రెబల్స్కి తలొగ్గిన బాబు
Published Mon, Mar 6 2017 8:42 AM | Last Updated on Fri, Aug 10 2018 7:13 PM
అమరావతి: స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో టీడీపీ రెబల్స్కే సీట్లు కేటాయించారు సీఎం చంద్రబాబు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో, రెబల్స్కే అధిక ఎమ్మెల్సీలు ఇచ్చారు.
శ్రీకాకుళం నుంచి శత్రుచర్ల, కర్నూలు నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, ప్రకాశం నుంచి కరుణం బలరాం, పోతుల సునీత మాకు టికెట్లు ఇవ్వకపోతే రెబల్స్గా నామినేషన్ వేస్తామన్నారు. చిత్తూరులో దొరబాబు, అనంతలో దీపక్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గిన బాబు వారికి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారని గుసగుసలు వినిపిస్తున్నారు.
Advertisement
Advertisement