Cyclone Hudhud
-
హుద్హుద్... మానని గాయం
-
రైతులకు రూ.96 కోట్ల హుద్హుద్ పరిహారం
మందస(పలాస) :హుద్హుద్ తుఫాన్ నష్టపరిహారం కింద జిల్లాలోని రైతులకు రూ.96 కోట్లను అందజేసినట్టు జిల్లా రిలీఫ్ అకౌంట్స్ సహాయ ఆడిట్ అధికారి ఎం.స్వాతి తెలిపారు. మందస మండలానికి సంబంధించిన హుద్హుద్ పరిహారం నిధుల పంపిణీ వ్యవహారంపై మంగళవారం తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయానికి రూ.86 కోట్లు, ఉద్యానవనానికి సంబంధించి రూ.10 కోట్లను రైతులకు ఇప్పటికే అందజేశామన్నారు. మందస మండలంలో 38 పంచాయతీల్లోని 147 మంది రైతులకు రూ.2.5 లక్షలు పంపిణీ చేశామని వివరించారు. ఈ నిధులు రైతులకు చేరాయా.. అక్రమాలు జరిగాయా.. అనే అంశాలపై ఆడిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు ఆడిట్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమెతో పాటు మందస ఏఎస్ఓ బి.భోగేశ్వరరావు, వీఆర్వోలు నల్ల వైకుంఠరావు, రవీంద్రనాథ్ పట్నాయక్లు రికార్డులను పరిశీలించారు. -
స్పోర్ట్స్ కాంప్లెక్స్పై క్రీనీడ
విజయనగరం మున్సిపాలిటీ: గతమెంతో ఘనం..వర్తమానం దైన్యం..అన్నట్లు తయారైంది క్రీడల ఖిల్లాగా పేరుగాంచిన విజయనగరంలో క్రీడామైదానాల పరిస్థితి. అందరికీ అందుబాటులో జిల్లాకేంద్ర నడిబొడ్డున గల రాజీవ్ క్రీడామైదానం ఇదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 2014వ సంవత్సరంలో సంభవించిన హుద్హుద్ తుఫాన్ ధాటికి కొన్ని వనరులు పాడవగా..కేవలం నష్ట అంచనాలు రూపొందించడం మినహా అంతకుమించి ఒక్కడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా మైదానం నిర్వహణ భారం మోయలేమని బాధ్యతలను తీసుకోవడానికి క్రీడాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీ వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాంప్లెక్స్లోని మౌలిక సౌకర్యాలు మరుగునపడుతున్నాయి. నిర్వహణకు నెలకు రూ20వేలు అవసరం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణకు నిధులు కరువయ్యాయి. నెలవారీ దీని నిర్వహణకు సుమారు రూ.20 వేల వరకూ అవసరం ఉంటుంది. అయితే ఆ నిధులు ప్రత్యేకంగా ఎక్కడ నుంచీ వచ్చే అవకాశం లేకపోవడం వల్ల డీఎస్ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల వరకు జిల్లా స్థాయిలో జరిగే క్రీడాపోటీలను ఉడా అనుమతితో నిర్వహించి, అందుకు అయిన ఖర్చును పోటీల నిర్వాహకుల నుంచి వసూలు చేసేవారు. ప్రస్తుతం ఆపరిస్థితి లేదు. ఫలితంగా మైదానం ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు పూర్తిగా పాడయ్యాయి. అలాగే ఇండోర్లోని ఉడెన్ గ్రౌండ్, వసతి గదులు, ప్రధాన ప్రవేశద్వారాలు, పార్కింగ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య లోపం నెలకొంది. రాత్రి , పగలు తేడా లేకుండా మైదానం ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి. గతంలోనే సూచించినా ప్రయోజనం శూన్యం మైదానం నిర్మాణ సమయంలోనే వాణిజ్య దుకాణాలు నిర్మించడం ద్వారా వాటిపై వచ్చే అద్దెతో నిర్వహణ చేయాలని ప్రతిపాదన వచ్చినా అప్పట్లో పట్టించుకోకపోవడంతో ఆ ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. స్టేడియం పడమర, ఉత్తర ప్రాంతాల్లో ప్రహరీ ఆనుకొని వాణిజ్య దుకాణాలు నిర్మిస్తే వాటి ఆదాయంతో నిర్వహణ సమస్య తీరుతుందని పలువులు సూచించారు. అయితే ఆ ప్రతిపాదనను అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు తోసిపుచ్చడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నిర్వహణకు స్థిరాదాయ వనరులు కావాలి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వాహణకు స్థిరంగా ఆదాయం వచ్చే వనరులు కావాల్సి ఉందని డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వరరావు చెప్పారు. కాంప్లెక్స్ పరిసరాలలో వాణిజ్య భవనాలు నిర్మించే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. స్వతహాగా తమ శాఖకు ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లే బాధ్యతలను తీసుకోలేదని వివరించారు. భవన నిర్మాణానికి మున్సిపాలిటీ నిధులను వెచ్చిస్తే కాంప్లెక్స్ అభివృద్ధి సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. -
ఇక్కడా కక్కుర్తే..!
♦ ఐఏవై ఇళ్లను కుదించిన రాష్ట్ర సర్కార్ ♦ సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఎత్తుగడ ♦ {పజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరిట కేంద్రం మంజూరు చేసిన ఐఏవై ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కుదించేసింది. తద్వారా సబ్సిడీ భారం రాష్ట్రంపై పడకుండా సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలతో హుద్హుద్ బాధితులకు తీవ్ర నష్టం జరగనుంది. మరోవైపు ఈ నిర్ణయంపై ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నూతన మార్గదర్శకాలతో జాబితాలో అర్హులను తొలగిస్తే నియోజకవర్గాల్లో తిరగలేమని వారు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. సాక్షి, విశాఖపట్నం : హుద్హుద్ తుఫాన్కు ఒక్క విశాఖలోనే లక్షా 18 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. నేటికీ వేలాది మంది నిలువ నీడ లేక పరాయి పంచన కాలం వెళ్లదీస్తున్నారు. ఐఏవై కింద 66,390 ఇళ్ల కోసంకేంద్రానికి ప్రతిపాదనలు పంపితే.. యూనిట్ కాస్ట్ రూ.75 వేల అంచనాతో జిల్లాకు 16,890 మంజూరు చేసిం ది. కాగా ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ర్టంలో రెండు లక్షల గృహాలు నిర్మిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న సర్కా ర్.. హుద్హుద్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖకు కేవలం 1,821 ఇళ్లను మాత్రమే మంజూరు చేసింది. ఇప్పటికే దాతల సహకారంతో ఆరువేల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నందున.. ఐఏవై ఇళ్లలో కోత పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు మంజూరైన 16,890 ఐఏవై ఇళ్లను 9,929 ఇళ్లకు కుదించేసింది. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో మంజూరు చేసిన 1,821 ఇళ్లతో కలిపి మొత్తం 11,750 ఇళ్లను యూనిట్ కాస్ట్ రూ.2.75లక్షలతో నిర్మించాలని నిర్ణయిం చింది. యూనిట్ కాస్ట్లో ఎస్సీ, ఎస్టీలకైతే సబ్సిడీ రూపంలో రూ.37,500 కేం ద్రం, రూ.1.37,500 రాష్ర్టం భరించనుండ గా, మరో లక్ష రుణం రూపం లో మంజూరు చేయనుంది. ఇతరులకైతే కేం ద్రం రూ.37,500, రాష్ర్టం రూ.87,500 భరించనుం డగా, రూ. 1.50 లక్షలు రుణంగా అందజేయనుం ది. అంటే కేంద్రం వాటా పోను.. రాష్ర్టం సబ్సిడీ భరించాల్సి ఉంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఐఏవై ఇళ్ల కింద మంజూరు చేసిన సొమ్మును సర్దుబాటు చేసుకుని ఇళ్ల సంఖ్య కుదించిందనే వాదన విన్పిస్తోంది. ఐఏవై ఇళ్లను కుదించడం వల్ల కేంద్రం వాటా, రుణం పోగా జిల్లాకు మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి రాష్ర్టంపై అదనంగా పడే భారం కేవలం రూ.65 కోట్ల లోపే ఉంటుందని అంచనా. హుద్ హుద్ బాధితులకు తీవ్ర నష్టం జిల్లా వ్యాప్తంగా హుద్హుద్ బాధితుల కోసం కేంద్రం ఐఏవై ఇళ్లు మంజూరు చేసింది. కానీ ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం మార్గదర్శకాలను పరిశీలిస్తే 75 శాతం పూర్తిగా ఒకే ప్రాంతంలో లే అవుట్ సైట్లోనై నిర్మించాలి. గ్రామా ల్లో ఇళ్లు నిర్మించుకోకుండా అక్కడక్కడా ఉన్న లబ్ధిదారుల్లో కేవలం 25 శాతం మందికి మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన హుద్హుద్కు బాధితులకు నష్టం జరిగే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత మరొక పక్క ఇప్పటికే ఐఏవై కింద మంజూరైన ఇళ్ల కోసం ఎమ్మెల్యేల నుంచి 4,488 ప్రతిపాదనలు అందగా, వీటిలో ఇప్పటికే 1,050 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. నియోజకవర్గానికి రెండువేల ఇళ్ల వరకు కేటాయించగా.. సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో వీటి సంఖ్య సగానికి తగ్గిపోనుంది. పైగా మార్గ దర్శకాలు పుణ్యమాని అర్హుల జాబితాలో చాలాపేర్లు తొలగించాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఇప్పటికే మంజూరైన ఐఏవై ఇళ్లను రూ.75 వేల యూనిట్ కాస్ట్తో నిర్మిస్తారో లేక రూ.2.75లక్షల యూనిట్కాస్ట్తో నిర్మిస్తారో మీ ఇష్టం.. కానీ జిల్లాకు మంజూరైన 16,890 ఇళ్లను కుదించడానికి వీల్లేదని’ వారు పట్టుబడుతున్నారు. అలా చేస్తే నియోజకవర్గాల్లో తిరగలేమని..ఇప్పటికే ఎంపిక చేసిన వారికి ఏం సమాధానం చెబుతామని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కూడా చర్చ జరగడంతో కుదించిన 5,140 ఇళ్లను జిల్లాకు అదనంగా మంజూరు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. -
లీలావతికి ఏం జరిగింది?
‘‘సినిమా తీయాలని వైజాగ్కు వచ్చిన ఓ అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని, వాణిజ్య అంశాలు జోడించి ఈ సినిమా తీశాం. హుద్ హుద్ తుఫాన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. లీలావతికి ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని పి. సునీల్కుమార్ రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో కీ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ‘మిస్ లీలావతి’ వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తులో హుద్ హుద్ వంటి పరిణామాలు బోల్డన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, అక్రమ సంబంధాల కారణంగా భవిష్యత్తులో మానవ సంబంధాల్లో ఎలాంటి విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయో ఈ చిత్రంలో చర్చించాం. అనుబంధాలు సవ్యంగా ఉన్నంతవరకూ బాగానే ఉంటుందనీ, దారి తప్పితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పే చిత్రం ఇది’’ అన్నారు. అసభ్యతకు తావు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదనీ, మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో చక్కని సందేశం ఉందనీ నిర్మాత రవీంద్రబాబు చెప్పారు. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు అన్నారు. సంగీతదర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి, ఎడిటర్ శివ కూడా మాట్లాడారు. -
టీడీపీ కార్యకర్తలకే తుపాను సాయం: రఘువీరా
టీడీపీ కార్యకర్తలు, నకిలీ బాధితులకు హుద్హుద్ తుపాను నష్టపరిహారాన్ని దోచి పెడుతున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.తుపాను సాయంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ తుపానులోనష్టపోయిన అసలైన బాధితులకు పరిహారం అందట్లేదని ఆయన చెప్పారు. అలాంటి బాధితుల జాబితా కూడా ప్రభుత్వం రూపొందించలేదని ఆరోపించారు. మొత్తం 774 కోట్ల రూపాయలు విడుదలైతే, అందులో సగానికి పైగా సొమ్మును టీడీపీ కార్యకర్తలే దోచుకున్నారని మండిపడ్డారు. వీటిపై క్షేత్రస్థాయిలో అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి, అధికారులతో సమీక్షలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. -
లేని కీడుకు లబ్ధి కోసం..
పిఠాపురం : గాలీవానకు నేలమట్టమైన ఇళ్లు కొన్ని. కడలి కడుపులో కలిసిపోయిన ఇళ్లు కొన్ని. ‘హుద్హుద్’ తుపాను దెబ్బకు నిలువనీడ కోల్పోయిన నిజమైన బాధితులు ఎండకు ఎండి, చలికి వణుకుతూ.. మళ్లీ గూళ్లు సమకూర్చుకునేందుకు సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు స్వార్థపరులు ఇదే అదనుగా పావులు కదిపారు. నిక్షేపంలా ఉన్న ఇళ్లు కూడా హుద్హుద్ తాకిడికి ధ్వంసమైనట్టు చూపుతూ పరిహారాన్ని దండుకోవడానికి చూస్తున్నారు. ఈ అక్రమానికి అధికార పార్టీ నాయకులు సూత్రధారులు. తుపాను సమయంలో తూతూమంత్రంగా సహాయక చర్యలు చేపట్టి, వాటికైనా ఖర్చును రూ.లక్షల్లో చూపుతున్న అధికారులే అధికార పార్టీ వారి పన్నాగానికి దన్నుగా నిలుస్తున్నారు. నష్టపోని ఇళ్లను నాశనమైనట్టు రికార్డులు సృష్టించి, సర్కారు సొమ్ము దుర్వినియోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ‘హుద్హుద్’ తాకిడికి కొత్తపల్లి మండలంలో 156 గృహాలు ధ్వంసమైనట్టు అధికారులు నివేదికలు తయారు చేశారు. బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయాలని కోరుతూ నివేదికలను ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపారు. అలాగే తుపాను వేళ బాధితులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించడానికి రూ.4 లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు, వారి కనుసన్నల్లో పరిహారానికి అర్హులైన వారి జాబితాలు తయారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారుల నివేదికలను అనుసరించి బాధితులు ఒక్కొక్కరికీ ముందస్తుగా రూ.5 వేల నష్టపరిహారం మంజూరు కాగా పంపిణీకి రంగం సిద్ధమైంది. పంపిణీ అనంతరం ప్రభుత్వం జాబితాల్లోని బాధితుల్లో ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, బీసీ, ఓసీలకు రూ.75 వేలు కేటాయించి, ఆ మొత్తానికి దాతల నుంచి సేకరించే సొమ్ములో రూ.3 లక్షల చొప్పున జోడించి, ఐఏవై గృహాలతో మోడల్ కాలనీ నిర్మించనుంది. దీంతో ఆ లబ్ధి తమ వారికే చెందేలా అధికారపార్టీ నేతలు పావులు కదిపారు. అనుచరుల పేర్లను ఇళ్లు కోల్పోయిన బాధితులుగా రాయించారు. సీఆర్జెడ్ పరిధిలోని ఇళ్లకూ నష్టమని నివేదిక.. నిజానికి హుద్హుద్ తాకిడికి మండలం కోనపాపపేటలో సుమారు 50 గృహాలు ధ్వంసమయ్యాయి. అదే ఊళ్లో కొన్ని గృహాలు సముద్రకోతకు గురయ్యాయి. కొత్తపల్లి మండలంలో ఎక్కడా ఇళ్లు పాక్షికంగా కూడా దెబ్బతిన్న దాఖలాలు లేవు. కానీ మండలం మొత్తం మీద 156 గృహాలు దెబ్బ తిన్నట్టు అధికారులు నివేదికలు ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు తయారు చేసిన జాబితాలో గతంలో ఉప్పాడ శివారు మాయాపట్నంలో అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారిని చేర్చడం అనర్హులకు చోటు కల్పించారన్న నిజాన్ని బయటపెడుతోంది. ఈ అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సుబ్బంపేట వద్ద స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కాగా సముద్రానికి 500 మీటర్ల దూరం (కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్)లో ఎలాంటి నిర్మాణాలు జరపకూడదని కచ్చితమైన నిబంధన ఉండగా అధికారులు ఆ పరిధిలోని కొన్ని ఇళ్లకు నష్టం జరిగిందంటూ నివేదికలు ఇవ్వడం గమనార్హం. క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణశాఖ విచారణ ఇళ్లు కోల్పోయిన వారి జాబితాల విషయంపై స్థానిక తహశీల్దారు రియాజ్ హుస్సేన్ను వివరణ కోరగా తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానన్నారు. నివేదికలపై విచారణ జరుగుతోందని, అనర్హులుంటే తొలగిస్తామని చెప్పారు. కాగా రెవెన్యూ అధికారుల నివేదికపై విచారణ నిర్వహించిన గృహనిర్మాణశాఖాధికారులు ఇళ్లు దెబ్బతిన్న బాధితుల జాబితాలో 56 మంది అనర్హులేనని తేల్చారు. వారిలో ఎక్కువ మంది ఇదివరకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారేనంటున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నామని, ఇంకా ఎవరైనా అనర్హులున్నా బయటపడుతుందని ఆ శాఖ ఏఈ సోమిరెడ్డి తెలిపారు. -
మాకే సాయమూ అందలేదు
రాకాసి గాలులకు పడిపోయిన చెట్లకు చిన్న చిన్న చిగుళ్లు వచ్చాయి. కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్తవి రూపుదిద్దుకుంటున్నాయి. చిందరవందరగా మారిన తీరం ఇప్పుడు సర్దుకుంటోంది. ఇదిగో ఇప్పుడు వచ్చారు అధికారులు ‘మీ నష్టమెంత’ అని అడగడానికి. తుపాను వెళ్లిన నలభై రోజుల తర్వాత కేంద్ర బృందం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఈ సందర్భం గా స్థానికులతో అధికారులు మాట్లాడారు. అయితే అధికారుల ప్రశ్నలకు మెజారిటీ ప్రజలు ఇచ్చిన జవాబు మాత్రం ‘మాకే సాయమూ అందలేదు’ అనే... భోగాపురం: తుపాను వెలిసిన నలభై రోజుల త ర్వాత వచ్చిన కేంద్ర బృందం వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మండలంలోని హుద్హుద్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. ముందుగా కవులవాడలో పడిపోయిన ఇళ్లను, కొబ్బరి తోటలను పరిశీలించింది. అనంతరం తూడెం గ్రామంలో కూలిన కొబ్బరి తోటలను అధికారులు పరిశీలించారు. దీనిపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడ స్థానికులతో అధికారులు నష్టంపై మాట్లాడారు. అనంతరం దిబ్బలపాలెం గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి తమకు బియ్యం తప్పించి ఎలాంటి సాయం అందలేదని బాధితులు తెలిపారు. ఇల్లు కూలిపోయినా నమోదు చేయలేదన్నారు. అనంతరం అధికారులు బమ్మిడి పేట వద్ద తుపానుకు కొట్టుకుపోయిన ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 20వంతెనలు పాడయ్యాయని దానికి రూ.65లక్షలు అవసరం అవుతుందని సంబంధిత శాఖ అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తారు రోడ్లకు కిలోమీటరుకి రూ.10లక్షల చొప్పున మెయింటనెన్స్కి నిధులు అవసరమని తెలిపారు. అనంతరం ముక్కాం గ్రామంలో పర్యటించారు. ఇక్కడ మత్స్యశాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు అందాల్సిన సాయంపై మ త్స్యశాఖ ఏడి ఫణిప్రకాష్ వివరించారు. ఇక్కడి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన కేంద్ర బృందం దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం భోగాపురం గ్రామానికి చేరుకుని పశుసంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడారు. తుపాను కారణంగా చనిపోయిన పశువులు, కోళ్ల పారాల్లో కోళ్లు, గొర్రెలు తదితర ఫొటోలను పరిశీలించారు. కార్యక్రమంలో బృంద సభ్యులు కృష్ణ, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఎస్ఈ ఎం. రమేష్బాబు, ఫైనాన్స్ కమిషన్ సీనియర్ డెరైక్టరు రాజీబ్ కుమార్, కేంద్ర పశుసంవర్ధక శాఖ విభాగం డిప్యూటీ సెక్రటరీ పి.ఎస్. చక్రబర్తీ, గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ రామవర్మ తోపాటు జెడ్పీ చైర్మన్ శోభా స్వాతి రాణి, ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ‘తీరని శోకమిది’ పూసపాటిరేగ: మండలంలోని తిప్పలవలస గ్రామంలో హుద్హుద్ కారణంగా మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని కేంద్రబృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. తీర ప్రాంతంలో జరిగిన నష్టాన్ని మత్స్యశాఖ ఏడీ ఫణిప్రకాష్ కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. తుపాను ప్రభావంతో 22 మత్స్యకార గ్రామాల్లో రూ.కోట్లలో నష్టం జరిగిందని, వలలు, పడవలతో పాటు ఇళ్లకు కూడా నష్టం జరిగిందని బృంద సభ్యులకు వివరించారు. స్థానిక సర్పంచ్ భర్త వాసుపల్లి అప్పన్న గ్రామంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి తెలియజేశారు. అలాగే కలెక్టర్ ఎం.ఎం నాయక్ తీరప్రాంతంలో జరిగిన నష్టం,తుపాను సమయంలో అప్రమత్తమైన విధానాన్ని తెలిపారు. బృంద సభ్యులతో పాటు జేసీ రామారావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, ప్రత్యేక అధికారి వి.ఆదినారాయణ, తహశీల్దార్ జి.జయదేవి, ఎంపీడీఓ డి.లక్ష్మి, ఎంపీపీ మహం తి చిన్నంనాయుడు, జెడ్పీటీసీ ఆకిరి ప్రసాదరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పంటనష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ మండలంలోని కుమిలి గ్రామం పరిధిలో దెబ్బతిన్న పంటలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి తిలకించారు. తుపాను కారణంగా నష్టపోయిన పంటలు విషయమై కుమిలి సర్పంచ్ దల్లి ముత్యాలురెడ్డి కేంద్రబృందం సభ్యులకు వివరించారు. రామతీర్థసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరఫున నిదులు మంజూరు చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు కోరారు. దీంతో బృందం సభ్యులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ ట్యాంకును పరిశీలించారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. -
హుదూద్ సహాయార్థం టాలీవుడ్ 'మేము సైతం'
-
హుదూద్ సహాయార్థం టాలీవుడ్ 'మేము సైతం'
హుదూద్ తుపాను బాధితులను ఆదుకోడానికి 'మేము సైతం' అనే భారీ కార్యక్రమాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ చేపడుతోంది. ఈనెల 29, 30 తేదీలలో ఈ బృహత్ కార్యక్రమం ఉంటుందని టాలీవుడ్ ప్రముఖులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కేవలం ఆ రెండు రోజులకు మాత్రమే పరిమితం కాదని, మారథాన్లా సాగుతుందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. 29వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు నటీనటులతో డిన్నర్ కార్యక్రమం ఉంటుందని నాగార్జున చెప్పారు. దానిలోకి కేవలం 250 జంటలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో జంటకు టికెట్ ధరను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. జంటలు అంటే.. భార్యాభర్తలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఎవరైనా ఇద్దరి చొప్పున రావాలని తెలిపారు. ఎవరికీ కాంప్లిమెంటరీ పాస్లు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అప్పటికప్పుడే మొదటి టికెట్ను అల్లు అరవింద్ కొన్నారు. పలు రకాల కార్యక్రమాలు ఉంటాయని, 500 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వివిధ రకాల కార్యక్రమాలకు వివిధ ధరల్లో టికెట్లు నిర్ణయించారు. ఆటలు, పాటలు, డాన్సులు, వినోద కార్యక్రమాలు అన్నీ ఉంటాయన్నారు. వీటన్నింటికి సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా కూడా పొందొచ్చన్నారు. అలాగే సికింద్రాబాద్ క్లబ్బు, ఫిల్మ్నగర్ క్లబ్బు లాంటి చోట్ల కూడా దొరుకుతాయన్నారు. ఇతర వివరాలకు memusaitam.com అనే వెబ్సైట్లో కూడా సంప్రదించవచ్చని వివరించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, సురేష్ బాబు, అల్లు అరవింద్, అశోక్ కుమార్, ఇతర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో కార్మికుల ‘ఆకలి కేకలు’
మెరకముడిదాం : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖామంత్రి కిమిడి మృణాళిని సొంత ఇలాకాలో ఉన్న రెండు ఫెర్రో పరిశ్రమలు మూతపడడంతో సుమారు నాలుగు వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. మెరకముడిదాం మండలం గర్భాం సమీపంలో ఉన్న ఆంధ్రా ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమ హుద్హుద్ తుపాను కారణంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది. విద్యుత్ సరఫరా వచ్చేంత వరకూ కార్మికులు విధులకు హాజరుకావొద్దని యాజమాన్యం ప్రకటించింది. దీన్ని కార్మికులు వ్యతిరేకించారు. ఈ దశలో యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరిగాయి. పరిశ్రమకు వారం రోజుల్లో విద్యుత్ సరఫరా వచ్చినా , లేకపోయినా కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని యాజమాన్యం ఒప్పుకుంది. దీనికి కార్మికులు కూడా సరేననడంతో అప్పటికి సమస్య కొలిక్కి వచ్చింది. అయితే చర్చలు జరిగిన రెండో రోజునే పరిశ్రమకు విద్యుత్ సరాఫరా రావడంతో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి రావాలని కోరింది. అయితే తాము విధులకు హాజరుకాని రోజులకు కూడా వేతనం చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని, లేదంటే హాజరుకామని కార్మికులు మొండికేశారు. దీనికి యాజమాన్యం ఒప్పుకోలేదు. అనంతరం ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినా ఫలితం తేలకపోవడంతో యాజమాన్యం ఈ నెల 8వ తేదీన లాకౌట్ ప్రకటించింది. అలాగే మరోవైపు గరివిడి మండలంలోని ఫేకర్ పరిశ్రమ మూతపడి 9 నెలలు కావస్తోంది. ఈ విషయాన్ని కార్మికులు పలుమార్లు మంత్రి మృణాళిని దృష్టికి, కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నెలలు గడుస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఈ పరిశ్రమలు తెరిచే పరిస్థితి కానరాకపోవడంతో కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ఇలాకాలోని పరిశ్రమలు పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మంత్రి మృణాళిని కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
విశాఖ నెమ్మదిగా కోలుకుంటోంది: చంద్రబాబు
హుదూద్ తుపాను నుంచి విశాఖపట్నం నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఆరిపాక ప్రాంతంలో జన్మభూమి - మాఊరు కార్యక్రమంలోను, సబ్బవరం ప్రాంతంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలోను చంద్రబాబు పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన ప్రమాణం చేయించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమవంతు కృషి చేస్తామని వాళ్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక విశాఖపట్నానికి తాను పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పారు. మొక్కలు నాటుదామని, పరిశుభ్రత పాటిద్దామని విశాఖ వాసులకు ఆయన పిలుపునిచ్చారు. -
'ప్రభుత్వానికి మిడిమిడి జ్ఞానం ఉండకూడదు'
ప్రభుత్వానికి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానం ఉండకూడదని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వ్యాఖ్యానించింది. ప్రకృతితో ఆడుకుంటే హుదూద్ లాంటి మరిన్ని విధ్వంసాలు ఖాయమని వేదిక ప్రతినిధులు మండిపడ్డారు. అభివృద్ధి పేరు మీద విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం వల్లనే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఇటీవల హుదూద్ తుఫాను తీవ్ర ప్రభావం చూపిన చోట్ల రెండు రోజుల పాటు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక బృందం సభ్యులు పర్యటించారు. అనంతరం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. -
'హుదూద్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి'
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుపానుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖపట్నంలో తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అందులోభాగంగా ఆయన స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. తుపాను వల్ల స్టీల్ ప్లాంట్కు జరిగిన నష్టంపై ఆ సంస్థ ఉన్నతాధికారులను కారత్ అడిగి తెలుసుకున్నారు. హుదూద్ తుపాను ముంచుకోస్తుందని తెలిసిన అధికార్లు నిర్లక్ష్యం ఉందన్న వార్తలపై విచారణ జరిపించాలని కారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని ప్రకాష్ కారత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
చేసింది గోరంత.. చంద్రబాబు ప్రచారం కొండంత: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమస్యల నుంచి పక్కకు తప్పుకోవడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. హుదూద్ తుఫాన్ సహయ చర్యలు ఎవరికీ అందలేదని, ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. తుఫాన్ సహాయ కార్యక్రమంలో విఫలమైన అంశాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించేందుకే ఏపీ రాజధాని అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని శ్రీకాంత్ విమర్శించారు. లక్ష కోట్లు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు.. రూ.30 వేల కోట్లకు కుదించినట్లే.. లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణమని 30 వేల ఎకరాలకు కుదించారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు రైతులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీశైలంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను వెంటనే ఆపేయాలని, రుణమాఫీపై చంద్రబాబుకే స్పష్టత లేదన్నారు. తుఫాన్ బాధితులకు చంద్రబాబు గోరంత చేసి, కొండంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇన్సూరెన్స్ లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని.. చంద్రబాబు అసమర్ధత కారణంగానే ఈ సమస్య తలెత్తిందన్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
వచ్చారు... వెళ్లారు
చీపురుపల్లి: తుపాను బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం ప్రకటిస్తారో అంటూ ఎదురు చూసిన బాధితులు, రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. శుక్రవారం గుర్ల మండలంలో సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన పర్యటన వచ్చారు...వెళ్లారు అన్నట్టుగా మారింది. తుపాను వల్ల ఏర్పడిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి జిల్లా ప్రజలకు మేలు చేయవలసిన టీడీపీకి చెందిన నేతలెవరకూ ఆ దిశ గా కనీస ప్రయత్నం కూడా చేయలేదు. సభలో జిల్లా మంత్రి కిమిడి మృణాళిని, ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవ్వరూ జిల్లాకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ కావాల్సిన సాయాన్ని కోరకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా మంత్రి మృణాళిని ప్రసంగంలో రైతులు, బాధితులు కోసం మాట్లాడాల్సింది పోయి ఏకంగా పొగడ్తలకే సమయం మొత్తం కేటాయించడం సర్వత్రా చర్చంశనీయమయింది. గుజ్జంగివలసలో జరిగిన సభలో పలువురు వృద్ధులు, రైతులు పింఛన్లు, రుణమాఫీ, ఇసుక కోసం ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అయితే వీటిపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో వారు కూడా నిరాశ చెందాల్సి వచ్చింది. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ ఎందుకు ఇవ్వలేదంటూ వృద్ధుల ఆవేదన ఓ వైపు, రుణమాఫీ జరగలేదు, ఇసుక లేక పట్టణాల్లోను, గ్రామాల్లోను ఉపాధి లేదంటూ మరోవైపు రైతులు అరుపుల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభ జరిగింది. హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలు పరిశీలించేందుకు, రైతులను పరామర్శించేందుకు గురువారం గుర్ల మండలంలోని గుజ్జంగివలస గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన అకస్మాత్తుగా నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలు ప్రాంతంలో గుజ్జంగివలస చేరుకున్న ముఖ్యమంత్రి పొలాల వైపు వె ళ్లలేదు, రైతులు పరామర్శించలేదు. గుజ్జంగివలసలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలోనే గుజ్జంగివలస గ్రామానికి చెందిన తలచుట్ల పైడమ్మ, లండ ఆదమ్మ అనే ఇద్దరు వృద్ధమహిళలు ఒకరి తరువాత మరొకరు లేచి తమకు పింఛను తొలగించారంటూ చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. వీరికి ఎలా పింఛను తొలగిపోయిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటతోనే సరిపెట్టారు తప్ప మీకు పింఛను ఇప్పిస్తానని చెప్పకపోవడంతో నిరాశ చెందారు. దీంతో పక్కనే ఉన్న కలెక్టర్ ఎం.ఎం.నాయక్ వారిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సభ జరుగుతుండగా కొంతమంది రైతులు వెనుక నుంచి రుణమాఫీ కోసం పెద్దగా అరుస్తూ ప్రశ్నిస్తున్నారు. వారిని ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో సమావేశం ఆఖరి సమయంలో మరోసారి పెద్దగా రుణమాఫీ జరగలేదని, గత కొద్ది రోజులుగా ఇసుక లభించకపోవడంతో ఊరిలో పనులు లేవని పెద్దగా పలువురు రైతులు అరవడంతో ఉపాధి పనులు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రుణమాఫీ కోసం మాట్లాడకపోవడంతో రైతులు నిరాశ చెందారు. అంతేకాకుండా తుపాను నష్టాలను అంచనా వేసేందుకు గ్రామాల్లోకి వస్తున్న అధికారులు తమ మాట వినడం లేదని, నష్టాలను సరైన పద్ధతిలో నమోదు చేయడం లేదని జెడ్పీటీసీ పద్మిని, ఎంపీపీ సత్యమమ్మలు నేరుగా మైక్లో ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించగా దానికి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అధికారులు సక్రమంగా నమోదు చేయకపోతే మళ్లీ ఫొటోలు తీసి తనకు పంపించాలని అనడంతో వారు కూడా కంగుతిన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి కిమిడి మృణాళిని, రాష్ట్ర ఐటీశాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యేలు కిమిడి గణపతిరావు, గద్దే బాబూరావు, జెడ్పీటీసీ టి.పద్మిని, ఎంపీపీ జమ్ము సత్యమమ్మ, సర్పంచ్ గొర్లె జానకి, సీఈఓ మోహనరావు, డీఆర్డీఏ పీడీ గోవిందరాజులు, ఆర్డీఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
2 కోట్ల విరాళం ఇచ్చిన 'శ్రీ చైతన్య' డైరెక్టర్లు
హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చాయి. హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును విద్యాసంస్థల డైరెక్టర్లు కలిసి 2 కోట్ల రూపాయల చెక్కులు అందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్లు శ్రీధర్, సుష్మ, సీమ ఉన్నారు. హుదూద్ తుఫాను ఉత్తరాంధ్ర వాసులకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని, వారిని ఆదుకోవడానికి తమవంతు సాయంగా ఈ మొత్తం ఇచ్చామని డైరెక్టర్లు తెలిపారు. -
విశాఖలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ
విశాఖపట్నం: 'తుపాన్లను జయిద్దాం' నినాదంతో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తుపాను బాధితులకు సంఘీభావంగా ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు చేబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు మంత్రులు నారాయణ, మృణాళిని, సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత దగ్గుబాటి సురేష్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య
-
మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య
విశాఖపట్నం: హుదూద్ తుపాను బాధిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు మరోసారి కేంద్ర బృందం వస్తోందని కేంద్ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. దెబ్బతిన్న టెలికాం, రైల్వే వ్యవస్థలను నెల రోజుల్లో పునరుద్దరిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తుపాన్ సాయం అందుతూనే ఉందని వెల్లడించారు. దెబ్బతిన్న ఎస్సీ, ఎస్టీ ఇళ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామన్నారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంకయ్య నాయుడు బుధవారం ప్రకటించారు. -
కొవ్వొత్తులు ప్రదర్శించడం కాదు.. ప్రజలకు ఇవ్వండి
హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్నం నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం 60 శాతం కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 వేల మందితో నిర్వహిస్తున్న 40 వేల కొవ్వొత్తుల ప్రదర్శనపై ఆయన విరుచుకుపడ్డారు. అక్కడ ప్రదర్శన నిర్వహించే బదులు కరెంటు లేనిచోట వాటిని పంచిపెడితే బాగుంటుందని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర అధికారులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. విశాఖలో విద్యుత్ సరఫరాను వారం రోజుల్లోనే పునరుద్ధరించేశామని, ప్రకృతి విలయాన్ని టెక్నాలజీతో అడ్డుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై కూడా ఈ ప్రాంత వాసుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలాచోట్ల ప్రజలే స్వచ్ఛందంగా చెట్లు తొలగించుకున్నారు తప్ప, సర్కారు ప్రకటించిన 200 పొక్లెయిన్లు ఎటు వెళ్లాయో తెలియట్లేదని అంటున్నారు. -
విరాళాల సొమ్ములు ఏటైపోనాయి బావూ?
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని హుదూద్ తుఫాను అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు కూడా కూకటివేళ్లతో కూలిపోయాయి. ఎన్ని ఇళ్లు కుప్పకూలాయో లెక్కలేదు. కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. జనజీవనం అల్లకల్లోలంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో తుఫాను బాధితులను ఆదుకోడానికి పెద్ద హృదయంతో చాలామంది ముందుకు వచ్చారు. భారీ విరాళాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల్లో ఇస్తామంటూ గట్టిగానే చెప్పారు. అయితే.. వీటిలో ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయానికి వచ్చినవి మాత్రం ఒకటి.. అర మాత్రమేనట. అవును.. విరాళాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్నవాళ్లలో ఎంతమంది నిజంగా ఇస్తున్నారు, ఎంతమంది కేవలం పేరుకు మాత్రమే చదివిస్తున్నారన్న విషయం తెలియడంలేదు. విశాఖలో సహాయ కార్యకలాపాలు చేపట్టడానికి డబ్బుకోసం చూసుకుంటే.. సీఎంఆర్ఎఫ్ ఖాళీగా కనిపిస్తోంది. సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా చాలామంది పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటించినా, వాటిలో చేతికి అందినవి కొన్నిమాత్రమే. కొంతమంది నేరుగా సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి చెక్కులు పంపారు. హీరో కృష్ణ, పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటివాళ్లు నేరుగా చంద్రబాబును కలిసి ఆయనకే చెక్కులు అందించారు. మిగిలినవాళ్లు మాత్రం ఇంకా చెక్కులుగానీ, డీడీలు గానీ ఏ రూపంలోనూ విరాళాలు అందించలేదు. ఆ విషయం చెప్పడానికి సీఎంఆర్ఎఫ్ కార్యాలయ అధికారులు మొహమాటపడుతున్నారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయనకు చెక్కులు అందిస్తూ ఫొటోలు తీయించుకోడానికి ఇలా ఆలస్యం చేస్తున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పేరుగొప్ప.. ఊరుదిబ్బ అన్నట్లు ఘనంగా విరాళాలు ప్రకటించి, తర్వాత ఊరుకున్నారేమోనని కూడా అంటున్నారు. -
ఆళ్లగడ్డలో పోటీకి కాంగ్రెస్ దూరం: రఘువీరా
హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఆళ్లగడ్డలో పోటీ చేయొద్దంటూ కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవతీర్మానం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. హుదూద్ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. దీనికోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒత్తిడి తీసుకురావాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందన్నారు. వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయని చెప్పారు. బాధితులను గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. ఇందుకోసం అఖిలపక్ష కమిటీలు వేయాలని సూచించారు. గ్రామ సభల్లో చదివి వినిపించాలి. జాబితాను ఆన్లైన్ కూడా పెట్టాలన్నారు. తుపాను కారణంగా నష్టపోయినవారందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
తుపాను నష్టం లెక్కలు అస్తవ్యస్తం: వైఎస్ జగన్
-
తుపాను నష్టం లెక్కలు అస్తవ్యస్తం: వైఎస్ జగన్
తుపాను నష్టం లెక్కలు సరిగా వేయలేదని బాధితులు చెబుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫానుతో అల్లకల్లోలంగా మారిన శ్రీకాకుళం జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించారు. అసలు తమకు తుపాను సాయం అందలేదని బాధితులు చెబుతున్నారని, ప్రభుత్వ ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం చివరకు బియ్యం కూడా సరిగా పంపిణీ చేయలేదని మండిపడ్డారు. రుణాలు మాఫీ చేస్తారన్న ఆశతో రైతులెవరూ రుణాలు కట్టలేదని, తీరా ఇప్పుడు మాత్రం రుణాలు మాఫీ కాక, అటు పంటబీమా కూడా దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, కరెంటు లేకపోవడంతో తాగునీటి పథకాలు పనిచేయడం లేదని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పారని, వాస్తవానికి లక్ష కోట్ల వరకు అప్పులు మాఫీ చేయాల్సి ఉంటే ఇప్పుడు కేవలం 5వేల కోట్లే ఇస్తామంటున్నారని ఆయన విమర్శించారు. కేవలం రుణాల వడ్డీల కోసమే ఏడాదికి 14 వేల కోట్లు అవసరం అవుతుందని ఆయన గుర్తు చేశారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించి 18 మంది మరణించిన సంఘటన పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన బుధవారం వాకతిప్ప వెళ్లనున్నారు. -
కరెంటు లేని ప్రాంతాలకు సోలార్ లాంతర్లు
హుదూద్ తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో దీపావళి పండుగ లోగానే 90 శాతం వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అయినా దీపావళి రోజుకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని, అలాంటి ప్రాంతాలకు కూడా వెలుగులు అందించేందుకు తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏయే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదో, అక్కడ నెడ్క్యాప్ ద్వారా పదివేల సోలార్ లాంతర్లు అందిస్తామని అజయ్ జైన్ వివరించారు. కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసులను అందించే విషయంలో సిబ్బంది ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
హుదూద్ పోర్టల్ ప్రారంభం: పనివారు సిద్ధం
హుదూద్ సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఓ పోర్టల్ను సిద్ధం చేసింది. హుదూద్ ప్రళం, తుఫాను అనంతర పరిస్థితుల లాంటివాటిని ఇందులో పొందుపరిచారు. www.hudhud.ap.gov.in అనే ఈ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. నిపుణులైన ప్లంబర్లు, కార్పెంటర్ల లాంటి పనివాళ్ల కోసం ఈ వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. తుఫాను కారణంగా విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో పరిస్థితులు మామూలు స్థితికి రాలేదు. దాంతో వృత్తిపనివాళ్లు కావాలంటే ఈ వెబ్సైట్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పంపుతారు. వాళ్లకు అయ్యే లేబర్ ఛార్జీలను కూడా ప్రభుత్వం భరిస్తుందని చెబుతున్నారు. మొత్తం వెయ్యిమంది వరకు పనివారు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. -
రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన
విశాఖ:హుదూద్ తుఫానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం పర్యటించనున్నారు. ఆ రోజు నేరుగా ఢిల్లీ నుంచి వచ్చి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ఉదయం 11 గం.లకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో , 12 గం.లకు తాటిచెట్లపాలెంలో రాహుల్ బాధితులను పరామర్శిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 1 గం.కు విజయనగరం జిల్లా చేరుకుని కొవ్వులవాడలో పర్యటిస్తారు. అనంతరం ఏడు గంటలకు ఏడుగుళ్లలో తుపాను బాధితులను రాహుల్ కలుసుకుంటారు. గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తరువాత వెయ్యి కోట్ల రూపాయలను తక్షణ సాయం ప్రకటించారు. -
చెట్ల తొలగింపు పూర్తికాలేదు: నారాయణ
హుదూద్ తుఫానుకు దెబ్బతిన్న విశాఖపట్నం నగరంలో చెట్ల తొలగింపు ఇంకా పూర్తికాలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తాగునీటి సరఫరాను పూర్తిగా పునరుద్ధరించారని, ప్రస్తుతానికి 25 శాతం అదనంగా కూడా నీళ్లు ఇస్తున్నారని ఆయన చెప్పారు. రేపు 50 శాతం అదనంగా ఇస్తారని, పరిశ్రమలకు కూడా తాగునీరు ఇస్తున్నారని తెలిపారు. విశాఖపట్నంలో చెట్ల తొలగింపు ఇంకా పూర్తికాలేదని, ప్రస్తుతం పదివేల మంది సిబ్బంది ఈ పనిలో ఉన్నారని, మరో పదివేల మందిని రప్పిస్తామని ఆయన చెప్పారు. రెండు రోజుల్లో మొత్తం అన్ని కాలనీలలో పడిపోయిన చెట్లను తొలగిస్తామని తెలిపారు. -
రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని చూడండి.. ప్లీజ్
పాడైపోతున్న రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని సందర్శించాల్సింగా రైల్వే మంత్రి సదానంద గౌడను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆహ్వానించారు. హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వీటి పునరుద్ధరణకు వెంటనే పనులు చేపట్టాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు. హుదూద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని విశాఖపట్నం పంపాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. అలాగే విద్యుత్ శాఖకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ విషయంలోనూ సాయం చేయాలని తాను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరానని మురళీ మోహన్ వెల్లడించారు. -
షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే
-
కాఫీ తోటలు నాశనమైపోయాయి: అశోక్
హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఈ నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇచ్చేందుకు రాష్ట్రానికి ఓ బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరినట్లు ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటలు పూర్తిగా నాశనం అయిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోడానికి కేంద్రం నుంచి వీలైనంత సాయం చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే: వైఎస్ జగన్
సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి తీసేసి.. వాటిని సొంత మనుషులకు అమ్మేయడం ఈ ప్రభుత్వానికి మామూలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫాను బారిన పడిన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతాన్ని ఆయన శనివారం సందర్శించి, అక్కడి వారిని పరామర్శించారు. తుఫాను సాయం ఎలా అందుతోందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి చెరుకు రైతులు తమ గోడును వైఎస్ జగన్ వద్ద వెళ్లబోసుకున్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు 6 కోట్ల రూపాయలు బకాయి పడితే ఇప్పటికి కేవలం 3 కోట్లే ఇచ్చారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏడు నెలల నుంచి కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా 4 కోట్ల రూపాయలకు ఈ ఫ్యాక్టరీని అమ్మేయడానికి ప్రయత్నాలు చేయగా, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు. -
షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి: వైఎస్ జగన్కు రైతుల మొర
హుదూద్ తుఫాను కారణంగా అస్తవ్యస్తమైన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. ఆయనను కలుసుకున్న చెరుకురైతులు.. అక్కడి షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హుదూద్ తుఫాను కారణంగా ఫ్యాక్టరీకి బాగా నష్టం వాటిల్లిందని వాళ్లు చెప్పారు. దీన్ని కూడా సాకుగా చూపించి.. దాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కార్యవర్గం పావులు కదుపుతోందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వాళ్లు తెలిపారు. దీన్ని అడ్డుకోవాలంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
5 రోజులుగా చెట్టుకిందే ఉంటున్నాం
* విశాఖ గాంధీనగర్లో 100 కుటుంబాల గోడు * జగన్కు మొరపెట్టుకున్న హుదూద్ బాధితులు * లక్ష కోట్ల బడ్జెటున్నా సాయానికి చెయ్యి రాలేదా? * టీడీపీ సర్కారు తీరుపై ధ్వజమెత్తిన జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఐదు రోజులుగా 100 కుటుంబాల వాళ్లం రోడ్డు పక్కన ఈ చెట్టు కిందే పడి ఉన్నాం. పగలు ఎండలో, రాత్రి చీకట్లో చస్తూ బతుకుతున్నాం. పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. పక్కనున్న అపార్టుమెంట్లకు వెళ్లి అడుక్కుని వచ్చి పిల్లలకు పెడుతున్నాం. పెద్దలమైతే పస్తులే ఉంటున్నాం. పక్కనున్న ఈ రోడ్డు మీద నుంచే మినిస్టర్లు, అధికారులు వెళ్తున్నారు. మా దగ్గరికి ఒక్కరూ రాలేదు. మేం బతికున్నామో చచ్చామో కూడా చూడటం లేదు. జగన్బాబూ! నువ్వైనా వచ్చావు. మాకు కాస్త న్యాయం చెయ్ బాబూ... నీకు పుణ్యం ఉంటుంది’’ ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో విశాఖలోని హుదూద్ తుపాను బాధితులు వ్యక్తం చేసిన ఆవేదన! వై.ఎస్.జగన్ శుక్రవారం విశాఖ ఉత్తర, పశ్చిమ, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల పరిధిలోని కంచరపాలెం మెట్టులోని గాంధీనగర్, సాకేతపురం కాలనీ, స్టీల్ప్లాంట్, ఇస్లాంపేట, బర్మాకాలనీ, దయాళ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు.కాలినడకన కలియదిరిగి బాధితులందరినీ పరామర్శించారు. ఈ సందర్భంగా కంచరపాలెం గాంధీనగర్కు చెందిన కోలా కాసులమ్మ, ఆసనాల గౌరి తమ గోడును ఆయనతో వెళ్లబోసుకున్నారు. వారి దీనస్థితి చూసి జగన్ చలించిపోయారు. ప్రభుత్వం వద్ద రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నా బాధితులకు సహాయం చేయడానికి చేయి రావ డం లేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పార్టీ తరఫున పోరాడతామని చెప్పారు. తాత్కాలికంగా పార్టీ తరఫున సాయం చేస్తామంటూ భరోసానిచ్చి వారికి ధైర్యం చెప్పారు. తాగునీటికి కూడా అల్లాడుతున్న మురికివాడలు, రాజకీయ కక్షసాధింపుతో సర్కారు సహాయం నిరాకరించడంతో దిక్కుతోచని స్థితిలోపడిపోయిన ముస్లిం మైనార్టీలు తదితర వేలాదిమంది బాధితులను కూడా జగన్ పలకరించారు. ఈ సందర్భంగా జగన్ ఏం మాట్లాడారంటే... * బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వెయ్యి కుటుంబాలు ఉన్న కాలనీలోకి రాత్రిపూట లారీల్లో వచ్చి 200 పులిహోర ప్యాకెట్లు విసిరేసి వెళ్లిపోతున్నారు. అది కూడా పాచిపోయి తినేందుకు పనికిరావడం లేదు. రూ.10పులిహోర, రూ.14 అర లీటరు పాలు ఇచ్చేసి... ఏదో సహాయం చేశామన్నట్టుగా ప్రభుత్వం మీడియా స్టంట్లు చేస్తోంది. * లక్షలాదిమంది రోడ్డున పడ్డారు. తిండి లేదు. ఇల్లు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. పనికీ దిక్కు లేదు. అల్లాడుతున్నా ఇంతవరకూ ఒక్కరూ పలకరించింది లేదు, దమ్మిడీ సాయం చేసిందీ లేదు. ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటిలోనూ బాధితులు ఇదే మాట చెబుతున్నారు. * ప్రభుత్వం మేల్కోవాలి. ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5 వేలివ్వాలి. స్వల్పంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు ఇవ్వాలి. బాగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేయాలి. గంటకు 250 కి.మీ. వేగంతో వీచే గాలులను తట్టుకునేలా అధునాతన పరిజ్ఞానంతో ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఒక్కో ఇంటికి రూ.1.5 అయినా, రూ.2.5 లక్షలైనా భరించాలి. -
విశాఖ స్టీలుప్లాంటును సందర్శించిన వైఎస్ జగన్
హుదూద్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. తుఫాను వల్ల స్టీల్ ప్లాంటుకు జరిగిన నష్టం గురించి అక్కడ పనిచేసే కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తుఫాను వల్ల నష్టపోయిన ఇస్లాంపేటను వైఎస్ జగన్ సందర్శించారు. ఆ ప్రాంతంలో తుఫాను కారణంగా కూలిపోయిన మసీదును సందర్శించి, ముస్లిం సోదరులకు ఆయన భరోసా ఇచ్చారు. -
సాయం చేయాలంటే సాక్ష్యం కావాలి:బాబు
-
రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు!
-
సాయం చేయాలంటే సాక్ష్యం కావాలి: చంద్రబాబు
తుఫాను బాధితులకు సాయం చేయాలంటే వాళ్లకు జరిగిన నష్టానికి సాక్ష్యం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు ఎన్యుమరేషన్ బృందాలను పంపామని, వాళ్లు పంపిన వివరాలు సరికావనుకుంటే బాధితులు కూడా నేరుగా వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చని ఆయన అన్నారు. అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉందని, వాళ్ల పని నూరుశాతం పూర్తయ్యేవరకు వాళ్లను అభినందించేది లేదని చంద్రబాబు అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. ''జరిగిన నష్టం చాలా ఎక్కువ. బాధితులకు ఇవ్వడానికి సరుకులు వేర్వేరు చోట్ల కొనాలి, ప్యాకింగ్ చేయాలి. నూనె, పంచదార అన్నీ ఇవ్వాలి. కూరగాయలు వేర్వేరు ప్రాంతాల నుంచి తెప్పించాలి. ఉల్లిపాయలు కర్నూలు నుంచి రావాలి. బంగాళాదుంపలు పశ్చిమబెంగాల్ నుంచి రావాలి. రవాణా సమస్యలు ఉండటం వల్ల కూడా సహాయం అందించడం ఆలస్యం అవుతోంది. సామర్థ్యం పెంచుకోవాలని అందరికీ చెబుతున్నాను. అధికారులంతా అందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం తీవ్రంగా ప్రభావితమైంది. దీనిపక్కన 50 శాతం కంటే ఎక్కువ ప్రభావితమైన గ్రామాలు కూడా ఉన్నాయి. వాటికో ప్యాకేజి, అంతకంటే తక్కువ ఉన్నవాటికి 10 కిలోల బియ్యం, కిలో చొప్పున పప్పు, ఉప్పు, చక్కెర, లీటరు నూనె, అర కిలో కారం ప్యాకేజిగా ఇస్తాం. కరెంటు లేదు, చెట్లు పడిపోయి ట్రాఫిక్ జామ్ అయింది, ఉపాధి కూడా లేదు కాబట్టే తుఫాను ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా సాయం అందజేస్తున్నాం. సర్వే కోసం అధికారులు బయల్దేరుతున్నారు. వాళ్లు ఫొటోలు, వీడియోలు తీసుకుని అక్కడికక్కడే రికార్డు చేసి ఆన్లైన్లోకి అప్లోడ్ చేయాలి. వాళ్లు ఎన్యుమరేట్ చేసిన తర్వాత అది సరికాదనుకుంటే ఎవరైనా బాధితులు వాళ్లే ఫొటోలు, వీడియోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయచ్చు. దాన్నయినా కూడా మేం అనుమతిస్తాం. మేం అందించే సాయం నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలకు వెళ్తుంది. ఆన్లైన్లో వెళ్తుంది కాబట్టి, మధ్యలో ఎవరి ప్రమేయం ఉండబోదు. చేసిన సాయం మొత్తం బాధితులకు చేరుకుంటుంది'' అని ఆయన చెప్పారు. -
రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు!
హుదూద్ తుఫాను కారణంగా విశాఖ విమానాశ్రయం దెబ్బతినడంతో ఒక్కసారిగా రాజమండ్రి సమీపంలో ఉన్న మధురపూడి విమానాశ్రయం నుంచి రాకపోకలు పెరిగిపోయాయి. దాంతో గిరాకీ పెరిగిందని రాజమండ్రి నుంచి హైదరాబాద్కు టికెట్ ఉన్నట్టుండి 17 వేల రూపాయలు చేసేశారు. మామూలు రోజుల్లో అయితే ఈ ఛార్జి కేవలం 3,500 రూపాయలు మాత్రమే. సాధారణంగా ఏవైనా పండుగ సీజన్లు వచ్చినా, ప్రయాణం తేదీ బాగా దగ్గర పడినా. విమాన ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని డైనమిక్ ఫేర్ సిస్టం అంటారు. కానీ.. ఒక విమానాశ్రయం పనిచేయకపోవడం వల్ల ఇలా జరగడం మాత్రం ఇదే మొదటిసారి. విశాఖ నుంచి వెళ్లాల్సిన వాళ్లు కూడా అక్కడినుంచి రోడ్డు/రైలు మార్గాల్లో మధురపూడి చేరుకుని, ఇక్కడి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. -
రూ.10 పులిహోరతో సరిపెడతారా?
-
విశాఖకు విమాన రాకపోకలు ప్రారంభం
విశాఖ : హుదూద్ తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు శుక్రవారం ప్రారంభమైయ్యాయి. ఇందు కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ తాత్కాలికంగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసింది. అయితే కొద్ది సంఖ్యలో మాత్రమే విశాఖ-హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎయిరిండియా విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కాగా, ప్రయివేట్ విమాన సర్వీసులు శనివారం నుంచి తిరగనున్నాయి. నవంబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. 2009 ఫిబ్రవరిలో నిర్మించిన విమానాశ్రయ భవనం పైకప్పు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు రన్వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
నచ్చినోళ్లకు నచ్చినట్టుగా..
* సాయం పంపిణీలోనూ రాజకీయాలు * పెత్తనమంతా ఎమ్మెల్యేలదే.. * అధికారుల ప్రేక్షకపాత్ర * బాధితుల ధర్నా సాక్షి, విశాఖపట్నం: ‘అడుక్కొని తెచ్చి పిల్లలకు అన్నం పెడుతున్నా.. తుపానొత్తందని మూడురోజులు ముందరగానే మమ్మల్ని ఈ గల్లీ బడిలో పడేశారు. తుపానులో మా కొంప పూర్తిగా ఎగిరిపోయింది. గోడలు కూడా మిగలలేదు. ఇక్కడకు వచ్చి ఏడు రోజులైనాది.. ఏ అధికారి.. ఏ నాయకుడు మా వైపు తొంగి చూడలేదు. మమ్మల్ని పత్తించుకోలేదు. ఉన్నామా? తిన్నామా? చచ్చామా? అని అడిగేవారే లేరు. ఈ గల్లీబడిలో తిండితిప్పల్లేక ఇలాగే ఉంటున్నాం. వారం రోజులుగా పనుల్లేవు. మేమెలాగూ పత్తులుంటున్నాం. పిల్లలు ఆకలేత్తందంటే వారిని చూడలేక చుట్టుపక్కల వార్ని కాస్త అన్నం పెట్టమని అడుక్కొని తెచ్చి పెడుతున్నాం. పులోరపొట్లాలిత్తున్నారు. అవి కూడా తెలుగుదేశపోళ్లు తమకు నచ్చిన వారికే ఇత్తున్నారు. నచ్చనోళ్లకు ఇవ్వడం లేదు. మేమేం పాపం చేశాం. మమ్మల్ని ఎందుకు పత్తించుకోవడం లేదో అర్ధం కావడం లేదు. మాకెందుకీ పరిస్థితి. మా కొంపతో పాటు మేము కూడా కొట్టుకుపోయి ఉంటే బాగుండేది..’ అంటూ వాసువానిపాలెం ప్రాథమిక పాఠశాల (గల్లీబడి)లోని పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న మహిళ ఎస్.పద్మ కన్నీరుమున్నీరైంది. విశాఖ నగరంలోని పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారే కాదు.. తుపాను బాధితులంతా ఇదేరీతిలో గొల్లుమంటున్నారు. సాయం కోసం నిరుపేద బాధితులు గురువారం విశాఖపట్నం ఊటగెడ్డ వద్ద నడిరోడ్డుపై ధర్నాకు దిగడం పరిస్థితికి అద్దంపడుతోంది. సీతమ్మధార, మర్రిపాలెం, అక్కయ్యపాలేల్లో కూడా ఆందోళనలు జరిగాయి. అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం వల్ల ఆహార పొట్లాలే కాదు.. నిత్యావసర సరుకులు ఎక్కడికక్కడ తుపాను బాధితులకు అందకుండా పక్కదారి పడుతున్నాయి. అధికారులు ఉన్నతాధికారుల సేవలోను, ఆ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి సేవలోను తరిస్తుండడంతో క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను పర్యవేక్షించే వారే లేకుండాపోయారు. ఆహారం, నిత్యావసరాల పంపిణీ బాధ్యతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తమ చేతుల్లోకి తీసుకుని తమ అనుచరుల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. అధికారులు పైపైన పర్యవేక్షణకే పరిమితమవుతున్నారు. ఆహార పొట్లాలు, నిత్యావసరాలు, కూరగాయలు ఇలా ప్రతి దాన్లోను ఎమ్మెల్యేల జోక్యం శృతిమించుతోంది. ఎక్కడా తమకు తెలియకుండా పంపిణీ చేయడానికి వీల్లేదంటూ అధికారులను ఆదేశిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ అనుచరులద్వారా గడిచిన ఎన్నికల్లో తమకు ఓట్లు వేసిన వారికి, తమకనుకూలంగా ఉన్నవారికి, తమకు నచ్చిన ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేస్తూ మిగిలిన వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొండవాలు ప్రాంతాలైన వెంకోజుపాలెం, వాసువానిపాలెం, హనుమంతవాక, పెద్దగదులు, రెల్లివీధి, ఊటగెడ్డ, జాలరిపేటల్లో బాధితులకు అరకొర సాయమే అందుతోంది. ముఖ్యంగా పునరావాసకేంద్రాల్లో ఉన్న వారికి సాయం పంపిణీ జరగకపోవడంతో వారు కూలిపోయిన ఇళ్లమధ్యే కాలం గడుపుతున్నారు. వాసువానిపాలెం, శివగణేష్నగర్, ఆరిలోవ, రామకృష్ణాపురం, ఆదర్శనగర్, సాగర్నగర్, జాలరిపేటల్లో ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా చేస్తున్న సహాయ చర్యలు పక్కదారిపడుతున్నాయి. కుటుంబానికి ఉచితంగా పంపిణీ చేయదల్చిన 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు ఎమ్మెల్యేల అనుచరులు పంపిణీ చేయకుండానే పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలున్నాయి. రేషన్ షాపుల వద్ద ఎమ్మెల్యేల అనుచరులు మకాం వేసి మరీ పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ పంపిణీ చేస్తుందా? లేక ప్రభుత్వం పంపిణీ చేస్తుందా? పర్యవేక్షించడానికి వీరెవరంటూ ఎంవీపీ కాలనీలో టీడీపీ నాయకుల తీరుపై బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సక్రమంగా పంపిణీ చేస్తున్నదీ లేనిదీ చూస్తే తప్పేమిటంటూ తెలుగుదేశం నేతలు ఎదురు ప్రశ్నిస్తుంటే.. ఆ పని అధికారులు చేస్తారు కదా మీకెందుకంటూ బాధితులు నిలదీస్తున్నారు. టీడీపీ కార్యాలయం సమీపంలోని ఊటగెడ్డ వద్ద సాయం అందడం లేదంటూ బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఎందుకు మా పట్ల వివక్ష చూపుతున్నారు.. మాకెందుకు సాయం పంపిణీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం పంపిణీ చేసే ప్రతిచోట ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. మత్స్యకార ప్రాంతాలు, మురికివాడల్లోనే పంపిణీ నామమాత్రంగా జరుగుతోంటే, మధ్య తరగతి, ఎగువమధ్య తరగతి ప్రజలుండే ప్రాంతాల్లోని బాధితుల వైపు అసలు చూడటమే లేదు. -
రూ.10 పులిహోరతో సరిపెడతారా?
* ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జగన్ * సాయం చేశామని చెప్పుకొనే ధైర్యం ప్రభుత్వానికి లేదు * నేడు సాకేతపురం, గాజువాక ప్రాంతాల్లో జగన్ పర్యటన సాక్షి, విశాఖపట్నం: ‘‘పెద్ద పెద్ద గాలులొచ్చా యి, ఇళ్లు కూలిపోయాయి, సర్వస్వం కోల్పోయి జనం వీధిన పడ్డారు... అయినా వారెలా ఉన్నారని పట్టించుకోవడానికి, ఎంత నష్టంజరిగిందని నష్టం రాసుకోవడానికి కూడా ప్రభుత్వ అధికారులెవరూ రాలేదు. సీఎం చంద్రబాబు మాత్రం పొద్దున్నే టీవీల్లో కనిపించి అదిచేస్తాం.. ఇది చేస్తాం.. అని మాయమాటలు చెబుతున్నారు. నిజానికి ఎక్కడో ఒక లారీలో రూ.10 పులిహోర పాకెట్లు కొన్ని తెచ్చి, దూరం నుంచి విసిరేసి అంతా చేసేశామన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదేనా చిత్తశుద్ధి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై, పాలకులపై ధ్వజమెత్తారు. మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రతీ ఇంటి దగ్గరకు వచ్చి ఏమేమి ఇస్తారో ఇచ్చి అప్పుడు సగర్వంగా ఎందుకు చెప్పుకోరని ప్రశ్నించారు. ప్రభుత్వం నిజాయితీగా సాయం చేయాలనుకుంటే రూ.లక్షల కోట్లు ఉన్నాయని, కానీ మంచి చేయాలనే ఉద్దేశం ఎవరిలోనూ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏదో చేసేస్తున్నామని ఊరికే కలర్ పూసేసి చెప్పుకుంటున్నారని, ఇలాగే వదిలేస్తే ఎప్పటికీ సాయం అందదని ఆందోళన వ్యక్తంచేశారు. హుదూద్ తుపాను ధాటికి కకావికలమైన విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి కొండంత ధైర్యమిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా సహాయం చేయడానికి ముందుంటామని, ప్రతీ కాలనీలోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడతారని చెప్పారు. కొన్ని రోజులు సమయం ఇచ్చి అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే బాధితులందరితో కలిసి రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తామని, ప్రభుత్వం మెడలు వంచయినా మంచి జరిగేలా ప్రయత్నిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ఉదయం గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి ప్రారంభమైన జగన్పర్యటన వైఎస్సార్ కాలనీ, ధర్మానగర్, బీఎన్ఐటీఎన్ కాలనీ, సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లేఔట్, రాజీవ్ కాలనీ, ఏకేపీ కాలనీ, మల్కాపురం జయేంద్రకాలనీ, కాకర్లలోవ, చింతల్లోవ, కొత్త గాజువాక ప్రాంతాల మీదుగా సాగింది. ఆయన శుక్రవారం సాకేతపురం, స్టీల్ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్నగర్, దయాళ్ నగర్, హైస్కూల్ రోడ్డు, గాజువాక ల్లో పర్యటిస్తారు. అడుగడుగునా కష్టాలు తెలుసుకుంటూ... వైఎస్సార్ కాలనీలో ప్రజల అవస్థలను జగన్ ప్రత్యక్షంగా చూశారు. గండి రాములమ్మ, మీసాల రాజేశ్వరి, నారాయణమ్మ అనే మహిళలు తమ పాకలు ఎగిరిపోయాయని, ఇంతవరకూ ఎవరూ తమని చూడడానికి కూడా రాలేదని విలపించారు. ఏమైనా ఇచ్చారా తల్లీ? అని జగన్ ప్రశ్నించగా... పనికిరాని పులిహోర ప్యాకెట్లు ఇచ్చారని వారు బదులిచ్చారు. ఇళ్లు కూలిపోయి నడిరోడ్డున పడ్డ నాస రామయ్య, నడిపూడి చంద్రరావు, నాగేశ్వరరావులను జగన్ పరామర్శించారు. అన్నయ్యా... ఇల్లు పోయింది, పిల్లలతో దిక్కులేని వాళ్లమయ్యామని సియాద్రి మాధురి తన గోడు చెప్పుకుంది. ఇల్లు మొత్తం పడిపోయిందని, పింఛను కూడా రావడం లేద ని, పోలియో వచ్చిన కొడుకుతో అవస్థలు పడుతున్నానని గొడ్డు అప్పారావు తన దుస్థితిని వివరించారు. నిరాశ్రయులైన వారందరినీ జగన్ పేరు పేరునా పలకరించి ఓదార్పునిచ్చారు. అక్కడనుంచి రైల్వే కాలనీలో క్వార్టర్స్ దుస్థితిని పరిశీలించి... ‘సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్ల పరిస్థితే ఇట్లుంది’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతీ చోట ఓపిగ్గా గంటల తరబడి జనం కష్టాలు తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ జగన్ ముందుకు కదిలారు. వెళ్లిన ప్రతీచోట ఎవరైనా వచ్చారా? సాయమేదైనా చేశారా? అని ఆరా తీశారు. ఇంతవరకూ తామున్నామో పోయామో పట్టించుకోవడానికి కూడా ఎవరూ రాకపోయినా మీరు మాత్రమే వచ్చారని ప్రజలు బదులిచ్చారు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు బాధితులకు సాయమందించడానికి వైఎస్సార్ పార్టీ శ్రేణులు ఆహార సరుకులు టన్నుల కొద్దీ తీసుకువచ్చి జగన్ సమక్షంలోనే పంచిపెట్టారు. కొత్త గాజువాక చేరుకొనే సరికి రాత్రి ఎనిమిది గంటలు కావస్తున్నా జగన్ అక్కడ కూలిపోయిన మసీదును సైతం పరిశీలించి ముస్లిం సోదరులకు అండగాఉంటానని ధైర్యమిచ్చారు. -
38కి చేరిన హుదూద్ మృతుల సంఖ్య
-
త్వరలో విశాఖ హార్బర్ లో కార్యకలాపాలు
న్యూఢిల్లీ: తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖ హార్బర్ లో కార్యకలాపాలను త్వరలో పునరుద్ధరిస్తామని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సృష్టం చేసింది. ఇందుకు సంబంధించి సర్వే చేస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా పౌరవిమానాల రాకపోకలకు సంబంధించి రక్షణశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి బుధవారం పౌరవిమానాయాన శాఖ అధికారులతో రక్షణశాఖ అధికారులు సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. అదృష్టవశాత్తు రన్వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని అధికారులు చెప్పారు. హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన గాలులు విశాఖపట్నంతో పాటు విమానాశ్రయాన్ని తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ప్యాసింజర్ టెర్మినల్ మీద ఓ టార్పాలిన్ షీటును పైకప్పుగా వేసి ఉంచారు. -
వరద బాధితులకు వైఎస్ జగన్ సాయం పంపిణీ
-
వరద బాధితులకు వైఎస్ జగన్ సాయం పంపిణీ
హుదూద్ తుఫానుకు తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలోని ధర్మానగర్ ప్రాంతంలో తుఫాను బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన సహాయ సామగ్రి విశాఖపట్నానికి చేరుకుంది. ఆ సామగ్రిని బాధితులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గత రెండు రోజులుగా విశాఖలోనే ఉండి, తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న వైఎస్ జగన్, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏవేం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. ఆ మేరకు వారందరికీ సహాయం అందేలా ఇటు పార్టీ వర్గాలతోను, అటు స్వచ్ఛంద సంస్థలతోను సమన్వయం చేస్తున్నారు. -
రేపట్నుంచే విశాఖలో విమానాలు!
తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాలు శుక్రవారం నుంచి తిరుగుతాయి. హుదూద్ విలయం సృష్టించిన ఐదు రోజులకు మళ్లీ గాలిమోటార్లు పనిచేయడం ప్రారంభం అవుతోంది. ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి, ఇక్కడినుంచి మళ్లీ హైదరాబాద్ వెళ్తుంది. 2009 ఫిబ్రవరిలో నిర్మించిన ఈ భవనం పైకప్పు బాగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు రన్వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని అధికారులు చెప్పారు. గంటకు 180-195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విశాఖపట్నంతో పాటు విమానాశ్రయాన్ని తీవ్రంగా వణికించాయి. శనివారం నుంచి మరిన్ని విమానాలు తిరుగుతాయి. తాత్కాలికంగా ప్యాసింజర్ టెర్మినల్ మీద ఓ టార్పాలిన్ షీటును పైకప్పుగా వేశారు. ప్రస్తుతానికి కంప్యూటర్లన్నీ తుఫాను కారణంగా పాడైపోయాయి కాబట్టి, బోర్డింగ్ పాసులు మాత్రం మాన్యువల్గానే ఇస్తారు. నెలాఖరుకు విమానాశ్రయం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అధికారులు చెప్పారు. -
ఆహార పొట్లాలు అక్కర్లేదని చెబుతున్నారు: బాబు
తుఫాను వల్ల ఇబ్బంది పడిన విశాఖ ప్రజల్లో ధైర్యం కల్పించామని, అసలు తమకు ఆహార పొట్లాలు అక్కర్లేదని ప్రజలు చెబుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హుదూద్ తుఫాను వల్ల అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎల్అండ్టీ వాళ్లు, పాతూరి రామారావు తదితరులందరినీ పిలిపిస్తున్నామని, వాళ్లతో కూడా మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయిస్తామని చెప్పారు. వాస్తవానికి విశాఖలో మొదట విద్యుత్ సరఫరా చేయడానికి 15 రోజులు పడుతుందని అనుకున్నామని, కానీ మూడు రోజుల్లోనే ఇచ్చామని అన్నారు. పెట్రోలు, డీజిల్ కొరత కూడా తీరిందన్నారు. -
శనివారానికల్లా సెల్ సర్వీసుల పునరుద్ధరణ: ఎయిర్టెల్
తుఫాను దెబ్బతో విలవిల్లాడిన విశాఖ ప్రజలకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. బాధితులను ఆదుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు గట్టిగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఆ ప్రాంతంలో సెల్ఫోన్ సర్వీసులను పునరుద్ధరించడానికి తామంతా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు సునీల్ మిట్టల్ చెప్పారు. శనివారం సాయంత్రానికల్లా అక్కడ ఎయిర్టెల్ సెల్ఫోన్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అయితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఇంకా బాగోలేదని ఆయన అన్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా ఉందని చెప్పారు. అయితే.. డబ్బు మిగుల్చుకోడానికి టెలికం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, అందుకే సెల్ టవర్లకు డీజిల్ జనరేటర్లను ఉపయోగించట్లేదని చంద్రబాబు ఆరోపించారు. దాన్ని సునీల్ మిట్టల్ ఖండించారు. సెల్ టవర్లను అసలు టెలికం కంపెనీలు నడపడంలేదని, డీజిల్తో నడపాలా.. కరెంటుతో నడపాలా అనేది తమ చేతుల్లో లేదని అన్నారు. టెలికం సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని, టవర్లను మాత్రం నడిపించేది థర్డ్ పార్టీ వ్యక్తులని ఆయన చెప్పారు. -
తుఫాను కలిగించిన నష్టం బాధాకరం: పవన్
హుదూద్ తుఫాను విశాఖపట్నానికి కలిగించిన నష్టం చాలా బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని ఆయన కోరారు. క్లిష్ట సమయాలను ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని ఆయన చెప్పారు. తుఫాను బాధితుల సహాయార్థం తాను ఇంతకుముందు ప్రకటించిన 50 లక్షల రూపాయల విరాళం తాలూకు చెక్కును ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు. తక్షణ సాయం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆపత్కాలంలో అక్కడే ఉండి విశాఖ వాసులకు అండగా ఉన్న చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తుపానువల్ల దెబ్బతిన్న విశాఖను చూస్తే బాధ వేసిందన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు పాలనానుభవం ఉన్న వ్యక్తుల అవసరం ఉందని, అందుకే చంద్రబాబుకు మద్దతు ఇచ్చామని చెప్పారు. -
స్టీల్ప్లాంట్ నుంచి విషవాయువులు వచ్చే ప్రమాదం!
హుదూద్ తుఫాను దాటికి విశాఖ స్టీలు ప్లాంటులో నాలుగురోజులగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్కసారిగా కరెంటు సరఫరా ఆగిపోవపడంతో పవర్ హౌస్లో ఒక యూనిట్ ట్రిప్పయింది. గురువారం సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోతే అక్కడి నుంచి విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రభుత్వ అధికారుల హెచ్చరికలను స్టీలు ప్లాంటు యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. -
36కి పెరిగిన హుదూద్ మృతుల సంఖ్య
-
నీటిలో చిక్కుకున్న చంద్రబాబు!
-
నీటిలో చిక్కుకున్న చంద్రబాబు!
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో తుఫాన్ బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు చేపట్టిన పర్యటనలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాల్లోని రెల్లిగడ్డి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ నీటిలో చిక్కుకు పోయింది. పార్టీ కార్యకర్తలు, అధికారులు చంద్రబాబు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తుఫాన్ తాకిడి గురైన ప్రాంతాల్లో చంద్రబాబు ట్రాక్టర్ పై పర్యటిస్తున్నారు. మొదలవలస, రెల్లిగడ్డి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
తుఫాను నష్టం వివరాలు ఇవీ..
హుదూద్ తుఫాను కారణంగా సంభవించిన మొత్తం నష్టం వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తుఫాను కారణంగా మొత్తం 26 మంది మరణించారని, 146 మందిని సహాయక బృందాలు కాపాడాయని అధికారులు చెప్పారు. 7806 ఇళ్లు ధ్వంసం అయ్యాయని, 219 చోట్ల రోడ్లు, రైలుపట్టాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 8301 కరెంటు స్తంభాలు కూలిపోగా, 19 చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. 181 బోట్లు గల్లంతయ్యాయి. 3368 పశువులు మృతి చెందాయి. తుపాను ప్రభావం మొత్తం 2 కోట్ల మందిపై పడిందని, 223 రిలీఫ్ క్యాంపులు, 223 వైద్య శిబిరాలు ఏర్పాటుచేశామని అధికారులు ఓ ప్రకటనలో వివరించారు. -
19న విశాఖలో రాహుల్ గాంధీ పర్యటన
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే ఆదివారం.. 19వ తేదీ పర్యటించనున్నారు. ఆరోజు నేరుగా ఢిల్లీ నుంచి వచ్చి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తిరుగుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారమే విశాఖలో పర్యటించి, తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే. హుదూద్ తుఫాను సరిగ్గా గత ఆదివారం నాడు.. అంటే ఈనెల 12వ తేదీన తీరం దాటింది. వారం రోజులకు అంటే మళ్లీ ఆదివారం నాడు రాహుల్ గాంధీ విశాఖకు వస్తున్నారు. -
విశాఖ మార్గంలో 26 రైళ్ల రద్దు
హుదూద్ తుఫానుకు అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నం మార్గంలో బుధవారం వెళ్లాల్సిన 26 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్, విశాఖ నుంచి కాజీపేట వెళ్లే లింక్ ఎక్స్ప్రెస్, విశాఖ నుంచి రేణిగుంట వెళ్లే స్పెషల్ రైలు రద్దయ్యాయి. అలాగే, రేణిగుంట నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ రైలు, విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే స్పెషల్ రైలు కూడా రద్దయ్యాయి. అలాగే, గురువారం నాడు వెళ్లాల్సిన సికింద్రాబాద్ - విశాఖ స్పెషల్ రైలు, ఈరోజు, రేపు తిరగాల్సిన భువనేశ్వర్ - సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్, విశాఖ- సికింద్రాబాద్ గరీబ్రథ్, భువనేశ్వర్ - ముంబై కోణార్క్ ఎక్స్ప్రెస్, రేపటి చెన్నై -షాలిమార్ ఎక్స్ప్రెస్, షాలిమార్ - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రద్దయిన జాబితాలో ఉన్నాయి. -
'హుదూద్'తో జనజీవనం అస్తవ్యస్తం
-
తుఫాను సాయాన్ని నిరాకరించిన ఎయిర్పోర్టు
హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోడానికి దాతలు చేసిన సహాయాన్ని గన్నవరం విమానాశ్రయం అధికారులు తిరస్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతానికి చెందినవాళ్లు దాదాపు 25 వేల పులిహోర ప్యాకెట్లు, 25 వేల వాటర్ ప్యాకెట్లు, 2వేల దుప్పట్లు, 2వేల టవల్స్ మొత్తం సిద్ధం చేసి, వాటిని విశాఖపట్నం తరలించేందుకు గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అయితే, వాటిని విశాఖపట్న పంపడానికి కుదరదంటూ అధికారులు ఆ సరుకులను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దాంతో అధికారుల తీరును నిరసిస్తూ విమానాశ్రయం వద్ద తాడేపల్లి వాసులు ఆందోళన చేశారు. -
ఏటీఎంల వద్ద భారీ క్యూలు
-
నడుస్తున్న రైళ్లు.. ఏటీఎంల వద్ద భారీ క్యూలు
ఎట్టకేలకు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి క్రమంగా వస్తోంది. బయ్యారం - ఎలమంచిలి మధ్య రైల్వే బ్రిడ్జిని పునరుద్ధరించారు. రెండు ట్రాకులు అందుబాటులోకి వస్తాయి. దాంతో విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రాంతాలకు బుధవారం సాయంత్రం నుంచి పూర్తిస్థాయిలో రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు రోజుల నుంచి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిషాకు కూడా రవాణా మార్గాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేసి, రైలు మార్గాలను పునరుద్ధరించారు. మరోవైపు.. కొన్ని ఏటీఎం కేంద్రాలు కూడా ఇప్పుడిప్పుడే పనిచేయడం ప్రారంభించాయి. దాంతో డబ్బులు తీసుకోడానికి వాటి ముందు భారీ క్యూలలో ప్రజలు వేచిచూస్తున్నారు. వృద్ధులు, మహిళలు కూడా ఈ క్యూలలో వేచి చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజుల తర్వాత వీటిలో రెండు మూడు కేంద్రాలు పనిచేస్తుండటంతో చాలామంది డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్లారు. తుఫాను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి వద్దా ఇళ్లలో పెద్దగా డబ్బులు లేకపోవడం, ఏటీఎంలలో ఇన్వర్టర్లు విద్యుత్ సరఫరా లేక ఛార్జింగ్ అయిపోయి అవి పనిచేయడం మానేశాయి. అసలే ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతుండటం, మరోవైపు డబ్బు లేకపోవడంతో విశాఖ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు వాళ్ల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం కనిపిస్తోంది. -
వందల కోట్లు తీసుకుని.. లక్షలు విదిలిస్తారా
తుఫాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ హీరోలు ప్రకటిస్తున్న సాయం మీద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వందల కోట్లు తీసుకునే హీరోలు.. విశాఖపట్నం కోసం కేవలం కొన్ని లక్షలు మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు. ఉచితంగా వస్తాయి కాబట్టే బోలెడంత ప్రేమ కురిపించి, ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు. Am shocked tht stars who hav100s of crores frm people r gvng jst a few lakhs to vizag..Thy r gvng lots of love n prayers bcos they are free — Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2014 ఇక తుఫాను విషయంలో దేవుడి నిర్ణయాన్ని కూడా రాంగోపాల్ వర్మ కొంతవరకు ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులు దేవుడు సృష్టించేవే అయితే.. ఇలాంటి విధ్వంసం సృష్టించి దేవుడు ఎలా ఆనందం పొందుతాడని వర్మ ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఉన్న అందరూ పాపం చేసినవాళ్లేనా.. వాళ్లను ఆయన ఎందుకు శిక్షించాలనుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే చివర్లో మాత్రం.. మళ్లీ తనకంటే దేవుడికే బాగా తెలుస్తుందని, తాను కేవలం ఓ సామాన్య మానవుడినేనని వేదాంతం వల్లించారు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. అయితే హీరోలు కనీసం ఆమాత్రం లక్షలైనా విరాళాలు ప్రకటించారు. రాంగోపాల్ వర్మ మాత్రం తాను ఎంత సాయం చేసేదీ ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అవతలి వాళ్ల మీద రాళ్లు వేసేటప్పుడు తన అద్దాల మేడ సంగతి చూసుకోవాలన్న విషయం వర్మకు తెలియదంటారా? If a natural disaster is an act of God what pleasure does God take in such destruction? — Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2014 I can't believe that everybody in Vizag is a sinner that he wanted to punish everybody...but ofcourse God knws bettr and I am jst a commoner — Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2014 -
ఎంత కష్టం..ఎంత నష్టం...
-
తుపాను బాధితులకు వైసీపీ ఎంపీల 2 నెలల జీతం
సాక్షి, హైదరాబాద్: విశాఖ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) ఎంపీలు బాసటగా నిలిచారు. ఆ పార్టీ ఎంపీల 2 నెలల జీతాన్ని హుదూద్ తుపాను బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మంగళవారం ప్రకటించారు. తుపాను బాధితులకు అందాల్సిన ఆహారం, వైద్య సదుపాయాలు వెంటనే అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతక్షణ సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు. -
అండగా ఉంటాం
* ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ భరోసా * రాష్ట్రానికి తక్షణ సహాయంగా రూ.1,000 కోట్లు * ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే * పంటల బీమా చెల్లింపులోసానుభూతి చూపాలని కంపెనీలకు చెబుతా * టెక్నాలజీ సహాయంతోప్రాణ నష్టం బాగా తగ్గించారు * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయి * విశాఖను చూస్తే బాధేస్తోంది * మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వే ల కేంద్ర సహాయం విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హుదూద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు తక్షణ సహాయంగా రూ.1,000 కోట్లు అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ 50 వేలు కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. నష్టంపై సమగ్ర సర్వేలు చేయించి ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దక్షిణ ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాం తాల్లో మంగళవారం ఏరియల్ సర్వే జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను ప్రభావానికి కకావికలమైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుపాను ఫొటోల ప్రదర్శనను తిలకించారు. తుపాను సమీక్ష అనంతరం ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తాయనీ, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. భీకరమైన తుపాను ప్రభావాన్ని స్వయంగా అనుభవించిన విశాఖ ప్రజలు నిబ్బరంగా ఉన్నారనీ, సహాయక చర్యల్లో పాల్గొం టున్న ప్రజలు, అధికారులను ఆయన అభినందించారు. ప్రధానమంత్రి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ఇటీవల వచ్చిన హుదూద్ పెనుతుపాను ఆంధ్రాతో సహా ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో విలయం సృష్టించింది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలపై సానుభూతి ప్రకటిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా సహకారాన్ని అందిస్తుంది. ఈ తుపానును ఎదుర్కోవడంలో సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో వినియోగించారు. పొంచి ఉన్న తుపాను ముప్పును వాతావరణశాఖ ముందుగానే గుర్తించి ఈనెల 6వ తేదీ నుంచే సమాచారాన్ని అందించింది. ఊహించిన దిశ, సమయంలోనే తుపాను తీరం దాటింది. ఫలితంగా ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో సఫలమయ్యాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం భుజం భుజం కలిసి పనిచేస్తే, సరైన మార్గంలో వెళితే ఎంతటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు. ఏపీ ప్రభుత్వం, కేంద్రం ఐదు రోజులపాటు నిరంతరం.. మినిట్ టు మినిట్.. పూర్తిస్థాయిలో సమన్వయంతో పనిచేశాయి. స్థానిక సంస్థలు కూడా పూర్తిస్థాయిలో కలిసి నడిచాయి. విపత్తు సమయంలో ప్రభుత్వ సూచనలను పాటించిన వైజాగ్ ప్రజలను అభినందిస్తున్నా. క్రమశిక్షణతో సూచనలు పాటించడంవల్లే ప్రజల ప్రాణాలను కాపాడటంలో మేం సఫలమయ్యాం. విపత్తులో ధైర్యం కోల్పోకుండా భయంకరమైన తుపానును మీరు(ప్రజలు) ఎదుర్కోగలిగారు. నేను చాలా దూరం వెళ్లాను. ఏరియల్ సర్వే చేశాను. ఒడిశా ప్రాంతాలను కూడా చూశాను. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. కోస్ట్గార్డు, నేవీ, రైల్వే, ఎయిర్లైన్స్, జాతీయ రహదారులు.. అన్నిటికీ నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంకోసం కేంద్రం నుంచి అధికారులు వచ్చి సర్వే చేస్తారు. రైతులకు పంట చేతికొచ్చే సమయం ఇది. తుపానువల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా, నష్టపరిహారం చెల్లింపు విషయంలో సానుభూతితో వ్యవహరించాలని బీమా కంపెనీలతో మాట్లాడతాను. ఇక ప్రైవేటు బీమా కంపెనీల ప్రతినిధులు బాధితులతో సమావేశమై వారి క్లెయిములను త్వరగా చెల్లించే దిశగా పనిచేయాలని బీమా కంపెనీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితులు, ప్రజలు పడుతున్న అవస్థను చూస్తే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏపీ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. ఇప్పటికే చాలా పనులు చేయాల్సి ఉంది. ఇంతలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చింది. మరోవైపు వైజాగ్ను స్మార్ట్ సిటీ చేయాలన్న కలతో నేను చాలా ఆనందపడ్డాను. ఊహించని విధంగా కష్టాలు వచ్చాయి. ఈ విపత్తు నుంచి బయటపడతామనే నమ్మకం నాకుంది. అతి త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. నష్టాలను సరిచేసుకోడంలో సఫలం అవుతాం. విద్యుత్, తాగునీరు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణ ప్రాధాన్యత ఇచ్చాం. కొన్ని గంటల్లోనే పరిస్థితులు మెరుగవుతాయి. దీని కోసం కేంద్రం నుంచి ప్రతినిధులను ప్రత్యేకంగా విపత్తు సర్వే పనుల కోసం డిప్యూట్ చేశాను. ఏపీ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో పనిలో నిమగ్నమైంది. ప్రజలకు ప్రాథమిక అవసరాలు తీర్చే దిశగా పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. భారీ విపత్తు నుంచి కోలుకోవడానికి కేంద్రం తరపున మధ్యంతర సహాయం కింద రూ. 1000 కోట్లు సహాయం ప్రకటిస్తున్నా. ఇక ముందు కూడా ఏపీ, వైజాగ్ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి సహాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందిస్తాం. తుపాను నష్టంపై ప్రధాని సమీక్ష హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి రాష్ట్రానికి 2 వేల కోట్ల రూపాయల సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించారు. తుపాను నష్టంపై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ప్రధాని సమీక్ష జరిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, డిప్యూటీ సీఎంలు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు, అధికారులు ప్రధాని సమీక్షలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాను విధ్వంసం కారణంగా జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించారు. విశాఖపట్నంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం జరిగిందని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్య లు చేపట్టడానికి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి అధికారులు, ఉద్యోగులను రంగంలోకి దించామని తెలిపారు. తనతోపాటు మంత్రులు సైతం ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మంగళవారం రాత్రికి విశాఖలో అత్యవసర సర్వీసులకైనా విద్యుత్ సరఫరా జరపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విశాఖ నగరంలో పూర్తిగా సాధారణ పరిస్థితి నెలకొనే వరకు తాను ఇక్కడే ఉంటానని చంద్రబాబు ప్రధానికి తెలిపారు. విశాఖ విషాదం అందరిదీ! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని మోదీ రాష్ట్రంలో తుపాను నష్టం పరిశీలనకు ఏరియల్ సర్వే కోసం మంగళవారం విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం లో ప్రయాణించి విశాఖపట్నంలో సంభవించి న తుపాను విధ్వంసాన్ని స్వయం గా చూశా రు. ఈ సందర్భంగా విశాఖ విషాదం అందరిదీనని, నగరం త్వరగా కోలుకునేందుకు చేయూతనందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో కలసి ఒకే వాహనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రధాని విశాఖ రోడ్లపై కుప్ప కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, తీగలను చూసి నష్టం పెద్దదని వ్యాఖ్యానించారు. తుపాను బాధిత ప్రజలను కూడా సమీకరించి త్వరితగతిన కోలుకునేలా చేద్దామని చంద్రబాబుకు చెప్పారు. ‘విశాఖనగరాన్ని వీలైనంత త్వరగా పూర్వ స్థితికి తెచ్చేందుకు బ్లూప్రింట్ తయారు చేయాలని ప్రధాని సూచించారు. అదేవిధంగా తగిన ప్రతిపాదనలతో వస్తే విశాఖ పునరుద్ధరణకు సహకరిస్తానని మోదీ చెప్పారు. కాగా, ప్రధాన మంత్రి తొలిసారి కలెక్టరేట్కు వచ్చి తుపానుపై సమీక్ష నిర్వహించడం ఇదే ప్రథమం. మరోపక్క ప్రధాని రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ మమకారాన్ని నిలుపుకుందాం: మోదీ సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ప్రజలు కేంద్రంపై, తనపై చూపిన మమకారాన్ని నిలుపుకోవాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మంగళవారం విశాఖలో పలు ప్రాంతాలను రోడ్డు మార్గంలో సందర్శించినప్పుడు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతూ మోదీకి జయజయధ్వానాలు పలికారు. పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ప్రధాని ఈ విషయం ప్రస్తావించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రజలు తమ గోడు వినిపిస్తూ ఆందోళన చేస్తుంటారని గుర్తుచేశారు. కానీ విశాఖ ప్రజలు అందుకు భిన్నంగా స్వాగతం పలకడంపట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తుపానుకు ముందు, అనంతరం కేంద్రం, రాష్ట్రం అప్రమత్తంగా ఉండడంతో ప్రజల్లో విశ్వాసం కలిగిందని వెంకయ్య చెప్పారు. ప్రధాని మీద ఉన్న నమ్మకం కూడా వారి మమకారానికి కారణమన్నారు. దీంతో ప్రధాని తిరిగి ‘ఆ విశ్వాసాన్ని, వారి మమకారాన్ని మనం నిలుపుకోవాలి..’ అని వెంకయ్యనాయుడితో చెప్పారు. -
మేము సైతం...
హుదూద్ తుఫాన్ బీభత్సం కారణంగా గోదావరి జిల్లాలు, విశాఖ సహిత ఉత్తరాంధ్ర అతలా కుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి వైపరీత్యంపై సినీపరిశ్రమ అభినందనీయంగా స్పందించింది. పలువురు సినీ ప్రముఖులు మేము సైతం అంటూ బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. బాధితుల సహాయార్థం పవన్కల్యాణ్ 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయనున్నట్లు ప్రకటించారు. బాధిత ప్రాంతాలలో త్వరలోనే పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ స్పందించాలని, అభిమానులు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు. మహేశ్బాబు కూడా ఈ విపత్తు విషయంలో తనదైన శైలిలో స్పందించారు. 25 లక్షల రూపాయలు బాధితుల సహాయార్థం ప్రకటించారు. జరిగిన నష్టం నుంచి త్వరగా కోలుకొని, త్వరగా ఆ ప్రాంతాలు పూర్వవైభవానికి చేరుకోవాలని మహేశ్ ఆకాంక్షించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అభి మానులకు పిలుపునిచ్చారు. సీనియర్ నటుడు, సూపర్స్టార్ కృష్ణ కూడా 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అనౌన్స్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి విజయనిర్మల కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఘట్టమనేని అభిమానులు తక్షణం తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రామ్చరణ్ 15 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వాటిలో పది లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి అందిస్తామని, మిగిలిన అయిదు లక్షలు విశాఖకు చెందిన రామకృష్ణ మిషన్ వారికి అందిస్తామని, ఇంకా అయిదువేల పులిహోర పొట్లాలు, పదివేల వాటర్ బాటిల్స్, అయిదు వేల బిస్కెట్ ప్యాకెట్స్ అందిస్తామని రామ్చరణ్ మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మానవతా దృక్పథంతో అందరూ కలిసి తుఫాన్ బాధితుల్ని ఆదుకోడానికి ముందుకు రావాలని పిలుపునిస్తూ జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి ప్రకటించారు. షూటింగ్ నిమిత్తం కొచ్చీలో ఉన్న అల్లు అర్జున్ కూడా తుఫాన్ బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి 20 లక్షల రూపాయిల ఆర్థిక సాయం ప్రకటించారు. తుఫాన్ కారణంగా తానెంతో ఇష్టపడే విశాఖ నగరం రూపురేఖలు మారిపోవడం తననెంతో కలచివేసిందనీ, తాను ప్రకటించిన 20 లక్షల ఆర్ధిక సాయంలో ఎక్కువ శాతం మత్స్యకారుల కుటుంబాలకే చెందాలని బన్నీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభాస్ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. రామ్ కూడా సీఎమ్ రిలీఫ్ ఫండ్కు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అందరూ కలిసి కట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలని రామ్ పేర్కొన్నారు. ‘హృదయకాలేయం’ ఫేమ్ సంపూర్ణేశ్బాబు కూడా లక్ష రూపాయిలు బాధితుల సహాయార్థం అందించడం గమనార్హం. ఇంకా బియ్యం, కూరగాయలు కూడా తుఫాన్ బాధితులకు అందించనున్నట్లు చెప్పారు. తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కూడా మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతానికి 25 లక్షల రూపాయిలు ఇస్తున్నామని, ఇక ముందు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 3జి లవ్’ చిత్ర నిర్మాత ప్రతాప్ కొలగట్ల ఒక లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు. -
తక్షణసాయం ప్రకటించండి: వైఎస్ జగన్
విశాఖపట్నం: తుపాన్ బాధిత కుటుంబాలకు తక్షణసాయంగా రూ. 5వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధ్వంసమైన మత్సకారుల పడవలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు. విశాఖ జిల్లాలో హుదూద్ తుపాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. కాగిత, పూడిమడక, పాలదిబ్బ, దుత్తితూరు గ్రామాలను ఆయన సందర్శించారు. అచ్యుతాపురం, పరవాడ, స్టీల్ ప్లాంట్ మీదుగా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తుపాన్ బాధితులతో మాట్లాడారు. పంటనష్టపోయిన రైతులను వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా స్పందించారు!
-
ఉత్తరాంధ్రలో రైళ్ల పునరుద్ధరణ
-
'హుదూద్' విలయ తాండవం
-
ఉత్తరాంధ్రలో రైళ్ల పునరుద్ధరణ
తుఫాను కారణంగా రైల్వేలైన్లు దెబ్బతిన్న కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. యలమంచిలి వద్ద సింగిల్ ట్రాకు మరమ్మతులు చేయడంతో ఇది సాధ్యమైంది. సాయంత్రం 4 గంటలకు విశాఖ నుంచి సింహాద్రి ఎక్స్ప్రెస్ బయల్దేరుతుంది. అలాగే హౌరా- యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రాత్రి 11.45 గంటలకు బయల్దేరుతుంది. భువనేశ్వర్ - ముంబై ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. బెంగళూరు - డిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 4.30 గంటలకు మొదలవుతుంది. అయితే కొన్ని రైళ్లు మాత్రం రద్దయ్యాయి. సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ మంగళవారం కూడా రద్దయింది. షాలిమార్ - చెన్నై ఎక్స్ప్రెస్ రద్దయింది. సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి - విశాఖపట్నం స్పెషల్ రైలు రద్దయింది. విజయవాడ - విశాఖ రత్నాచల్ ఎక్స్ప్రెస్ను సామర్లకోట వరకే పరిమితం చేశారు. అలాగే విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ను సామర్లకోట నుంచే నడిపిస్తున్నారు. -
తక్షణ సాయంగా వెయ్యికోట్లు: మోదీ
-
తక్షణ సాయంగా వెయ్యికోట్లు: మోదీ
తుఫాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందని, ఈ ఆపద సమయంలో అన్ని విధాలా తాము ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విశాఖపట్నంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''తుఫాను గమనాన్ని గుర్తించేందుకు టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నారు. ఆరోతేదీ నుంచి ఈ సంకేతాలిచ్చారు. ముందుగా అనుకున్న స్థాయి, దిశ, సమయం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఒకరకంగా ఈ ఆపద నుంచి తప్పించుకోవడంలో టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కేంద్రం, రాష్ట్రం రెండూ సమన్వయంతో పనిచేసి, సరైన దిశలో పనిచేస్తే ఎంత పెద్ద ఆపద అయినా.. దాన్నుంచి బయటపడొచ్చు. ఆంధ్రా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిమిష నిమిషానికీ అద్భుతమైన సమన్వయంతో పనిచేశాయి. స్థానిక ప్రభుత్వాలు కూడా వాటిని అమలుచేశాయి. విశాఖ ప్రజలను అభినందిస్తున్నాను. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చెప్పినట్లే చేశారు. క్రమశిక్షణ కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడటంలో మేం విజయం సాధించగలిగాం. తుఫాను భీకరమైనది. దీన్ని మీరంతా స్వయంగా అనుభవించారు. మీరు చూపించిన ధైర్యానికి సెల్యూట్. నేను దారిలో ఇబ్బందులన్నీ గమనించాను. ఒడిషాలో కూడా చూశాను. ఈ ఆపద సమయంలో కేంద్రం మీ అందరికీ వెన్నంటి ఉంటుంది. కోస్ట్గార్డ్,నేవీ, రైల్వే, ఎయిర్లైన్స్, జాతీయ రహదారులు.. అన్నింటికీ ఎంత నష్టం వచ్చినా కేంద్రం నుంచి పూర్తి సాయం అందిస్తాం. పూర్తి సర్వే చేయిస్తున్నాం. వ్యవసాయ సర్వే, ఆస్తుల సర్వే కూడా చేయిస్తాం. ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటిల్లిందో చూస్తాం. ప్రైవేటు బీమా కంపెనీలతో మాట్లాడి, సానుభూతి దృష్టితో పరిహారం ఇప్పించాల్సిందిగా చెబుతాం. ఆంధ్రప్రదేశ్కు చాలా పెద్ద ఆపద వచ్చింది. విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా చేద్దామని ఇంతకుముందే అనుకున్నాం. అంతలోనే ఈ ఆపద వచ్చింది. అయినా.. వెనకడుగు వేసేది లేదు. విద్యుత్, మంచినీళ్లు, కమ్యూనికేషన్లను ముందుగా పునరుద్ధరిస్తాం. కొంచెం సర్వే ఇంకా చేయాల్సి ఉంది. అయినా.. ఈ ఘోర విపత్తు సమయంలో ముందుగా వెయ్యికోట్ల రూపాయల తక్షణ సాయం ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరింత సాయం చేస్తాం. మృతులు, క్షతగాత్రులకు కూడా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తాం'' అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. -
'విద్యుత్'ను పునరుద్ధరించడానికి మరో మూడు రోజులు
విశాఖపట్నం: పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖపట్నం ఎంపి హరిబాబు తెలిపారు. బుధవారం నుంచి తాగునీరు అందించడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన అన్నారు. తుఫాన్ బాధితులకు విజయవాడ నుంచి నిత్యవసర వస్తువులు, కూరగాయలు తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని హరిబాబు తెలిపారు. హదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం కారణంగా ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. తుఫాన్ బాదితులను పరామర్శించడానికి ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ప్రధాన కూడళ్లను మోడీ పరిశీలిస్తున్నారు. -
25కు చేరుకున్న తుఫాను మృతుల సంఖ్య
హుదూద్ తుఫాను ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 25కు చేరుకుంది. మంగళవారం ఉదయం వరకు 21 మంది మాత్రమే మరణించినట్లు అధికారవర్గాలు తెలియజేశాయి. అయితే, మరో నలుగురు కూడా వివిధ కారణాలతో మరణించినట్లు తాజాగా తెలిసింది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 25కు చేరుకుంది. కానీ, ఇప్పటికీ విశాఖపట్నంలోని పలు ప్రాంతాలకు ఎవరూ చేరుకోలేని పరిస్థితి ఉండటం, శిథిలాలను ఇప్పటికీ తొలగించలేకపోవడం తదితర కారణాలతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు అంటున్నాయి. కాగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తమకు కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇప్పించాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ప్లకార్డులతో స్థానికులు కోరారు. -
విశాఖలో కలియదిరుగుతున్న మోదీ
హుదూద్ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో విశాఖపట్నం చేరుకున్న మోదీ.. అక్కడ దెబ్బతిన్న విమానాశ్రయాన్ని పరిశీలించారు. అనంతరం తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్డు, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాలకు ఆయన చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వెంట ఆ పర్యటనలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు. ముందుగా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత.. కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ప్రధాని సమీక్ష జరుపుతారు. ఆ తర్వాత బయల్దేరి నేరుగా మళ్లీ ఢిల్లీ వెళ్తారు. -
ప్రధాని విశాఖ పర్యటనలో మార్పులు
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని ఇక్కడ ఏరియల్ సర్వే చేయబోవడంలేదని విశాఖ ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. ఢిల్లీలో బయల్దేరిన మోదీ.. మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖ వస్తారన్నారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన నేరుగా విశాఖ కలెక్టరేట్కు వస్తారని, కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం 3.25 గంటలకు మోదీ విశాఖ నుంచి బయల్దేరి నేరుగా ఢిల్లీ వెళ్లిపోతారు. వాస్తవానికి అంతకుముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం అయితే ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేసి, తర్వాత ఇక్కడినుంచి కర్ణాటక వెళ్తారని కూడా చెప్పారు. అయితే, ఢిల్లీలో అత్యవసరపనులు ఉండటం, రేపు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కూడా ఉండటంతో పర్యటనలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. -
వారణాసికి 120 కిలోమీటర్ల దూరంలో తుఫాను
ఆంధ్రప్రదేశ్, ఒడిషాలలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన హుదూద్.. ఇప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పై ఆవరించింది. విశాఖపట్నంలో తీరాన్ని తాకిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారిన హుదూద్.. అక్కడినుంచి పయనించి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ చేరుకుంది. దాంతో పాటు మధ్యప్రదేశ్ మీద కూడా ఆవరించి ఉంది. మధ్యప్రదేశ్కు ఈశాన్యంగా, ఉత్తరప్రదేశ్కు తూర్పు దిశలో ఈ తుఫాను కదులుతోంది. ప్రస్తుతం వారణాసికి నైరుతి దిశలో 120 కిలోమీటర్ల దూరంలో హుదూద్ ఉన్నట్లు జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. -
మూడు రోజుల్నుంచి చీకట్లే!
హుదూద్ తుఫాను దెబ్బకు విశాఖపట్నంలో మూడు రోజులుగా చీకట్లు కమ్ముకునే ఉన్నాయి. అక్కడ కరెంటు ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారు. సహాయ కార్యక్రమాలు చాలా మందకొడిగా సాగుతున్నాయి. శిథిలాలను, చెట్లను తొలగించడానికి 200 పొక్లెయిన్లు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెప్పినా, అవి ఎక్కడ పనిచేస్తున్నాయో అర్థం కావట్లేదు. దాంతో ప్రజలు తమంతట తామే శిథిలాలను తొలగించుకుంటున్నారు. కాలనీల్లో ప్రజలు బృందాలుగా ఏర్పడి చెట్లను తమకు తాముగా తొలగించుకుంటున్నారు. అలాగే కాలనీ రోడ్లను యువత తమంతట తామే క్లియర్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ సాయం అందకపోవడంతో ప్రజలు ఇక చేసేది లేక.. తామే ముందుకు వెళ్తున్నారు. ఆస్పత్రులకు కూడా కరెంటు సరఫరా లేకపోవడంతో రోగుల పరిస్థితి దారుణంగా ఉంది. కేవలం డీజిల్ జనరేటర్లపైనే ఆధారపడి అత్యవసర సేవలు అందిస్తున్నారు. -
మోదీ చెబితే గానీ... కదలని బాబు!
హుదూద్ తుఫాను తాకిడితో విలవిల్లాడుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు చూసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ చెబితేనే తప్ప.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి కదల్లేదా? ఢిల్లీ బీజేపీ వర్గాలు ఈమాటే చెబుతున్నాయి. హుదూద్ తుఫాను ఎప్పుడు తీరం దాటుతుందన్న విషయం ముందుగానే వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా చెప్పారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు తీరం దాటుతుందని, ఆ సమయంలో విలయం సృష్టించడం ఖాయమని సాక్షాత్తు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా వెల్లడించింది. ఆ తర్వాత అక్కడకు చేరుకోవడం దాదాపు అసాధ్యమని అందరూ అన్నారు. ముందు జాగ్రత్త ఉన్నవాళ్లయితే.. అక్కడ సహాయక చర్యలు చేపట్టాలనుకుంటే ముందుగానే అక్కడకు చేరుకుంటారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ సమయానికి హైదరాబాద్లోనే ఉన్నారు. ఇక్కడ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సులు, ఇతర మార్గాల ద్వారా అధికారులకు సూచనలు ఇస్తున్నారు. కానీ.. అక్కడ తుఫాను ప్రళయం సృష్టించిందని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. వెంటనే అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఫోన్ చేసి కనుక్కున్నారట. హైదరాబాద్ లో ఉన్నానని చంద్రబాబు చెప్పడంతోనే షాక్ తిన్న మోదీ.. తుఫాను ప్రభావం హైదరాబాద్పై ఉందా అని అడిగారట. లేదని చెప్పగానే.. అయితే మీరు వెంటనే ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడ కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పండి ..సహాయ కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించండి అని సూచించారట. మోదీ ఫోనులో చెబెతే కానీ ఉత్తరాంధ్ర పరిస్థితి తీవ్రం చంద్రబాబుకు అర్ధం కాలేదేమోనని బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. -
విశాఖకు రైళ్లు ఇప్పట్లో కష్టమే
తాడేపల్లిగూడెం : విశాఖపట్నం వైపు నాలుగైదు రోజుల వరకు రైళ్లు తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. హుదూద్ తుపాను ప్రభావంతో విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న నేపథ్యంలో రైళ్లను పునరుద్ధరించలేకపోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రదీప్కుమార్ శ్రీవాస్తవ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్లో స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్, విద్యుత్ పునరుద్ధరణ తదితర పనులు ఇంకా పూర్తికాని నేపథ్యంలో రద్దు చేసిన రైళ్లను ఇప్పట్లో పునరుద్ధరించడం కష్టమని పేర్కొన్నారు. ట్రాక్, స్టేషన్లు, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్థితిగతులపై విశ్లేషణ చేశామని, రైళ్లను పునరుద్ధరించడానికి సమయం పడుతుందని తెలిపారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ఆదివారం రాత్రి నుంచి గ్యాంగ్ వర్కర్లు, ఇంజినీర్ల పర్యవేక్షణలో ట్రాక్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో వీచిన బలమైన గాలులకు విశాఖ ప్రాంతంలో రైల్వే సమాచార వ్యవస్థ మొత్తం దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగారుు. స్టేషన్లలో నిర్మాణాలు సైతం కూలాయి. నర్సీపట్నం వద్ద ట్రాక్ దెబ్బతినగా, మిగిలిన ప్రాం తాల్లో ట్రాక్పై రాళ్లు, ఇతర సామగ్రి పడి ఉండటాన్ని గ్యాంగ్ వర్కర్స్, ఇంజినీర్లు గుర్తించారు. కమ్యూనికేషన్స్ విభాగానికి సంబంధించి ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థకు విద్యుత్ సరఫరా నిలిచిపోరుునట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైళ్ల పునరుద్ధరణకు అవకాశం లేకుండాపోరుుందని రైల్వే జీఎం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. మరమ్మతు పనులు పూర్తికావడానికి కనీసం నాలుగైదు రోజులు పట్టవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు ఇవే సోమవారం ఉదయం సింహాద్రి ఎక్స్ప్రెస్ సామర్లకోట వరకు వెళ్లి వెనక్కు వచ్చింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ రైలు రాజమండ్రి వరకే నడచింది. కాకినాడ టౌన్-షిర్డీ సాయినగర్, కాకినాడ టౌన్-లోకమాన్య తిలక్ టెర్మినస్, గౌతమి ఎక్స్ప్రెస్ యథావిధిగా నడుస్తున్నాయి. రత్నాచల్ ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్ సామర్లకోట వరకు, విజయవాడ-విశాఖ పాసింజర్ రాజమండ్రి వరకు మాత్రమే నడుస్తున్నాయని, కాకినాడ తిరుపతి పాసింజర్ రైతు యథావిధిగా నడుస్తోందని తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ మేనే జర్ కె.నాగభూషణం తెలిపారు. -
హుదూద్ దాటికి విశాఖ విలవిల
-
ఎరువుల కంపెనీల పైనా హుదూద్ ప్రభావం
-
శ్రీకాకుళంలో భయం భయం!
శ్రీకాకుళం/శ్రీకాకుళంన్యూకాలనీ: హుదూద్ తుపాను ప్రభావం, ఆ తర్వాత వరద హెచ్చరికతో శ్రీకాకుళం పట్టణ వాసులు క్షణం ఒక యుగంలా గడిపారు. కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆదివారం వేకువజాము నుంచి భీకర ఈదురుగాలులతోపాటు కురిసిన భారీ వర్షానికి ఆపసోపాలు పడ్డ ప్రజలు సోమవారం ఉదయానికి కాస్త తేరుకున్నట్టు కనిపించారు. తుపాను భయం వీడిందని కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలోనే రాకాసి కారుమబ్బులు కమ్మేశాయి. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. పట్టణంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా హడ్కోకాలనీ, బలగ, కృష్ణాపార్కు, ఇలిసిపురం, చిన్నబజారు రోడ్డు, గుజరాతిపేట, విశాఖ-ఏ, బీ కాలనీలు, రామ్నాగర్, ఆదిత్యనగర్, తదితర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మిర్తిబట్టి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండడుగుల నీరు ప్రవహిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో నడవడానికి కూడా వీలులేకుండాపోయింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాల వాసులు నీటిలో చిక్కుకుని రెండు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. అధికార యంత్రాం గం తీర ప్రాంతాల్లో ఉండడంతో వీరిని పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కసారిగా నాగావళినదికి వరద పోటెత్తింది. దీంతో నదికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఎప్పు డు ఏఉపద్రవం ముంచుకువస్తుందోనని చిగురుటాకులా వణికిపోతున్నారు. ఆది వారంపేట, బలగ, శాంతినగర్కాలనీ, రెల్లివీధి, పెద్దరెల్లివీధి, గుడివీధి, కంపోస్టుకాలనీ, లెప్రసీకాలనీ కలెక్టరేట్ పరిధిలోని పలుకాలనీలతోపాటు తమ్మినాయుడుపేట, పీఎన్కాలనీ, ఫాజుల్బాగ్పేట, పొందరవీధి, తోటవీధి తదితర కాలనీల వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు. పీఎన్కాలనీ, ఫాజుల్బాగ్పేటలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. వరదనీరు పోటెత్తింది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 12.30 గంటలకు నాగావళి ఉగ్రరూపం దాలుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశం ఉందని ప్రచారం చేశారు. నది సమీపంలోకి వెళ్లవద్దని హెచ్చరించడంతో ప్రజలు హడలిపోయారు. కాగా మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో నదిలో 1.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించినట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సీపన్నాయుడుపేట నుంచి డేఅండ్నైట్ కూడలి వరకు పోలీసు పహరా కాశారు. కాగా నాగావళి వరద ఉద్ధృతిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. -
జలదిగ్బంధంలో పలు గ్రామాలు
వంగర: ఆదివారం రాత్రి వరకు ఎటువంటి ప్రమాదం ఉండదని భావించిన ఆ గ్రామాలకు సోమవారం వేకువజామున ఐదు గంటలకు ఉలిక్కిపడ్డారు. సువర్ణముఖి, వేగావతి నదుల నీరు చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోలేదు. కళ్లు తెరిచి చూసేసరికి గ్రామాల చుట్టూ నీరు చేరిపోవడంతో ఆందోళన చెందారు. ఇదీ వంగర మండలంలోని కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి, పాతమరువాడ, ఇరువాడ గ్రామాల దుస్థితి.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తహశీల్దార్ కె.వరప్రసాద్ సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 150 మంది సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. కొప్పర గ్రామం నుంచి గర్భిణి కొనపల బంగారమ్మ, రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న గుగ్గిలాపు తమ్మమ్మలను బోట్లపై తీసుకువచ్చి ఆస్పత్రులకు తరలించారు. కొప్పర గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వచ్చేందుకు నిరాకరించడంతో కొండచాకరాపల్లి గ్రామస్తులను ఈ బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, తుపాను ప్రత్యేకాధికారి సౌరవ్గౌర్ కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాలను సందర్శించారు. మడ్డువలస ప్రాజెక్టు వద్ద గేట్లను సకాలంలో ఎత్తకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని సర్పంచ్ కిమిడి సన్యాసినాయుడు ఎస్పీ ఏఎస్ ఖాన్కు వివరించారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇన్నీసుపేట... ఇచ్ఛాపురం: ఇన్నీసుపేట గ్రామం జలదిగ్బంధంలో ఉండిపోయింది. హూదూద్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు బాహుదా నదిలో నీటి ప్రవాహం పెరిగి దండుగడ్డకు నీరు ఎక్కువగా రావడం, పద్మనాభపురం గెడ్డ పొంగడంతో గ్రామం చుట్టూ నీరు చేరింది. మోకాళ్ల లోతు నీటిలో గెడ్డను దాటుకుంటూ ప్రమాదకరంగా వెళుతున్నారు. ఇదిలా ఉండగా బాహుదా నది ప్రమాదకర స్థాయి లో ప్రవహిస్తోంది. ఒడిశాలోని బోగలోట్టి డ్యాం గేట్లను ఎత్తివేయడంతో ఒక్కసారిగా నీరు నదిలోకి చేరింది. సుమారు 51,270 క్యూసెక్కుల నీరు నదికి చేరింది. దీంతో నదీ పరివాహక గ్రామాలైన బొడ్డబడ, టి.బరంపురం, అరకబద్ర, శాసనం, జగన్నాథపురం తదితర గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దాంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన డ్యాం వద్దకు సోమవారం వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. టెక్కలి మండలంలో... టెక్కలి: హుదూద్ ప్రభావం వల్ల రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన జెండాపేట, సింగుమహంతిపేట, పెద్దరోకళ్లపల్లి, సీతారాంపల్లి, రామనగరం, నాయుడుపేట తదితర గ్రామాలు సోమవారం మధ్యాహ్నానానికి జలదిగ్భంద మయ్యాయి. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి ఒక్క సారిగా వరద నీరంతా గెడ్డల నుంచి రావడంతో ఈ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాత నౌపడ దాటిన తరువాత రైల్వే క్రాసింగ్ నుంచి జెండాపేట, సింగుమహంతిపేటతో పాటు పెద్దరోకళ్లపల్లి నుంచి సీతారాంపల్లి, రామనగరం, నాయుడుపేట గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలోకి చేరడంతో ఆయా గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వీరఘట్టం మండలంలో రెండు గ్రామాలు... వీరఘట్టం: స్థానిక ఒడ్డిగెడ్డకు వరదనీరు పొటెత్తడంతో దశుమంతపురం, కంబర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యల కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. స్త్రీశక్తి, బీసీ బాలికల వసతి గృహం చుట్టూ వరద నీరు చేరింది. పెనుగొటివాడను ముట్టడించిన నీరు కొత్తూరు: హుదూద్ తుపాను ప్రభావంతో ఒడిశా-ఆంధ్ర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా వంశధార నదికి సోమవారం వరద నీరు చేరింది. దీంతో మండలంలోని పెనుగొటివాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. మాతల వద్ద పీహెచ్ రోడ్డు మీదుగా వరద నీరు ప్రవహించడంతో కొత్తూరు నుంచి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. వరద నీరు కారణంగా మండలంలో కుంటిభద్ర, మాతల, పెనుగొటివాడ, ఆకులతంపర, మదనాపురం, వసప, సురుసువాడతో పాటు పలు గ్రామాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. అన్నవరం, అంపిలి, గోపాలపురం... పాలకొండ: నగర పంచాయతీ పరిధి గారమ్మకాలనీ, వడమ కాలనీల్లోకి వరదనీరు చేరింది. అంపిలి, అన్నవరం, గోపాలపురం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుపాను కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాలకొండ-సీతంపేట రహదారిలో వాబ గెడ్డ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వీరఘట్టం, పాలకొండ రహదారిలోనూ గజాలఖానా వద్ద నీరు పొంగిపొర్లడంతో 24 గంటలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు ఎల్ఎన్పేట: తుపాను కారణంగా కురిసిన భారీ వర్షానికి మోదుగువలస, బొర్రంపేట, వలసపాడు కాలనీ, చింతలబడవంజ కాలనీ, వాడవలస, మురగడలోవ తదితర గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొమనాపల్లిలోకి చేరిన వరదనీరు సారవకోట రూరల్(జలుమూరు): మండలంలోని కొమనాపల్లి గ్రామంలోకి సోమవారం వరద నీరు చేరింది. రంగసాగరంలోకి నీరు ఉద్ధృతంగా రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని తహశీల్దార్ ఉమామహేశ్వరరావు తెలిపారు. బీసీ కాలనీలోకి నీరు చేరడంతో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు చర్యలు తీసుకున్నారు. -
నీట మునిగిన రైల్వే ట్రాక్లు
విజయనగరం టౌన్:తుపాను ధాటికి విజయనగరం రైల్వేస్టేషన్ పరి సర ప్రాంతాలను ఛిన్నాభిన్నమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచి వీచిన ఈదురుగాలులతో పాటు భారీ వర్షానికి రైల్వే ట్రాక్లు పూర్తిగా నీటితో నిండిపోయా యి. స్టేషన్ ఆవరణలో ఉన్న గాజు గ్రిల్స్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు కోటి రూపాయల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ పైకప్పులు గాలులకు ధ్వంసమయ్యాయి.విద్యుత్ వ్య వస్థ నిలిచిపోవడంతో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గా ఢాంధకారం నెలకొంది. రిజర్వేషన్ కౌంటర్ బోర్డులు, స్టేషన్ పరిసరాల్లో విద్యుత్ స్తంభాలు, విలువైన సా మగ్రి పూర్తిగా పాడైంది. మూడు, నాలుగు నెంబర్ ఫ్లాట్ఫారాలపై ఉన్న పలు దుకాణా లు గాలికి కొట్టుకుపోయాయి. విజయనగరం మీదు గా వెళ్లి, వచ్చే పలు రైళ్లను రద్దు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. కాగా సోమవారం ఉద యం నుంచి స్టేషన్లో పారి శుద్ధ్య పనులు ప్రారంభిం చారు. ఎక్కడికక్కడ నిల్వ ఉన్న నీటిని తోడిస్తున్నారు. అలాగే స్టేషన్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి పరిస్థితి చక్కబడితే సమతా ఎక్స్ప్రెస్ను ట్రయిల్ రన్గా తీసుకువచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. హెల్ప్లైన్ ద్వారా సమాచారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేష న్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హె ల్ప్లైన్ సెంటర్ను రైల్వే ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు టికె ట్ క్యాన్సిలేషన్, తదితర వాటిపై అవగాహన కల్పిం చారు. రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎస్. రంగారావు, ఇన్చార్జీ డీవీఎన్ రా వు, కురియాకోస్, బీరేందర్, ఆర్పీఎఫ్ ఎస్ఐ రామకృష్ణ హెల్ప్లైన్ వద్ద ఉంటూ ప్ర యాణికులకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తున్నారు. నిలిచిన రైళ్లు వేపాడ: తుపాను తాకిడికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శనివారం రాత్రి నుంచి లక్కవరపుకోట రైల్వే స్టేషన్ వద్ద రెండు గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. తు పాను తాకిడికి విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే శాఖకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. -
ముప్పు వీడినా..తప్పని తిప్పలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తుపాను పెను ముప్పు కలిగించకుండానే నిష్ర్కమించిందని సంతోషపడాలో, కొన్నిచోట్ల జరిగిన నష్టాన్ని చూసి వాపోవాలో తెలియని సందిగ్ధం జిల్లావాసులకు ఎదురవుతోంది. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారుల ఉపాధికి ఆటంకంగా, వారి ఆవాసాలకు అపాయంగా పరిణమించిన హుదూద్.. అక్కడి అరటి, వరి పంటలనూ తీవ్రంగా దెబ్బ తీసింది. విశాఖ సరిహద్దున ఉన్న తుని నియోజకవర్గం రెండు రోజులుగా గాఢాంధకారంలో ఉంది. తుని, తొండంగి మండలాల్లో పలు గ్రామాల్లో చెట్లు పడిపోవడంతో ఎక్కడికక్కడ విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో గుక్కెడునీరు కూడా దొరకని దయనీయ పరిస్థితి ఆ నియోజకవర్గంలో నెలకొంది. తుని వాసులకు రోజుకు 25 లక్షల లీటర్లు మంచినీరు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 10 వేల లీటర్లు కూడా సరఫరా చేయలేక మున్సిపాలిటీ చేతులెత్తేసింది. సుమారు 11 వేల కుటుంబాలు గుక్కెడునీటి కోసం ఇబ్బందిపడుతున్నాయి. పట్టణంతో పాటు తుని రూరల్, తొండంగి, కోటనందూరు మండలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గంటకు అపార్టుమెంట్కు రూ.2000, చిన్న భవనాలకు రూ.500 వంతున నివాసితులే ఖర్చు పెట్టుకుని జనరేటర్లను మోటార్లకు బిగించుకుని మంచి నీరు తోడించుకుంటున్నారు. ఈ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలో కూడా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను సోమవారం నాటికి కూడా పునరుద్ధరించలేదు. జగ్గంపేట మండలం మల్లిశాల ఎలక్ట్రికల్ ఫీడర్ పరిధిలోని జె.కొత్తూరు, రాజపూడి, వెంగాయమ్మపురం, సీతారామపురం, మన్యంవారిపాలెం తదితర గ్రామాలు కటిక చీకట్లో ఉన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాను సోమవారం మధ్యాహ్నానికి పునరుద్ధరించగలిగారు. దిగాలు పడ్డ అరటి, వరి రైతులు ఈదురుగాలులకు ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో అరటి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. ఏలేశ్వరం మండలం లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం, తొండంగి మండలం శృంగవృక్షం, కొత్తపల్లి, తుని రూరల్ మండలం తేటగుంట, కోటనందూరు మండలం కె.ఇ.చిన్నయ్యపాలెం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, రంగంపేట మండలాల్లో అరటితోటలు ధ్వంసమయ్యాయి. గెలలు కోతకు వచ్చే దశలో ఉన్న తోటలు కాస్తా ఆదివారం మధ్యాహ్నం వీచిన ఈదురుగాలులకు నిట్టనిలువునా విరిగిపోవడంతో రైతులు కుదేలయ్యారు. శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో వరి చేలు నేలకొరిగాయి. పంట పొట్ట దశకు కూడా చేరని వేళ బలమైన ఈదురుగాలులతో వరిచేలు పడిపోవడంతో దిగుబడి బాగా పడిపోయే ముప్పుంది. తూర్పు, మధ్య డెల్టాలలో సైతం వరి చేలు ఈదురుగాలులకు పడిపోయాయి. అసలే రుణమాఫీ గందరగోళంతో కొత్త రుణాలందక, అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులు చేసిన రైతులను..ఇప్పుడు కలిగిన నష్టం కలవరపరుస్తోంది. మత్స్యకారుల ఉపాధి ఊసెత్తని అధికారులు తీరప్రాంత మండలాల్లో రవాణా వ్యవస్థను సోమవారం నాటికి కూడా పునరుద్ధరించ లేదు. ఛిద్రమైన ఉప్పాడ బీచ్ రోడ్డును మొత్తం కొత్తగా నిర్మించాల్సిందే. ఇందుకు ఎంత తక్కువగా లెక్కేసినా రూ.10 కోట్లు అవుతుందని, యుద్ధప్రాతిపదికన పని చేసినా కనీసం పది రోజులు పడుతుందని అంచనా. ఈ రోడ్డు ధ్వంసంతో కాకినాడ-తుని మధ్య వాహనాల రాకపోకల్ని పిఠాపురం నుంచి మళ్లించారు. ఫలితంగా 20 కిలోమీటర్ల దూరం పెరుగుతోంది. సముద్రంలోకి వెళ్లవద్దన్న హెచ్చరికలతో గత నాలుగు రోజులుగా తుని, తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాట్రేనికోన, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో దాదాపు వంద గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేట మానుకున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించడం మినహా తక్షణ సాయం అందించలేదని వారు ఆవేదన చెందుతున్నారు. మంగళవారం కూడా వేటకు వెళ్లొద్దంటున్న అధికారులు తమ ఉపాధి ఊసెత్తడం లేదని వాపోతున్నారు. -
దీపావళి తర్వాతే టీఆర్ఎస్ ప్లీనరీ..?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ మళ్లీ వాయిదాపడే అవకాశాలున్నట్టు తెలిసింది. ప్లీనరీని ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినా హుదూద్ తుపాను కారణంగా 18, 19 తేదీలకు వాయిదా వేశారు. కానీ అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలు ఉండటం, దీపావళి వంటి కారణాలతో మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నట్టు పార్టీ ముఖ్యులు వెల్లడించారు. దీపావళి తర్వాత జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే మధ్యలో 2 రోజుల పాటు పార్టీ ప్లీనరీని నిర్వహించాలనే యోచనలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఉన్నట్టు ఆ నాయకులు తెలిపారు. -
నాలుగు జిల్లాలో హదూద్ ప్రభావం
-
నాలుగు జిల్లాలో హదూద్ ప్రభావం
విశాఖ: హుదూద్ తుఫాన్ ప్రభావం నాలుగు జిల్లాల్లో తీవ్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. శ్రీకాకుళంలో జిల్లా 11 మండలాల్లో 117 గ్రామాలు, విశాఖ జిల్లాలో 11 మండలాల్లో 103 గ్రామాలు, తూర్పు గోదావరి జిల్లా 20 మండలాల్లో 78 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం ఉందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో 2 మండల్లాల్లో 22 గ్రామాల్లో కూడా తుఫాన్ ఎక్కువ మోతాదులో ఉందని తెలిపారు. హుదూద్ తుఫాన్ కారణంగా 6695 ఇళ్లు ధ్వంసం కాగా, 109 చోట్ల రైల్వే ట్రాక్, రోడ్లు దెబ్బతిన్నాయని, 5727 కరెంటు స్తంభాలు, 19 చోట్ల కాల్వలకు గండ్లు, 181 బోట్లు గల్లంతైన గణాంకాలు వెల్లడించారు. -
బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు: పరకాల
విశాఖ: తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్ఓ లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. విశాఖలో ఈ రోజు రాత్రికి కొంత మేరకు విద్యుత్ ను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. తుఫాను నష్టంపై అంచనాకు ఇంకా రాలేదని ఆయన ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. తుఫాన్ లో మొత్తం 21 మంది చనిపోయారని, మృతుల్లో చాలా మంది వృక్షాలు విరిగి మీదపడటంతోనే మరణించారని ఆయన తెలిపారు. హుదూద్ తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారని, అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారని పరకాల ప్రభాకర్ వెల్లడించారు. -
టీడీపీ ఎంపీల 2 నెలల జీతం విరాళం
హైదరాబాద్:తుపాను బాధితులకు టీడీపీ ఎంపీలు తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి సోమవారం స్పష్టం చేశారు. తుపాను బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తుపాను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సుజనా చౌదరి పేర్కొన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఒక్కో ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలను సేకరిస్తున్నట్లు తెలిపారు. హుదూద్ తుపాను ప్రభావంతో మూడు జిల్లాలో భారీ ఆస్తినష్టంతో పాటు, పంట నష్టం కూడా ఏర్పడింది. దీనిపై సహాయకచర్యలు ప్రభుత్వం సిద్ధమైనా.. బాధితులు మాత్రం ప్రభుత్వం నుంచి తగిన సహకారాలు లభించడంలేదని ఆవేదన చెందుతున్నారు. -
విద్యుత్ శాఖకు రూ.500 కోట్ల నష్టం
విశాఖ: తుపాను వల్ల విద్యుత్ శాఖకు రూ. 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ స్పష్టం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లిందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. హుదూద్ పెను తుపాను కారణంగా విజయనగరం జాతీయరహదారిపై 30 కి.మీ మేర కూలిన భారీ వృక్షాలు కూలి రూ.10 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. తీవ్ర గాలుల ప్రభావంతో సముద్రంలోకి 120 బోట్లు కొట్టుకుపోయాయని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రా యూనివర్శిటిలో భవనాలు కూలిపోవడంతో ఆ నష్టం రూ.50 కోట్ల వరకూ ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న మూడు జిల్లాలకు 30 మంది ఐఏఎస్ అధికారులను తరలించినట్లు ప్రభుత్వం పేర్కొంది. -
విద్యుత్ వ్యవస్థకు అపార నష్టం: అజయ్ జైన్
హైదరాబాద్: హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు అపార నష్టం వాటిల్లిందని ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. తుఫాన్ కారణంగా దాదాపు 400 ట్రాన్స్ ఫార్మార్లు దెబ్బతిన్నాయని అజయ్ జైన్ తెలిపారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఇతర జిల్లాల నుంచి 2 వలే మంది సిబ్బందిని తరలిస్తున్నామన్నారు. సోమవారం రాత్రికి కొన్ని ప్రాంతాలకైనా విద్యుత్ సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అజయ్ జైన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
'ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. సహకారం అందించాలి'
విశాఖ: హుదూద్ పెను తుపాను ప్రభావంతో అపార నష్టం బారిన పడ్డ ప్రజలకు తగిన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. ఈ సమయంలో అందరూ సహకారం అందించాలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోని నీళ్లను జనరేటర్లు పెట్టి తొలగిస్తున్నామన్నారు. ఈ సాయంత్రానికి తుపాను బాధితులకు 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన, కిలో చక్కెర చొప్పున అందజేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఆస్పత్రులకు సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.తుపానులో మృత్యువాత పడిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామన్నారు. తీవ్రగాయాలైన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50వేలు అందిస్తామన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకులను బాధితులకు అందజేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మత్యకారులకు రూ.5 వేలు, బోటు ధ్వంసమైతే రూ.10 వేలు, మోటారు బోటుకు రూ.15 వేలు, ఆటోకు రూ.5 వేలు, ఇల్లు ధ్వంసమైతే రూ.5 వేలు పరిహారం అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారు రూ.15 వేలు సాయం చేస్తామన్నారు. -
తుఫాన్ బాధితులను ఆదుకుంటాం: టీపీసీసీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని తెలంగాణ పీసీసీ(టీపీసీసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం గాంధీభవన్ లో ఏర్పాటైన సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాలకు బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను పంపించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది అని అన్నారు. హదూద్ తుఫాన్ ను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు, రవాణా వ్యవస్థను వెంటనే పునరుద్దరించాలని ఏపీ ప్రభుత్వానికి పొన్నాల సూచించారు. -
సహాయక చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి: బొత్స
హైదరాబాద్: ప్రచారానికి కాకుండా హుదూద్ తుఫాన్ బాధితులకు తగిన సహాయ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ పీసీసీ చీఫ్ బొత్స తెలిపారు. తుఫాన్ తీవ్రతను ముందుగానే ఉహించి.. అధికారులును విశాఖకు తరలించి ఉంటే సహాయక చర్యలు వేగంగా జరిగేవని బొత్స అభిప్రాయపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇక నెల జీతాన్ని, మాజీలు ఒక నెల పెన్షన్ ను బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్టు బొత్స తెలిపారు. -
పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు
విశాఖ : హుదూద్ తుఫాను ప్రభావంతో సోమవారం కూడా పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. కాగా పలు రైళ్లను దారి మళ్లించారు. వాటి వివరాలు * ముంబై-భువనేశ్వర్, తిరుపతి-పూరి ఎక్స్ప్రెస్ రద్దు *రాత్రి 11 గంటలకు బయల్దేరాల్సిన నిజాముద్దీన్ -విశాఖ ఎక్స్ప్రెస్ రద్దు *విజయవాడ-విశాఖ పాసింజర్ రాజమండ్రి వరకే *ఉదయం 10 గంటలకు బయల్దేరాల్సిన హైదరాబాద్-హౌరా-ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ నాగ్పూర్ మీదగా మళ్లింపు * నాగర్ సోయల్-షాలిమర్ గురుదేవ్ ఎక్స్ప్రెస్ నాగ్పూర్ మీదగా మళ్లింపు *ముంబై-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ కాజీపేట్-బలార్షా మీదగా మళ్లింపు *పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు *ముంబై-విశాఖ ఎక్స్ప్రెస్ విజయవాడ వరకే *కాజీపూట-విశాఖ లింక్ ఎక్స్ప్రెస్ విజయవాడ వరకే *నిజాముద్దీన్-విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ విజయవాడ వరకు కుదించిన రైళ్ల సర్వీసుల వివరాలు: *సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరాల్సిన ముంబై-విశాఖ ఎక్స్ప్రెస్ తుని వరకు *మధ్యాహ్నం 2.30 గంటలకు కాజీపేటలో బయల్దేరే కాజీపేట్-విశాఖ లింక్ ఎక్స్ప్రెస్ తుని వరకు *సాయంత్రం 6.15 గంటలకు విశాఖలో బయల్దేరాల్సిన జన్మభూమి ఎక్స్ప్రెస్ తెనాలి నుంచి ప్రారంభం *మధ్యాహ్నం 12.40 గంటలకు బయల్దేరాల్సిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ సామర్లకోట నుంచి ప్రారంభం *విజయవాడ నుంచి వెళ్లే రత్నాచల్ సామర్లకోట వరకే *గుంటూరు నుంచి వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్ సామర్లకోట వరకే *నర్సాపూర్-విశాఖ లింక్ ఎక్స్ప్రెస్ సామర్లకోట వరకు -
మండలానికో ఐఏఎస్ అధికారి!
హుదూద్ తుఫాను పునరావాస చర్యలను పరిశీలించేందుకు మండలానికో ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వీరిని పంపుతున్నామన్నారు. హుదూద్ తుఫాను బాధితులు మొత్తం 2.48 లక్షల మంది ఉన్నారని, మొత్తం 223 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని, 1.35 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. నాలుగు జిల్లాల పరిధిలోని 44 మండలాలు, 330 గ్రామాల్లో తుఫాను ప్రభావం ఉందన్నాయి. -
రేపు విశాఖకు ప్రధాని మోదీ
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలలంగా మారిన విశాఖపట్నం నగరానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రానున్నారు. ఇక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి.. బాధితులను పరామర్శించేందుకు ఆయన వస్తున్నారు. హుదూద్ తుఫానుపై తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని, ఇప్పటికే తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నానని ఆయన తెలిపారు. కనీవినీ ఎరుగని రీతిలో నష్టాన్ని మిగిల్చిన హుదూద్ తుఫాను అనంతరం సహాయక చర్యలకు 2వేల కోట్ల రూపాయల సాయం చేయాలని కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. తుఫాను కారణంగా తన వారణాసి పర్యటనను కూడా రద్దు చేసుకున్న ప్రధాని.. నేరుగా ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్తారు. -
విశాఖకు పొంచి ఉన్న మరో ముప్పు!
హుదూద్ తుఫాను విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసింది. సెల్ టవర్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. ఇళ్లు కుప్పకూలాయి, అపార్టుమెంట్లు బీటలు వారాయి. హోర్డింగులు పడిపోయాయి. పెద్దపెద్ద చెట్లు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. కమ్యూనికేషన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. విశాఖ నగరానికి మరో అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. లెక్కలేనన్ని మూగజీవాలు ఈ తుఫాను కారణంగా మరణించాయి. అయితే వాటి కళేబరాలను తొలగించడం అధికారులకు ఇప్పటికిప్పుడు సాధ్యం కావట్లేదు. అసలు రోడ్ల మీద వాహనాలు వెళ్లే పరిస్థితి ఎక్కడా లేదు. 200 పొక్లెయిన్లను ఉపయోగించి రోడ్లు క్లియర్ చేస్తామని చెబుతున్నా, ఇంకా పనులు పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. దాంతో రోడ్లమీద పడి ఉన్న పశు కళేబరాల కారణంగా అంటువ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా, ఎవరికీ తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకట్లేదు. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో వరదనీటినే తాగుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, దీంతో ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పునరావాస కేంద్రాలతో పాటు, మామూలు ఇళ్లలో కూడా ఎక్కడా మంచినీళ్లు దొరకట్లేదు. ఈ పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో కూడా ఎవరూ చెప్పలేకపోవడం విషాదం. -
చంద్రబాబుకు రాజ్నాథ్ సింగ్ ఫోన్
విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ఫోన్ చేశారు. హుదూద్ తుఫాను ప్రభావంపై ఆయన ఈ సందర్భంగా బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు తుఫాను నష్టం వివరాలతో, రాష్ట్రంలోని పరిస్థితిని రాజ్నాథ్కు వివరించారు. పరిస్థితి అంచనాకు రాజ్నాథ్ సింగ్ను ఆంధ్రప్రదేశ్ రావాలని చంద్రబాబు కోరారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. తుఫాను ప్రభావ పరిస్థితిని వివరించారు. -
సోషల్ మీడియాను వాడుకుంటున్నాం
రాజమండ్రి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం హుదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు బయల్దేరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అంతకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి ఆహారపు పొట్లాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా అందచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఒకవేళ నేరుగా అందచేయటానికి వీలుకాకుంటే హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. సహాయక చర్యల కోసం సోషల్ మీడియాను వాడుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొట్టమొదటిసారిగా ప్రకృతి వైపరీత్యాలపై ప్రభుత్వం ఫేస్బుక్లో ఓ పేజీ క్రియేట్ చేస్తే గూగుల్, ఫేస్బుక్లు ప్రమోట్ చేశాయన్నారు. పునరావాస కార్యాక్రమాల బాధ్యతను ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్కు అప్పగించినట్లు తెలిపారు. విద్యుత్ పునరుద్దరణపై పియూష్ గోయల్తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. నష్టాన్ని ఏ,బీ,సీ కేటగిరిల కింద విభజిస్తామన్నారు. ఒడిశా, తెలంగాణ పవర్ గ్రిడ్ల నుంచి విద్యుత్ను వాడుకుంటామన్నారు. -
హుదూద్ తుఫానుకు ఐదుగురు మృతి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను ప్రభావంతో అయిదుగురు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2.48లక్షల మంది తుఫాను బాధితులుగా వెల్లడించింది. 223 సహాయక శిబిరాల్లోని 1.35లక్షల మందిని పునరావస కేంద్రాలకు తరలించినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 44 మండలాల్లో 320 గ్రామాలు తుఫాన్ ప్రభావానికి గురయినట్లు తెలిపింది. తుఫాను ప్రభావంతో అయిదుగురు చనిపోగా, 34 పశువులు మృత్యువాత పడ్డాయని, అలాగే 70 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది. కాగా సహాయక చర్యలకు గానూ 691మంది గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే 6 హెలికాప్టర్లతో నిరంతర పర్యవేక్షణ చేయడంతోపాటు 155 వైద్య బృందాలు, 56 పడవలు, 19 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. -
విశాఖలో కమ్యూనికేషన్ వ్యవస్ధ చిన్నాభిన్నం
-
కుప్పకూలిన ఇళ్లు,కొట్టుకుపోయిన రోడ్లు
-
పరిస్థితి మెరుగుపడేవరకూ విశాఖలోనే మకాం
రాజమండ్రి : విశాఖ జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గత రాత్రి విశాఖ బయలుదేరిన ఆయన రోడ్డుమార్గం దెబ్బతినడంతో రాజమండ్రిలో బస చేశారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, కూలిన చెట్ల తొలగింపు, రహదారుల మరమ్మతుకు నేటి నుంచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు ప్రకటించారు. విద్యుత్, కమ్యూనికేషన్లు, రోడ్లు పునరుద్ధరించడంతోపాటు.. బాధితులకు ఆహారపదార్ధాలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ..తక్షణ సాయం క్రింద 2వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. కాగా హుదూద్ ప్రభావంతో భారీ వర్షాలకు రాష్ట్రంలో అయిదుగురు మృతి చెందారు. -
ఉత్తరాంధ్ర కకావికలం
-
విలయం...విధ్వంసం
-
మరో మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: హుదూద్ తుపాను ప్రభావం మరో 3 రోజులు తీవ్రంగా ఉండనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతోపాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలపై అధికంగా ఉంటుందని భారత వాతావరణశాఖ డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ ఆదివారం తెలిపారు. విశాఖపట్నం వద్ద తుపాను తీరం దాటినందున తీవ్రత మరింత ఎక్కువ ఉంటుందన్నారు. గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చన్నారు. తుపాను తీరం దాటాక మొదటి ఆరు గంటల్లో గాలుల తీవ్రత 50 శాతం తగ్గుతుందని, తర్వాతి ఆరు గంటల్లో మరో 50 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణ జిల్లాలతోపాటు ఉత్తర భారతదేశంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. -
విశాఖ, రాజమండ్రికి విమానాలు రద్దు
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాన్ కారణంగా హైదరాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం, రాజమండ్రికి మధ్య రాకపోకలు సాగించే విమాన సర్వీసులన్నీ దాదాపు రద్దయ్యాయి. విశాఖపట్నం నుంచి ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సి ఇండిగో విమానం, 10.10కి చేరుకోవాల్సిన స్సైస్జెట్ విమానంతోపాటు మధ్యాహ్నం 12, 1.45 గంటలకు రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి నుంచి రావాల్సిన విమానంతోపాటు 6.35 గంటలకు విశాఖపట్నం నుంచి రావల్సిన రెండు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే 4 విమానాలతోపాటు రాజమండ్రి వెళ్లాల్సిన 3 విమానాలనూ రద్దు చేసినట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
ఏపీకి అన్నివిధాలా సహకరిస్తాం
* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాన్తో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవడానికి పూర్తి సహాయం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్కు సమాచారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటన నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చే ముందు కేసీఆర్ సీఎస్తో మాట్లాడారు. ఈ మేరకు సీఎస్ రాజీవ్శర్మ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో మాట్లాడి కేసీఆర్ హామీని వివరించారు. కాగా.. ఢిల్లీ నుంచి ఆదివారం రాత్రి తిరిగి రాగానే హుదూద్ తుపాను పరిస్థితిపై ఉత్తర తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో ఆదివారం రాత్రి కేసీఆర్ సమీక్షించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలపైన తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. తుపాను ప్రభావం ఉన్నన్ని రోజులు జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో మెలగాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్కు ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. -
విలయం.. విధ్వంసం
* హుదూద్ బీభత్సం * ఉత్తరాంధ్ర కకావికలం * విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద * ఆదివారం మధ్యాహ్నం తీరం దాటిన పెను తుపాను * 195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల బీభత్సం.. విశాఖ నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం * వేల సంఖ్యలో నేలకూలిన వృక్షాలు, స్తంభాలు... కుప్పకూలిన ఇళ్లు... కొట్టుకుపోయిన రోడ్లు * విశాఖ విమానాశ్రయం ధ్వంసం.. దెబ్బతిన్న ఫిషింగ్ హార్బర్... స్తంభించిన రాడార్ వ్యవస్థ * సహాయ చర్యల్లో ప్రభుత్వ అధికార వ్యవస్థ విఫలం * ఉత్తరాంధ్రలో ముగ్గురు, ఒడిశాలో మరో ముగ్గురు దుర్మరణం... వేలాది మంది నిరాశ్రయులు హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తోంది. తుపాను కేంద్రానికి అతి సమీపంలోనే ఉన్న విశాఖ నగరాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన హుదూద్ పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో ఈ సముద్ర తీర నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రికి గాలుల వేగం 120 కిలోమీటర్లకు తగ్గినప్పటికీ.. కుంభవృష్టి తోడవటంతో విశాఖ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. విద్యుత్ సరఫరా లేక అంధకారంలో, సమాచార వ్యవస్థ లేక.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియని, తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆదివారం రాత్రి వారికి కాళరాత్రిగానే మారింది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తంగా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. తుపాను విధ్వంసంలో ఉత్తరాంధ్రలో ముగ్గురు మృతిచెందారని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా వందలాదిమంది క్షతగాత్రులయ్యారు. ప్రాణనష్టం తక్కువగా ఉన్నప్పటికీ ఆస్తినష్టం అంచనాలకు అందని రీతిలో ఉంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు, టెలికమ్యూనికేషన్ టవర్లు నేలకొరిగాయి. భారీ సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీరమంతటా రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ లక్షలాది ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నష్టం ఎంత ఉంటుందన్నది ప్రభుత్వ యంత్రాంగానికే అంతుచిక్కడం లేదు. అసలు.. తుపానును ఎదుర్కొనేందుకు, నష్ట నివారణకు మూడు రోజులుగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కీలక సమయంలో చేతులెత్తేసింది. తుపాను విలయంలో చిక్కుకున్న లక్షలాది మంది సహాయం కోసం హాహాకారాలు చేస్తున్నా సర్కారు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. సాక్షి, విశాఖపట్నం: భయపడినంతా అయ్యింది. మూడు రోజులుగా తీవ్ర పెను తుపానుగా రూపుదాల్చి ఉగ్రంగా ఉరుముతున్న ‘హుదూద్’.. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలపై విరుచుకుపడింది. శనివారం రాత్రికి విశాఖపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్న హుదూద్ స్థిరంగా పయనిస్తూ ఆదివారం ఉదయం తీరానికి సమీపంలోకి చేరుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచే తుపాను విధ్వసం పెరుగుతూ వస్తోంది. ఉదయం 11 గంటల 25 నిమిషాలకు విశాఖపట్నం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో పశ్చిమవాయవ్య దిశలో (పూడిమడక వద్ద) తీరాన్ని తాకింది. 11 గంటల 40 నిమిషాలకు తుపాను కేంద్రం (కన్ను) తీరాన్ని దాటింది. తీరాన్ని తాకే ముందు కొద్దిసేపు ప్రశాంతత కనబరిచిన తుపాను.. తీరానికి వస్తూనే మహోగ్రంగా పంజా విసిరింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విశాఖ నగరంలో కనివినీ ఎరుగని తుపాను విధ్వంసం సృష్టించింది. శనివారం రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో నగరమంతా అంధకారంలో మునిగిపోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మొదలైన విధ్వంసం ఆదివారం ఉదయానికి పతాకస్థాయికి చేరుకుంది. తుపాను గాలులకు ఇళ్ల తలుపులు, కిటికీలు కొట్టుకుని విరిగిపోతుంటే లక్షలాదిమంది రాత్రంగా కంటి మీద కునుకులేకుండా బితుకుబితుకుమని గడిపారు. తెల్లవారుజాము నుంచి 150 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న పెనుగాలులు సృష్టించిన విధ్వంసం మాటలకు అందనిది. తుపాను విశాఖపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉండగా పెనుగాలులు ఏకంగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాయి. రాత్రి నుంచీ ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు, సెల్ఫోన్ టవర్లు కూలిపోతుండటంతో సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ లేకపోవటంతో టీవీలు పనిచేయక.. సమాచార వ్యవస్థ స్తంభించిపోవటంతో ఫోన్లన్నీ మూగపోయి.. తుపానుకు సంబంధించిన సమాచారం తెలియక జనం తల్లడిల్లిపోయారు. ఇళ్ల చుట్టూ వృక్షాలు, స్తంభాలు కూలిపోతుండటం.. రేకులు, పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోతుండటంతో బయటకు అడుగు పెట్టే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య తుపాను తీరాన్ని దాటే సమయంలో పెను గాలుల వేగం 180 కిలోమీటర్ల నుంచి 195 కిలోమీటర్లను కూడా దాటిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ గాలుల తీవ్రతకు.. వందేళ్లుగా ఉన్న భారీ వృక్షాలతో సహా వేలాది చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకొరిగిపోయాయి. వేలాది విద్యుత్తు స్తంభాలు, టెలిఫోన్ టవర్లు కూలిపోయాయి. తుపాను కారణంగా సముద్రం ఉప్పొంగి అలలు నాలుగు మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి. నిత్యం సందర్శకులతో కళకళలాడే విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. విశాఖ విమానాశ్రయం దాదాపుగా ధ్వంసమైంది. తీరంలోని ఫిషింగ్ హార్బర్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. పురాతనమైన విశాఖపట్నం కలెక్టరేట్ భవనం కూడా ధ్వంసమైంది. ఇక్కడ నుంచి సహాయక చర్యలు కూడా ఆగిపోయాయి. వర్షం ఆగితేగానీ సహాయక చర్యలు చేపట్టడం వీలుకాదని విశాఖపట్నం జిల్లా అధికారులు పేర్కొన్నారు. నగరంలోని దుకాణ సముదాయాలు భారీగా దెబ్బతిన్నాయి. తుపాను తీరం తాకే సమయంలో భారీ వర్షాలు లేనప్పటికీ.. ఆ తర్వాత వర్షాలు పుంజుకున్నాయి. గాలుల వేగం క్రమంగా 120 కిలోమీటర్లకు తగ్గగా.. వాటికి కుండపోత వర్షాలు తోడయ్యాయి. దీంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా విధ్వంసం కొనసాగుతోంది. ఒకవైపు గాఢాంధకారం.. మరోవైపు పెను గాలులు.. వాటికి తోడు ఎడతెరిపిలేని అతి భారీ వర్షాలు.. ఈ పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడతామా లేదా అన్న భయాందోళనలు విశాఖ ప్రజల్లో అలముకున్నాయి. ఉత్తరాంధ్ర అంతటా విధ్వంసం... ఒక్క విశాఖ నగరంలోనే కాదు.. తుపాను ప్రభావ ప్రాంతమైన ఉత్తరాంధ్ర అంతటా ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారీ ఘీంకారంతో పెనుగాలులు వీస్తుంటే ప్రజానీకం నిలువునా వణికిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని రోడ్లు, సమాచార, విద్యుత్తు, రవాణా వ్యవస్థలు మొత్తం ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో 44 మండలాలు హుదూద్ విలయంలో చిక్కుకున్నాయి. 320 గ్రామాల్లోని మూడు లక్షల మందికిపైగా ప్రజలు దిక్కులేని దీనస్థితిలో పడిపోయారు. 1,35,262 మందిని 223 పునరావాస శిబిరాల్లోకి తరలించారు. మిగిలిన దాదాపు 1,40 లక్షల మందిని పట్టించుకునే నాథుడు లేక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. వందకు పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడ ఏం జరుగుతోందో, ఎవరికి ఏ ఆపద వచ్చిందో తెలియక అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. 12.40 సెం.మీ. నుంచి 24.50 సెం.మీ. వరకు భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ‘నష్టం అంచనాలకు అందనిది. ఊహించిన దానికంటే ఆస్తి, పంట నష్టం చాలా అధికంగా ఉంటుంది’ అని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. రెండు జిల్లాల్లో ముగ్గురు మృతి హుదూద్ ధాటికి చెట్లు, స్తంభాలు మీదపడి ఉత్తరాంధ్రలో ముగ్గురు దుర్మరణం చెందారు. విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండ్రాం గ్రామానికి చెందిన జి.పంచవతి (50), పద్మనాభం మండలం బి.ఆర్.పాలవలసకు చెందిన ఎం.యర్రయ్య (58) చెట్లు పైన పడటంతో దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన గంటా యోగానందం (45) కూడా భారీ వర్షాల దాటితో విద్యుత్తు స్తంభం కిందపడి ప్రాణాలు విడిచారు. వేలాది ఇళ్లు నేలమట్టం ఉత్తరాంధ్రలో వేలసంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనేకచోట్ల పాత భవనాలు కూలిపోయాయి. విశాఖ నగరంలో రెండు భవనాలు నేలలోకి కుంగిపోయాయి. వందకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లెక్కకుమిక్కిలి ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. ఉత్తరాంధ్ర సముద్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే మరబోట్లు వందకు పైగా ధ్వంసమయ్యాయి. ఒక్కో బోటు ధర సగటున రూ. 25 లక్షలు ఉంటుంది. మరో 300 బోట్లు వరకు స్వల్పంగా దెబ్బతిన్నాయి. చేపల షెడ్లు, బోట్లు, వలలు కొట్టుకుపోయాయి. లక్షల ఎకరాల్లో పంట ధ్వంసం ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. పెనుగాలులు, భారీవర్షాలతో వరి, జీడి, అరటి, కూరగాయలు తదితర పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. పంటలకు ఎంత నష్టం వాటిల్లిందన్నది వారం రోజుల తరువాత లెక్కతేల్చగలమని అధికారులు చెబుతున్నారు. పశు సంపదకు సైతం అపారనష్టం కలిగింది. ఎన్ని పశువులు మృత్యువాత పడ్డాయన్నది రెండు రోజులు గడిస్తేగానీ చెప్పలేని స్థితి నెలకొంది. విశాఖకు మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు న్యూఢిల్లీ: హుదూద్ తుపాను విశాఖ వద్ద తీరం దాటడంతో.. అక్కడి తమ దళాలను ఎన్డీఆర్ఎఫ్ రెట్టింపు చేసింది. మెుత్తం 13 బృందాలు విశాఖపట్నంలో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొననున్నారుు. వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం విశాఖ విమానాశ్రయం, ఫిషింగ్ హార్బర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. తుపాను హెచ్చరికల కేంద్రంలోకే నీళ్లు వచ్చేశాయి. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. వందల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైపోయాయి. భారీ వృక్షాలు, హోర్డింగులు కూలిపోవడంతో అనేక మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రైలు ట్రాక్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. వేల సంఖ్య లో స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరి గాయి. వీటి పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడుతుందన్నది చెప్పలేని స్థితి నెలకొంది. ఈపీడీసీఎల్ పరిధిలోని సిబ్బంది ఏమాత్రం సరిపోరు. అందుకే ఎస్పీడీసీఎల్ నుంచి వెయ్యిమంది నిపుణులను పంపించాలని నిర్ణయించారు. -
బిక్కుబిక్కుమంటూ..
విశాఖపట్నం: అన్ని సౌకర్యాలూ ఉంటాయని ఉత్తరాంధ్రతోపాటు ఇతర జిల్లాల నుంచి విశాఖకు ప్రజలు వలస వస్తుంటారు. కానీ హుదూద్ తుపాను ప్రస్తుతం విశాఖ నగరంలో తాగునీరుకు కూడా దిక్కులేని దుస్థితిని మిగిల్చింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జీవీఎంసీ సరఫరా చేసే తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. విద్యుత్తు సరఫరా లేకపోవటం వల్ల బోర్లు కూడా పనిచేయటం లేదు. ఇప్పటికే ట్యాంకుల్లో ఉన్న నీళ్లు దాదాపుగా పూర్తికావచ్చాయి. ట్యాంకుల ద్వారా సరఫరా చేయాలంటే మొదట రోడ్లపై వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. లెక్కకు మిక్కిలిగా దుకాణాలు ధ్వంసం కావడంతో అత్యవసర, నిత్యావసర వస్తువుల అమ్మకం కూడా సాధ్యపడేట్లుగా లేదు. మందుల దుకాణాలు కూడా తెరవడం లేదు. విద్యుత్తు సరఫరా లేక ఆసుపత్రుల్లోనూ గాడాంధకారం నెలకొంది. ఈ నేపథ్యంలో అత్యవసర చికిత్స అవసరమైతే ఎక్కడికి వెళ్లాలో తెలియని దుస్థితి నెలకొంది. విశాఖపట్నంలో ఓ కళాశాల హాస్టల్ విద్యార్థికి అస్వస్థత ఏర్పడితే ఎక్కడికి, ఎలా తీసుకువెళ్లాలో తెలియక సహ విద్యార్థులు నానా హైరానా పడాల్సి వచ్చింది. ఆంధ్రా విశ్వవిద్యాలయంతో సహా విశాఖలోని అన్ని కళాశాలల హాస్టళ్లలో విద్యార్థులకు ఆహారం, తాగునీరు సదుపాయం లేకుండాపోయింది. అంతర్జాతీయ నగరంలో వినుతికెక్కుతుందని ఆశిస్తున్న విశాఖ నగరం... హుదూద్ పెను తుపాను మిగిల్చిన విషాదాన్నుంచి కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందన్నది కూడా చెప్పే పరిస్థితి లేదు. -
అంధకారంలో విశాఖ నగరం
* విద్యుత్తు, సమాచార, రవాణా వ్యవస్థలు విచ్ఛిన్నం హుదూద్ ధాటికి విశాఖపట్నంలోని విద్యుత్తు, సమాచార, రవాణా వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. వేలసంఖ్యలో విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. ఈ నష్టం కోట్లలోనే లెక్కతేలనుంది. శనివారం రాత్రి నుంచే విశాఖ నగరంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. ఇక ఆదివారం నాటి విధ్వంసంతో మరో రెండురోజుల వరకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. గృహాల్లో ఇన్వర్టర్లలో ఛార్జింగ్ కూడా దాదాపు అయిపోవడంతో విశాఖ నగరం రెండురోజులు అంధకారంలో కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి దాపురించింది. ఇక కేబుల్ వైర్లు చాలావరకు తెగిపోయి సెల్ టవర్లు పనిచేయడం మానేశాయి. దాంతో విశాఖ నగరంలో ల్యాండ్ఫోన్, సెల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. సమాచార సంబంధాలు తెగిపోయాయి. ఒకటీ అరా ఫోన్లు పనిచేసినా కరెంటు లేక టీవీలు కూడా పనిచేయకపోవటంతో అసలు విశాఖలో ఏం జరుగుతోందన్నది విశాఖవారే ఇతర ప్రాంతాల్లోని వారికి ఫోన్లు చేసి తెలుసుకోవాల్సి వచ్చింది. ఆదివారం రాత్రికి గాలుల తీవ్రత కొంత తగ్గినా వర్షం భారీగా కురుస్తుండటంతో ఇళ్లలోంచి బయటకి వచ్చే పరిస్థితి లేక... బయట ఏం జరుగుతోందో తెలీక భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. సెల్ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయి ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. విశాఖలోని రోడ్లతోపాటు ఇతర ప్రాంతాలతో అనుసంధానించే అన్ని ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్హెచ్ 16 మీద ఎక్కడిపడితే అక్కడ వందల సంఖ్యలో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. దాంతో ఇతర ప్రాంతాలతో విశాఖ నగరానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కట్టర్లు తెచ్చి చెట్లను కోసి, స్తంభాలు తీసి రోడ్లపై రాకపోకలను పునరుద్ధరించడానికి ఎంతసమయం పడుతుందన్నది చెప్పలేని స్థితి నెలకొంది. -
విశాఖ విలవిల
* విశిష్టతలను ధ్వంసం చేసిన హుదూద్ * వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం, నగరజీవనం అస్తవ్యస్థం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సిటీ ఆఫ్ డెస్టినీ... నవ్యాంధ్ర ప్రదేశ్కు ఆర్థిక, పర్యాటక రాజధానిగా వర్ణిస్తున్న నగరం... అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించిన స్మార్ట్సిటీ... అలాంటి విశాఖపట్నాన్ని హుదూద్ తుపాను భయానకంగా కుదిపేసింది. ఓ రాకాసి చేయి పట్టుకుని ఊపేసినట్లు ఊపేసింది. పెను విధ్వంసం కళ్లకు కట్టింది. మధ్యయుగాల్లో విదేశీ దురాక్రమణల్లో ధ్వంసమైన భారతీయ నగరాలను గుర్తుకు తెచ్చేలా ప్రకృతి ప్రకోపానికి గురైంది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విధ్వంసానికి మూగసాక్షిగా నిలుస్తోంది. విశాఖ విశిష్టతలు గాలికి... హుదూద్ తుపాను విశాఖలో విధ్వంసం సృష్టించింది. విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే విశిష్టతల్ని ఘోరంగా దెబ్బతీసింది. విశాఖ ప్రత్యేక గుర్తింపునకు ప్రధాన కారణమైన సముద్రమే ఈ పెను విధ్వంసానికి కూడా కారణం. విశాలమైన విశాఖ రోడ్లు చిన్నాభిన్నమయ్యాయి. తూర్పున సాగర్ నగర్ నుంచి దక్షిణాన గాజువాక వరకు హుదూద్ ప్రకోపానికి గురికాకుండా ఒక్క రోడ్డు కూడా మిగల్లేదు. ఇక విశాఖ రోడ్లకు ఇరువైపులా ప్రకృతి వర ప్రసాదంగా నిలిచే పచ్చని చెట్లు... చెట్టు కనిపిస్తే ఒట్టు అనే రీతిలో నేలకొరిగాయి. వందల ఏళ్ల నాటి చెట్లతోసహా దాదాపు 80 శాతం చెట్లు కూకటివేళ్లతో కుప్పకూలాయి. సినీ అందాలకు ఎర్ర తివాచీ పరిచే విశాఖ అందాల బీచ్ రోడ్డు భారీగా కోతకు గురైంది. రెండుచోట్ల బీచ్ రోడ్డు కోతకు గురై సముద్రం నీళ్లు పైకి వచ్చేశాయి. బీచ్రోడ్డుకు 3 మీ. దిగువన ఉండే సముద్రం నీళ్లు హుదూద్ దాటికి ఉప్పెనగా పొంగి రోడ్డుపైకి చేరుకున్నాయి. ఫిషింగ్ హార్బర్ సమీపంలో రోడ్డు కోతకు గురై రాకపోకలకు నిలిచిపోయాయి. బీచ్రోడ్డుకు ఇరువైపులా హోర్డింగులు చెల్లాచెదురయ్యాయి. విశాఖలో వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలైన జగదాంబ జంక్షన్, సిరిపురం, ఆశీలు మెట్ట, ద్వారకానగర్, సీతమ్మధార, పూర్ణా మార్కెట్, వీఐపీ రోడ్డు దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఎయిర్పోర్టు.. తుపాను తాకిడికి విశాఖ ఎయిర్పోర్టు దారుణంగా దెబ్బతింది. ఎయిర్పోర్టు పైకప్పులు ఎగిరిపోయాయి. లాంజ్తో సహా అన్ని కార్యాలయాలు 50 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. అద్దాలు విరిగిపడ్డాయి. రన్వే పూర్తిగా నీటమునిగింది. చాలా చోట్ల రన్వే కోతకు గురైంది. రెండురోజుల తరువాతగానీ ఎయిర్పోర్టుకు జరిగిన నష్టంపై ఏమీ చెప్పలేమని అధికారులు తెలిపారు. మూడునాలుగు రోజుల వరకు విమానాల రాకపోకలు సాధ్యం కాదని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ విధ్వంసం... విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో మత్స్యకారుల ప్రధాన జీవనాధార కేంద్రం ఫిషింగ్ హార్బర్ విధ్వంసానికి గురైంది. హార్బర్లో 60 మర బోట్లు పూర్తిగా దెబ్బతిని నీట మునిగిపోయాయి. అవి ఇక ఎందుకూ పనికిరావని వాటి యజమానులు చెబుతున్నారు. మరో 100 బోట్లు స్పల్పంగా దెబ్బతిన్నాయి. రూ.25 లక్షలు విలువ చేసే ఒక్కో బోటు మీద 8 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. పూర్తిగా ధ్వంసమైన బోట్ల వల్ల రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది. స్వల్పంగా నష్టపోయిన బోట్ల వల్ల దాదాపు రూ.కోటి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. వీటిపై ప్రత్యక్షంగా ఆధారపడుతున్న 1,300మందితోపాటు పరోక్షంగా ఆధారపడుతున్న మరో వెయ్యిమంది ఉపాధికి విఘాతం కలిగింది. తుపాను తాకిడికి సముద్రపు నీరు ముంచెత్తడంతో హార్బర్లో నిల్వ ఉంచిన రూ.లక్షల విలువైన మత్స్య సంపద కొట్టుకుపోయింది. -
స్తంభించిన జనజీవనం
సాక్షి, రాజమండ్రి :హుదూద్ తుపాను ప్రభావంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులు, ఎడతేరిపి లేని వర్షంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. తెల్లవారు జామునే వర్షం ప్రారంభం కాగా, పది గంటల ప్రాంతం నుంచి ఈదురు గాలులు మొదలయ్యాయి. తుపాను తీరం దాటే సమయానికి మధ్యాహ్నం 12.00 గంటల ప్రాంతం నుంచి గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీర ప్రాంతంలో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుని, కాకినాడ రూరల్ నియోజక వర్గాల పరిధిలోని సముద్రతీరంలో గాలుల వేగం 80 కిలోమీటర్లు దాటింది. కొత్తపేట, కాకినాడ రూరల్, తొండంగి, ఏలేశ్వరం, కె.గంగవరం, కాజులూరు, రామచంద్రపురం పిఠాపురం, జగ్గంపేట, ముమ్మిడివరం, కడియం, రాజమండ్రి రూరల్, రాజానగరం, మండపేట పరిసర ప్రాంతాల్లో పంట దశలో ఉన్న వరిచేలు నేలకు ఒరిగాయి. ఆలమూరు మండలం సంధిపూడిలో రోడ్డుపై చెట్టు కూలి ట్రాఫిక్కు అంతరాయం కలిగించింది. ఏలేశ్వరం, కె.గంగవరం ప్రాంతాలతో పాటు కోనసీమలో అక్కడక్కడా అరటి తోటలు నేలకు ఒరిగాయి. ముమ్మిడివరం, కొత్తపేట పరిసరాల్లో కొబ్బరి తోటలకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. శంఖవరం మండలంలో సర్వేతోటలు నేలకూలాయి. అమలాపురం సహా కోనసీమలోని, పలు ప్రాంతల్లోను. ఏజెన్సీలోను తుఫాను తీవ్రత పెద్దగా కనిపించలేదు. ఈదురుగాలులతో జల్లులు పడ్డాయి. రాజవొమ్మంగి మండలంలో ఎక్కువగావర్షం కురిసింది. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలుపు చేశారు. అక్కడక్కడా కరెంటు స్తంభాలు నేలకు ఒరిగాయి. ఆదివారం సాయంత్రానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో సుమారు 70 విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. నాలుగు ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలాయి. ఒక్క సూర్యారావుపేట ప్రాంతంలోనే 12 కరెంటు స్తంభాలు, మూడు ట్రాన్ఫ్ఫార్మర్లు కూలి పోయాయి. చాలా చోట్ల చెట్టుకొమ్మలు కరెంటు స్తంభాలపై విరిగి పడి నష్టాన్ని తెచ్చిపెట్టాయి. కాజులూరు, అండ్రంగి, ఓదూరు పరిసర ప్రాంతాల్లో చెట్టుకొమ్మలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఒకటి రెండు చోట్ల మినహా జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్తు సరఫరా నిలుపు చేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నాం జిల్లాలో విద్యుత్తు అంతరాయాలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం ముందు జాగ్రత్త చర్యగా సరఫరా నిలుపు చేశామన్నారు. గాలులు భారీగా ఉన్న చోట్ల మినహా మిగిలిన చోట్ల ఆదివారం రాత్రి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించామని పేర్కొన్నారు. కాకినాడలో ఈదురుగాలుల ప్రభావం తీవ్రం గా ఉండడంతో రాత్రి వరకూ విద్యుత్సరఫరా ఇవ్వలేకపోయామన్నారు. ఎక్కడ బ్రేక్ైడౌన్ అయినా తాను స్వయంగా హాజరై చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాయంత్రం వరకూ భారీ గాలులు కొనసాగడం వల్ల ఎన్ని చెట్ల నష్టం జరిగింది. ఎన్ని స్థంభాలు నేలకూలాయి అనే అంశాలపై ఇంకా ఒక అంచనాకు రావాల్సి ఉందన్నారు. కాగా రాత్రి ఏడున్నర నుంచి వర్షం తగ్గినా గాలుల తీవ్రత పెరగడంతో విద్యుత్తు అధికారులకు పునరుద్దరణచర్యలకు ఆటంకం ఏర్పడింది. ఉదయం నుంచి జిల్లాలోని సుమారు 500 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. వైజాగ్లో సహాయక చర్యలకు 200 మంది ప్రకాశ్నగర్ (రాజమండ్రి) : హుదూద్ తుపానుతో అతలాకుతలమైన విశాఖపట్నంలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాజమండ్రి నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది బయలుదేరి వెళ్లారు. ఉన్నతాధికారులు 300 మందిని పంపించాలని ఆదేశించగా 200 మందిని పంపారు. 13,14 తేదీల్లో జన్మభూమి రద్దు కాకినాడ సిటీ : హుదూద్ తుపాను కారణంగా సోమ, మంగళవారాల్లో నిర్వహించే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ నీతూప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జన్మభూమి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు. ‘అల’కల్లోలం తొండంగి : హుదూద్ ప్రభావంతో ఆదివారం తొండంగి మండలం ఈదురగాలులతో కురిసిన వర్షంతో అల్లకల్లోలమైంది. కొత్తచోడిపల్లిపేట తీరంలో 30 మీటర్ల మేరకు సముద్రం ముందుకు వచ్చింది. నాలుగు మీటర్ల మేర సముద్రం కోతకుగురైంది. మత్స్యకారులు వలలు భద్రపరుచుకున్న గుడిశెలు పైకప్పులు ఎగిరిపోయాయి. చోడిపల్లిపేటలో మత్స్యకారులను ఎస్సై రవికుమార్, ఇతర పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాసకేంద్రాలకు తరలించారు. ముసలయ్యపేటలో మూడు ఇళ్లు దెబ్బతిన్నాయి. దానవాయిపేటలో పాక్షికంగా మరో ఇల్లు దెబ్బతిందని రెవెన్యూఅధికారులు తెలిపారు. కూలిన వృక్షాలు చోడిపల్లిపేట నుంచి ఒంటిమామిడి వెళ్లే బీచ్రోడ్డులో మూడు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. పెరుమాళ్లపురం నుంచి తలపంటిపేట బీచ్రోడ్డులో విద్యుత్వైర్లు తెగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గోపాలపట్నం నుంచి తొండంగి వె ళ్లే రహదారిలో రైల్వేగేటుకుసమీపంలోనూ, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం గ్రామాల సమీపంలోనూ, కోదాడ పంచాయతీ కార్యాలయం వద్ద, జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద, ఎరబంద మలుపు వద్ద చెట్లు పడిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెరుచుకోని రైల్వేగేట్లు తుపాను కారణంగా రావికంపాడు, చిన్నాయిపాలెం, గోపాలపట్నం రైల్వేగేట్లు తెరవలేదు. దీంతో పునరావాసకేంద్రాల వద్ద ఉన్న ప్రజలకు, అధికారులకు మధ్యాహ్న భోజనం తరలింపులో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు తీరప్రాంత గ్రామాల్లో అధికారులు ఏర్పాటు చేసిన 10 పునరావాసకేంద్రాలను ఆదివారం కొనసాగించారు. సుమారు రెండు వేలమందికిపైగా ప్రజలను కేంద్రాల వద్దకు తరలించారు. ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ప్రత్యేకాధికారి మధుసూదనరావు, ఎంపీడీవో సీహెచ్కేవిశ్వనాథరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణలు దానవాయిపేట, ఎల్లయ్యపేట, వేమవరం, అద్దరిపేట, ఆవులమంద, లక్ష్మణుడుపేట, హుకుంపేట, చోడిపల్లిపేటల్లోని పునరావాసకేంద్రాలను పరిశీలించారు. 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం,220 మంది వరకూ పోలీసులు, 200మంది వివిధ శాఖల అధికారులు వీఆర్వోలు, వీఆర్ఏలు, సెక్రటరీలు, ఆర్డబ్ల్యూయస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, స్ధానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పునరావాసకేంద్రాల వద్ద సేవలందించారు. కొనసాగుతున్న కంట్రోల్ రూం తొండంగిలో ఏర్పాటు చేసిన కంట్రోల్రూం కొనసాగుతోంది. తుపాను ప్రత్యేకాధికారి చక్రవర్తి తహశీల్దార్ కార్యాలయం ఉండి అధికారులను పని తీరును సమీక్షించారు. సోమవారం కూడా కంట్రోల్ రూం కొనసాగుతుందన్నారు. ప్రజలు 08854 248825, 08854248108కు గానీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. -
తీరానికి శరాఘాతం
కొన్ని రోజులుగా కోస్తా వెన్నులో చలి పుట్టించిన ‘హుదూద్’..జిల్లా పాలిట పెనుముప్పు కాకుండానే నిష్ర్కమించింది. పొరుగునున్న విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సృష్టించిన విలయాన్ని చూస్తే..ఈ తుపాను ‘తూర్పు’ను చాలావరకూ కనికరించిందనే చెప్పొచ్చు. తీరప్రాంత మండలాల్లో ఒకింత ఉగ్రరూపం ప్రదర్శించిన ఈ విపత్తు.. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో తన ప్రతాపాన్ని చూపకుండా దయ తలచినట్టే! సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘హుదూద్’ ఉపద్రవం ఏం ప్రళయం సృష్టిస్తుందో; ఎన్ని కష్టనష్టాల పాలు చేస్తుందోనని బిక్కుబిక్కుమన్న జిల్లావాసులు.. చివరికి తుపాను తీవ్రమైన చేటు కలిగించకుండానే తీరం దాటిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం విశాఖ జిల్లా పూడిమడక వద్ద తీరం దాటిన తుపాను.. జిల్లాపై భయపడినంత క్రౌర్యాన్ని చూపకుండా విడిచి పెట్టింది. అయితే తీరప్రాంతంలోని మండలాల్లో తుపాను తాకిడి తీవ్రంగానే ఉంది. తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లోని తీరగ్రామాలపై ‘హుదూద్’ కన్నెర్రజేసింది. ఈ ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వీచిన బలమైన ఈదురుగాలులతో జనజీవనం స్తంభించింది. ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటపై సముద్రం విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచే ఉవ్వెత్తున ఎగసిపడ్డ కెరటాలు.. ఈ గ్రామంలో తీరానికి ఆనుకుని ఉన్న మత్స్యకారుల ఇళ్లను కబళించాయి. కొమ్మల నుంచి రాలిన పండ్లలా.. 50 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. మరో 25 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 150 కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. కట్టుబట్టలతో, ప్రాణాలు అరచేతపట్టుకుని బయటపడ్డ మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఒక్క ఊరిలోనే నష్టం రూ.కోటి వరకు ఉంటుందని అంచనా. సామర్లకోటలో 29వ వార్డుకు చెందిననేమాని వెంకట్రావు(60) నేరేడు చెట్టు విరిగి మీద పడటంతో మృతి చెందాడు. సీతానగరం మండలం రఘుదేవపురం పంచాయతీ పరిధిలోని నల్గొండకు చెందిన బందెల ప్రసాద్ (40) విద్యుదాఘాతానికి బలయ్యాడు. ఆదివారం రాత్రి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రసాద్కు విద్యుత్ స్తంభం నుంచి తెగిపడిన తీగ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.కాగా రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన ఉప్పులూరి రాజ్కుమార్ ఎలియాస్ మోషే (20) విశాఖ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మరణించాడు. ఓ స్కూలు బస్సుపై క్లీనర్గా పని చేస్తున్న మోషే విద్యుత్ కాంట్రాక్టు పనులూ చేస్తుంటాడు. విశాఖలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరికొందరితో కలిసి ఈపీడీసీఎల్ వ్యాన్లో వెళుతుండగా విశాఖ సమీపంలో పెనుగాలులు వీచాయి. ఆ ఉధృతికి కిందపడిన మోషే అక్కడికక్కడే మరణించాడు. చొచ్చుకు వచ్చిన కడలి, కోతకు గురైన తీరం కోనసీమలో తీర ప్రాంత మండలాలైన కాట్రేనికోన, తాళ్లరేవు, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లిలలో బలమైన ఈదురుగాలులతో తీరంలో సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఉప్పాడ వద్ద బీచ్రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఈ రోడ్లో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట గ్రామాల్లోకి సముద్రం నీరు చొచ్చుకు వచ్చింది. ఆ గ్రామాల నుంచి సుమారు 5,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తొండంగి మండలంలో సముద్రం 30 మీటర్లు ముందుకు వచ్చింది. పాతచోడిపల్లిపేట, కోదాడ-ఎ.కొత్తపల్లి, పెరుమాళ్లపురం తదితర ప్రాంతాల్లో రెండు మీటర్ల మేర తీరం కోతకు గురైంది. ఈ మండలంలోని శృంగవృక్షం, ఎ.కొత్తపల్లి, గోపాలపట్నం గ్రామాల్లోని అరటితోటలు గాలికి నేలనంటాయి. కొన్నిచోట్ల గాలి తాకిడికి వరి చేలు నేలకొరిగాయి. జిల్లాలో 16 మండలాల్లో 78 గ్రామాల్లో తుపాను ప్రభావం కనిపించింది. ఆ గ్రామాల నుంచి 31,804 మందిని జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన 67 పునరావాస కేంద్రాలకు తరలించారు. 28 వేల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తొండంగి మండలంలో పలు పునరావాస కేంద్రాలకు సకాలంలో భోజనం అందక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు నిలిచి బోసిపోయిన రహదారులు రైళ్లు, అంతర్ జిల్లాల బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో, 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేయడంతో ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ వైపు రోడ్లు వెలవెలబోయాయి. వాకలపూడి-ఉప్పాడ రోడ్డు, కోటనందూరు-నర్సీపట్నం రోడ్డు తుపాను తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ రోడ్లపై పలుచోట్ల చెట్లు పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లా అంతటా ఆదివారం ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరించారు. జిల్లావ్యాప్తంగా 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు తొమ్మిది, 11 కేవీ సబ్ స్టేషన్లు 12 దెబ్బతిన్నాయి. తుపానుతో వాటిల్లిన పరిస్థితిని, సహాయక చర్యలను ఉపముఖ్యమంత్రి ఎన్.చినరాజప్ప, కలెక్టర్ నీతూప్రసాద్ కలెక్టరేట్ నుంచి సమీక్షించారు. తుపాను తాకిడి ఎక్కువగా ఉన్న తుని, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో విద్యాసంస్థలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు. రైల్వేశాఖ తుపాను బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు తునిలో 16, సామర్లకోటలో 15 కోచ్లను అందుబాటులో ఉంచింది. -
ఆ పల్లె ఇళ్లు.. కడలికి పల్లీలు
పిఠాపురం :ఎన్నోసార్లు ఆ ఊరిపై దాడి చేసినా కసి తీరని కడలి.. మరోసారి రాకాసి కెరటాల కత్తులు దూసింది. ఆకలితో నకనకలాడేవాడు పల్లీలను నోట వేసుకున్నట్టు.. ఒకదాని వెనుక ఒకటిగా అనేక ఇళ్లను మింగేసింది. రోడ్లను కాటేసింది. వలనూ, తననూ నమ్ముకున్న మత్స్యకారుల జీవితాన్ని వెతల పాలు చేసింది. ‘హుదూద్’ తుపాను దెబ్బకు కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో దాదాపు 200 ఇళ్లుండగా 50 సముద్రంలో కలిసిపోయాయి. మరో 25 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఈ ఉత్పాతం ఆదివారం కొనసాగుతోంది. మరికొన్ని ఇళ్లు కూడా ఏ క్షణమైనా కడలిలో కలిసే స్థితిలో ఉన్నాయి. ఊళ్లోని 300 కుటుంబాల్లో 150 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా. కళ్లెదుటే ఇళ్లు ఒకటొకటిగా కుప్పకూలి కడలి కడుపులో కలిసిపోతున్నా చేయగలిగింది లేక మత్స్యకారులు నిస్సహాయంగా చూడాల్సి వచ్చింది. వీలైన సామాన్లను దొరకపుచ్చుకుని ‘బతుకు జీవుడా!’ అనుకుంటూ పరుగు తీశారు. కొందరికి ఆ కొద్దిపాటి సామగ్రిని దక్కించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా.. ఎనుబోతు చిగురాకును మేసినట్టు.. వారి ఇళ్లను కడలి కబళించింది. కెరటాలు గ్రామంలోకి సుమారు 40 మీటర్ల మేర చొచ్చుకు వచ్చాయి. ఊరిలోని సిమెంటురోడ్డు సైతం కెరటాల ఉధృతికి సముద్రంలో కలిసిపోయింది. తీరంలోని అనేక చెట్లు కూకటివేళ్లతో సముద్రంలో కలిసిపోయాయి. తీరానికి సమీపంలోని సుబ్బంపేట, పల్లెపేట, కొత్తపేట, రంగంపేట, మాయాపట్నం సూరాడపేట తదితర మత్స్యకార గ్రామాలు సముద్రం చొచ్చుకు రావడంతో జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి. బీచ్రోడ్డు తునాతునకలు.. ఉప్పాడ తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణగోడ కూడా తుపాను ధాటికి తలవంచక తప్పలేదు. ఈ గోడ అనేకచోట్ల అలల తాకిడికి కొట్టుకుపోయింది. బీచ్రోడ్డు వెంబడి వేసిన రాళ్లగోడ కూడా ఛిద్రమైంది. విరుచుకుపడే కెరటాలకు తోడు భారీ రాళ్లు ఎగిరి పడడంతో పాటు రోడ్డు తునాతునకలై కొట్టుకుపోయింది. తీరంలో కెరటాలు సుమారు 10 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతూ తీరప్రాంతాన్ని తీవ్ర కోతకు గురిచేస్తున్నాయి. రక్షణగా వేసిన రాళ్లే ప్రస్థుతం రోడ్డును తునాతునకలు చేస్తున్నాయి. -
స్తంభించిన రవాణా
సాక్షి, రాజమండ్రి : హుదూద్ తుపాను ప్రభావంతో జిల్లాలో రవాణా స్తంభించింది. జిల్లా మీదుగా వెళ్లే 23 రైళ్లను రద్దు చేయడంతో రైల్వే స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. శనివారం రాత్రి హైదరాబాద్, చెన్నైల నుంచి బయలుదేరిన సర్కార్, గౌతమి ఎక్స్ప్రెస్ రైళ్లను మాత్రమే ఆదివారం కాకినాడ వరకూ అనుమతించారు. ఆదివారం విశాఖ-విజయవాడ మధ్యలో రైళ్లన్నీ రద్దయ్యాయి. రాజమండ్రి నుంచి విజయవాడ, భీమవరం వైపు వెళ్లే ప్యాసింజర్ రైళ్లు మాత్రమే తిప్పారు. శని, ఆదివారాల్లో 200 మంది తమ రిజర్వేషన్లను రద్దు చేసుకున్నారని, వారికి రూ. లక్ష మేరకు చెల్లించినట్టు రాజమండ్రి స్టేషన్ మేనేజర్ బి. సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. రైళ్లు రద్దుకావడం వల్ల మరో రూ. రెండు లక్షల మేరకు రైల్వేకు నష్టం వాటిల్లి ఉండవచ్చంటున్నారు. ఆర్టీసీకి రూ. 25 లక్షల నష్టం తుపాను ప్రభావం వల్ల బస్సులను నడపకపోవడం వల్ల ఆదివారం సాయంత్రం వరకూ జిల్లాలో ఆర్టీసీకి రూ. 25 లక్షలు నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ప్రాంతాలకు వెళ్లే సుమారు 100 సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. కాగా తుని వరకూ అన్ని ప్యాసింజర్ సర్వీసులు యథావిధిగా తిప్పినట్టు అధికారులు చెప్పారు. నిలిచిన వాణిజ్య రవాణా తూర్పు విశాఖ సరిహద్దుల్లో 16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించడంతో విజయవాడ- విశాఖ మధ్యలో రూ. కోట్ల విలువైన సరుకు రవాణా నిలిచి పోయింది. తుని నుంచి విశాఖవైపునకు వాహనాలు పూర్తిగా నిషేధించారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ విమాన సర్వీసులను రద్దు చేశారు. నేడు విశాఖ వైపు నుండి వచ్చే రైళ్లు రద్దు రాజమండ్రిసిటీ : విశాఖ వైపు నుంచి వచ్చే పలు రైళ్లను సోమవారం రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం రద్దు అయిన రైళ్లు అన్నీ సోమవారం కూడా నడవవన్నారు. విజయవాడ -విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్ప్రెస్ను రాజమండ్రి లేదా సామర్లకోట వరకూ నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణం సక్రమంగా ఉంటే ఆది వారం రద్దు చేసిన ఆర్టీసీ బస్సులను నడుపు తామని ట్రాఫిక్మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. -
విశాఖ విమానాశ్రయం పైకప్పు ధ్వంసం
విశాఖపట్నం: హుదూద్ తుఫాన్.. విశాఖ విమానాశ్రయంపై విరుచుకుపడింది. చండప్రచండంగా వీచిన ఈదురు గాలులకు ఎయిర్పోర్టు బాగా దెబ్బతింది. విమాశ్రాయం టెర్మినల్ పైకప్పు, అద్దాలు ధ్వంసమైయ్యాయి. సూచికలు, హోర్డింగ్స్ దెబ్బతిన్నాయి. శిథిలాలు ప్రయాణికులు వేచివుండే గదిలోకి పడిపోయాయి. ఎయిర్పోర్టుల పరిసర ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో రన్ వేపైకి నీరు చేరింది. ఫలితంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. -
విశాఖ ఎయిర్ పోర్ట్ పైకప్పు ధ్వంసం
-
వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దుర్మార్గాలకు నిరనసగా ఈ నెల 16న చేపట్టాలనుకున్న నిరనస కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈమేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హుదూద్ తుఫాన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తీరప్రాంతాల్లో తుఫాన్ సృష్టించిన విలయంపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
విశాఖలో భారత్-విండీస్ మూడో వన్డే రద్దు
విశాఖపట్నం: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఈ నెల 14న జరగాల్సిన మూడో వన్డే రద్దయింది. హుదూద్ తుఫాన్ కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. విశాఖలో మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేవని బీసీసీఐకు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) తెలిపింది. తుఫాన్ విరుచుకుపడడంతో విశాఖపట్నం వణికింది. ప్రపంచ పవనాల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గుడిసెలు, రేకుల షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి. భీకర గాలులకు తోడు భారీ వర్షాలు కురుస్తుండడంతో విశాఖ తడిసిముద్దయింది. స్టేడియం అంతా వర్షపు నీటితో ముగినిపోయింది. వర్షం లేకపోతే భారత్, వెస్టిండీస్ల మధ్య మూడో వన్డేను నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ముందుకు వచ్చినప్పటికీ వాతావరణం సహకరించకపోవడంతో వెనక్కు తగ్గాల్సివచ్చింది. ఇప్పటికిప్పుడు వన్డే వేదికను మార్చే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేయాల్సివచ్చింది. -
తీరప్రాంతాల్లో హుదూద్ విధ్వంసం; నలుగురు మృతి
విశాఖపట్నం/భువనేశ్వర్: హుదూద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలం చేసింది. దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో ప్రపంచ గాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా సంభవించిన విధ్వంసానికి నలుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండున్న లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో లక్ష మందిని పునరావాస కేంద్రాలకు పంపారు. ఇంకా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖ నగరంపై పడింది. ప్రపంచ పవనాల ధాటికి చెట్లు, విద్యుత్ సంభాలు కూలిపోయాయి. ముందుజాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థను నిలిపివేశారు. తుఫాన్ కారణంగా ఇప్పటివరకు 70 ఇళ్లు దెబ్బతిన్నాయని, 34 జంతువులు మృతి చెందాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు, ఒడిశాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. -
ఉప్పాడలో ఎగసిపడిన అలలు
-
విశాఖపై తుపాన్ ప్రభావం తీవ్రం
-
బలవంతంగా అయినా వారిని ఖాళీ చేయించాలి
హైదరాబాద్ : హదూద్ తుఫాను దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. ప్రాణహాని జరగకుండా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన శనివారమిక్కడ కోరారు. ఒకవేళ ప్రజలు తమ నివాసాల నుంచి తరలి వెళ్లేందుకు నిరాకరిస్తే, కలెక్టర్లు తమకున్న అధికారల మేరకు బలవంతంగా అయినా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రఘువీరా సూచన చేశారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం కూడా జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
తుఫాను ప్రభావం: శ్రీకాకుళంలో వర్షాలు ప్రారంభం
హుదూద్ తుఫాను ప్రభావం మొదలైపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్న తుంపర్లు వస్తుండగా మరికొన్ని గ్రామాల్లో పెద్ద వర్షమే కురుస్తోందని సమాచారం. ఇక తుఫాను నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. మొత్తం 64 మండలాల పరిధిలోని 5.14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తక్షణం తరలించాలని ఆదేశించారు. మొత్తం 370 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ కార్యక్రమాల కోసం 54 బోట్లతో 689 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. మొత్తం 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు తరలించారు. -
హుదూద్ తుఫానుపై 'నాసా' కన్ను
వాషింగ్టన్ : ఉత్తర కోస్తాను వణికిస్తున్న హుదూద్ తుఫానుపై నాసా దృష్టి పెట్టింది. హుదూద్ తుఫానుపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను తీరందాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. తుఫాను గమనంపై నాసా ఉపగ్రహం ఆక్వా ఈ సమాచారాన్ని అందించింది. మేఘాల్లో ఉష్ణోగ్రత -53 డిగ్రీల సెంటీగ్రేడ్గా నాసా పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలకు ఇది సూచనగా నాసా హెచ్చరించింది. 11.1 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా తుఫాను కదులుతున్నట్లు నాసా తెలిపింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని నాసా వెల్లడించింది. -
మూడు జిల్లాల్లో రెండు లక్షల మంది తరలింపు
హుదూద్ తుఫాను ముంచుకొస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం అవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు లక్షల మందిని తరలించాలని నిర్ణయించారు. మరోవైపు ఒడిషాలోని 11 జిల్లాల నుంచి ఇప్పటికే దాదాపు 4 లక్షల మందిని తరలించేశారు. ప్రస్తుతం తుఫాను విశాఖకు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని గమనం వేగంగా ఉంది. సహాయ కార్యక్రమాల కోసం 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాలు రెడీగా ఉన్నాయి. నాలుగు నౌకలు, పది హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ఇప్పటికే 250 మంది సైనికులు చేరుకున్నారు. తుఫాను బలహీనపడే అవకాశాలు ఏమాత్రం లేవని వాతావరణ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ టెలికం కంపెనీలు ప్రజలకు ఎస్ఎంఎస్లు పంపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కంట్రలో రూం ఏర్పాటుచేశారు. దీని నెంబర్లు 040 23456005, 23450419. మొత్తం 200కు పైగా సహాయ శిబిరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు, ఉద్యోగులు అందరికీ సెలవులు రద్దుచేశారు. డీజిల్, పెట్రోలు నిల్వలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
కళింగపట్నం పోర్ట్ లో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
విశాఖ : హుదూద్ తుఫాను నేపథ్యంలో ప్రధాన ఓడరేవుల్లో హై-అలర్ట్ ప్రకటించారు. కళింగపట్నం, గంగవరం ఓడరేవుల్లో శనివారం 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, మచిలీపట్నం పోర్ట్ల్లో అయిదో నెంబర్, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక సూచికలను ఎగురవేశారు. ఓడ రేవుల్లో మొత్తం 11వ నెంబర్ వరకూ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. సాధారంగా అయిదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయితేనే తుఫాను ప్రభావం భారీగా ఉన్నట్లు లెక్క. ఇక 11వ నెంబర్ జారీ అయితే మొత్తం సమాచార వ్యవస్థే స్తంభించిపోతుంది. -
శ్రీకాకుళం జిల్లా దిశగా హుదూద్ పయనం
-
శ్రీకాకుళం జిల్లా దిశగా హుదూద్ పయనం
శ్రీకాకుళం : విశాఖ సమీపానికి అతివేగంగా దూసుకొస్తున్న హుదూద్ తుఫాను తన దిశ మార్చుకుంది. శ్రీకాకుళం జిల్లా దిశగా తుఫాను పయనిస్తోంది. ఆదివారం ఉదయం కంటే ముందుగానే తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 130 నుంచి 150 కి.మీ వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన సముద్రం మరింత భీకర రూపం దాల్చి ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. మరోవైపు తుఫానుపై మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని కామినేని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వైద్య సిబ్బంది, 108 వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. -
భారీ విధ్వంసం తప్పదు
విపరీతమైన వేగంతో దూసుకొస్తున్న హుదూద్ తుఫాను భారీ విధ్వంసం సృష్టించక తప్పదని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం వరకు విశాఖ వైపు కదిలిన తుఫాను.. ఆ తర్వాత ఉత్తరంవైపు.. అంటే శ్రీకాకుళం వైపు పయనిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వాస్తవానికి ఆదివారం మధ్యాహ్నం తర్వాత తీరం దాటుతుందని అనుకున్నా, దానికంటే మూడు గంటల ముందే తీరాన్ని తాకొచ్చని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు విస్తారంగా 192 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. ఇక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పడంతో.. 11 మండలాలు, 231 గ్రామాలకు చెందిన అందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటున్నారు. ఈ సమయంలో ప్రజలెవరూ బయట తిరగొద్దని స్పష్టం చేశారు. రేకులు పైకి ఎగిరిపడతాయని, అందువల్ల గాయాల పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కిటికీలు, తలుపులు వేసుకోవాలని, ఏ పని ఉన్నా బయటకు రావద్దని హెచ్చరించారు. పూరిళ్లలో కూడా ఉండొద్దన్నారు. మట్టిగోడల ఇంట్లో ఎవరైనా ఉంటే బలవంతంగానైనా వారిని తరలించాలని కలెక్టర్ చెప్పారు. వాస్తవానికి లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంతాల్లో ఉన్న ప్రజలను శనివారం రాత్రి తరలించాలని అనుకున్నారు. కానీ తుఫాను ముందుగానే వస్తోంది కాబట్టి వెంటనే అప్రమత్తం కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు హెచ్చరించారు. దాంతో అందరినీ వెంటనే అక్కడినుంచి తరలించేస్తున్నారు. పోలీసు స్టేషన్లలో అదనపు సిబ్బందిని మోహరించారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే జరిగితే నాగావళి, వంశధార నదులకు వరద వచ్చే ప్రమాదం ఉంది. ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లను ఎత్తయిన ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
హుదూద్ తుఫాను తీవ్రతపై కేసీఆర్ సమీక్ష
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ హుదూద్ తుఫానుపై ఢిల్లీ నుంచే అధికారులతో శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించి తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం కేసీఆర్ ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. -
ఉత్తరాంధ్రలో హై అలర్ట్.. పలురైళ్లు రద్దు
హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేశారు. తుఫాను కారణంగా పలు జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మరోవైపు హుదూద్ తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు. తుఫాను కారణంగా 30 రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఈస్ట్కోస్ట్ రైల్వే పరిధిలో 37 రైలు సర్వీసులు రద్దయ్యాయి, 31 రైళ్లను దారి మళ్లించారు. కంట్రోల్ రూంల నెంబర్లు తూర్పుగోదావరి- 0884 2359173; విశాఖ- 1800 4250 0002; శ్రీకాకుళం ౦ 1800 4256625; విజయనగరం - 08922 276888; పార్వతీపురం - 08963 221006 -
జిల్లాలో 125 పునరావాస కేంద్రాలు ఏర్పాటు: గంటా
విశాఖపట్నం: హదూద్ తుపాన్ నేపథ్యంలో విశాఖ జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో గంటా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు 125 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. తుపాన్ వల్ల ఎక్కడ ఎటువంటి ఆపద సంభవించిన వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. జిల్లాలో 11 మండలాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. నావీ, పోలీసుల సహాయం తీసుకుంటున్నామన్నారు. పరిస్థితులను బట్టి నెవీ బోట్లను ఉపయోగించుకుంటామన్నారు. తుపాన్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయని గుర్తు చేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి సోమవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశంముందన్నారు. విలేకరి ఎంసెట్ పై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కోర్టు తీర్పు ఆధారంగా ఎంసెట్ సెకెండ్ కౌన్సెలింగ్పై ముందుకెళ్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని గంటా తెలిపారు. -
గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గుంటూరు: హుదూద్ తుపాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. జిల్లాలో తుపాన్ వల్ల ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన 0863 -2234070, 2234301 నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష నిర్వహించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. నిజాంపట్నం ఓడరేవులో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
పైలీన్ కంటే తీవ్రంగా దూసుకొస్తున్న హుదూద్
హుదూద్ తుఫాను గత సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చిన పైలీన్ తుఫాను కంటే మరింత బీభత్సంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావంతో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దీని ప్రభావంతో శుక్రవారం నాడు ఈదురుగాలులు, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం హుదూద్ తుఫాను విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో సముద్రం రెండు మూడు అడుగులు ముందుకు రావచ్చని చెబుతున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉండబోతోంది. శ్రీకాకుళం జిల్లాకు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా 192 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండటంతో ఇక్కడ తుఫాను మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో ఇప్పటికే ఆర్మీ, నేవీ, కోస్ట్గార్డ్ దళాలు అప్రమత్తమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. శ్రీకాకుళం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ముందు జాగ్రత్త చర్యలను సమీక్షిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా యంత్రాంగం కూడా తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైంది. జిల్లాలోని అందరు ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్షించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. విశాఖపట్నం ఓడరేవులో రెండో నెంబరు ప్రమాదహెచ్చరిక ఎగరేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు. వీటి నెంబర్లు 0863-2234070, 2234301. -
తరుముకొస్తున్న హుదూద్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఈ ఏడాదిలో అతి పెద్దదిగా భావిస్తున్న హుదూద్ తుఫాన్ తరుముకొస్తోంది. పెనుతుఫాన్గా బీభత్సం సృష్టించే అవకాశం ఉండడంతో అందరిలో భయాందోళన మొదలైంది. పై-లీన్, లెహెర్ తరహాలో బీభత్సం సృష్టించొచ్చని భావిస్తున్న అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేలా సన్నద్ధమయింది. పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు వివిధ శాఖలు సమన్వయమవుతున్నాయి. ఈమేరకు కలెక్టర్ ప్రత్యేకాధికారులను నియమించారు. రెవెన్యూ గ్రామానికొకరు చొప్పున బాధ్యతలు చేపట్టనున్నారు. మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా కలెక్టర్ దృష్టికి తీసుకురానున్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించనున్నారు. వారికి అవసరమైన అన్నీ వసతులు సమకూర్చనున్నారు. హుదూద్ తుఫాన్ ప్రభావం జిల్లాలోని ఏడు మండలాలపై ఉండొచ్చని భావిస్తున్నారు. తీవ్ర ప్రభావం పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు ఉండగా, నాగావళి నదికి వరద నీరు పోటెత్తడం ద్వారా కొమరాడ, పార్వతీపురం మండలాలకు, భారీ వర్షాల ద్వారా గుర్ల, విజయనగరం, ఎస్కోట మండలాల్లో ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 20 గ్రామాలపై పెనుగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కొక్క రెవెన్యూ గ్రామానికి ఒక్కొక్క జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. చేపల కంచేరు రెవెన్యూ పంచాయతీకి జిల్లా పరిషత్ సీఈఓ మోహనరావు, కొంగవానిపాలెంనకు డ్వామా పీడీ గోవిందరాజులుు, కోనాడకు డీఆర్డీఏ పీడీ పెద్దిరాజు, చింతపల్లికి సెట్విజ్ సీఈఓ దుర్గారావు, కొల్లాయవలసకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హెచ్.వి.ప్రసాదరావు, పతివాడకు హౌసింగ్ పీడీ డి.కుమార్ ప్రత్యేక అధికారులగా వ్యవహరించనున్నారు. వీరంతా అక్కడే ఉండి పర్యవేక్షించనున్నారు. వాతావరణ ఇబ్బందులను అధిగమించి, జిల్లా యంత్రాంగానికి సమాచారమిచ్చేందుకు దోహదపడే విధంగా ఆయా గ్రామాల్లో ‘వెరీ హై ప్రీక్వెన్సీ వైర్లై స్’ సెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం వద్ద ఆ స్థాయి వైర్లెస్ సెట్లు లేకపోయినప్పటికీ జిల్లా పోలీసు యంత్రాంగం నుంచి తీసుకుని గ్రామాలకు చేరవేస్తున్నారు. అలాగే, భారీ వర్షాలకు రోడ్లు శిథిలమై రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందనే దృష్టితో రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, ట్రాన్స్కో అధికారులను అందుబాటులో ఉంచుతున్నారు. అవసరమైతే విశాఖ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకురానున్నారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అపాయకర పరిస్థితులు తలెత్తితే యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగేలా బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. వరద ఉద్ధృతి ,పెనుగాలులకు నివాస ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంటే వారికోసం సురక్షిత ప్రాంతాల్లో 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 15,670మందికి సరిపడా ఆహార, వసతులను కల్పించనున్నారు. విపత్తు నిర్వహణ ఓఎస్డీగా శోభజిల్లా విపత్తు నిర్వహణ ఓఎస్డీగా పీఏ శోభను ప్రభుత్వ నియమించింది. ఈమె గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. -
తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాకు తుఫాన్ హెచ్చరికలు ఉన్నందున అధికారులంతా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తక్షణమే చేపట్టాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అన్నారు. అధికారులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ రాక ముందే ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ అనంతరం జరిగే నష్టాలను పూడ్చేందుకు, బాధితులకు పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తుఫాన్ సమయంలో బాధితులకు అందించేందుకు తాగునీరు, మంచి ఆహారం, కిరోసిన్, బియ్యం తదితర సరుకులను సిద్ధం చేయూలన్నారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గతంలో తుఫాన్లను ఎదుర్కొన్నట్టే ఈసారి కూడా ఎలాంటి లోపాలు లేకుండా పని చేయూలని కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశామన్నారు. అయినా ప్రత్యేకాధికారులు వారిని సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు. వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఉంటూ నిరంతరం పర్యవేక్షిం చాలన్నారు. వాతావరణ శాఖ అందిస్తున్న సమాచారా న్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పనిచేయూలన్నారు. చిన్న పిల్లలకు అవసరమయ్యే పాల డబ్బాను, తాగునీటిని నిల్వ ఉంచాలని సూచించారు. వైద్యాధికారులు మందులతో సిద్ధంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాల కు తరలించాలన్నారు. చెట్లు, పాడుబడిన భవనాల్లో ప్రజలు నివాసం లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తమ ఆస్తులను వదిలి తర లివెళ్లేందుకు సుముఖంగా ఉండరని, ప్రాణనష్టం, పశునష్టం కన్నా ఆస్తులు ఎక్కువ కాదనే విషయూన్ని వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జేసీ బి.రామారావు, ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, ఆర్డీఓ జె.వెంకటరావు, డీఎస్ఓ హనుమంతు వెంకటప్రసాదరావు, డీపీఓ మోహనరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. తీరంలో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ పూసపాటిరేగ : హుదూద్ నేపథ్యంలో తీరంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆయన గురువారం సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీరప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అధికారులను అప్రమత్తం చేస్తున్నట్టు తెలి పారు. తీరప్రాంతంలో గల ఆరు రెవెన్యూ గ్రామాల్లో తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆరుగురు ప్రత్యేక అధికారులను నియమించినట్టు తెలిపారు.ఎన్డీఆర్ఎఫ్ దళం కూడా నియమించినట్టు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రెండు మండలాల్లో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పునరావాస కేంద్రాలకు అవసరమైన సరుకులు, రేషన్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. -
'హుదూద్'కు 51 సహాయక బృందాలు
న్యూఢిల్లీ : హుదూద్ తుఫాను నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్టీఆర్ఎఫ్) 51 సహాయక బృందాలను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 బృందాలను తరలిస్తోంది. శ్రీకాకుళం-2, విజయనగరం-1, విశాఖ-1, తూర్పు గోదావరి జిల్లా-1 బెటాలియన్లను పంపుతోంది. విశాఖపట్నం, భువనేశ్వర్ కేంద్రంగా సహాయ కార్యక్రమాలు అందించనుంది. బాధితు ప్రాంతాలకు 162 బోట్లు, 54మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేసింది. విశాఖపట్నంలో ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్స్ను డీఐజీ పర్యవేక్షించనున్నారు. తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని పరికరాలను ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లనున్నాయి. మరోవైపు 'హుదూద్' తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో ఈ తుఫాను మరింత బలపడనున్నట్లు వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీర, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించింది. -
విశాఖకు నాలుగు మిలటరీ దళాలు
హుదూద్ తుఫాను నేపథ్యంలో విశాఖపట్నానికి కేంద్రప్రభుత్వం నాలుగు మిలటరీ దళాలను పంపింది. విశాఖపట్నం - గోపాల్పూర్ ప్రాంతాలకు మధ్యలో తుఫాను తీరం దాటనున్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ సమయంలో తీవ్ర విలయం సంభవించే ప్రమాదం ఉందన్న సూచనలతో ఈ చర్యలు తీసుకుంది. మరోవైపు గోదావరి జిల్లాలపై కూడా తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉండేలా ఉంది. దాంతో తూర్పుగోదావరి జిల్లాలో తీరం వెంబడి ఉన్న 13 మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలలో కంట్రోల రూంలు ఏర్పాటుచేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి తిరిగి రావాలని తెలిపారు. కాకినాడ పోర్టులోనూ రెండోనెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు.