
ఆర్జీయూకేటీ చాన్స్లర్గా డాక్టర్ రాజ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) చాన్స్లర్గా డాక్టర్ రాజ్రెడ్డిని తిరిగి నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గత ఐదేళ్లుగా చాన్స్లర్గా ఉన్న డాక్టర్ రాజ్రెడ్డి మరో ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. డాక్టర్ రాజ్రెడ్డి అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.