
పాలనా నగరానికి రెండో శంకుస్థాపన
అవి కావడానికి డిజైన్ల రూపకల్పన చేయించడంతో పాటు టెండర్ల ప్రక్రియ నిర్వహించి నిర్మాణ సంస్థలను ఎంపిక చేయాల్సి వుంది. కానీ ఏడాదిన్నరగా రకరకాల డిజైన్లు చూపిస్తూనే ప్రభుత్వం కాలక్షేపం చేసింది. చివరికి ఇటీవలే అసెంబ్లీకి వజ్రాకారం, హైకోర్టుకు స్థూపాకార డిజైన్లను ఆమోదించడంతో డిజైన్ను ప్రాథమికంగా ఖరారు చేసింది. ఇంకా పలు మార్పులు చేయాల్సి ఉన్నందున 15 నుంచి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత టెండర్లు పిలిచినా ఆ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది. చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా విజయదశమికి నిర్మాణం (సెప్టెంబర్) పనులు ప్రారంభిస్తామని ప్రకటించేశారు. ఇంకా డిజైన్ల రూపకల్పనే పూర్తిస్థాయిలో కాలేదు. టెండర్లపైనా స్పష్టత రాకుండానే ప్రకటన చేయడం ద్వారా మరో భారీ ప్రచార ఆర్భాటానికి తెరలేపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.