హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చాయి.
హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చాయి. హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును విద్యాసంస్థల డైరెక్టర్లు కలిసి 2 కోట్ల రూపాయల చెక్కులు అందించారు.
ముఖ్యమంత్రిని కలిసినవారిలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్లు శ్రీధర్, సుష్మ, సీమ ఉన్నారు. హుదూద్ తుఫాను ఉత్తరాంధ్ర వాసులకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని, వారిని ఆదుకోవడానికి తమవంతు సాయంగా ఈ మొత్తం ఇచ్చామని డైరెక్టర్లు తెలిపారు.