స్కూల్ ఆటో బోల్తా : విద్యార్థి మృతి | Student dies in Road accident | Sakshi

స్కూల్ ఆటో బోల్తా : విద్యార్థి మృతి

Jun 29 2015 5:41 PM | Updated on Nov 9 2018 4:36 PM

విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు.

కర్నూలు (కోడుమూరు) : విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు.  కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆటోలో ఇంటికి తిరిగి వెళుతుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిని విద్యార్థులను  స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement