'రాజీనామా చేస్తానంటే నేనే వద్దన్నా' | sridhar babu offered resignation but i stopped him, says janareddy | Sakshi
Sakshi News home page

'రాజీనామా చేస్తానంటే నేనే వద్దన్నా'

Published Wed, Jan 1 2014 2:33 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'రాజీనామా చేస్తానంటే నేనే వద్దన్నా' - Sakshi

హైదరాబాద్ : శాఖ మార్పు వ్యవహారంలో శ్రీధర్ బాబు రాజీనామా చేస్తానంటే తానే వద్దన్నానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీధర్ బాబు శాఖ మార్చటం అనైతికం, అప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జానారెడ్డి విమర్శించారు.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని జానా అన్నారు. ఈనెల 3వ తేదీన మినిస్టర్స్ క్వార్టర్స్లో సమావేశం కావాలని తెలంగాణ నేతలను జానారెడ్డి ఈ సందర్భంగా కోరారు. కాగా సీఎం వ్యవహారశైలిపై తెలంగాణ ప్రాంత మంత్రులు ఈరోజు రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement