ప్యాసింజర్ ట్రైన్లో దారుణం | robbery in train narasaraopet - piduguralla passenger train | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్ ట్రైన్లో దారుణం

Published Sun, Mar 27 2016 12:23 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbery in train narasaraopet - piduguralla passenger train

గుంటూరు : నరసరావుపేట - పిడుగురాళ్ల ప్యాసింజర్ ట్రైన్లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. వినుకొండ వెళ్తున్న వ్యక్తి నుంచి దుండగులు రూ. 10 వేల నగదు దోచుకున్నారు. అనంతరం ట్రైన్ నుంచి సదరు వ్యక్తిని తోసేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.  ఆ సమీపంలోని స్థానికులు వెంటనే స్పందించి... ఆసుపత్రికి తరలించారు.

అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని... బాధితుడిని దోపిడి దుండగులపై ఆరా తీస్తున్నారు. బాధితుడు గుంటూరు జిల్లా బెల్లంకొండకు చెందిన కోటేశ్వరరావు అని పోలీసులు చెప్పారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement