హుదూద్ పెను తుపాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో విశాఖ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నగరంలో కొన్ని భవానాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. మొబైల్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. విశాఖలో విద్యుత్ సరఫరాను ఆపివేశారు. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.