తల్లిని హతమార్చిన కొడుకు | son kills mother with sickle in kadapa | Sakshi
Sakshi News home page

తల్లిని హతమార్చిన కొడుకు

Published Wed, Mar 29 2017 12:26 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

తల్లిని హతమార్చిన కొడుకు - Sakshi

తల్లిని హతమార్చిన కొడుకు

వేముల(వైఎస్సార్‌ జిల్లా): కన్న కుమారుడే తల్లిని హత మార్చిన ఘటన వైఎస్సార్‌ జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన బయమ్మ కుమారుడు రవిశంకర్‌రెడ్డి తాగుడుకు బానిసై ప్రతిరోజు డబ్బులకోసం తల్లిని వేధించేవాడు. బుధవారం తెల్లవారుజామున డబ్బులు ఇవ్వాలని తల్లిని డిమాండ్‌ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవిశంకర్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు. కొడవలితో తల్లి మెడపై నరికడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటనకు సంబంధించి సమీప బంధువు గంగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేముల ఎస్సై నరేంద్రకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement