాసన రాకపోవడం ఈ పద్ధతి ప్రత్యేకత ఒలపల దాపల ఒక్క తీరుగా నడిస్తేగాని బండి ప్రయాణం భద్రంగా సాగదన్నట్లుగానే.. వ్యవసాయం లాభాల సాగవ్వాలంటే ప్రధాన, అనుబంధ రంగాల మధ్య సమతుల్యం సాధించడం అవసరం. వ్యవసాయం నగదు పంటల వ్యామోహంలో పడినప్పటి నుంచి ధరలకు దొరలెవరో తెలియని పరిస్థితి. పంటల ధర పూటకో తీరుగా ఊరించి చివరికి ఊబిలో దించుతున్నాయి. ఈ పరిస్థితిలో రైతుకు ‘సాగుబాటు’ కావాలంటే సమగ్ర వ్యవసాయ విధానమే శరణ్యం. మార్కెట్ మాయాజాలం పుట్టిముంచకుండా ఉండాలంటే వ్యవసాయానికి అనుబంధంగా పాడి, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టాలి. మాట భారీగా ఉన్నా ఇదే సమగ్ర వ్యవసాయ విధానమంటే. నగదుల పంటల వెంట మొదలయిన పరుగు రైతులను మిగతా రంగాలను విస్మరించేలా చేసింది. పారిశ్రామిక పద్ధతుల్లో కోళ్ల పెంపకంపై సందేహాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో దేశీ కోళ్ల పెంపకం రైతుకు బాగా లాభసాటిగా ఉంటుంది. సహజ విధానంలో కోళ్ల పెంపకంపై దక్షిణ కొరియాకు చెందిన డాక్టర్ చోహన్ క్యూ విస్తృతమైన పరిశోధన చేశారు. చో నేచురల్ పౌల్ట్రీ ఫార్మింగ్ పద్ధతిని రూపొందించారు. మార్కెట్పై ఆధారపడకుండా రైతుకు అందుబాటులో ఉన్న వనరులతోనే కోళ్లను పెంచగలగడం ఇందులో ప్రత్యేకత. వ్యాక్సిన్లు, హార్మోన్ల అవసరం లేకుండా రైతుకు అందుబాటులో ఉన్న వనరులతో పుష్టికరమైన కోడి మాంసం అందించడం ఇందులోని ప్రత్యేకత. వైవిధ్యభరితం చోహన్ విధానం డాక్టర్ చోహన్ విధానంలో కోళ్ల షెడ్డు నిర్మాణం సహజంగా గాలి, వెలుతురులందే విధంగా.. ఎలాంటి సిమెంట్ గచ్చు చేయని నేల మీదే నిర్మించాలి. ఈ విధానంలో ప్రతి కోడికీ గరిష్టంగా 4 అడుగుల స్థలం అవసరం అని నిర్ణయించారు. మీరు పెంచదలచిన కోళ్ల సంఖ్యకు అనుగుణంగా కొలతను నిర్ణయించుకోవాలి. ఎంపిక చేసుకున్న స్థలాన్ని దున్ని చదును చేసుకోవాలి. చుట్టూరా రెండు అడుగుల మేర గోడను నిర్మించుకొని సిమెంట్ స్తంభాల ఆధారంగా చుట్టూ ఇనుప వలను బిగించుకోవాలి. పై కప్పుకు సిమెంట్ రేకులు లేదా తాటాకు, పొరక, జమ్ముగడ్డి, వరిగడ్డి, కొబ ్బరాకులు.. ఏవైనా వాడొచ్చు. వర్షాకాలంలో నీరు పడకుండా కప్పు, చూర్ల నిర్మాణం ఉంటే సరిపోతుంది. ముందుగా తవ్విన మట్టి మీద మూడంగుళాల మేర వరిపొట్టు, చిన్నచిన్న ముక్కలుగా నరికిన గడ్డి, కొబ్బరి డొక్కు తదితరాలను మట్టితో పాటు కలపాలి. దీని మీద (పాలు, బియ్యం కడిగిన నీటితో తయారు చేసిన) ల్యాక్టో బ్యాక్టీరియా, (అన్నంతో తయారు చేసిన) ఆదిమ సూక్ష్మ జీవుల(ఐఎంఓ) మిశ్రమాన్ని నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. నేలలో ఉన్న మట్టిలో సూక్ష్మజీవులే కోళ్ల ఆరోగ్యానికి భరోసానిచ్చే కాపలాదారులన్నమాట. షెడ్డులో పూర్తి పొడి వాతావరణం ఏర్పడినప్పుడు ల్యాక్టో బ్యాక్టీరియా, ఐఎంఓను పిచికారీ చేయాలి. ఇవి కోళ్ల పెంటను కుళ్లింప జేసి అందులో చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. ఒకసారి షెడ్డులోని నేల తయారు చేస్తే పదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. వ్యవసాయ అవసరాల కోసం ఎరువును తీసుకోవాల్సి వచ్చినప్పుడు పై పొర 3, 4 అంగుళాల మేర తొలగించి వాడుకోవాలి. కోడి పిల్లలను తేవడానికి ముందు షెడ్డును రెండు భాగాలుగా విభజించాలి. ఇందులో మొదటి భాగంలో కోడి పిల్లలకు గూళ్లు ఏర్పాటు చేయాలి. రాత్రి వేళ అందులోనే విశ్రాంతి తీసుకుంటాయి. పెద్దవైన తరువాత గుడ్లు అదే చోట పెట్టడం అలవాటవుతుంది. ఈ గూళ్లను పౌల్ట్రీ భాషలో బ్రూడర్లంటారు. బ్రూడర్లకు ముందు భాగంలో మెత్తటి నూలు వస్త్రం, పాత చీరలు ఇందుకు సరిపోతాయి. తెరలు కట్టడం ద్వారా కోడి పిల్లలు అటు ఇటు తిరిగేటప్పుడు తల్లి రెక్కలు తగిలిన అనుభూతి కలుగుతుంది. తెరకు ముందు భాగంలో దాణా తొట్లు ఉంచాలి. వాటికి ముందు భాగంలో నీరు తాగే వసతి కల్పించాలి. నీటి అవసరాల కోసం తొట్లు లేదా పీవీసీ పైపునకు రంధ్రాలు చేసి అందులో నీరు నింపి ఉంచాలి. ఎప్పటికప్పుడు పాత నీరు తొలగించే ఏర్పాటు చేసుకోవాలి. కోళ్లు పెరిగేకొద్దీ పెద్ద రంధ్రాలున్న పైపులను అమర్చాల్సి ఉంటుంది. రోజుకు ఒకసారే మేత! చో విధానంలో కోళ్లకు రోజుకు ఒకసారే మేత ఇవ్వాలి. చీకటి పడడానికి 2 గంటల ముందు మేత వేస్తే సరిపోతుంది. మనకు అందుబాటులో దొరికే దాణాలనే మేతగా వాడొచ్చు. చిన్న కోడి పిల్లలకు రైసు మిల్లులో దొరికే ముక్కులు, వెదురు ఆకులను ఆహారంగా అందివ్వవచ్చు. దీని వల్ల కోడి పిల్లల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. కోడి పిల్లలు ఎదిగిన తరువాత రెండోనెల నుంచి తవుడు, గోధుమ పొట్టు, మొక్కజొన్నలు, ఉలవలు వంటి పప్పుధాన్యాలను వరిగడ్డి, గరిక, కూరగాయ వ్యర్థాలు, ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా ఇందుకు వాడొచ్చు. ఈ పద్ధతిలో సమతుల్య ఆహారం ఇవ్వడం వలన సాధారణ కోళ్ల కంటే ఎక్కువ కాలం గుడ్లు పెడతాయి. మేతలో 30% వరకు సన్నగా తరిగిన గరిక, మునగాకు, అవిశాకు తదితరాలను కూడా ఇవ్వవచ్చు. దీని వలన దాణా ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. దాణాలో కేజీకి ఒక మిల్లీ లీటర్ చొప్పున ఐఎంఓ, ల్యాక్టో బ్యాక్టీరియా కలిపి ఇవ్వాలి. ఐఎంఓ, ల్యాక్టో బ్యాక్టీరియా కలవడం వలన మేత తేలికగా జీర్ణమవుతుంది. అందులో ఎంజైమ్లు, యాంటీ బయోటిక్స్ తయారవడానికి ఇవి తోడ్పడతాయి. ఈ దాణా కోడి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. - జిట్టా బాల్రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్ (ఇన్పుట్స్ : డా. మల్లికార్జునరెడ్డి, న్యూస్లైన్, ఎస్వీయూ, తిరుపతి. ఫొటోలు: మోహన కష్ణ కేతారి) మేత రెండు రకాలు: పొడి మేత, తడి మేత తడి మేతలో అరటి బోదెలు- 50%, కూరగాయ వ్యర్థాలు- 30%, వరి గడ్డి- 15%, వెదురు ఆకులు- 5% ఉండాలి. పొడి మేతలో.. వరి తవుడు 30%, మొక్కజొన్న 30%, ఉలవలు 25%, వరిగడ్డి లేదా పుట్టమన్ను 15% కలిపి ఇవ్వాలి. కాయగూరలతో పాటు అందుబాటులో ఉన్నప్పుడు బొప్పాయి, గుమ్మడి కాయలను కూడా సన్నగా తరిగి మేతలో కలపవచ్చు. షెడ్ చుట్టూరా అడుగు దూరంలో నిమ్మగడ్డి, పుదీనా వంటి మొక్కలను పెంచితే.. దోమలు, ఇతర పరాన్నజీవులు కోళ్లను బాధించవు. నీటిలో కరిగే సున్నం, గుడ్ల పెంకులు, నత్తగుల్లలు, ఎముకలు గోధుమ రంగుకు తిరిగే వరకు వేయించి, పొడి చేసి నీటిలో కలిపి మేతలో కలిపి ఇస్తే కాల్షియం లోపం తీరుతుంది. డా. చో ప్రకృతి సాగు పద్ధతులపై వేసవిలోశిక్షణ! డా. చో పద్ధతిలో కోళ్ల పెంపకం ద్వారా రైతుకు నికరాదాయం బాగా వస్తుంది. మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వినియోగదారులకు ఆరోగ్య సమస్యలు రావు. డా. చో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కోళ్ల పెంపకంతోపాటు పంటలూ పండించవచ్చు. ‘సర్ర’ స్వచ్ఛంద సంస్థతో కలసి ఎస్వీయూలో అధ్యయనం చేశాం. ఫలితాలు బాగున్నాయి. ఈ వేసవిలో రైతులు, విద్యార్థులు, అధ్యాపకులు, విదేశీయులకు విడివిడిగా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. - ప్రొ.సాయి గోపాల్ (98496 15634), వైరాలజీ విభాగాధిపతి, ఎస్వీయూ, తిరుపతి ఇతర వివరాలకు: రోహిణీరెడ్డి (‘సర్ర’ సంస్థ)- 099859 47003, సోమశేఖర్- 99661 43361 ల్యాక్టో బ్యాక్టిరియా తయారీ ఇలా కోళ్ల ఫారమ్లో ఉపయోగించే ల్యాక్టో బ్యాక్టీరియాను తయారు చేసుకోవడం అతి సులభం. ఇంట్లో బియ్యం కడిగిన నీటిని ఒక ప్లాస్టిక్ టబ్లో లేదా కుండలో పోసి ఉంచుకోవాలి. బియ్యం కడిగిన నీరు 3 నుంచి 5 రోజుల్లో పులిసి పుల్లని వాసన వస్తుంది. ఈ నీటిని ఓ పాత్రలోకి పోసుకోవాలి. ఒక వంతు బియ్యం కడిగిన నీళ్లకు పది వంతులు పాలు కలపాలి. పాత్రలో మూడో వంతు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఈ పాత్రకు మూతి బిగించి లేదా శుభ్రమైన తెల్లకాగితంతో కప్పి దారంతో కట్టి ఎండసోకని మూలన భద్రపర్చుకోవాలి. 3 రోజుల్లో పాత్రలోని ద్రావణం 3 పొరలుగా ఏర్పడుతుంది. పై భాగంలో పాలలోని కొవ్వు పదార్థాలు తెట్టు మాదిరిగా పేరుకుంటాయి. మధ్య భాగంలో పసుపు పచ్చ లేదా లేత పసుపు పచ్చ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ల్యాక్టో బ్యాక్టీరియా. దీన్ని వడకట్టుకొని మరో పాత్రలో పోసుకోవాలి. నిలువ ఉంచుకోవడానికి ద్రావణం ఎంత ఉందో అంత బెల్లాన్ని కలుపుకోవాలి. కోళ్ల షెడ్డులో నాలుగైదు మిల్లీలీటర్ల ల్యాక్టో బ్యాక్టీరియాను ఒక లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. -
పౌల్ట్రీకి సగం ధరకే విద్యుత్
‘పౌల్ట్రీ ఎక్స్పో 2013’ ప్రారంభ సభలో సీఎం ప్రకటన సాక్షి,హైదరాబాద్: విద్యుత్ చార్జీలు తగ్గించాలనే పౌల్ట్రీ పరిశ్రమ వర్గాల చిరకాల డిమాండ్కు అనుగుణంగా ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఇక్కడి హైటెక్స్లో మూడురోజుల పాటు జరగనున్న ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2013’ను ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పౌల్ట్రీ రంగానికి యూనిట్కు రూ.5.60తో విద్యుత్ సరఫరా అవుతోందని ఈ ధరను సగానికి తగ్గించి రూ.2.80 కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. ఒక్క వ్యవసాయంపైనే రైతు ఆధారపడే పరిస్థితులు ప్రస్తుతం లేవని, అనుబంధ రంగాలైన పాడి, చేపలు, కోళ్ల పెంపకం లాంటివి చేపట్టినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కాసు వెంకట కృష్ణారెడ్డి, కేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనుప్ కుమార్ ఠాకూర్, సహ కార్యదర్శి సంజయ్ బోస్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డి.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. -
కోళ్లుకోలేని దెబ్బ
భువనగిరి, న్యూస్లైన్: పౌల్ట్రీ రైతు నష్టాల బాట పట్టాడు. ఇటీవల కాలంలో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో వారు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. బ్రాయిలర్ చికెన్ ధర గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. కొత్తగా పౌల్ట్రీలు ఏర్పాటు చేసిన వారు నష్టాలను తట్టుకోలేక దివాలా తీస్తున్నారు. అనేక పౌల్ట్రీలు మూతపడే దశకు చేరుకున్నాయి. ఇటీవల కాలంలో పౌల్ట్రీల్లో కోళ్ల ఉత్పత్తి బాగా పెరిగింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గాయి. ఆ రాష్ట్రాల్లో కూడా పౌల్ట్రీ పరిశ్రమలు పెరగడంతో పాటు ఉత్పత్తి కూడా బాగా పెరగడంతో వారు ఇక్కడ నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ఇక్కడి కోళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క భువనగిరి డివిజన్లోనే రెండు వేలకు పైగా కోళ్లఫారాలు ఉన్నాయి. వాటిపై సుమారు మూడువేల మంది రైతులు ప్రత్యక్షంగా, మరో 10వేల మంది పరోక్షంగా ఈ పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడ్డారు. ఈ సీజన్లో కోటికి పైగా కోళ్లను జిల్లా వ్యాప్తంగా పెంచుతున్నారు. ఒక్కో కోడిపిల్లను 23 రూపాయల నుంచి 26 రూపాయల వరకు కొనుగోలు చేస్తారు. 45రోజుల్లో కోడి రెండుకిలోల వరకు బరువు పెరుగుతోంది. ఇందుకోసం దాణా, ఇతర పెట్టుబడులతో కలపి 100 రూపాయల ఖర్చు అవుతోంది. ప్రస్తుతం హోల్సేల్గా రైతుకు కిలో చికెన్ను 50 రూపాయలే గిట్టుబాటు అవుతోంది. కొత్తగా వచ్చిన వారికి నష్టాల బాట పౌల్ట్రీలోకి కొత్తగా వచ్చిన వారికి నష్టాల బాట తప్పడం లేదు. రెండు సంవత్సరాల క్రితం మంచి లాభాలను చూసిన రైతుకు ఈ సారి ఆ పరిస్థితి లేదు. లాభాలు వస్తున్నా యి కదా అని మార్కెట్లోకి వచ్చిన పౌల్ట్రీ రైతులతో ఉత్పత్తి గణనీయంగా పెరిగిందే కానీ పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో పలువురు నష్టాలను భరించలేక అతి తక్కువ ధరకు ఆత్మకూర్ ఎం మండలంలో పౌల్ట్రీని అమ్ముకున్నారు. ఇల్లా జిల్లాలో పలు రైతులు నష్టాలను తట్టుకోలేకపోతున్నారు. ఇందులో స్థిరపడిన వారు మాత్రం ఏలాగోలాగు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. పెరిగిన ఉత్పత్తి దెబ్బతీసింది పెరిగిన కోళ్ల ఉత్పత్తితో కిలో చికెన్ రేటు గణనీయంగా పడిపోయింది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉత్పత్తి పెరగడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఈ సీజన్లో కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన రైతు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గతంలో మాదిరిగా పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగా గిట్టుబాటు ధర రావడం లేదు. - పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, భువనగిరి