రంగారెడ్డి జిల్లాలోని దెబ్బడిగల్లో తెలుగుదేశంపార్టీ నేత రవీందర్ నివాసంపై గురువారం తెల్లవారుజామున ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో రూ. 5 లక్షల విలువైన నకిలీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు ఆయన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయన్ని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం ఎక్కడి నుంచి తెస్తున్నారు. ఎన్నాళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు అనే అంశాలపై పోలీసులు రవీందర్ను తమదైన శైలీలో ప్రశ్నిస్తున్నారు.