సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు 9 నుంచి సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు విద్యా శాఖ సోమవారం తెలిపింది. తెలంగాణలో 9 నుంచి 18వరకు, సీమాంధ్రలో 13, 14, 15లో సెలవులు ఇస్తున్నట్టు పేర్కొంది. సీమాంధ్ర ఉపాధ్యాయులు చేసిన సమ్మె కారణంగా అప్పటి సెలవులను ఇప్పుడు సర్దు బాటు చేసినట్టు వివరించింది.