ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందే: అశోక్బాబు | Seemandhra MPs should resign, demands Ashok babu | Sakshi
Sakshi News home page

ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందే: అశోక్బాబు

Published Mon, Sep 23 2013 11:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

Seemandhra MPs should resign, demands Ashok babu

సమైక్య రాష్ట్రానికి మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందేనని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు డిమాండ్ చేశారు. అలా రాజీనామాలు చేయని వారికి రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఆందోళనల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అసలు యూపీఏ ప్రభుత్వమే సంక్షోభంలో ఉన్నప్పుడు.. తెలంగాణ నోట్ను ఎలా ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో పార్టీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో కూడా సమైక్య ఉద్యమం కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement