Ravinder
-
హెచ్ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరమైనదేమీ కాదు
సుల్తాన్బజార్: హ్యూమన్ మెటాప్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ ఒక ఫ్లూ వంటిదని, సాధారణ నియమాలు పాటిస్తే తగ్గిపోతుందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాయక్ పేర్కొన్నారు. ఈ వైరస్ చిన్నపాటి లక్షణాలతో వచ్చే వైరస్ అన్నారు. దానిని నియంత్రిస్తే ఎలాంటి ప్రమాదం లేదన్నారు. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపే ఒక రకమైన వైరస్ అన్నారు. హెచ్ఎంపీవీని మొదట 2001లోనే గుర్తించారని, ఇదేమీ కొత్త వైరస్ కాదన్నారు. అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో ఇది సోకుతుందని.. మన రాష్ట్రంలో ఈ లక్షణాలు ఏమీ లేవన్నారు. హెచ్ఎంటీవీ లక్షణాలు తేలికపాటి జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల వరకు ఉంటాయని రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందుల్లాంటి సాధారణ లక్షణాలు ఉంటాయని ఆయన వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్ఎంపీవీని గుర్తించడానికి పీసీఆర్ పరీక్ష, యాంటిజెన్ డిటెక్షన్, సిరాలజికల్ పరీక్షలు చేయవచ్చన్నారు. దీని నివారణ కోసం తరచుగా చేతులు కడుక్కోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలును ఉపయోగించడం, అస్వస్థతగా ఉన్న వారి నుంచి దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ కాలంలో అన్ని వసతులు సౌకర్యాలతో సమర్థంగా ఉందన్నారు. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైనది కాదని, చలికాలంలో వచ్చే చిన్నపాటి ప్లూగా ఉంటుందని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని రవీంద్ర నాయక్ సూచించారు. -
జమ్ముకశ్మీర్ ఫలితాలు.. బీజేపీ చీఫ్ ఓటమి
పదేళ్ల తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన మెజార్జీకి(45)మించి 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు లాంఛనంగా మారింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.కాగా జమ్ముకశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటికి భిన్నంగా ఫలితాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది. దీంతో బుద్గామ్లో గెలుపొందిన ఒమర్ అబ్దుల్లానే సీఎంగా బాధ్యతలు చేపడతారని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దులా పేర్కొన్నారు. -
జమ్మికుంట కౌన్సిలర్ అరాచకం..
జమ్మికుంట: ప్రభుత్వ భూమి కబ్జా చేసి బోరు వేయడమే కాకుండా.. ఆక్రమణ సరికాదని అడ్డుచెప్పిన ముగ్గురు గ్రామస్తులపై కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రామన్నపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మూడోవార్డులోని రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంక్ సమీప సర్వే నంబర్ 422లో కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. అక్రమంగా బోరు వేసేందుకు యత్నిస్తుండగా , గ్రామస్తులు మర్రి మల్లయ్య, కోలకాని రాజు, మేడిపల్లి రమేశ్ అడ్డుకున్నారు. ఆగ్రహించిన కౌన్సిలర్ రవీందర్.. బుధవారం ఇనుప రాడ్తో ముగ్గురిపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దాడిలో మల్లయ్య, రాజుకు తీవ్రగాయాలు కాగా రమేశ్కు గాయాలయ్యాయి. మల్లయ్యను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మిగిలిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మల్లయ్య భార్య రజిత ఫిర్యాదు మేరకు రవీందర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వి.రవి తెలిపారు. -
ఆయన తగ్గలేదు.. నేనే లావెక్కుతా: మహాలక్ష్మి
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి వివాహం తర్వాత చాలా మంది నుంచి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో భారీగా వైరల్ అయ్యాయి. వివాహం తర్వాత రవీందర్ చాలా అవహేళనలు ఎదుర్కొన్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయన మితిమీరిన బరువు ఉండటమే.. మహాలక్ష్మి మాత్రం నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఈ జంట మాత్రం లైఫ్ను ఆనందంగానే లీడ్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త గురించి ఓపెన్గా చెప్పింది. తనను ఎక్కువగా బాధపెట్టిన దాని గురించి బహిరంగంగా మాట్లాడింది. 'మా పెళ్లి సందర్భంగా చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు. అలాగే నా భర్త రవీందర్ బరువు ఎక్కువగా ఉండడంతో ఆయన కోసం నేనూ బరువు పెరిగేందుకు ప్లాన్ చేస్తున్నాను. బరువు తగ్గాలని రవీందర్ ఎంత ప్రయత్నం చేసినా అది కుదరడం లేదు.. కాబట్టి నేనే ఆయన మాదిరి బరువు పెరగాలని చూస్తున్న. బరువు పెరిగేందుకు నేను అధికంగా కొవ్వు పదర్థాలు కూడా తీసుకుంటున్నాను. ఆర్ధరాత్రి సమయంలో ఎక్కువగా ఫుడ్ తింటున్నాను. ఆ సమయంలో నాకు నిద్ర కూడా పోతుంది. ఎలాగైనా నేను కూడ ఆయనలా మారాలి. అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయి అనుకుంటా.' అని ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ తన భర్త రవీందర్ జుట్టు నెరిసిపోవడం చాలా బాధగా ఉందని ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మహాలక్ష్మి నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తన భర్త చెప్పినా అందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. ఏమేమైనా త్వరలో బరువు పెరగాలనే ఆలోచనతో మహాలక్ష్మి ఉంది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు కోలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. మహాలక్ష్మి, రవీందర్ ఇద్దరిదీ కూడా రెండో పెళ్లినే.. ఇద్దరికీ మొదటి వివాహం నుంచి ఒక బిడ్డ ఉంది. మొదటి వివాహం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.పెళ్లి సమయంలో మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్ని పెళ్లిచేసుకుందని, అతని సంపద చూసి నటి పెళ్లికి సిద్ధమైందని పలువురు చెప్పారు. అంతేకాదు మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పొందడానికి నిర్మాత రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశారని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే ట్రోల్స్ను అధిగమించి మంచి వైవాహిక జీవితాన్ని గడపగలమని వారు చాలాసార్లు నిరూపించారు. ఆ మధ్య వారిద్దరూ విడాకులు తీసుకున్నారనే పుకార్లు వచ్చాయి. వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. ఆ మధ్య రవీందర్పై చీటింగ్ కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకున్నారంటూ నిర్మాతపై కేసు నమోదైంది. చివరికి ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల మృతి
జైనథ్, వాంకిడి, కోటపల్లి: రాష్ట్రంలో పిడుగు పాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో ఓ మహిళ సహా ముగ్గురు రైతులు దుర్మరణం పాలైన ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామానికి చెందిన రైతు షేక్ యాసిన్(41) తన భార్య అఫ్సానాతో పొలంలో పత్తికి పురు గుల మందు పిచికారీ చేస్తుండగా భారీ వర్షం మొదలైంది. దీంతో ఇంటికి వెళ్లేందుకు ఎడ్లబండిని సిద్ధం చేసేందుకు చెట్టు కిందకు వెళ్ల గా ఒక్కసారిగా పిడుగుపడటంతో యాసిన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. రెండు ఎడ్లు సైతం అక్కడికక్కడే మృతి చెందాయి. కొంత దూరంలో ఉన్న అఫ్సానాకు తలకు గాయాలై స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలో పత్తి చేనులో ఎరువు వేస్తు న్న క్రమంలో భారీ వర్షం రావడంతో చింత చెట్టు వద్దకు వెళ్లి పిడుగు పాటుకు గురై మన్నెగూడ గ్రామానికి చెందిన పద్మబాయి(23) మృతి చెందారు. పక్కనే ఉన్న ఆమె భర్త గేడం టుల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రైతు రావుల రవీందర్ (25) పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా పిడుగు పడి స్పృహకోల్పోయాడు. దగ్గరలోనే ఉన్న భార్య లావణ్య వెంటనే రవీందర్ను చెన్నూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఏడాది క్రితమే వారికి వివాహమైంది. -
హోంగార్డులను స్టేషన్లోనే ఉంచండి
సాక్షి, హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు పోలీస్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. హోంగార్డులంతా డ్యూటీలోనే ఉండాలని, డ్యూటీ అయిపోయిన వారిని కూడా పోలీస్ స్టేషన్లకే పరిమితం చేయాలని హుకుం జారీ చేసినట్టు ఓ ఆడియో వైరల్ అయ్యింది. రవీందర్ మృతికి నిరసనగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం అయినట్టు తెలిసింది. ఆదేశాలు మీరితే విధుల నుంచి బహిష్కరణకు గురవుతారని ఓ దశలో బెదిరింపు ధోరణిలో హెచ్చరించినట్టు తెలిసింది. ’రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు’ ‘విధుల్లో ఉండే హోంగార్డులు, డ్రైవర్లు, ఆఫీసర్ల దగ్గర పనిచేసే వాళ్లయినా, డే డ్యూటీ చేసేవాళ్లు, ఇంకే డ్యూటీలో ఉండేవాళ్లయినా సరే ప్రతి ఒక్కరూ ఈ రోజు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. స్టేషన్ వదిలి బయటికి వెళ్లకూడదు. డ్యూటీ అయిపోయిన వాళ్లను కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచండి..రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు. ఎవరెవరైతే ఆబ్సెంట్లో ఉన్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టండి. పది నిమిషాల తర్వాత మళ్లీ నాకు చెప్పండి. ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్లను మిస్కండక్ట్ కింద తీసుకోబడుతుంది. వాళ్ల ఉద్యోగానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్. అందరికీ పేరు పేరున ఫోన్ చేసి తెలపండి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ...’అని ఓ పోలీస్ అధికారి సెట్లో ఆదేశాలిస్తున్న ఆడియో ఒకటి శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లపై బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నా...హోంగార్డులు అంతర్గతంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కుట్రతోనే డీఎంకే వ్యాఖ్యలు: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: రాజకీయకుట్రలో భాగంగా, తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి, మంత్రులపై ఉన్న అవినీతి, ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార డీఎంకే గందరగోళం సృష్టిస్తోందని బీజేపీ నేత తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. ఉదయనిధిస్టాలిన్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాలిన్తో పాటు కేంద్రమాజీమంత్రి ఎం.రాజాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ...తాను యజ్ఞయాగాలకు కేరాఫ్ అని చెప్పుకునే సీఎం కేసీఆర్, ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. -
హోంగార్డు రవీందర్ మృతి..ఉస్మానియా వద్ద హైటెన్షన్ వాతావరణం
-
హోంగార్డు రవీందర్ మృతి
సాక్షి, హైదరాబాద్: జీతం కోసం వెళ్తే అధికారులు అవమానించారంటూ ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్ను మూశారు. గోషామహల్లోని హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయం వద్ద మంగళవారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న రవీందర్కు 55 శాతం కాలిన గాయాలైన విషయం తెలిసిందే. ఆయనకు తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించగా.. మెరుగైన చికిత్స కోసం డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతదేహాన్ని ఉస్మా నియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రవీందర్ భార్య సంధ్య, కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నాకు దిగడంతో రోజంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేతనం కోసం వెళ్లి.. ఆందోళనకు గురై.. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. హైదరా బాద్ పాతబస్తీలోని రక్షాపురం ప్రాంతానికి చెందిన రవీందర్ (38) చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. తనకు జీతం రాకపోవడంతో రవీందర్ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాల యానికి వెళ్లి వాకబు చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేసే ఏఎస్సై నర్సింగ్రావు, కానిస్టేబుల్ చందు చులకనగా మాట్లాడటంతో రవీందర్ ఆవేదనకు లోనయ్యారు. ఆ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఆస్పత్రి వద్ద ఆందోళనతో.. పోలీసులు రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించగా.. ఆయన భార్య, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసు అధికా రుల వేధింపులతోనే రవీందర్ ఆత్మహత్యకు పాల్ప డ్డారని ఆరోపించారు. బాధ్యులైన ఇద్దరు పోలీసుల ను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. తన భర్త మృతిపై కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహా న్ని ఉస్మానియా మార్చురీకి తరలించడం ఏమిటని, తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారా? అనే సందేహాలు వస్తున్నాయని సంధ్య ఆరోపించారు. ఆమెకు సంఘీభావంగా రక్షాపురం బస్తీవాసులు, హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరు కున్నారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. చివరికి డీసీపీ లు సునీల్దత్, కిరణ్ ఖేర్, ఏసీపీ బాల గంగిరెడ్డి తదితరులు సంధ్యతో మాట్లాడి.. త్వరలో డీజీపీ వద్ద కు తీసుకెళ్లి న్యాయం చేస్తామని, పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో సంధ్య ఆందోళన విరమించారు. వైద్యులు పోస్టు మార్టం అనంతరం రవీందర్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. శనివారం రక్షాపురంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు రవీందర్ ఆత్మహత్యపై భార్య సంధ్య చేసిన ఫిర్యాదు మేరకు షాహినాయత్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య ఆరోపణల మేరకు హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయంలోని ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ తెలిపారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలి: రాజకీయ పక్షాలు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన రవీందర్ భార్య సంధ్యకు పలువురు రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, నేతలు మల్లు రవి, అంజన్కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, సీపీఐ నేతలు చాడ వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తదితరులు ఆమెకు బాసటగా నిలిచారు. ♦ రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, రూ.25 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.2 లక్షలు ఆర్థికసాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇక కేఏ పాల్ రూ.3.1 లక్షల చెక్కును సంధ్యకు అందించి ఓదార్చారు. ♦ హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు. హోంగార్డులకు సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. రవీందర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ♦ హోంగార్డు రవీందర్ మృతికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. హోంగార్డులను రెగ్యుల రైజ్ చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: రవీందర్ మృతి.. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ ఏమైంది? -
నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్ భార్య
సాక్షి, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ సూసైడ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘నా భర్తను తగలబెట్టారు. కానిస్టేబుల్చందు, ఏఎస్ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె. తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. "నా భర్త ఫోన్ అన్లాక్ చేసి మొత్తం డేటా డిలీట్ చేశారు. హమీద్ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్ బంక్లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారామె. జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు. రవీందర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. -
హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: టైంకి జీతం పడలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి చెందారు. చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కంచన్బాగ్ డీఆర్డీవో అపోలో వైద్యులు ప్రకటించారు. నాలుగు రోజుల కిందట.. జీతాలు పడలేదనే ఆవేదనతో ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. తీవ్ర గాయాలైన ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. హోంగార్డ్ రవీందర్ మృతిపై హోంగార్డ్ జేఏసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏం జరిగిందంటే.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) సాయంత్రం గోషామహల్లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. సకాలంలో జీతాలు అందక.. బ్యాంక్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అవుతోందన్న మనస్థానంతో రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 55 శాతం పైగా కాలిన గాయాలతో ఆయన తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఆపై పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. వేధింపులు కూడా.. అయితే ఆయన భార్య సంధ్య మాత్రం.. సకాలంలో జీతం అందకపోవడం మాత్రమే కాదని.. అధికారుల వేధింపులు కూడా తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణమని చెబుతున్నారు. జీతాలు అందకపోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు తన భర్తకి మంచి చికిత్స అందించలేని స్థితిలో ఉన్నానని, హోంగార్డుల దుస్థితికి ఇది నిదర్శనమని ఆమె పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ స్పందించాలంటూ కోరారామె. మరోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటన హోంగార్డుల్లో ఆవేశాగ్రహాలకు దారి తీసింది. విధుల బహిష్కరణతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణకు పిలుపు ఇచ్చింది హోంగార్డ్ జేఏసీ. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలంటూ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రవీందర్కు మద్దతుగా హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని సంఘీభావం కూడా ప్రకటించారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. రాజకీయ విమర్శలు ఇంకోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం రాజకీయ దుమారం రేపింది. ఎమ్మెల్యే రాజాసింగ్.. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వమే రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆస్పత్రికి వెళ్లి రవీందర్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. కనీస హక్కులను కూడా పరిరక్షించకుండా.. హోంగార్డ్ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని, హామీ ఇచ్చి ఐదేళ్లైనా హోంగార్డుల ఉద్యోగ భద్రత విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
హోంగార్డులూ..ఆత్మహత్యలు చేసుకోకండి
సంతోష్ నగర్: హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..పోరాడి హక్కులు సాధించుకుందామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయస్థితిలో అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ను ఆయ న గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ హోంగార్డుల విషయంలో శ్రమదోపిడీ జరుగుతోందని..వారికి కనీస హక్కు లు ఇవ్వడం లేదన్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. ఈ ఘటనపై విచారణ జరగాలన్నారు. ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ధర్నాకు కిషన్రెడ్డి మద్దతు: అపోలో డీఆర్డీఓ ఆస్పత్రి ఆవరణలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న హోంగార్డులకు కిషన్రెడ్డి మద్దతు తెలిపారు. 17 సంవత్సరాలుగా హోంగార్డుగా సేవలు అందిస్తున్న రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. మనం అవసరమైతే పోరాటం చేద్దాం కానీ.., ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాగా, హోంగార్డులను ఇలాంటి పరిస్థితిలో తాను ఎప్పుడూ చూడలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. అంతకు ముందు ఆయన రవీందర్ను పరామర్శించారు. -
అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా
అఫ్జల్గంజ్/సంతోష్నగర్: న్యాయంగా రావాల్సిన జీతాన్ని అడిగేందుకు వెళ్లిన తనను హోంగార్డు కార్యాలయ సిబ్బంది దూషించడంతోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు హోంగార్డు రవీందర్ తెలిపారు. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రక్షాపురం నివాసి రవీందర్ తనకు రావాల్సిన జీతం కోసం గోషామహల్లోని హోంగార్డు కార్యాలయానికి మంగళవారం వెళ్లారు. అక్కడి సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలు కాగా వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రవీందర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. హోంగార్డు అంటే ప్రతి నెలా 1వ తారీఖునే జీతాలిచ్చేయాలా అని చిన్నచూపు చూశారని ఆవే దన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానం రాష్ట్రంలోని ఏ హోంగార్డుకూ జరగకూడదన్నారు. కాగా ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రవీందర్ను రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్ నారాయణ పరామర్శించారు. రవీందర్ భార్య సంధ్యతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రవీందర్కు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 16 వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నిరసన తెలిపిన హోంగార్డులు..: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ బుధవారం సాయంత్రం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రి ఆవరణలో హోంగార్డులు ఆందోళనకు దిగారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలనీ, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సీఎందే బాధ్యత: కేంద్రమంత్రి కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రవీందర్ ఆత్మహత్యాయ త్నా నికి కేసీఆరే బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా 2017లో సీఎం కేసీఆర్ హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. హోంగార్డులకు బీజేపీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: బండి అమెరికా పర్యటనలో ఉన్న ఎంపీ బండి సంజయ్ బుధవారం రాత్రి (భారత సమయం) హోంగార్డు కుటుంబ సభ్యులతోపాటు హోంగార్డ్ అసోసియేష న్ జేఏసీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ వీడియోకాల్ చేసి మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ దృశ్యాలను వెంటనే బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. -
రవీందర్కు సీరియస్.. విధుల బహిష్కరణకు హోంగార్డ్ జాక్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: జీతాల ఆలసత్వంపై ఆవేదనతో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న హోంగార్డు జేఏసీ ఆస్పత్రికి చేరుకోగా.. బుధవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీందర్కు మద్దతుగా.. ఉస్మానియా హాస్పిటల్కు భారీగా తరలి రావాలని హోం గార్డ్ JAC పిలుపు ఇచ్చింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. అదే సమయంలో.. హోంగార్డులు ఎవరు అఘాయిత్యాలకు ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేసింది. జేఏసీ పిలుపు మేరకు హోంగార్డులు ఉస్మానియాకు తరలి వస్తున్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. సకాలంలో జీతం రావట్లేదనే ఆవేదనతో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. 55 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడరు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గోషామహల్లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మరోవైపు హోంగార్డులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై అధికార కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది హోంగార్డుల జేఏసీ. ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ.. హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి అని డిమాండ్ చేశారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న 22వేల హోంగార్డులను పర్మినెంట్ చేయాలన్నారు. మరొక హోంగార్డు రవీందర్ మాదిరి ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. -
మీకు దండం సారూ.. మీ వల్లే నేను ఇప్పుడు బతికున్నా..
హైదరాబాద్: ఆర్పీరోడ్ లోని దర్గా ప్రాంతం..ఆదివారం ఉదయం..కొద్దిసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అక్కడ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం వస్తున్నారు. బందోబస్తులో భాగంగా మహంకాళి ఏసీపీ రవీందర్తో పాటు మిగతా పోలీసులు, నాయకులు అక్కడ ఉన్నారు. ఇంతలో ఓ మహిళ దూరం నుంచి పరుగెత్తుకుంటూ..అయాసపడుతూ వారి దగ్గరకు వచ్చింది. పోలీసులతో పాటు అందరూ ఏమైందా, అని కంగారు పడ్డారు. కానీ వచ్చీ రావడంతోనే ఆ మహిళ ఏసీపీ రవీందర్ వద్దకు వెళ్లి ‘మీకు దండం సారూ..మీ వళ్లే నేను ఇప్పుడు బతికున్నా..మీరు చేసిన సహాయం మరచిపోలేను..అప్పుడు ఆపరేషన్ చేయించడం వల్లే ప్రాణాలతో ఉన్నా అంటూ ఆయాసపడుతూ చెప్పింది. వెంటనే అక్కడున్న వాళ్లు ఆమెను కొద్దిసేపు కూర్చోబెట్టి మంచి నీళ్లు తాగించి..ఏమైందంటూ ఆరాతీయగా...తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో ఉన్న ఆమెకు ప్రస్తుత మహంకాళి ఏసీపీ రవీందర్ సొంత డబ్బుతో ఆస్పత్రిలో చేరి్పంచి ఆపరేషన్ చేయించిన సంగతి చెప్పింది. 2014 సంవత్సరంలో టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లో రవీందర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన కార్వాన్కు చెందిన కవిత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేర్పించి సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించగా పూర్తి ఆరోగ్యంతో బయటపడింది. ఆ తర్వాత మళ్లీ ఆయన ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో కలవలేకపోయింది. ఆదివారం ఆమె కార్వాన్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళుతుంది. బస్సులో నుంచి బందోబస్తు విధుల్లో ఉన్న ఏసీపీ రవీందర్ను చూసి..గుర్తించి బస్సు ఆపాలని డ్రైవర్ను కోరింది. కానీ డ్రైవర్ ఆపకుండా ప్యాట్నీ సిగ్నల్ వరకు వెళ్లాడు. సిగ్నల్ దగ్గర బస్సు ఆగడంతో ఆమె బస్సు దిగి పరుగెత్తుకుంటూ దర్గా వరకు వచి్చంది. వచ్చీ రావడంతో ఆయనకు దండాలు పెడుతూ కన్నీరు పెట్టింది. మీ వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నా సారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు కలుస్తారో లేదో అనుకుంటూ పరుగెత్తుకొచ్చాను అంటూ చెప్పుకొచి్చంది. మీరు ఇంకా పెద్ద పోస్టులోకి రావాలి, ఎమ్మెల్యే అంత ఎదగాలి సారూ అంటూ కృతజ్ఞతాభావాన్ని చాటింది. ‘నా అన్న కోసం వెండి రాఖీ కొని తీసుకుని వచ్చి కడతా’ అంటూ చెప్పింది. అంతే కాకుండా తన ఫోన్లో భద్రపరుచుకున్న ఏసీపీ ఫొటోను చూపించి ఆశ్చర్య పరిచింది. ఈ సంఘటన చూసిన పోలీసులు, మీడియా ప్రతినిధులు, నాయకులు అందరూ ఆ మహిళ కృతజ్ఞతాభావాన్ని, ఏసీపీ మానవతా దృక్పథాన్ని అభినందించారు. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్రూమ్లు సైఫాబాద్లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
విల్లు.. వివాదాలకు చెల్లు
రఘు వయసు 51. అప్పటివరకూ కష్టపడి కూడబెట్టింది ఫిక్స్డ్ డిపాజిట్గా దాచుకున్నాడు. నామినీగా భార్య పేరు రాశాడు. కొన్నాళ్లకు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మరి.. రఘు డిపాజిట్లు మొత్తం నామినీగా ఉన్న భార్యకే దక్కాయా? అంటే లేదనే చెప్పాలి. సరస్వతి భర్త చిన్న వయసులోనే కాలం చేశాడు. వారికి పిల్లలు కూడా లేరు. ఉన్నదల్లా తల్లి, తండ్రి, అత్త మాత్రమే. ఈ పరిస్థితుల్లో సరస్వతి కూడా మరణిస్తే ఆమె సంపాదించినది ఎవరికి దక్కుతుంది? ముగ్గురికీ అనుకుంటున్నారా? కానీ చట్టప్రకారం ఒక్క అత్తకు మాత్రమే దక్కింది. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఘటనలు ఏ ఒకరిద్దరికో పరిమితం కాదు.. ఇటీవలి కాలంలో చాలా మంది ఇళ్లలో ఎదురవుతున్నవే. మరి ఒక వ్యక్తి తన ఆస్తులను ఇష్టం వచ్చిన వారికి ఇవ్వాలనుకుంటే ఎలా? నామినీకి, వీలునామాకు తేడా ఏమిటి? దాన్ని ఎప్పుడు రాయాలి.. ఎలా రాయాలి లాంటి వివరాలతో కథనం. వీలునామా అంటే... : ఒక వ్యక్తి మరణం తరువాత తన స్థిర, చరాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియజెప్పే చట్టబద్ధమైన డాక్యుమెంటే వీలునామా. మరణ వాంగ్మూలానికి ఎంత చట్టబద్ధత ఉందో అలాంటి చట్టబద్ధతే ఈ వీలునామాకు ఉంది. మనిషి బతికున్నంత వరకు వీలునామా ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. కానీ చివరిసారిగా రాసిన వీలునామానే చట్టప్రకారం చెల్లుబాటు అవుతుంది. వీలునామాపై ఇద్దరు సాక్షుల సంతకం తప్పనిసరి. ఆర్యోగంగా, మానసికంగా సరిగ్గా ఉన్న మేజర్లు రాసిన విల్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. భారతీయ వారసత్వ చట్టం సెక్షన్ 59 ప్రకారం విల్లు రాయాలి. నామినీ వేరు.. వారసులు వేరు..: చాలా మంది జీవిత బీమాకో.. బ్యాంకు ఖాతాకో.. ఇతర ఆర్థిక లావాదేవీలకో.. నామినీగా ఎవరినో ఒకరిని పెడతారు. తమకేమన్నా అయితే నామినీకి ఆ మొత్తం వెళుతుందనుకుంటారు. అయితే చట్టప్రకారం నామినీ అనేది వారసుల కిందకు రాదు. వ్యక్తి మరణించిన తర్వాత ఆ నగదు నామినీకి చెందదు. వారసుల్లో నామినీ ఉంటే వారికి చట్టప్రకారం వాటా మాత్రమే వస్తుంది. నామినీగా ఒక వారసుడి పేరో లేదా వారసురాలి పేరో పెట్టినంత మాత్రాన ఆ నగదు మొత్తం వారికే చెందదు. ఇది తెలియని చాలా మంది నామినీగా ఫలానా వారి పేరు పెట్టారని వారికి రావాల్సిన వాటాను కోల్పోతుంటారు. వీలునామా రిజిస్ట్రేషన్అవసరమా?..: వీలునామాను రిజిస్ట్రేషన్ చేయిస్తే.. దాంతో లబ్దిదారులు బ్యాంకు రుణాలు, ఇతర అవసరాలకు వాడుకొనే వీలు ఉంటుంది. రిజిస్టర్ అయిన వీలునామాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నామమాత్రపు చార్జీతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. తెల్ల కాగితంపై రాసినా చట్టబద్ధమే. కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తికయినా వీలునామాను ఎక్కడ భద్రపరిచిందీ తెలియజేయాలి. ఆన్లైన్లో వీలునామా సేవల కోసం ఓ సంస్థ..: అత్యంత స్వల్ప రుసుముతో ఆన్లైన్ ద్వారా చట్ట ప్రకారం విల్లు సిద్ధం చేసే లక్ష్యంతో ఆసాన్విల్ అనే సంస్థ ఏడాది క్రితం ప్రారంభమైంది. ఈ సంస్థ రూపకర్త తెలంగాణ వ్యక్తి విష్ణు చుండి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉన్నట్లు.. వీలునామా కూడా ఉండాలన్నదే ఆ సంస్థ లక్ష్యం. అంతేకాదు.. తమ వద్దకు వచ్చే వారిని సేవా కార్యక్రమాలు, అవయవదానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ. 100 కోట్లను వివిధ చారిటీలకు అందించారు. దీనికిగాను 2018లో ది సొసైటీ ఆఫ్ విల్ రైటర్స్ నుంచి గుర్తింపు పత్రం అందుకున్నారు. రూ. 1,50,000 కోట్లు.. ఎవరికీ చెందకుండా దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లో, బీమా పాలసీ కంపెనీల్లో పేరుకుపోయిన నగదు లెక్క ఇది. (లెక్కల్లోకి రానిది ఈ మొత్తంకన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు.) స్పృహలో లేనప్పుడు రాస్తే చెల్లదు... సొంతంగా సంపాదించిన ఆస్తులకు, ఆదాయానికి సంబంధించి మాత్రమే వీలునామా రాయొచ్చు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు చట్టప్రకారం వారసులకే ఆ ఆస్తులు దక్కుతాయి. ఆ వ్యక్తి మరణానంతరమే వీలునామా అమల్లోకి వస్తుంది. మత్తులో ఉన్న సమయంలోనూ, తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పుడు, తాను ఏం చేస్తున్నానన్న దానిపై స్పృహ లేని వ్యక్తులు వీలునామా రాయడానికి అవకాశం లేదు. – సామల రవీందర్, ప్రభుత్వ న్యాయవాది, హైకోర్టు -
బర్త్డే కానుకగా భర్తకు 6 అడుగుల గిఫ్ట్ ఇచ్చిన నటి.. వైరల్ వీడియో!
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ జంట పాపులర్ అయిపోయింది. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ కూడా చేశారు నెటిజన్లు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) వారి పెళ్లి అయి రెండేళ్లు దాటింది.. ఈ జర్నీలో వారిద్దరిపై భారీగానే ట్రోలింగ జరిగింది. ఒకసారి అయితే ఏకంగా ఈ జంట విడాకులు తీసుకుంటుందని ప్రచరాం జరిగింది. పెళ్లి అయి అన్నేళ్లైనా ఇంకా ఎందుకు తల్లివి కాలదేని ఇలా పలు రకాలుగా ఆ జంటపై పలు కామెంట్లు వచ్చేవి. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నామని బహిరంగానే ఆ జంట చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ప్రముఖ సింగర్తో అనిరుధ్ ప్రేమాయణం) తాజాగా రవీందర్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు 6 అడుగుల ప్రత్యేక బహుమతిని ఇచ్చి మహాలక్ష్మి ఆశ్చర్య పరిచింది. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో కూడా పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యేక బహుమతి ఏమిటంటే... 6 అడుగుల ఎత్తు ఉన్న రవీంద్ర ఫోటోను చక్కటి పెయింటింగ్తో తయారు చేయించి తన భర్తకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. మహాలక్ష్మి బర్త్డే విషెష్ చెబుతూ ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసింది. 'జీవితంలో నాకు మళ్లీ ధైర్యం తెచ్చిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరే నా బలం. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు లైక్లతో పాటు పాజిటివ్ కామెంట్లు పెట్టారు. పలువురు రవీందర్కు విషెస్ చెబుతూ.. చెత్తగ మాట్లాడే వారిని పట్టించుకోకుండా ఇలా సంతోషంగా జీవితంలో ముందుకు సాగాలని కోరారు. -
కూతురు ప్రేమపెళ్లి.. ఇటుకలపల్లిలో సర్పంచ్ వీరంగం..
సాక్షి, వరంగల్ జిల్లా: నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి సర్పంచ్ ఆగ్రహంతో తన బిడ్డను పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు వారి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు. నిప్పంటించడంతో పర్నిచర్ దగ్ధమయ్యింది. ప్రేమజంట హసన్పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం సర్పంచ్ హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహంతో స్వగ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మిత్రుల ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
ఓయూ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు కృషి
లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపుగా రూ. 120 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ తెలిపారు. రీఫార్మ ఫర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్లో భాగంగా రెండేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణల ప్రగతిని వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఓయూ వైస్ చాన్స్లర్గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి ఇనిషి యేటివ్స్.. ఈవెంట్స్... అచీవ్మెంట్స్ 2021–23 పేరుతో రూపొందించిన ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం అకడమిక్ పరిపాలనా వ్యవస్థలను పటిష్టం చేయడం, విద్యా పరిశోధనా రంగాల్లో మేటిగా నిలపడమే ధ్యేయంగా తాము చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. మరో వందేళ్ల పాటు ఓయూ తన కీర్తి ప్రతిష్టను కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్రావు, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో యూనివర్సిటీని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపే కార్యక్రమం కొనసాగతోందని స్పష్టం చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఓయూ 22వ స్థానాన్ని సాధించడం, డబ్ల్యూసీఆర్సీ లీడర్స్ ఆసియా వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022 యూకేలోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో అవార్డు అందుకోసం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రూ. 120 కోట్లతో బాయిస్ హాస్టల్స్, శతాబ్ది నూతన పరిపాలనా భవనం, పైలాన్, ఓపెన్ ఎయిర్ థియేటర్తో పాటు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వీసీ వివరించారు. ఓయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు తక్ష పేరుతో ప్రత్యేకంగా మూడు రోజుల కార్యక్రమాలతో పాటు ఉస్మానియా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించామన్నారు. అకడమిక్ కేలండర్ను సరిదిద్దడం, ఏటా స్నాతకోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని వీసీ వెల్లడించారు. మార్కెట్కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగు పరచడంతో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఇంజినీరింగ్లో కృత్రిమ మేధ మిషన్ లెరి్నంగ్, మైనింగ్, బీఏ హానర్స్, డిగ్రీలో ఏ కోర్సు చదివిన వారైనా ఆర్ట్స్ సోషల్ సైన్సెస్లో పీపీ చేసే వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చామని వీసీ వివరించారు. ఇది సివిల్ సర్విసెస్ వైపు వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. వివిధ అంశాలపై దాదాపు 10 విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ చేసుకున్నామన్నారు. ఎలాంటి ఫైరవీలు, ఒత్తిళ్లకు తావు లేకుండా ఆన్లైన్ అర్హతా పరీక్షలు, అకడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులైన వారికే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బోధన, బోధనేతర సిబ్బంది యూనివర్సిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములై ఉస్మానియా యూనివర్సిటీ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసేందుకు కలిసి రావాలనీ ఓయూ వీసీ రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్లు స్టీవెన్సన్, జి.మల్లేషం, శ్రీరాం వెంకటేష్, గణేష్, వీరయ్య, ప్యాట్రిక్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, సీనియర్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ వర్సిటీలో పాలకమండలి సభ్యులు, వైస్ చాన్స్లర్ మధ్య న డుస్తున్న పోరు మరో స్థాయికి చేరుకుంది. శుక్రవా రం వీసీ రవీందర్ గుప్తా ఉన్నతవిద్యా శాఖ కమిష నర్ నవీన్ మిట్టల్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వర్సిటీ నుంచి ప్రకటన విడుదల చేశారు. మరోవై పు నవీన్ మిట్టల్ చైర్మన్గా శుక్రవారం హైదరాబాద్ లోని రూసా భవనంలో తెయూ పాలకమండలి 57వ సమావేశం జరిగింది. వీసీ రవీందర్ గుప్తా న వీన్ మిట్టల్పై ఆరోపణల పర్వాన్ని మరింత పెంచ గా, పాలకమండలి సభ్యులు సైతం తమ చర్యలకు మరింత పదును పెడుతున్నారు. ఏకంగా వర్సిటీ వ్యవహారాల విషయమై ఉన్నత స్థాయి దర్యాప్తు చే యించేందుకు, ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసు లు పెట్టేందుకు తీర్మానం చేయడం గమనార్హం. నవీన్ మిట్టల్ చైర్మన్గా.. వర్సిటీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఉన్నత స్థా యిలో విచారణ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పాలకమండలి తీర్మానం చేసింది. తె లంగాణ యూనివర్సిటీల చట్టం 1991 మేరకు సెక్ష న్ 18(1) ప్రకారం 10 మంది సభ్యుల కోరం ఉండడంతో ఈసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వీసీ హాజరు కాకపోవడంతో ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చైర్మన్గా వ్యవహరించా రు. 1991 తెలంగాణ యూనివర్సిటీల చట్టంలోని సెక్షన్ 15(1) ప్రకారం రిజిస్ట్రార్ను నియమించేందుకు ఉన్న పూర్తి అధికారంతో పాలకమండలి ప్రొఫెసర్ యాదగిరిని పునర్నియామకం చేసింది. 2021 అక్టోబర్ 30న యాదగిరిని రిజిస్ట్రార్గా ఈసీ నియమిస్తే, వర్సిటీల చట్టంలోని 50.6(ఏ) నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్లుగా వీసీ నియమించడం చట్టవ్యతిరేకమన్నారు. ఈసీ నియమించిన రిజిస్ట్రార్ పదవీకాలం పూర్తయితే లేదా ఆ స్థానం ఖాళీ గా ఉంటే మాత్రమే కొత్త రిజిస్ట్రార్ను నియమించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈసీ ఆమోదం లేకుండా శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలాదేవి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం తదితరాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, ఏసీబీ డీజీ, నిజామాబాద్ సీపీలతో విచారణ చేయించాల ని తీర్మానించారు. 2022–23, 2023– 24 బడ్జెట్కు సంబంధించి సైతం విచారణ చేపట్టాలని, ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించా రు. తెయూలో అక్రమాలపై వరుస కథనాలను ప్రచురించిన ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపారు. స మావేశంలో ఈసీ సభ్యు లు గంగాధర్ గౌడ్, వసుంధరా దేవి, మారయ్య గౌడ్, ఎన్ఎల్ శాస్త్రి, రవీందర్రెడ్డి, ఆరతి, నసీమ్, ప్రవీణ్కుమార్, చంద్రకళ పాల్గొన్నారు. వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.. తెయూ (డిచ్పల్లి) : నాపై తప్పుడు, లేనిపోని అవినీతి ఆరోపణలతో తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను నాశనం చేస్తూ.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ నవీన్మిట్టల్ లక్ష్యమని తెయూ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని వారాలుగా తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని పరిణామాలపై తీవ్ర వేదనతో, బాధతో మీడియా ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తెయూ వీసీగా నియమించారని, అయితే నవీన్ మిట్టల్ ఇప్పుడు బ్యాక్డోర్ పద్ధతుల ద్వారా తన పరువు తీయాలని చూస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ కొన్ని నిరాధారమైన ఆరోపణలకు వివాదాలకు కేంద్రంగా మారిందన్నారు. వీటన్నింటికీ నవీన్ మిట్టల్ కారణమని చెప్పడానికి తనకు బాధగా ఉందన్నారు. మిట్టల్ తన నామినీ అయిన ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్గా ఎలాగైనా నియమించాలనే తపనతో ఇదంతా చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ యాదగిరిని తాను వ్యతిరేకిస్తున్నానని, వర్సిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో సహకరించలేడని పేర్కొన్నారు. ఏప్రిల్ 19, 2023 న హైదరాబాద్ రూసా కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ, రిజిస్ట్రార్గా యాదగిరిని నియమించాలని తీర్మానాన్ని ఆమోదించారని తెలిపారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించి ఈసీ నిర్ణయాలపై స్టే తెచ్చినట్లు తెలిపారు. ఒకే ఒక్క ఐఏఎస్ అధికారి తన ఉద్దేశాలు, చట్టవిరుద్ధమైన నిర్ణయాలతో విద్యాశాఖలోని మొత్తం వ్యవస్థలను తారుమారు చేయడం దురదృష్టకరమని వీసీ పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు సేవలందిస్తున్న గొప్ప యూనివర్సిటీ ఖ్యాతిని పణంగా పెట్టి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ యూనివర్సిటీకి విడుదల చేయాల్సిన రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్) మంజూరు నిధులను రూ.20 కోట్లను మిట్టల్ నిలిపివేస్తున్నారని ఆరోపించారు. రూసా డైరక్టర్గా ఉన్న మిట్టల్ తనకు నచ్చిన వ్యక్తిని ఇక్కడ రిజిస్ట్రార్గా నియమించినప్పుడే వర్సిటీకి ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు సుముఖంగా ఉండటం శోచనీయమన్నారు. మిట్టల్ అనవసర జోక్యాన్ని అడ్డుకుని యూనివర్సిటీని యథావిధిగా నిర్వహించేలా చూడాలని సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఇతర ఉన్నతాధికారులకు వీసీ విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఏ ఏజెన్సీ ద్వారానైనా న్యాయవిచారణకు తాను సిద్ధంగా ఉన్నట్లు వీసీ స్పష్టం చేశారు. -
మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారారు. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటూ ట్రోల్స్పై ఈ జంట స్పందించింది. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. అంతేకాదు తరచూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తూ ట్రోలర్స్ నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది ఈ జంట. అయినప్పటికీ వారిపై ట్రోల్స్ ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే గుడ్న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. మహాలక్ష్మి గర్భవతి అయినట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్ డేట్కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను రవీందర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోలో మహాలక్ష్మీ కాస్తా లావుగా, పొట్ట భాగం ముందుకు ఉన్నట్లుంది. చూస్తుంటే ఆమె గర్భవతి అన్నట్లుగాకనిపించింది. దీంతో ఆమెను చూసి మహాలక్ష్మి ప్రెగ్నెంటా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి రవీందర్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే అదే నిజం అనేట్టుగా ఉంది. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ‘ఐ లవ్ యూ చెప్పడంలోనే నా సంతోషం లేదు.. నేను వ్యక్తం చేయకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ ఈ ఫొటోకి రాసుకొచ్చాడు. దీంతో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్ మధ్యలో, మహాలక్ష్మి అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి తన మొదటి భర్తతో మగబిడ్డ జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా క్యాంపస్లో అత్యాధునిక సమీకృత పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అడోబ్ ముందుకొచ్చిందని ఉస్మానియా యూని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో, ఉస్మానియా పూర్వవిద్యార్థి శంతను నారాయణ్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఈ వివరాలను శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్ ద్వారా పంచుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో శంతను నారాయణ్తో భేటీ అయినట్టు తెలిపారు. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో విద్యార్థులు, పరిశోధకులకు ఉప యోగపడేలా ప్రతిపాదనలు రూపొందించాలని అడోబ్ సీఈవో కోరినట్టు తెలిపారు. శాన్ఫ్రాన్సి స్కోలో పలువురు పూర్వ విద్యార్థులను కలసి ఓయూ నిధుల సమీకరణపై చర్చించినట్టు చెప్పా రు. ఎంఐటీ, హార్వర్డ్ సహా ఇతర అమెరికన్ వర్సిటీలు ఆర్థిక సమీకరణ కోసం ఉపయోగించే ఎండోమెంట్లను అధ్యయనం చేయాలని, ఉస్మాని యాకు సైతం ఓ క్రమబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని శంతను నారాయణ్ ప్రతి పాదించినట్టు రవీందర్ చెప్పారు. ఓయూ మరో పూర్వవిద్యార్థి, ప్రఖ్యాత అప్లైడ్ మెటీరియల్ శాస్త్ర వేత్త, అప్లైడ్ వెంచర్స్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఓంకారం నలమాసతో కూడా చర్చించి నట్టు తెలిపారు. 21–పాయింట్స్ అజెండా, క్లస్టర్ సిస్టమ్, ఫ్యాకల్టీ పబ్లికేషన్లకు వీసీ అవార్డును ప్రవేశపెట్టడం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు, సంక్రమిత త్రీడీ తయారీ కేంద్రం ఏర్పాటు సహా వివిధ సంస్కర ణల గురించి వివరించినట్టు చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పన్నెండు మంది పూర్వ విద్యార్థులు, వివిధ కంపెనీల సీఈవోలతో భేటీ అయినట్టు చెప్పారు. ఓయూకు సహకరించేందుకు వారు సమ్మతిం చినట్టు తెలిపారు. -
విద్యార్థిగా చేరి.. నాయకుడిగా వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆలోచనలతో, ఆధునిక సంస్కరణలతో ఉస్మానియా యూనివర్సిటీ కీర్తిప్రతిష్టలను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఓయూ ఉప కులపతి దండెబోయిన రవీందర్ అన్నారు. సంస్కరణలు, పనితీరు, రూపాంతరం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చి నిజాం కాలేజీ, విశ్వవిద్యాలయ మహిళా కళాశాల సహా 9 కళాశాలలను ఎంపిక చేసి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రవీందర్ శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓయూ పురోగతిని ఆయన వివరించారు. ఆయన చెప్పిందేంటంటే... సివిల్ సర్వీస్ అకాడమీ.. ♦హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. దీనివల్ల ఉద్యోగాల కల్పన తేలికవుతుంది. కంపెనీలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థులకు తర్ఫీదునిచ్చే అవకాశం ఏర్పడింది. అంతర్జాతీయ విద్యా అవకాశాలపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం సహా ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రం పనిచేస్తోంది. ♦పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటు చేశాం. విద్యార్థిగా ఓయూలో చేరి నాయకత్వ లక్షణాలతో బయటకు వెళ్లాలన్నదే ఈ అకాడమీ లక్ష్యం. విద్యార్థి సమన్వయ కేంద్రం, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు సత్ఫలితాలనిస్తుంది. ♦సెమినార్లు, సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రదర్శనలు సహా ఇతర ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థులు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టూడెంట్ డిస్కోర్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. క్యాంపస్లో రాజకీయ కార్యకలాపాలకు అవకాశం లేకుండా వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇది అమలులో ఉంటుంది. విద్యార్థులకు యునీక్ ఐడీ.. ♦సెంటినరీ హాస్టల్ విద్యార్థులకు యునీక్ ఐడెంటిటీ సంఖ్యను కేటాయించి ప్రతి ఒక్కరికీ వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. సెంటినరీ హాస్టల్ బిల్డింగ్ చుట్టూ 120 సీసీ కెమెరాలు అమర్చి విద్యార్థుల రక్షణకు పెద్దపీట వేశాం. క్యాంపస్లో ప్రశాంత వాతావరణం కల్పించి శాంతిభద్రతలను కట్టుదిట్టం చేసే బాధ్యతను విశ్రాంత ఆర్మీ ఉద్యోగులకు అప్పగించాం. ♦రూ. 11 కోట్లతో 300 మంది నిజాం కళాశాల విద్యార్థినుల కోసం నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించాం. రూ.26 కోట్లతో 500 మంది బాలుర కోసం నిర్మించిన హాస్టల్ భవనాన్ని విద్యార్థినుల కోసం కేటాయించాం. మరిన్ని బాలికల నూతన హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. విద్యార్థినులకు ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించాం. ♦క్యాంపస్లోని ఓయూ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో పసిఫిక్ స్టడీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సోషల్ సైన్సెస్లో పరిశోధనలకు ఊతమిచ్చేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కేంద్రాలు నెలకొల్పాం. ♦‘ఆరోగ్యం, సౌందర్య సాధనాలలో సహజ పదార్థాల వాడకం’ హైబ్రిడ్ మాస్టర్ ప్రోగ్రామ్ను నిర్వహించడానికి ఫ్రాన్స్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బోర్డియాక్స్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నాం. -
కష్టపడితే నెలలో ‘గ్రూప్స్’ కొట్టొచ్చు
సాక్షి, హైదరాబాద్: పరీక్షల కోసం కాకుండా, పరిశోధనాత్మకంగా అభ్యాసన చేస్తే గ్రూప్స్లోనే కాదు సివిల్స్లోనూ రాణిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ అభిప్రాయపడ్డారు. కోచింగ్ సెంటర్స్కు వెళ్తేనే పోటీ పరీక్షలో విజయం సాధిస్తామనేది భ్రమని చెప్పారు. గ్రూప్స్లో ఇంటర్వ్యూ తొలగించినందున పరిజ్ఞానం ఉన్నవాడికి పారదర్శకంగా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థులు ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే అంశంపై రవీందర్ ‘సాక్షి’తో పంచుకున్న అంశాలు ఆయన మాటల్లోనే... లక్ష్య సాధన దిశగా విద్యార్థుల పాత్రేంటి? ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్య దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. చాలామంది విద్యార్థుల్లో అంతర్లీనంగా సామర్థ్యాలున్నాయి. దృష్టి పెడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగల సత్తా ఉంది. కానీ వాళ్లు స్వల్పకాలిక లక్ష్యాలకే ప్రాధాన్య మిస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. దీంతో గ్రూప్స్ పోటీకి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోలేకపోతున్నారు. దీన్ని గమనిం చిన తర్వాత ఓయూలో సివిల్స్ అకాడమీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీని కోసం రూ.37 లక్షలు ఖర్చు పెట్టాం. కోచింగ్ కేంద్రాలతో ఫలితం ఎలా ఉంటుంది? లక్షల మంది విద్యార్థులు కోచింగ్ కేంద్రాల బాట పడుతున్నారు. అక్కడికి వెళ్తేనే పోటీ పరీక్షల్లో రాణిస్తామని భ్రమ పడుతున్నారు. నా అనుభవం ప్రకారం ఇది శుద్ధ దండగ. అక్కడ కేవలం షార్ట్ కట్ పద్ధతులు మాత్రమే చెబుతారు. ఒకరకంగా ఇది మల్టిపుల్ చాయిస్ లాంటిదే. ఆ మాదిరి ప్రశ్న వస్తేనే అభ్యర్థి సమాధానం ఇవ్వగలడు. కానీ సొంతంగా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటే మెరుగైన రీతిలో గ్రూప్స్లో రాణించే వీలుంది. కాబట్టి కోచింగ్ కేంద్రాలకు వెళ్లి విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దు. ఏం చదవాలి? గ్రూప్స్కు సిద్ధమయ్యే విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా 8 నుంచి ఇంటర్ వరకూ ఉన్న పుస్తకాలను అభ్యసించాలి. వీటిల్లో లోతైన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎన్సీఈ ఆర్టీ, సీబీఎస్సీ ఇంటర్మీడియెట్ పుస్తకాలు.. రాష్ట్ర సిలబస్తో పోలిస్తే పోస్ట్గాడ్యుయేషన్ పుస్తకాలతో సమానం. ప్రతీ పాఠం తర్వాత పాఠానికి కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగే సత్తా విద్యార్థులకు ఉంటుంది. ఆప్షన్స్ ఎంపిక ఎలా ఉండాలి? ఈ మధ్య గ్రూప్–2లో సోషల్ సబ్జెక్టు ఆప్షన్గా తీసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులే మంచి స్కోర్ సాధించారు. కొత్త సబ్జెక్టు అయితే, మూలాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లోతుగా అధ్యయనం చేసే విద్యార్థి ఆప్షన్ విషయంలో ఏది తీసుకున్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి. సివిల్స్లో కూడా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా? సాధ్యమే. రోజూ ఒక గంట ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రముఖ రచయితల పుస్తకాలు చదవాలి. పోటీ పరీక్షలకు గ్రూప్ డిస్కషన్స్ చాలా ముఖ్యం. ఈ తరహా చర్చల వల్ల లోతైన పరిజ్ఞానం అలవడే వీలుంది. నెల రోజులు సీరియస్గా చదివితే కోచింగ్ సెంటర్కు వెళ్లకుండానే గ్రూప్స్ కొలువు కొట్టొచ్చు. అలాగే, ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. సమయపాలన చాలా ముఖ్యం. దీనిపై ప్రిపరేషన్ నుంచే దృష్టి పెట్టాలి. -
World Senior Wrestling Championship: రవిందర్ ఓటమి
World Senior Wrestling Championship: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ రవీందర్ దహియాకు నిరాశ ఎదురైంది. నార్వేలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆదివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగం కాంస్య పతక పోరులో రవీందర్ 0–10తో హరుతున్యాన్ (అర్మేనియా) చేతిలో ఓటమి చవిచూశాడు. భారత్కే చెందిన పంకజ్ (57 కేజీలు), రోహిత్ (65 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... యశ్ (74 కేజీలు), గౌరవ్ (79 కేజీలు), పృథ్వీరాజ్ (92 కేజీలు), అనిరుధ్ (125 కేజీలు) తొలి రౌండ్లో పరాజయం పాలయ్యారు. చదవండి: Ind W Vs Aus W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా.. -
జూనియర్ల జోరు
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ రవీందర్ ‘బంగారు’ ఆశలు ఫైనల్లో ఆవిరయ్యాయి. 61 కేజీల విభాగంలో అతను రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇరాన్ రెజ్లర్ రహ్మాన్ ముసా అమోజద్కలి 9–3తో రవీందర్ను ఓడించాడు. రెపిచేజ్ దారిలో ఉన్న రజతం అవకాశాల్ని యశ్ (74 కేజీలు), పృథ్వీ పాటిల్ (92 కేజీలు), అనిరుధ్ (125 కేజీలు) సద్వినియోగం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు చేరాయి. రజతం సహా మొత్తం 6 పతకాలు ఫ్రీస్టయిల్ రెజ్లర్లు గెలిచారు. 74 కేజీల కాంస్య పతక పోరులో యశ్ 12–6తో కిర్గిజిస్తాన్కు చెందిన స్టాంబుల్ జానిబెక్పై గెలుపొందగా, పృథ్వీ పాటిల్ (92 కేజీలు) 2–1తో ఇవాన్ కిరిలోవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. అనిరుధ్ (125 కేజీలు) 7–2తో అయిదిన్ అహ్మదోవ్ (అజర్బైజాన్)ను ఓడించాడు. ఫైనల్లో బిపాషా: మహిళల ఈవెంట్లో బిపాషా (76 కేజీలు) స్వర్ణ బరిలో నిలిచింది. ఆమె ఫైనల్ చేరడంతో భారత్కు కనీసం రజతం ఖాయమైంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో బిపాషా 9–4తో మంగోలియాకు చెందిన ఒద్బాగ్ ఉల్జిబాత్పై అలవోక విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 6–3తో కజకిస్తాన్ రెజ్లర్ దిల్నాజ్ ముల్కినోవాను ఓడించింది. 50 కేజీల విభాగంలో సిమ్రాన్ ఉడుం పట్టు సెమీస్లో సడలింది. ఎమిలీ కింగ్ షిల్సన్ (అమెరికా)తో జరిగిన పోరులో ఆమె ‘టెక్నికల్ సుపీరియారిటీ’లో పరాజయం చవిచూసింది. మిగతా రెజ్లర్లు సితో (55 కేజీలు), కుసుమ్ (59 కేజీలు), అర్జూ (68 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ► 4 X 400 మీ. మిక్స్డ్ రిలేలో భారత్కు కాంస్యం ► జావెలిన్లో ఇద్దరు ఫైనల్కు నైరోబీ: వరల్డ్ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్షిప్ తొలి రోజు భారత్ సత్తా చాటింది. 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. మన బృందం 3 నిమిషాల 20.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. కాంస్యం గెలిచిన భారత జట్టులో శ్రీధర్ భరత్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్ సభ్యులుగా ఉన్నారు. శ్రీధర్ ముందుగా పరుగు మొదలు పెట్టగా...ప్రియా, సుమ్మీ తర్వాతి లెగ్లలో పరుగెత్తారు. చివర్లో బ్యాటన్ అందుకున్న కపిల్...తనకు పోటీగా దూసుకొచ్చిన జమైకా అథ్లెట్ను వెనక్కి నెట్టి భారత్ను గెలిపించాడు. ఈ ఈవెంట్లో నైజీరియా (3 నిమిషాల 19.70 సెకన్లు), పోలండ్ (3 నిమిషాల 19.80 సెకన్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నాయి. అంతకు ముందు హీట్స్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ పరుగులో పాల్గొన్న అబ్దుల్ రజాక్ స్థానంలో ఫైనల్లో శ్రీధర్ బరిలోకి దిగాడు. వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్లో గతంలో భారత్ తరఫున సీమా అంటిల్ (కాంస్యం – డిస్కస్, 2002), నవజీత్ కౌర్ (కాంస్యం – డిస్కస్ 2014), నీరజ్ చోప్రా (స్వర్ణం – జావెలిన్, 2016), హిమ దాస్ (స్వర్ణం – 400 మీ., 2018) పతకాలు గెలుచుకున్నారు. షాట్పుట్లో ఫైనల్కు: వరల్డ్ చాంపియన్షిప్ మరో మూడు ఈవెంట్లలో భారత్కు మంచి ఫలితాలు లభించాయి. షాట్పుట్లో అమన్దీప్ సింగ్ గుండును 17.92 మీటర్లు విసిరి ఫైనల్కు అర్హత సాధించాడు. ప్రియా మోహన్ 400 మీటర్ల పరుగులో కూడా ఫైనల్కు చేరుకుంది. జావెలిన్ త్రోలో ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టడం విశేషం. అజయ్ సింగ్ రాణా (71.05 మీటర్లు), జై కుమార్ (70.34 మీటర్లు) క్వాలిఫయింగ్లో సత్తా చాటి ఫైనల్ చేరారు. -
టీవీవీ గౌరవాధ్యక్షుడు రవీందర్రావు అరెస్టు
సాక్షి, రామకృష్ణాపూర్(చెన్నూర్): తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గురిజాల రవీందర్రావును పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మావోయిస్టు భావజాల వ్యాప్తి చేస్తున్నారన్న అభియోగాలతో ఆయన స్వగృహం రామకృష్ణాపూర్ పరిధి క్యాతనపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 సిమ్ కార్డులు, విప్లవ సాహిత్యంతో కూడిన సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ‘రవీందర్రావు టీవీవీ ముసుగులో మావోయిస్టులకు సహకరిస్తున్నారు. రవీందర్రావు ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యానికి ఆశ్రయమిచ్చారు. సుబ్రహ్మణ్యం గత నవంబర్లో 20 రోజుల పాటు రవీందర్రావు ఇంట్లో తలదాచుకున్నాడు. రవీందర్రావు మావోయిస్టు కీలక నేతలతో అందుబాటులో ఉంటూ అర్బన్ నక్సలిజాన్ని విస్తరింపజేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ పోలీసుల పక్కా సమాచారం మేరకు రవీందర్రావు ఇంట్లో సోదాలు నిర్వహించాం. రవీందర్రావుపై 120, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నాం..’అని సీపీ తెలిపారు. పీపుల్స్వార్లో క్రియాశీలకంగా.. క్యాతనపల్లికి చెందిన రవీందర్రావు 1978 నుంచే ర్యాడికల్ యూత్ వింగ్లో పనిచేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. ‘రవీందర్రావు ఆ క్రమంలోనే ఎదుగుతూ అప్పటి పీపుల్స్వార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కొన్నాళ్ల అనంతరం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో కీలక బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉంటూ పనిచేసి.. రెండు దశాబ్దాల క్రితం లొంగిపోయారు. ప్రస్తుతం టీవీవీని ఆయన ఆసరాగా చేసుకుని మావోయిస్టు భావజాల వ్యాప్తికి హితోధికంగా సహకరిస్తున్నారు..’ అని సీపీ పేర్కొన్నారు. నాకే సంబంధం లేదు.. అరెస్టు అక్రమం: రవీందర్రావు ఇటు పోలీస్స్టేషన్లో గురిజాల రవీందర్రావు విలే కరులతో మాట్లాడారు.. అకారణంగా తనను పోలీ సులు అరెస్టు చేయడం అక్రమమన్నారు. తాను టీవీవీలో మాత్రమే పనిచేస్తున్నానని, మావోయిస్టు పార్టీతో తనకు సంబంధం లేదని వెల్లడించారు. చదవండి: గెలుపు సంబరాల్లో గన్తో హల్చల్ -
మూడేళ్లూ జీతం నిల్!
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో అయిన రవీందర్ టక్కర్కు మూడేళ్ల సర్వీసు కాలంలో ఎటువంటి వేతనం చెల్లించకూడదనే ప్రతిపాదనను కంపెనీ తీసుకొచ్చింది. టక్కర్కు సంబంధించిన ప్రయాణ, బస, వినోద తదితర అన్ని రకాల ఖర్చులను మాత్రం కంపెనీ భరిస్తుంది. అదే విధంగా బోర్డు సమావేశాలు, ఇతర కమిటీల సమావేశాలకు పాల్గొన్న సమయంలోనూ ఎటువంటి ఫీజులు చెల్లించదు. ఈ మేరకు టక్కర్ నియామకం సహా ఇతర ప్రతిపాదనలకు ఈ నెల 20న నిర్వహించే కంపెనీ 25వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం కోరనుంది. ఈ వివరాలను వాటాదారులకు ఇచ్చిన నోటీసులో వొడాఫోన్ ఐడియా పేర్కొంది. బాలేష్ శర్మ ఆకస్మిక రాజీనామాతో రవీందర్ టక్కర్ను ఎండీ, సీఈవోగా మూడేళ్ల కాలానికి కంపెనీ నియమించుకున్న విషయం గమనార్హం. 2019 ఆగస్ట్ 19 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచ్చింది. బాలేష్శర్మకు మాత్రం ఆయన పదవీ కాలంలో రూ.8.59 కోట్ల వేతనాన్ని కంపెనీ చెల్లించింది. చదవండి: వొడాఫోన్ కొత్త ‘ఐడియా’ -
ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె
సాక్షి, వరంగల్ : గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతి చెందారు. హన్మకొండ డిపోకు చెందిన రవీందర్కు నాలుగు రోజుల క్రితం టీవీ చూస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో అతన్ని హైదరాబాద్లోని ఓ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్తో రవీందర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్ మృతితో ఆర్టీసీ కార్మికులు పెద్త ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రవీందర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పరకాల డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 29వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. అలాగే సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈ నెల ఐదో తేదీలోగా విధుల్లో చేరాలని, లేని పక్షంలో వారికి ఆర్టీసీతో సంబంధాలు తెగిపోయినట్లేనన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. -
ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె
-
ఎల్పీ, పీఈటీలకు ఎస్ఏ హోదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రేడ్ 2 భాషా పండితులు(ఎల్పీ), పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. తెలుగు భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తామని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని పూర్తి చేశారు. తెలంగాణలో ఇకపై గ్రేడ్–2 పండిట్ పోస్టులు ఉండవు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 6,024 మంది భాషా పండితులకు, 793 మంది గ్రేడ్ 2 భాషా పండితులకు మేలు జరుగుతుంది. ఎమ్మెల్సీల కృతజ్ఞతలు.. తెలుగు పండిట్లు, పీఈటీలను స్కూలు అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్రెడ్డి ప్రగతిభవన్లో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హామీ నిలబెట్టుకున్న కేసీఆర్.. గ్రేడ్–2 భాషా పండిట్లను గ్రేడ్–1 పండిట్లుగా అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వివిధ ఉపాధ్యాయ సంఘా లు పేర్కొన్నాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, సంబంధిత ఫైలుపై సంతకం చేయ డం పట్ల ధన్యవాదాలు తెలిపాయి. కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలోని పండిట్లు, పీఈటీలకు మేలు జరుగుతుందని పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, చావ రవి, టీపీఆర్టీయూ అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నారు. -
ఎన్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సామల రవీందర్
హైదరాబాద్: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా హైకోర్టు న్యాయవాది సామల రవీందర్ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్పవార్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఎన్సీపీ జాతీయ కార్యదర్శి ఎస్ఆర్ కోహ్లి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం సామల మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించను న్నట్లు స్పష్టం చేశారు. త్వరలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో శరద్పవార్, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, మాజీ మంత్రి ధర్మారావ్బాబా ఆత్రం తదితరులు పాల్గొంటారని సామల రవీందర్ వెల్లడించారు. రవీందర్ గతంలో బహుజన సమాజ్వాది పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. -
సేవాభావం వర్ధిల్లాలి
ఒకరు తెలిసీ తెలియని వయస్సులో సమాజ మార్పు కోసం తుపాకీ పట్టారు. అడవుల్లో తిరిగారు. పాటలతో ప్రభావితమైన సాయుధ సమరంలో భాగస్వామ్యమయ్యారు. మరొకరు తల్లిదండ్రుల వారసత్వంతో విప్లవోద్యం వైపు అడుగులు వేశారు. అడవి తల్లి ఒడిలో కలిసి ప్రయాణిస్తూ జీవితాన్ని పంచుకున్నారు. అనుకోని సందర్భంలో పోలీసుల చేతికి చిక్కి జైలు జీవితాన్ని అనుభవించారు. ఇప్పుడు అనాథలకు అమ్మనాన్నలుగా మారారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్నీ తామై సాకుతున్నారు. పోరుబాటను వదిలి నేడు అనాథలకు తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. సొంత ఖర్చులతో అనాథల జీవితాల్లో వెలుగులు నింపడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వారే.. మాజీ నక్సలైట్ దంపతులు కత్తుల లక్ష్మి, రవీందర్.బాల్యంలోనే పోరుబాట వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన కత్తుల కట్టయ్య, ఉపేంద్ర దంపతుల కుమారుడు కత్తుల రవీందర్. రాంపేట గ్రామం నాడు పీపుల్స్ వార్ ఉద్యమానికి కంచుకోటగా ఉంది. ఉద్యమ నేపథ్యం కలిగిన గ్రామం కావడంతో రవీందర్పై ఆ ప్రభావం పడింది. దీనితో పదో తరగతి పూర్తి చేసిన వెంటనే 1992లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆకిటి నర్సిరెడ్డి, అనసూర్య దంపతుల కుమార్తె లక్ష్మి. నర్సిరెడ్డి, అనసూర్య దంపతులు అప్పటికే పార్టీ కంట్రోల్లో పని చేస్తున్నారు. లక్ష్మి రామన్నగూడెంలో 7వ తరగతి చదువుతోంది. మీ తల్లిదండ్రుల జాడ చెప్పమని పోలీసులు వేధించారు. దీనితో లక్ష్మి చదువును ఆపేసి 1996లోనే పోరుబాట పట్టింది. రవీందర్, లక్ష్మిలు ఇద్దరూ పాలకుర్తి ఏరియాలోనే పనిచేయడంతో పార్టీ అనుమతిలో 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అరెస్టుతో ఉద్యమానికి స్వస్తి ఉద్యమంలోనే దంపతులుగా మారిన లక్ష్మి, రవీందర్లు అరెస్టు కావడంతో పోరుబాటకు స్వస్తి చెప్పారు. పార్టీ విస్తరణలో భాగంగా లక్ష్మి, రవీందర్లను మహారాష్ట్రకు పంపించారు. అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం హైదరాబాద్కు వచ్చారు. పోలీసులు అరెస్టు చేశారు. దీనితో 2000 నుంచి 2002 వరకు వరంగల్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించారు. విడుదలైన తరువాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. లక్ష్మి తీవ్రంగా అనారోగ్యానికి గురి కావడంతో 2004లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. భార్య లొంగిపోయిన 6 నెలల తరువాత భర్త రవీందర్ను పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలు జీవితం అనుభవించి ఉద్యమ పంథాకు స్వస్తి చెప్పి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. మనసు చలించి..! ఉద్యమం బాట నుంచి బయటకు వచ్చిన లక్ష్మీ రవీందర్ దంపతులు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవితంలో ఎదిగేందుకు అష్టకష్టాలు పడ్డారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుందామని కాజీపేట రైల్వే స్టేషన్కు వెళ్లారు. అక్కడ అనాథ పిల్లలు పైసలు అడుక్కుంటూ కన్పించారు. ఈ దృశ్యాన్ని చూసిన లక్ష్మి మనస్సు మార్చుకుని తిరిగి ఇంటికి వచ్చారు. ఆలోచనను మార్చిన అనాథల కోసం ఏమైనా చేయాలనే నిర్ణయించుకున్న ఆమె భర్త రవీందర్ సహకారంతో ముందు చీరెల అమ్మకం ప్రారంభించారు.. 15 ఏళ్లపాటు చీరెల అమ్మకం చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. దృష్టి సారించి.. ఆర్థికంగా నిలబడిన తరువాత లక్ష్మి, రవీందర్ దంపతులు సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. 2013 లోనే కుమారుడు జన్మించారు. కుమారుడి పేరు మీద ‘వర్ధన్ స్వచ్ఛంద సంస్థ’ను ప్రారంభించారు. ఏజెన్సీ ఏరియాలో ఇల్లు కాలిపోయిన బాధితులకు బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులను అందించారు. నిరుపేద మహిళలకు చీరెలు దానం చేయడం, అనాథ ఆశ్రమాల్లో అన్నదానాలు నిర్వహించారు. వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. .. అనాథలకు చేయూత సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిన లక్ష్మి రవీందర్ దంపతులు 2017 అక్టోబర్లో జనగామ జిల్లా కేంద్రంలో ‘వర్ధన్ అనాథ ఆశ్రమం’ ప్రారంభించారు. రెడ్డి సంక్షేమ భవనాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలో 30మంది అనాథ పిల్లలు ఆశ్రయంపొందుతున్నారు. పిల్లలను పోషిస్తూనే విద్యను చెప్పిస్తున్నారు. అలనాపాలన మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. ‘అమ్మ’కు కర్మకాండ ఆరు మాసాల కింద గుర్తు తెలియని అనాథ వృద్ధురాలు నర్సమ్మ ఆశ్రమంలో చేరింది. అయితే నర్సమ్మ ఆగస్టు 1వ తేదీన మృతి చెందింది. దీనితో నర్సమ్మకు లక్ష్మి రవీందర్ దంపతులు అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మి కర్మకాండ చేయడం పలువురిని కదిలించింది. బంగారు భవిష్యత్తు ఇవ్వడమే ధ్యేయం కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో ఎన్నో కష్టాలను అనుభవించాం. కనీసం తినడానికి అన్నం లేదు. ఉండటానికి ఇల్లు లేదు. బయటకు వచ్చిన తరువాత ఎవరూ తెలియదు. ఎలా బతకాలో తెలియదు. వరంగల్లో చిరు వ్యాపారం చేసి ఈ స్థాయికి వచ్చాం. అనాథలకు బంగారు భవిష్యత్ ఇవ్వడమే ధ్యేయంగా ఆశ్రమాన్ని నిర్వహించాం. ఆశ్రమానికి వచ్చే పిల్లలకు తల్లిదండ్రుల్లా సేవ చేస్తాం. దాతలు అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ఆడపిల్లలను బతికించుకుందామనే కార్యక్రమంతో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నాం. అనాథలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో సేవలను మరింతగా విస్తరిస్తాం. మాకు చేయూతగా మానవత్వవాదులు ముందుకు రావాలని కోరుతున్నాం. – కత్తుల లక్ష్మి – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ -
హైదరాబాద్ వద్ద డ్యూక్స్ మెగా ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్యూక్స్ బ్రాండ్తో బిస్కెట్లు, కన్ఫెక్షనరీ తయారీలో ఉన్న రవి ఫుడ్స్ హైదరాబాద్ సమీపంలోని కొత్తూరు వద్ద మెగా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో 5 యూనిట్లతో ఇది రానుంది. నాలుగేళ్లలో ఈ మెగా ప్రాజెక్టుపై రూ.250 కోట్ల దాకా వెచ్చిస్తామని రవి ఫుడ్స్ ఎండీ రవీందర్ అగర్వాల్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. భాగ్యనగరి వెలుపల కాటేదాన్ పారిశ్రామిక వాడలో రవి ఫుడ్స్కు ప్రస్తుతం 10 తయారీ కేంద్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో వీటన్నిటినీ దశల వారీగా మూసివేస్తారు. వచ్చే కొన్నాళ్లలో తయారీ అంతా కొత్తూరులోని మెగా ప్లాంటులోనే చేపడతారు. బ్రిటానియా, ఐటీసీ, పార్లె వంటి కంపెనీల కోసం రవి ఫుడ్స్ పలు ఉత్పత్తులను తయారు చేస్తోంది. రెండింతలకు టర్నోవర్.. రవి ఫుడ్స్ 2017–18లో రూ.1,500 కోట్ల టర్నోవర్ సాధించింది. 2020 నాటికి టర్నోవర్ రెండింతలకు చేరుస్తామని రవీందర్ అగర్వాల్ చెప్పారు. ‘10 ప్లాంట్లకుగాను నెలకు 15,000 టన్నుల తయారీ సామర్థ్యం ఉంది. ఇందులో 50 శాతం కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, 50 శాతం సొంత బ్రాండ్ అయిన డ్యూక్స్ కైవసం చేసుకుంది. నాలుగేళ్లలో ఉద్యోగుల సంఖ్య ప్రస్తుత 2,200 నుంచి 4,000లకు చేరుతుంది. ఎగుమతుల ఆదాయం రెండింతలై రూ.800 కోట్లను తాకుతుందని విశ్వసిస్తున్నాం’ అని తెలియజేశారు. కాగా, ఆసియా వన్ మ్యాగజైన్, యునైటెడ్ రిసర్చ్ సర్వీసెస్ మీడియా కన్సల్టింగ్ నుంచి 2017–18కిగాను ఆసియాలోని 100 వరల్డ్స్ గ్రేటెస్ట్ బ్రాండ్స్లో డ్యూక్స్, గ్రేటెస్ట్ లీడర్స్ జాబితా లో రవీందర్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. -
జిమ్నాస్టిక్స్ కోచ్ రవీందర్కు సన్మానం
హైదరాబాద్: ‘శాట్స్’ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆర్. రవీందర్ ఆదివారం రిటైరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్రాజ్, రంగారెడ్డి డీవైఎస్ఓ వెంకటేశ్వర్ రావు, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి మహేశ్వర్ పాల్గొన్నారు -
మిస్టర్ పర్ఫెక్ట్..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మిస్టర్ కూల్గా కనిపించే డాక్టర్ విశ్వనాథ రవీందర్ రూల్స్ విషయంలో మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు గడించారు. 1991లో గ్రూప్–1లో విజయం సాధించి డీఎస్పీగా కెరీర్ను ప్రారంభించిన ఆయన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్కు రెండో కమిషనర్గా ఇటీవల నియమితులైన ఆయన ‘సాక్షి’తో సోమవారం తన అనుభవాలను పంచుకున్నారు. నూతన పోలీస్ కమిషనర్ స్వగతం, కెరీర్లో మరిచిపోలేని ఘటనలు మీ కోసం.. వద్దనుకుంటూనే వచ్చారు.. డాక్టర్ విశ్వనాథ రవీందర్ స్వస్థలం సిద్ధిపేట. తండ్రి రాజేశ్వర్, తల్లి అనసూయబాయి (లేట్). డిగ్రీ వరకు అక్కడే చదివారు. తర్వాత ఎమ్మెస్సీ ఎంట్రన్స్లో 18వ ర్యాంకు సా«ధించి 1982లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్లో చేరారు. అనంతరం వెంటనే పీహెచ్డీ పూర్తి చేశారు. అది పూర్తవుతుండగానే ఒకేసారి లెక్చరర్, గ్రూప్–1 రాశారు. చిన్నప్పటి నుంచి పోలీస్ జాబ్ అంటే భయం ఉండడంతో ఇటువైపు రావొద్దని మొదట అనుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచనలతో లెక్చరర్ జాబ్ను పక్కనపెట్టి 1991లో డీఎస్పీగా చేరారు. తొలుత తెనాలి, బాపట్ల, గుంటూరులో డీఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా చిత్తూరు, ఓఎస్డీగా కర్నూలు, నల్లగొండలో, డీసీపీగా విశాఖపట్నంలో, ఇంటలిజెన్స్శాఖలో ఎస్పీగా, తిరుపతి అర్బన్ ఎస్పీగా, కరీంనగర్ ఎస్పీగా, హైదరాబాద్ ఈస్ట్జోన్ డీసీపీగా, హైదరబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా వరంగల్ పోలీస్ కమిషనర్గా బదిలీపై వచ్చారు. సన్నిహితులే స్ఫూర్తి... స్నేహితులు, సన్నిహితుల నుంచి స్ఫూర్తి పొందినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ చెబుతున్నారు. వాళ్ల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. పట్టుదలతో శ్రమించి చదువులో, కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించానని అంటున్నారు. ‘సానుకూల దృక్పథంతో కష్టపడితే ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు. ఏదైనా లక్ష్యం కోసం మంచి మనసుతో కష్టపడితే తప్పక ఫలితం ఉంటుంది. ఇది నాచురల్ సీక్రెట్’ అని పేర్కొంటున్నారు. టీ షర్ట్స్ ధరించడంపై మక్కువ ఉన్నా, వృత్తిరీత్యా ఎక్కువగా ఖాకీ యూని ఫామ్లోనే కనిపిస్తానని.. పనిఒత్తిడి కారణంగా పార్టీలు, ఫంక్షన్లకు హాజరయ్యేది తక్కువేనని.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతిరోజు ఉదయం షటిల్ ఆడుతానని తన ఇష్టాయిష్టాలను వెల్లడించారు. చదువుకునే రోజుల్లో సాగర సంగమం సినిమాను అనేకసార్లు చూశానంటూ తన గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. మరిచిపోలేని సంఘటన తెనాలిలో పనిచేస్తుండగా ఓ యువకుడి మిస్సింగ్ కేసును ఛేదించడం తన వృత్తి జీవితంలో మరిచిపోలేనిదని విశ్వనాథ రవీందర్ ఆ ఘటన గురించి వివరించారు. ‘తెనాలిలో పని చేస్తున్నప్పుడు ఓ మహిళ నా దగ్గరకు వచ్చింది. ఒక్కగానొక్క కొడుకు కనిపించడం లేదని, బంధు వులతో కలిసి సినిమాకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటినుంచి రాత్రి వేళ బయటకు వెళ్లిన కొడుకు తిరిగి రాలేదంటూ రోదించింది. కొడుకు కోసం ఏడాదిన్నరగా అన్ని చోట్ల తిరిగినా.. ఫలితం లేదని కన్నీరుమున్నీరైంది. చేతికి అందివచ్చిన కొడుకు ఏమైపోయాడో అంటూ ఆ తల్లి పడిన బాధ చూస్తే నా మనసు చలించిపోయింది. కేసు విచారణ మొదలుపెట్టాను. తప్పిపోయిన కొడుకును సినిమాకు తీసుకెళ్లిన బంధువులను పిలిపించి మాట్లాడాను. ‘నా అక్క కొడుకు సార్. రాత్రి సినిమా చూసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్లం వెళ్లిపోయాం. అప్పటి నుంచి వాడు కనిపించడం లేదు’ అంటూ చెప్పాడు. దీంతో కేసు ముందుకు కదలలేదు. బాగా ఆలోచించగా.. ఆ తల్లి చెప్పిన మాట ల్లో కొడుకు కనిపించకుండా పోయిన తర్వాత ఏడు నెలలకు ఓ చోట కొడుకు షర్ట్ కనిపించిందని చెప్పిన అంశం గుర్తుకొచ్చింది. ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించాం. షర్ట్ దొరికిన ప్రదేశం చుట్టూ అర కిలోమీటరు వరకు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి అంశాన్ని పరిశీలించినా.. ఫలితం లేదు. చివరగా షర్ట్ దొరికిన ప్రదేశానికి సమీపంలో నాలుగైదు వ్యవసాయబావులు కనిపించాయి. మోటా ర్లతో అందులో ఉన్న నీరు అంతా బయటకు తోడించాం. ఒక బావిలో ఎముకలు కనిపించాయి. వాటిని బయటకు తీసి.. పేరిస్తే మనిషికి సంబంధించినవిగా తేలింది. వెంటనే మరోసారి సినిమా కు తీసుకెళ్లిన బంధువులను పిలిపించి గట్టిగా ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నాడు. ఆస్తి కోసమే అల్లుడిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ‘అక్కకు ఒక్కడే కొడుకు.. బావ చనిపోయాడు. ఆమె పేరు మీద నాలుగెకరాల పొలం ఉంది. దాని విలువ కోట్లలో ఉంది. అల్లుడి అడ్డు తొలగిస్తే వార సులు లేకుండా పోయి.. అక్క తర్వాత ఆ ఆస్తి అంతా తనపరం అవుతుందని... అందుకే ఈ నేరం చేశా.’ అని చెప్పాడు. తమ్ముడే తన కొడుకును హత్య చేసిన విషయం తెలుసుకుని ఆ తల్లి గుండె పగిలేలా ఏడ్చింది. ఇంతకాలం నా కొడుకు ఏమయ్యాడో అని ఏడ్చాను. నా కొడుకు తిరిగి రాడు. కానీ.. దోషులను పట్టుకున్నారని ఆమె ఉద్వేగంగా మాట్లాడింది. ఈ సంఘటన నా కెరీర్లో గుర్తుండిపోయేదిగా నిలిచింది. సీపీ రవీందర్ కుటుంబం భార్య : నిర్మల కూతురు : నిఖిల అల్లుడు : డాక్టర్ మధునారాయణ, డీఎన్బీ సర్జికల్ అంకాలజీ కొడుకు : అభిజిత్ బీటెక్ ఇష్టమైన క్రీడ : టెన్నీస్ ఇష్టమైన నటులు : కమల్హాసన్, అమితాబ్బచ్చన్ -
భోజ్యేషు ఇండస్ట్రీ
మహిళ ‘భోజ్యేషు మాత’ అయితే కావచ్చు. అయితే భోజనాన్ని వండి వడ్డించే పరిశ్రమలో ఆమె రాణించగలదా అనే సంశయం అనేకమందిలో ఇప్పటికీ ఉంది. ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ‘రాణించగలం’ అని.. గత దశాబ్దకాలంగా లండన్లో తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఓ ఐదుగురు భారతీయ మహిళలు. దీప్నా ఆనంద్ లండన్లోని భారతీయ భోజన పరిశ్రమ రంగంలో దాదాపుగా మొదటి స్థానంలో ఉన్నారు దీప్నా ఆనంద్. ఈమె తాతగారు కెన్యాలో 1950లో ఒక రెస్టారెంట్ ప్రారంభించి దానికొక బ్రాండ్ ఇమేజిని సృష్టించుకున్నారు. అయితే పదిహేనేళ్ల తర్వాత దాని ప్రాభవం తగ్గిపోయింది. దాంతో ఆమె తండ్రి రంగంలోకి దిగి ‘డిప్ ఇన్ బ్రిలియంట్’ పేరుతో లండన్లో రెస్టారెంట్ను ప్రారంభించారు. సంప్రదాయ పంజాబీ తాలీని, తన కుటుంబంలో అంతా ఇష్టపడే రుచులను రెస్టారెంట్లో ప్రవేశపెట్టారు. దీంతో ఆ కెన్యా ఘుమఘుమలు లండన్కు వ్యాపించాయి. తర్వాత తండ్రి నుంచి తను స్వీకరించారు దీప్నా. ఇప్పుడు ‘ఇన్ కిచెన్ ఆన్ బి 4 యు’ అనే టీవీ షోతో లండన్లో చాలా పాపులర్ అయ్యారు. రవీందర్ భోగల్ రవీందర్ భోగల్ అనే ఈ ఫ్యాషన్ జర్నలిస్ట్ కూడా రెస్టారెంట్ వైపు తన దృష్టిని మరల్చారు. చెఫ్, కుకరీ రైటర్గా లండన్లో పేరొందారు. ‘జెంటిల్మెన్స్ క్లబ్ డెకార్’ పేరుతో రెస్టారెంట్స్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. కెన్యా, నార్త్ ఇండియన్ వంటకాలను ఈమె తన రెస్టారెంట్ ద్వారా అందిస్తున్నారు. ఆస్మాఖాన్ ఇరవై నాలుగు గంటలూ ఈమె రెస్టారెంట్లో ఛాయ్ కోసం ఆర్డర్ ఇవ్వచ్చు. కోల్కతా వాసి అయిన ఆస్మా ఖాన్ తన ఇండియన్ రెస్టారెంట్ ద్వారా రాయల్ మొఘల్ ఘుమఘుమలను అందిస్తున్నారు. కొన్నేళ్లక్రితం కుటుంబంతో లండన్ చేరిన ఆస్మా లాయర్గానూ రాణించారు. హైదరాబాద్ రాయల్ డిషెస్, కోల్కతా స్ట్రీట్ ఫుడ్, బెంగాల్ క్లాసికల్ రిఫ్లెక్ట్స్.. ఆస్మా అందించే రుచులలో జిహ్వను మైమరపిస్తాయి. చెఫ్ శిల్పా దండేకర్ పూర్తిగా ఇండియన్ వంటకాలను మూడేళ్లుగా అందిస్తున్నారు. శిల్ప ఇండియన్ తాజ్ హోటల్ గ్రూప్లో శిక్షణ తీసుకున్నారు. యు.కె. వెళ్లిన తర్వాత అక్కడి పబ్బులలో రుచికరమైన వంటలను అందించారు. ఆ తర్వాత తనే సొంతంగా రెస్టారెంట్ను ప్రారంభించారు. కాలానుగుణంగా లభించే పదార్థాలతో వంటలను రుచికరంగా అందించడం శిల్ప ప్రత్యేకత. ఏంజెలా మాలిక్ ఈమెది పంజాబీ నేపథ్యం. చెఫ్గా రాణించడమే కాకుండా సొంతంగా కుకరీ స్కూల్ను నడుపుతున్నారు. టీవీల్లోనూ, రేడియోలోనూ తన క్లాసుల ద్వారా నగరవాసులకు చేరువయ్యారు. ఏంజెలా మాలిక్ అనే మరో చెఫ్ ‘లండన్ ఫుడ్ బోర్డ్’ సభ్యురాలిగా భారతీయ రుచులపై స్థానికులకు ఆసక్తి కలిగించడంతో పాటు, భారతీయ భోజన పరిశ్రమకు విస్తృతినీ కల్పిస్తున్నారు. ‘ప్రతిభ ఉన్న ఏ రంగంలో అయినా అవకాశాల కోసం ఎదురుచూడటం కాదు, ఆ అవకాశాలను మనమే కల్పించుకోవాలి’ అనేది ఈ ఆధునిక మహిళలు వంట ద్వారా నిరూపిస్తూ చెబుతున్నారు. ఫైవ్ ఉమెన్ వీళ్ల కన్నా ముందులండన్లో మొదటిసారి‘చట్నీ మేరీ’ అనే పేరుతో మోడ్రన్ ఇండియన్ రెస్టారెంట్ని నమిత, కామెలియా అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు 1990లలో ప్రారంభించారు. పంజాబీయులు అయిన ఈ అక్కచెల్లెళ్లు తమ కుటుంబ సంప్రదాయ రుచులను వండి వడ్డించారు. వంటల పుస్తకాలు, టీవీ షోల ద్వారా భోజనప్రియుల మనసులను కొల్లగొట్టారు. కొన్నాళ్లలోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. -
ప్రతి పైసా తెరపై కనిపిస్తుంది
‘‘భాగమతి’ పూర్తి స్థాయి హారర్ సినిమా కాదు. హారర్ కథాంశం కొంత మాత్రమే ఉంటుంది. ఇతర సినిమాలకీ దీనికీ పోలిక ఉండదు. 45 రోజుల పాటు బంగ్లా సెట్లో షూటింగ్ జరిపాం. అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలుస్తాయి’’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. అనుష్క లీడ్ రోల్లో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ మీడియాతో మాట్లాడారు. ∙కథ పరంగా 300 ఏళ్ల క్రితంనాటి బంగ్లా కావాలి. దాని కోసం ఎంతో రీసెర్చ్ చేసి, కొత్త టెక్నాలజీ ఉపయోగించి 29 రోజుల్లో బంగ్లా సెట్ తీర్చిదిద్దాం. సెట్ చూసి యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయారు. నిజం చెప్పాలంటే సెట్ భారీతనం యూనిట్ ఇంకాస్త ఎక్కువ కష్టపడి బెటర్ ఔట్ఫుట్ ఇచ్చేలా దోహదపడింది. ∙టాలీవుడ్లో ఇదొక కాస్ట్లీ సెట్ అన్నది నిజమే. ఈ సెట్ కోసం చాలా ఖర్చు చేశాం. అయితే.. పెట్టిన ప్రతిపైసా తెరపై కనిపిస్తుంది. ఇప్పటివరకు నేను వేసిన సెట్స్లో ఇదే బెస్ట్ అని చెప్పగలను. ∙ఏ సినిమాకైనా ముందు కథ వింటాను. అప్పుడే కథాంశం అర్థమై ఎలాంటి సెట్స్ కావాలో ఇవ్వగలం. అందరూ ఓ మంచి సినిమా చేశారని అంటున్నారు. మా వరకు మేం సిన్సియర్గా కష్టపడ్డాం. మా ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందని నా నమ్మకం. ∙ప్రస్తుతం మారుతి–నాగ చైతన్య కాంబినేషన్లో ఓ చిత్రం, మోహన్కృష్ణ ఇంద్రగంటిగారి సినిమాతో పాటు ఒక తమిళ సినిమా చేస్తున్నాను. ఇటీవల దర్శకుడు సుధీర్ వర్మ సినిమా ఒప్పుకున్నాను. -
ఆ అధికారులపై కేసులు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: అడవి తల్లినే నమ్ముకున్న గిరిజనులపై అటవీ అధికారులు విచక్షణారహితంగా దాడి చేసి ఇళ్లు కూల్చివేశారని, బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జలగలంచలోని అటవీ ప్రాంతంలో గొత్తికోయలపై అటవీ శాఖ సిబ్బంది విచక్షణారహితంగా దాడులు చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుంటి రవీందర్ పిల్ దాఖలు చేశారు. గత నెల 16న పస్రా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శిరీష, తాడ్వాయి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జోగీందర్ సారథ్యంలో రెండు వందల మంది సిబ్బంది జేసీబీలు, ట్రాక్టర్లు, బుల్డోజర్లతో వచ్చి 36 ఇళ్లను కూల్చేశారని పేర్కొన్నారు. తాగు, సాగుకు ఆధారమైన ఏకైక బోరును తొలగించారని, గిరిజనులకు తాగునీరు కూడా లేకుండా చేశారని తెలిపారు. ‘అడ్డుకోబోయినవారిని చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. గర్భవతులైన కుంజం నందిని, మాధవి ఐతై, మాధవి మునితలను కూడా కొట్టారు. అధికారుల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే బోర్వెల్ ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయం కల్పించాలని, కూల్చిన ఇళ్లను నిర్మించాలని, దెబ్బతిన్న ఇండ్లు, పంటలకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలివ్వాలి. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్తో దర్యాప్తునకు ఆదేశించాలి. అటవీ అధికారులు శిరీష, జోగీందర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
కేసును పక్కదోవ పట్టిస్తున్నారు
- శిరీష తండ్రి రవీందర్, అక్క భార్గవి ఆరోపణ - రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్రెడ్డి కలిసే హత్య చేశారు - న్యాయం జరిగే వరకూ పోరాడతామని వెల్లడి మిర్యాలగూడ: శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అది ముమ్మాటికీ హత్యేనని ఆమె తండ్రి ఎక్కంటి రవీందర్, అక్క భార్గవి పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రవీందర్, భార్గవి విలేకరులతో మాట్లాడారు. శిరీష కుటుంబా నికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, మరే విధమైన సమస్యలు లేవని వారు పేర్కొ న్నారు. ఎంతో చలాకీగా ఉండే శిరీష మంచి బ్యూటీషియన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. స్నేహితుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలంటూ.. ఎస్సై ప్రభాకర్రెడ్డి వద్దకు వెళితే శిరీషపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. పోలీసు అధికారులే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్రెడ్డి ముగ్గురు కలసి పథకం ప్రకారమే శిరీషను హత్య చేశారని ఆరోపించారు. శిరీష దేహంపై గాయాలున్నాయని వాటిని చూస్తే ముమ్మాటికీ హత్యేనని అర్థమవుతోందని చెప్పారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కూడా హత్యగా పేర్కొన్నారని.. కానీ కావాలనే పోలీసులు కేసును నీరుగార్చుతున్నారని ఆరోపించారు. పోరాటం చేస్తాం.. రాజీవ్తో శిరీషకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు చెప్పడం దారుణమని.. పోలీసు శాఖను కాపాడుకోవడానికే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని శిరీష తండ్రి, సోదరి పేర్కొన్నారు. దగ్గరుండి కంటితో చూసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. తేజస్విని వల్లే వారి మధ్య వివాదం వచ్చిందని, ఆమెను విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా తేజస్వినిని ఎందుకు విచారించలేదని ప్రశ్నిం చారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని... మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రభు త్వం చొరవ తీసుకుని కేసును తిరిగి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. -
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్పై కేసు
మరో ఇద్దరిపైనా.. ఆదిలాబాద్: ఓ వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచే విధంగా వాట్సాప్లో ఫొటోలు అప్లోడ్ చేసిన వ్యక్తిపై ఉట్నూర్లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఉట్నూర్లోని అభి డిజిటల్ ఫొటో స్టూడియో యజమాని రవీందర్ వాట్సాప్ గ్రూప్ తయారు చేసి అందులో దేవుళ్లను కించే పరిచే విధంగా ఫొటోలు పెడుతూ రెచ్చగొడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడిని ఉట్నూర్ ఏఎస్సై ముకుంద్రావు అరెస్టు చేశారు. రవీందర్ పెట్టిన ఫొటోలకు స్పందించిన నారాయణ, శ్రీనునాయక్, ఉషశ్రీలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో వారిపైనా కేసు నమోదు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోనే వాట్సాప్ గ్రూప్ తయారు చేసిన వారిపై కేసు నమోదు చేయడం మొదటిసారి అని పేర్కొన్నారు. ఇలాంటి రెచ్చ గొట్టే పోస్టులు చేసేవారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు. -
ఆ కాలేజీలు జైళ్ల కంటే దారుణం
నారాయణ, చైతన్య కాలేజీలపై రవీందర్, పొంగులేటి సాక్షి, హైదరాబాద్: నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజీలు జైళ్ల కంటే హీనంగా ఉన్నాయని, ఆ కాలేజీల ఒత్తిడిని భరించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుం టున్నారని ఎమ్మెల్సీలు పూల రవీందర్, పొంగులేటి సుధాకర్రెడ్డి శాసన మండలి దృష్టికి తీసుకువచ్చారు. గురువారం మండలి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లా డుతూ.. ఇష్టం వచ్చినట్లు ఫీజుల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని, రైతు ఆత్మహత్యలకు కార్పొరేట్ కాలేజీల ఫీజులు కూడా ఓ కారణమని పూల రవీందర్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలను పట్టణాలకే పరిమితం చేయాలని, గ్రామాల్లో అనుమతించవద్దని ఆయన కోరారు. మంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ.. కార్పొరేట్ కాలేజీల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయడానికి కసరత్తు చేస్తున్నామని చెప్పారు -
'24 గంటల్లోనే ఆ కేసును ఛేదించాం'
సుల్తాన్ బజార్: నగరంలోని సుల్తాన్ బజార్ లో జరిగిన దారి దోపీడీ కేసు ను ఈస్ట్జోన్ పోలీసులు ఛేదించారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్టు ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్ వెల్లడించారు. ఈ కేసులో నిందితులను ఆదివారం డీసీపీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. దోపీడీకి పాల్పడ్డ ఏడుగురిలో ఐదుగురిని పట్టుకున్నామని చెప్పారు. అయితే నిందితుల నుంచి రూ. 10 లక్షల 70వేలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పట్టుబడ్డ ఐదుగురిలో ఓ బాలుడు కూడా ఉన్నట్టు ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ నగరంలో గతరాత్రి సుల్తాన్ బజార్లో ఘారానా దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. దుకాణం మూసివేసి బైక్పై ఇంటికి వెళుతున్న వ్యాపారిని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి.. రూ. 12 లక్షలు దోచుకున్నారు. అంతేకాకుండా వ్యాపారి బైక్ ను సైతం తీసుకొని పరారయ్యారు. -
ముఖ్యమంత్రికి గుడి కట్టేశాడు...
దండేపల్లి(ఆదిలాబాద్): తమిళుల ప్రభావం అంతో ఇంతో తెలంగాణపై పడినట్లు చెప్పవచ్చు. తమకు నచ్చిన రాజకీయ నాయకుడు, నాయకురాలికి, అమితంగా ఇష్టపడే హీరోయిన్, హీరోలకు గుడి కట్టేయడం తమిళలకు అలవాటే. కానీ, తాజగా అలాంటి ఘటన తెలంగాణలోనూ చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్ ఆయన ఇంటి ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్కు గుడి నిర్మించారు. గుడిలో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని నెలకొల్పాడు. నేడు (బుధవారం) సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రవీందర్ దంపతులు ఈ గుడిని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప దేవుడు కేసీఆర్ అని రవీందర్ కొనియాడాడు. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించినప్పటికి వారు రాకపోవడంతో రవీందర్ దంపతులు స్వయంగా గుడిని ఆవిష్కరించుకున్నారు. రవీందర్ గతంలో దండేపల్లిలో తెలంగాణ తల్లి, ప్రొఫేసర్ జయశంకర్ సార్ విగ్రహాలను కూడా నిర్మించి ఉద్యమకారుల్లో స్పూర్తిని రగిలించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కు గుడికట్టి రవీందర్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. -
ఎమ్మార్వో ఆత్మహత్య
చిట్యాల: వరంగల్ జిల్లా చిట్యాల మండలం తహశీల్దార్ రవీందర్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్ గత గ్రూప్స్ పరీక్షలో ఎమ్మార్వో ఉద్యోగం సాధించాడు. అంతకుముందు పోలీస్ డిపార్టుమెంటులో విధులు నిర్వహించాడు. హన్మకొండలోని ప్రగతినగర్లో రవీందర్ నివాసం ఉంటూ చిట్యాల మండల ఎమ్మార్వోగా విధులు నిర్వహించేవాడు. అయితే ఆత్మహత్యకు గత కారణాలు ఇంకా తెలియరాలేదు. -
అన్నం తిని అనారోగ్యానికి గురైన ఆవు మృతి
రంగారెడ్డి(శంషాబాద్): అన్నం తిని అనారోగ్యానికి గురైన ఓ ఆవు బుధవారం మృతి చెందింది. వివరాలు..మండలంలోని ఘాంసిమియాగూడకు చెందిన రవీందర్ ఆవును పోషించుకుంటున్నాడు. రెండు రోజుల కిందట గ్రామంలో బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అమ్మవారికి నైవేధ్యంగా సమర్చించిన అన్నంను సమీపంలో ఓ కుప్పగా పోశారు. మంగళవారం అటుగా వెళ్లిన ఆవు ఆ అన్నం తినింది. అన్నం తిన్న ఆవు అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందింది. ఆవు మృతితో తనకు ఉపాధి లేకుండా పోయిందని, నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. -
30 మందిని చంపింది నేనే...
న్యూఢిల్లీ : దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో మొత్తం 30మందిని హత్య చేసింది తానేనని సీరియల్ కిల్లర్ రవీందర్ కుమార్ అంగీకరించాడు. ఈ విషయాన్ని డీసీపీ విక్రమ్ సింగ్ వెల్లడించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పడంతో తాను తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానన్నారు. 2008 నుంచే హత్యలకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడని సింగ్ చెప్పారు. 'విచారణ సమయంలో ఈ విషయాన్ని రవీందర్ చెప్పగానే షాక్ అయ్యా. ఆ సమయంలో నా చెవిన పడిన మాటలన్నింటినీ ఇప్పుడు చెప్పలేను. అయితే అతని నేరాంగీకారం వాస్తవాలను నిర్థారించేందుకు దోహదపడింది' అని గద్గద స్వరంతో తెలిపారు. అయితే విచారణలో తమకు ఇచ్చిన సమచారం ప్రకారం హత్యకు గురైన వారి సంఖ్య 40కి చేరే అవకాశం ఉంది. -
సంసారంలో సరిగమలు
ఓ జంట తమకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకుందనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సీతా శ్రీరాం’. వర్ష ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో ఆడెపు రవీందర్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. శ్వేత కథానాయిక. రమేశ్ ముక్కర స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్లో జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటలను ఆవిష్కరించారు. ‘‘ఆలుమగల మధ్య జరిగే సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు రాజా వన్నెంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు
- వైఎస్సార్ సీపీ యువత రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ మెదక్ (సంగారెడ్డి క్రైం): టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేకపోయిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బి.రవీందర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే లక్షమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్ హామీ అమలు కాకపోగా, ఆయన కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు. ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలోనే అనేకమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా వాటి నివారణకు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోకపోగా వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. కొత్త పింఛన్లు రాకపోగా ఉన్న పింఛన్లు ఊడిపోవడంతో అనేకమంది అర్హులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ‘ఆసరా’ అందక అనేకమంది వృద్ధులు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. వేసవిలో విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికలే టార్గెట్గా వైఎస్సార్ సీపీ ముందుకెళ్తుందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. పార్టీలో యువకులు కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి పదవులు కట్టబెట్టి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపడతామన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ సరుకులు పక్కదారి
సుల్తానాబాద్: మండల కేంద్రంలోని మార్కండేయ కాలనీ, బస్టాండ్ సమీపంలో ఉన్న జాపతి రాజిరెడ్డి, బాకం సంపత్ ఇళ్లలో 75 క్వింటాళ్ల 80 కిలోల పీడీఎస్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నట్లు తహశీల్దార్ రజిత, డీటీసీఎస్ కాశీవిశ్వనాథం తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని స్థానిక డీలర్ కొమురయ్యగౌడ్కు అప్పగించారు. వీరిపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో డీటీసీఎస్ ఎన్.మల్లికార్జున్రెడ్డి, హరికిరణ్, ఆర్ఐ సురేందర్ పాల్గొన్నారు. ఓదెల రైల్వేస్టేషన్లో ఏడు క్వింటాళ్ల బియ్యం.. ఓదెల : మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో ఏడు క్వింటాళ్ల రేషన్బియ్యంను గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఇన్చార్జి తహశీల్దార్ తూము రవీందర్ పట్టుకున్నారు. రాత్రిసమయంలో కాజీపేట్ నుంచి బల్లార్షా వరకు నడిచే నాగపూర్ ప్యాసింజర్ ద్వారా రేషన్బియ్యంను అక్రమంగా తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు తనిఖీ చేసి బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు తహశీల్దార్ వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు బియ్యంను రైల్వేస్టేషన్ ప్లాట్ఫాంపైన వదిలేసి పరారయ్యారని ఆయన పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంను పొత్కపల్లి రేషన్డీలర్ ఇస్మత్తారకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వోలు కనుకయ్య, సదయ్య, బషీర్, ఎల్లయ్య పాల్గొన్నారు. నీరుకుల్లలో రేషన్షాప్ సీజ్ సుల్తానాబాద్ : మండలంలోని నీరుకుల్ల డీలర్షాపు (నంబరు21)ను సీజ్ చేసినట్లు తహశీల్దార్ రజిత తెలిపారు. మండల కేంద్రంలో శనివారం పట్టుబడ్డ బియ్యంతో పాటు 14 కిలోల గోధుమలు నీరుకుల్ల గ్రామానికి చెందిన డీలర్ అంజయ్య తమకు అమ్మినట్లు పట్టుబడ్డ బాకం సంపత్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అధికారులు నీరుకుల్లకు వెళ్లి డీలర్షాను సీజ ్చేసినట్లు తెలిపారు. పీడీఎఫ్ సరుకులను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహించేది లేదని ఆమె హెచ్చరించారు. పైడిచింతలపల్లి డీలర్పై 6ఏ కేసు ధర్మారం : ధర్మారం మండలం పైడిచింతలపల్లి రేషన్ డీలర్ బీసగోని మల్లేశంపై శనివారం 6ఏ కేసు నమోదు చేసినట్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేశ్కుమార్ తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు.. డీటీసీఎస్ మల్లిఖార్జున్, వీఆర్వో ప్రసాద్ విచారణ చేపట్టారు. గత నెల పంపిణీ చేయాల్సిన నాలుగు వందల లీటర్ల కిరోసిన్ను అక్రమంగా నిల్వ ఉంచినట్లు విచారణలో తేలిందన్నారు. అక్రమంగా నిల్వ చేసిన డీలర్ మల్లేశంపై 6ఏ కేసునమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలపై జేఏసీ దృష్టి
రైతు ఆత్మహత్యలు, విద్యుత్ కొరతపై అధ్యయనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి నాలుగేళ్లపాటు దిశానిర్ధేశం చేసిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) మళ్లీ క్రియాశీలం కావాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కార్యాచరణకు దూరంగా ఉన్న జేఏసీ రాష్ట్రంలో క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు కొరత, రైతు ఆత్మహత్యలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది. విద్యుత్తు కొరతకు కారణాలు, సమస్యను అధిగమించడానికి పరిష్కార మార్గాలపై అధ్యయనం చేయనుంది. పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి నివేదించనుంది. ఇందులో భాగంగా భాగస్వామ్య సంఘాల నిపుణులతో అధ్యయనం చేయనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుండడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్న జేఏసీ, రైతుల ఆత్మహత్యలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయించింది. నేడు జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ : పిట్టల రవీందర్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం హైదరాబాద్లో జరగనుందని సమన్వయకర్త పిట్టల రవీందర్ శనివారం తెలిపారు. విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై ఇందులో చర్చిస్తామని పేర్కొన్నారు. -
చిన్నారిపై వృద్ధుడి లైంగికదాడి
చిట్యాల : అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని బావుసింగ్పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిట్యాల సీఐ రవీందర్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 27న వారు కూలి పనులకు వెళ్లారు. ఇంటి పక్కనే ఉన్న అజ్మీర మొగిళి ఆడుకుంటున్న చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని ఇంటి వద్ద వదిలి వెళ్లాడు.ఇంటికి వచ్చిన తల్లి దండ్రులు ఇంటి పనులు చేసుకుని నిద్రించారు. తెల్లారి ఉదయం చిన్నారికి తల్లి స్నానం చేయిస్తుండగా రక్తస్రావం జరిగినట్లు గమనించి... కుమార్తెను అడగడంతో విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రైతన్న మేడెక్కిన ఇంటిపంట!
ఒకటికి నాలుగు ఆహార పంటలు పండించుకునే రైతు కుటుంబాలకు ఇంట్లో వండుకు తినడానికి కూరగాయలు, ఆకుకూరలకు కొదవ ఉండదు. అయితే, బహుళ పంటలు పండించుకునే అలవాటు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది. పొలంలో ఒకటో, రెండో పంటలను మాత్రమే(అది కూడా వాణిజ్య పంటలు) సాగు చేస్తూ.. పండీ పండగానే అక్కడికక్కడే అమ్మి అప్పులు తీర్చే పరిస్థితులొచ్చాక.. ఇక ఇంటి అవసరాలకు పొలం నుంచి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏడాది పొడవునా కొనుక్కొని తినాల్సిందే గదా! ఇప్పుడు చాలా రైతు కుటుంబాల దుస్థితి ఇదే. కూరగాయల ధరలు మండిపోతున్న దశలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తున్న దుర్గతిని అధిగమించేందుకు ఒక చిన్న రైతు కుటుంబం ముందడుగు వేసింది. మేడ మీద కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే అవసరం సెంటు పొలంలేని పట్నవాసులకే కాదు.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి గ్రామీణ రైతు కుటుంబాలకు కూడా ఎంతగానో ఉందని చాటి చెబుతున్నారు యువ రైతు అన్నారం రవీందర్ గౌడ్(35), మౌనిక దంపతులు. మహబూబ్నగర్ జిల్లా కొందుర్గు మండల పరిధిలోని శ్రీరంగాపూర్ వీరి స్వగ్రామం. ఎస్సెస్సీ వరకు చదివి వ్యవసాయంలో స్థిరపడిన రవీందర్కు ఇద్దరు సోదరులున్నారు. వారి కుటుంబాలూ అదే గ్రామంలోనే కాపురం ఉంటున్నారు. తలా రెండెకరాల పొలం ఉంది. తన రెండెకరాల్లో బోరు కింద వరి, పత్తి వంటి పంటలు పండిస్తున్న ఆయన బోరు మెకానిక్ షాపు కూడా నిర్వహిస్తూ.. సొంత పక్కా భవనంలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది వర్షం లేకపోవడంతో పత్తి వేయడం మానేసి.. రెండు కుంటల్లో వరి ఊడ్చాడు. ఇంటి ముందున్న పాత తొట్టిలో పడి మొలిచిన టమాటా మొక్క చాలా కాయలు కాసింది. ఇది రెండేళ్ల నాటి ముచ్చట. ఇంటి అవసరాల కోసం రెండు మూడు రోజులకోసారి రూ.50-100లు పెట్టి కూరగాయలు, ఆకుకూరలు కొనేవారు. మనం కొనడం ఎందుకు? మేడ మీద కొన్ని కుండీలు పెట్టుకొని సొంతంగా పండించు కోవచ్చు కదా? అన్న ఆలోచన వచ్చింది. ఆ క్షణంలోనే రవీందర్ మదిలో ఇంటిపంటకు బీజం పడింది. గత ఏడాది వర్షాకాలం ప్రారంభంకాగానే పూర్తిస్థాయిలో మేడ మీద ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టారు రవీందర్ దంపతులు. వారి మేడ మీద 150 చదరపు గజాల స్థలం ఉంది. వాడేసిన 50 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ములు 75 కొని తెచ్చాడు రవీందర్. ఒక్కో డ్రమ్మును సగానికి కోశాడు. 150 చిన్న డ్రమ్ములు సిద్ధమయ్యాయి. వాటికి అడుగున నీరు బయటకుపోవడానికి రెండు, మూడు చిల్లులు పెట్టాడు. మట్టి, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపి.. షాద్నగర్లోని నర్సరీ నుంచి తెచ్చిన నారు, విత్తనాలు వేశారు. టమాటా, వంగ, మిర్చి మొక్కలు నాటారు. చెట్టుచిక్కుడు, సొర, బీర వంటి తీగజాతి గింజలు, తోటకూర, గోంగూర, కొత్తిమీర వంటి ఆకుకూరల గింజలు విత్తారు. ఒక్కో డ్రమ్ములో రెండు, మూడు చొప్పున వివిధ కూరగాయ మొక్కలు నాటాడు. పొలం కోసమని సబ్సిడీపై తెచ్చిన డ్రిప్ లేటరల్ పైపులు కొన్ని తెచ్చి ఏర్పాటు చేసి, మేడ మీదున్న నీటి ట్యాంకుకు అనుసంధానం చేశాడు. వాల్వు తిప్పగానే మొక్కలన్నిటికీ డ్రిప్ ద్వారా నీరందే ఏర్పాటు చేయడంతో పని తగ్గిపోయింది. సహజ కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలన్న ఆసక్తితో సేంద్రియ ఎరువుతో సాగు ప్రారంభించిన రవీందర్.. ఉద్యాన శాఖ అధికారుల సలహా మేరకు నెలకోసారో, రెండు సార్లో వేప నూనెను తన భార్య పిచికారీ చేస్తుంటుందని చెప్పాడు. రోజూ పెద్దలూ పిల్లలూ టై కిచెన్ గార్డెన్ను పరిశీలిస్తూ.. కలుపు మొక్కలు కనిపిస్తే తీసేస్తుంటారు. అంతే.. చూస్తుండగానే మొక్కలు రసాయనిక అవశేషాల్లేని, తాజా ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి. ఆలుగడ్డలు తప్ప.. అప్పటి నుంచీ తమ కుటుంబంతోపాటు తన ఇద్దరు సోదరుల కుటుంబాలు కూడా ఆలుగడ్డల్లాంటివి తప్ప ఆకుకూరలు, కూరగాయలు కొనాల్సిన అవసరం రావడం లేదని రవీందర్ సంతోషంగా చెప్పాడు. కొద్ది నెలల క్రితం టమాటా కిలో రూ. 70లు అమ్మిన రోజుల్లో కూడా తమ మేడ మీద కోసినప్పుడల్లా నాలుగైదు కిలోల టమాటాలు వచ్చేవని చెప్పాడు. గత ఏడాది నాటిని మొక్కల్లో టమాటా కాపు అయిపోయింది. చెట్టు చిక్కుడు మొక్కలు కాపు అయిపోయిన తర్వాత కూడా మళ్లీ ఇప్పుడు చిగుళ్లు వచ్చి కాపుకొచ్చాయి. టమాటా, వంగ మొక్కలు మళ్లీ నాటారు. మేడ మీద మొక్కలుండడం వల్ల గత ఎండాకాలంలో ఇంట్లో ఉబ్బరం తక్కువగా ఉందని, చల్లగా ఉందని రవీందర్ తెలిపాడు. ఇంటిముంగల కూరగాయ మొక్కలు పెట్టుకోమని ఉద్యాన శాఖ వాళ్లు కిట్లు ఇచ్చినా గ్రామస్తులు పెద్దగా స్పందించని పరిస్థితు ల్లో రవీందర్ తన మేడ మీద భారీగా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు పండించడం స్థానికం గా చర్చనీయాంశమైంది. అయితే, కొందరు వివ రాలు అడిగి తెలుసుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరూ మొదలు పెట్టలేదని రవీందర్ చెప్పాడు. కొత్తదారి తొక్కేవాడెప్పుడూ ఒక్కడే కదా! - గుట్టల్ల బాలయ్య, కొందుర్గు, మహబూబ్నగర్జిల్లా తక్కువ చోటుందా? మేడ మీదనో, పెరట్లోనో ఎండ తగిలే చోటు ఒకటి, రెండు గజాలకు మించి లేదు.. అయినా, సేంద్రియ ఆకుకూరలు సాగు చేయాలనుంది! అప్పుడేం చేయాలి? ఇలాంటి ప్రశ్నలో నుంచి పుట్టిందే ఈ ఆలోచన! పుస్తకాల రాక్ మాదిరిగా ఇలా ఆకుకూరల మడి(వర్టికల్ గార్డెన్)ను పెట్టుకుంటే సరి! ఇనుప రాక్ వంటి ఫ్రేమ్ చేయించి, దానికి అవసరం మేరకు షేడ్నెట్ను కుట్టి.. చిన్న ట్రేలలో ఆకుకూరలు పెంచుకోవచ్చు. మరీ ఎండ ఎక్కువ అవసరం అనుకున్న మొక్కలను పై అంతస్తులో వేసుకోవాలి. ఆకుకూరలను తరిగి సలాడ్సగా ఉపయోగించడం చాలా ఆరోగ్య దాయకం అని వైద్యులు చెబుతున్నారు. గ్రీన్ సలాడ్స్లోకి అవసరమైన మైక్రో గ్రీన్స్ను కూడా ఈ పద్ధతిలో ఎంచక్కా పెంచుకోవచ్చు. ఆకుకూర లేకాకుండా కొన్ని పప్పు ధాన్యాలు, నూనెగింజల రకాలను కూడా వత్తుగా మొలకెత్తించి రెండు అంగుళాలు ఎదిగిన మొక్కలను సలాడ్సలో వినియోగిస్తున్నారు. 3,4 అంగుళాల లోతుండి, వెడల్పుగా ఉండే ట్రేలను ఎంపిక చేసుకొని ఉపయోగించవచ్చు. కొబ్బరిపొట్టు, వర్మీ కంపోస్టు గానీ లేదా చివికిన పశువుల ఎరువు గానీ సమపాళ్లలోను, కొద్దిగా మట్టిని కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని ట్రేలలో నింపి మైకోగ్రీన్స పెంచవచ్చు. అడపాదడపా జీవామతం, వర్మీవాష్, కంపోస్టు టీ, అమత్పానీ.. వీటిల్లో ఏది వీలైతే అది పిచికారీ చేసుకుంటే చాలు! కావాల్సిన ఎత్తులో కావల్సినన్ని అరలతో బోల్టు ల బిగింపు ద్వారా సులభంగా సిద్ధం చేసుకునే ఇనుప రాక్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇల్లు మారేటప్పుడైనా.. ఇప్పుడు అవసరం లేదనుకు న్పప్పుడైనా ఆ రాక్ల బోల్టులు విప్పేసి బస్తాలో కట్టేసి అటక మీద పెట్టేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
పోరుబాట వీడిన చంబాల రవీందర్
డీజీపీ ఎదుట లొంగుబాటు 24 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెర అనారోగ్యంతోనే బయటికి.. కుటుంబ సభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం జఫర్గఢ్/వరంగల్క్రైం : సుదీర్ఘ కాలంగా విప్లవోద్యమంలో పని చేస్తున్న జిల్లాకు చెంది న ప్రముఖ మావోయిస్టు నేత కుక్కల రవీందర్ అలియూస్ చంబాల రవీందర్ తన భార్యతో సహ పోలీసుల ఎదుట శుక్రవారం లొంగిపోయూరు. కుమారుడి లొంగుబాటు గురించి తెలియగానే ఆయన తల్లి, సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో రవీందర్ లొంగిపోయినట్లు తెలిసింది. మండలంలోని తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన చంబాల సాయిలు, నర్సమ్మ దంపతులకు నలుగురు కుమారులు. అందరిలో చిన్నవాడైన రవీందర్ ఇదే మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక సహకార సొసైటీలో వాచ్మన్గా ఏడాదిపాటు పని చేశాడు. ఈ క్రమంలో అతడికి వివాహమైంది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఆయన పీపుల్స్వార్లో పనిచేస్తున్నట్లు తెలియడంతో వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. రెండు నెలలు జైలులో ఉండి ఇంటికి వచ్చిన ఆయనపై గ్రామస్తులు పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో విసుగు చెంది 1990లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆయన తిరిగి రాకపోవడంతో నాలుగేళ్ల తర్వాత భార్య విడాకులు ఇచ్చి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత తిరిగి ఆయన ఒక్కసారి కూడా ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన రవీందర్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఆంధ్రా- ఒరిస్సా బార్డర్లో స్పెషల్ జోనల్ కమిటీ ప్రొటెక్షన్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనపై ప్రభుత్వం రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. ఆలస్యంగా పోలీస్ రికార్డుల్లోకి.. రవీందర్ అజ్ఞాతంలోకి వెళ్లిన కొన్నేళ్ల తర్వాత పోలీసులు ఈ విషయూన్ని గుర్తించారు. అతడు అజ్ఞాతంలో ఉన్నట్లు అక్టోబర్ 29, 1998లో పోలీస్ రికార్డుల్లో నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు తరచూ తమ్మడపల్లి(ఐ) గ్రామానికి వెళ్లి రవీందర్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులను శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లకు గురిచేశారు. ఈ బాధ భరించలేక అతడి సోదరులు కొన్నేళ్లపాటు ఊరు విడిచి వెళ్లారు. కుటుంబ సభ్యులను పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రవీం దర్ మాత్రం లొంగిపోలేదు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇల్లు శిథిలవస్థకు చేరుకుని, చుట్టూ ముళ్ల కంపలు పెరిగాయి. ప్రస్తుతం రవీందర్ పెద్ద అన్న గ్రామంలోనే మరో ఇల్లు నిర్మించుకొని తల్లితో కలిసి నివసిస్తున్నాడు. తమ్మడపల్లి(ఐ)లో హర్షాతిరేకాలు.. రవీందర్ లొంగిపోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు రడపాక ఎల్లయ్య, మునిగల సామేల్ మాట్లాడుతూ పోలీసులు ఎలాంటి కేసులు పెట్టకుండా ప్రశాంతంగా గ్రామంలో జీవించేలా చూడాలని కోరారు. -
ఎమ్మెల్సీలు జంప్
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్, టీడీపీలకు జిల్లాలో మరో దెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ శాసన మండలి పక్ష నేత బోడకుంటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బుధవారం గులాబీ కండువాలు కప్పుకున్నారు. పీఆర్టీయూ తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పూల రవీందర్ కూడా టీఆర్ఎస్లో చేరారు. ఈ పరిణామంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను, 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. తాజాగా ఎమ్మెల్సీలు ముగ్గురు చేరడంతో రాజకీయంగా టీఆర్ఎస్కు మరింత బలం చేకూరింది. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కె.దిలీప్కుమార్ సైతం గతంలో టీఆర్ఎస్ మద్దతుతోనే గెలిచిన వారు కావడం గమనార్హం. సాధారణ ఎన్నికలు జరిగిన తక్కువ సమయంలోనే ఎమ్మెల్సీలు ఇలా పార్టీ మారడం చర్చనీయంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో బోడికుంట వెంకటేశ్వర్లుకు ఇటీవలే మండలిలో పార్టీ పక్ష నేత పదవి వచ్చింది. ఇలా పదవి వచ్చిన కొద్ది రోజుల్లేనే ఈయన పార్టీ మారడంతో జిల్లాలోని టీడీపీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. గురువారం టీడీపీ జిల్లా స్థాయి సమావేశం జరగనున్న తరుణంలో వెంకటేశ్వర్లు పార్టీ మారడం ఆ పార్టీ శ్రేణులను కుంగదీస్తోంది. కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. సుదీర్ఘకాలంగా పొన్నాల లక్ష్మయ్యతో రాజలింగంకు విభేదాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల తరుణంలోనూ ఇవి బయటపడ్డాయి. శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్పై రాజలింగం సంచలన ఆరోపణలు చేశారు. అయినా శాసన మండలిలో ప్రతిపక్ష నేత పదవికి డి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఇది కూడా రాజలింగం పార్టీ మారడానికి కారణంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పూల రవీందర్ 2013 ఫిబ్రవరిలో జరగిన ఎన్నికల్లో ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బోడికుంట వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం 2009లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. పొన్నాల నాయకత్వం నచ్చకనే కాంగ్రెస్ను వీడా.. ఎమ్మెల్సీ రాజలింగం జనగామ : పొన్నాల లక్ష్మయ్య అసమర్థ నాయకత్వం నచ్చకనే 40 ఏళ్ల కాంగ్రె స్ అనుబంధాన్ని తెంచుకుని టీఆర్ఎస్లో చేరినట్లు ఎమ్మెల్సీ రాజలింగం అన్నా రు.. తెలంగాణ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని చెప్పారు. బుధవారం ఆయన ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీపై ఎనలేని విశ్వసనీయత ఉందని, అయితే కనీసం సొంత జి ల్లాలో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక పోవడమే కాకుండా ఆయన కూడా ఘోరంగా ఓడినా పొన్నాలను ఇంకా టీ పీసీసీ చీఫ్గా కొనసాగించడం సరైంది కాదన్నారు. పొన్నాల కొనసాగింపుతో కార్యకర్తల్లో, నాయకుల్లో పార్టీపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. పొన్నాల పాలనలో జనగామ నియోజకవర్గం భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. 1978 నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చానని, పొన్నాల లక్ష్మయ్య కంటే కాంగ్రెస్లో తానే సీనియర్నని తెలిపారు. పొన్నాల నాయకత్వంలో కాంగ్రెస్ నష్టపోతుందని చెప్పారు. అభివృద్ధిని కాంక్షించి టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల సహకారంతో జనగామ నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకుంటానని ఆయన వెల్లడించారు. -
ఆ సీరియల్కి ఆమే ప్లస్!
పదే పదే కొడితే పిల్లి కూడా పులిలా మారి ఎదురుదాడి చేస్తుందంటారు. మరి అభిమానం ఉన్న ఆడపిల్ల మనసును గాయపరిస్తే ఆమె మాత్రం ఉగ్రరూపం దాల్చదా? అన్యాయం చేసినవాడికి బుద్ధి చెప్పదా? దుర్గ అదే చేస్తోంది... ‘ఏక్ హసీనా థీ’లో! స్టార్ ప్లస్లో కొద్ది వారాల క్రితమే మొదలయ్యిందీ సీరియల్. మొదటి ఎపిసోడ్ నుంచీ ఉత్కంఠ భరితంగానే ఉంది. దుర్గా ఠాకూర్ చాలా అందమైన అమ్మాయి. ఆమె గాజు కళ్లలో మెరుపులే కాదు... ఎవరికీ అర్థం కాని భావాలు కూడా ఉంటాయి. ఆమె నవ్వులో తళుకులే కాదు... ఎవరూ చదవలేని రహస్యాలు దాగివుంటాయి. ఓ ధనిక కుటుంబాన్ని దెబ్బ తీయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఓ యువకుడిని నాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంటుంది. అసలింతకీ ఆమె జీవితంలో ఏం జరిగింది? ఎందుకు అంతగా పగబట్టింది? అన్న విషయాలను కొద్దికొద్దిగా రివీల్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు సీరియల్ని. ఈ సీరియల్ మొత్తం క్రెడిట్ దుర్గగా నటించిన సంజీదా షేక్కి ఇచ్చేయవచ్చు. నాలుగైదు సినిమాలు, పదికి పైగా సీరియళ్లు చేసిన ఆమె దుర్గ పాత్రను అవలీలగా చేస్తోంది. అద్భుతంగా పోషిస్తోంది. తన అందానికి అభినయాన్ని జోడించి అదరగొట్టేస్తోంది. ఆమే ఈ సీరియల్కి పెద్ద ప్లస్! రవీందర్ కిచెన్లో మన వంటలు! వంటల షోల పట్ల మహిళల ఆసక్తి ఏపాటిదో చెప్పాల్సిన పని లేదు. కొత్త వంటకాలు నేర్చుకోవడానికి పెన్నూ, పేపరూ పట్టుకుని టీవీ ముందు హాజరైపోతారు. అయితే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం వంటలు నేర్చుకోవాలన్న ఆసక్తే ఉంటుంది. అందుకే టీఎల్సీ లాంటి చానెళ్లు మన వారిని పెద్దగా అలరించలేవు. ఆ లోటును తీర్చడానికి నడుం కట్టింది... యూకేకి చెందిన రవీందర్ భోగల్. రవీందర్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రి పది గంటలకు టీఎల్సీలో ప్రసారమయ్యే ‘రవీందర్స్ కిచెన్’ షోలో... అన్ని దేశాల వంటలతో పాటు మన వంటలనూ కూడా చేసి చూపిస్తుంది. పాత తరహా వంటలకు కొత్త రుచులను అద్దడంలో రవీందర్ మహా నేర్పరి. గతంలో 136 దేశాల వంటకాల గురించి ఆమె రాసిన ‘కుక్ ఇన్ బూట్స్’ పుస్తకం ప్రపంచ ఉత్తమ వంటల పుస్తకంగా అవార్డునందుకుంది! పేదపిల్ల ప్రేమ పోరాటం! ఒక ఊరిలో ఓ జమిందారు. మనుషుల జీవితాలతోటి, అమ్మాయిల తనువుల తోటి ఆడుకోవడం ఇతగాడికి మహా సరదా. ఇలాంటి వాడి వలలో చిక్కుతుంది హీరోయిన్. ఓ పేద రైతు కూతురైన ఈమెను లొంగదీసుకోవడానికి పన్నాగాలు పన్నుతాడు జమిందారు. అతడినామె ఎలా ఎదుర్కొంది, మృగంలాంటి వాడిని మనిషిగా ఎలా మారుస్తుంది? హిందీలో ‘బైరీ పియా’గా అలరించిన ఈ సీరియల్ని జెమినీవారు ‘నువ్వే కావాలి’గా తీసుకొచ్చారు. పేదపిల్లగా సుప్రియ జాలిగొలిపే నటన, క్రూరుడైన జమిందారుగా శరద్ హావభావాలు ప్రేక్షకుడిని కట్టి పడేస్తున్నాయి! -
ఆ సీరియల్కి ఆమే ప్లస్!
పదే పదే కొడితే పిల్లి కూడా పులిలా మారి ఎదురుదాడి చేస్తుందంటారు. మరి అభిమానం ఉన్న ఆడపిల్ల మనసును గాయపరిస్తే ఆమె మాత్రం ఉగ్రరూపం దాల్చదా? అన్యాయం చేసినవాడికి బుద్ధి చెప్పదా? దుర్గ అదే చేస్తోంది... ‘ఏక్ హసీనా థీ’లో! స్టార్ ప్లస్లో కొద్ది వారాల క్రితమే మొదలయ్యిందీ సీరియల్. మొదటి ఎపిసోడ్ నుంచీ ఉత్కంఠ భరితంగానే ఉంది. దుర్గా ఠాకూర్ చాలా అందమైన అమ్మాయి. ఆమె గాజు కళ్లలో మెరుపులే కాదు... ఎవరికీ అర్థం కాని భావాలు కూడా ఉంటాయి. ఆమె నవ్వులో తళుకులే కాదు... ఎవరూ చదవలేని రహస్యాలు దాగివుంటాయి. ఓ ధనిక కుటుంబాన్ని దెబ్బ తీయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఓ యువకుడిని నాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంటుంది. అసలింతకీ ఆమె జీవితంలో ఏం జరిగింది? ఎందుకు అంతగా పగబట్టింది? అన్న విషయాలను కొద్దికొద్దిగా రివీల్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు సీరియల్ని. ఈ సీరియల్ మొత్తం క్రెడిట్ దుర్గగా నటించిన సంజీదా షేక్కి ఇచ్చేయవచ్చు. నాలుగైదు సినిమాలు, పదికి పైగా సీరియళ్లు చేసిన ఆమె దుర్గ పాత్రను అవలీలగా చేస్తోంది. అద్భుతంగా పోషిస్తోంది. తన అందానికి అభినయాన్ని జోడించి అదరగొట్టేస్తోంది. ఆమే ఈ సీరియల్కి పెద్ద ప్లస్! రవీందర్ కిచెన్లో మన వంటలు! వంటల షోల పట్ల మహిళల ఆసక్తి ఏపాటిదో చెప్పాల్సిన పని లేదు. కొత్త వంటకాలు నేర్చుకోవడానికి పెన్నూ, పేపరూ పట్టుకుని టీవీ ముందు హాజరైపోతారు. అయితే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం వంటలు నేర్చుకోవాలన్న ఆసక్తే ఉంటుంది. అందుకే టీఎల్సీ లాంటి చానెళ్లు మన వారిని పెద్దగా అలరించలేవు. ఆ లోటును తీర్చడానికి నడుం కట్టింది... యూకేకి చెందిన రవీందర్ భోగల్. రవీందర్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రి పది గంటలకు టీఎల్సీలో ప్రసారమయ్యే ‘రవీందర్స్ కిచెన్’ షోలో... అన్ని దేశాల వంటలతో పాటు మన వంటలనూ కూడా చేసి చూపిస్తుంది. పాత తరహా వంటలకు కొత్త రుచులను అద్దడంలో రవీందర్ మహా నేర్పరి. గతంలో 136 దేశాల వంటకాల గురించి ఆమె రాసిన ‘కుక్ ఇన్ బూట్స్’ పుస్తకం ప్రపంచ ఉత్తమ వంటల పుస్తకంగా అవార్డునందుకుంది! పేదపిల్ల ప్రేమ పోరాటం! ఒక ఊరిలో ఓ జమిందారు. మనుషుల జీవితాలతోటి, అమ్మాయిల తనువుల తోటి ఆడుకోవడం ఇతగాడికి మహా సరదా. ఇలాంటి వాడి వలలో చిక్కుతుంది హీరోయిన్. ఓ పేద రైతు కూతురైన ఈమెను లొంగదీసుకోవడానికి పన్నాగాలు పన్నుతాడు జమిందారు. అతడినామె ఎలా ఎదుర్కొంది, మృగంలాంటి వాడిని మనిషిగా ఎలా మారుస్తుంది? హిందీలో ‘బైరీ పియా’గా అలరించిన ఈ సీరియల్ని జెమినీవారు ‘నువ్వే కావాలి’గా తీసుకొచ్చారు. పేదపిల్లగా సుప్రియ జాలిగొలిపే నటన, క్రూరుడైన జమిందారుగా శరద్ హావభావాలు ప్రేక్షకుడిని కట్టి పడేస్తున్నాయి! -
బ్రిటన్లో భారత శాస్త్రవేత్తకు ఫెలోషిప్
లండన్: బ్రిటన్లోని గ్లాస్గో యూనివర్సిటీలో పరిశోధనలు సాగిస్తున్న రవీందర్ దహియా అనే భారత శాస్త్రవేత్త సుమారు రూ. 10.83 కోట్ల విలువైన ‘ఇంజనీరింగ్ ఫెలోషిప్స్ ఫర్ గ్రోత్’ ఫెలోషిప్ గెలుచుకున్నారు. అడ్వాన్స్డ్ మెటీరియల్స్, రొబోటిక్ అండ్ అటానమస్ సిస్టమ్స్, సింథటిక్ బయాలజీ రంగాల్లో పరిశోధనలకు ప్రభుత్వ నిధులందించే ఇంజనీరింగ్ అండ్ ఫిజికల్ సెన్సైస్ రీసెర్చ్ కౌన్సిల్ (ఈపీఎస్ఆర్సీ)... రవీందర్ను ఈ ఫెలోషిప్కు ఎంపిక చేసింది. బ్రిటన్లోని 10 వర్సిటీల నుంచి రవీందర్ సహా మొత్తం 8 మంది ఈ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. -
పరిచయంలో పదనిసలు
జిల్లా నేతల గురించి కేసీఆర్ ప్రస్తావన పలువురికి సంతోషం కొందరికి ఇబ్బందులు సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు మడికొండ సభలో ఒకింత భావోద్వేగంతో ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటుతో తనకు వెయ్యి జన్మ ల కీర్తి వచ్చిందన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తనకు తెలంగాణ ఉద్యమ గురువు అని కొనియాడారు. భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసి జయశంకర్సారు పేరు పెడతామని చెప్పారు. బహిరంగసభ ఉపన్యాసంలో, లోక్సభ-అసెంబ్లీ అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. రవీందర్రావు... నిమిషం కేసీఆర్ బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు పక్కన కూర్చునే పార్టీ ముఖ్య నేతలు చిన్న కాగితాల్లో రాసి సమాచారం ఇస్తుంటారు. కేసీఆర్ సాధారణంగా ఒకరిద్దరు ఇచ్చే కాగితాలనే తీసుకుని వాటిని ప్రసంగంలో ప్రస్తావిస్తారు. మడికొండ బహిరంగసభలో కేసీఆర్ పక్కనే కూర్చున్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు.. ప్రసంగం మొదలుకాగానే కాగితాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వెంటవెంటనే ఇలా చేస్తుండడంతో కేసీఆర్, రవీందర్రావును ఉద్దేశించి ‘నిమిష నిమిషానాకి ఏందయా. రాసిచ్చుడు ఆపుండ్రి. ఇబ్బంది పెట్టొద్దు’ అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రవీందర్రావు ఇబ్బందిగా ఫీలయ్యారు. దేవాదుల... కడియం శ్రీహరి టీఆర్ఎస్ ఆవిర్భవించగానే 2001లో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని హడావుడిగా చేపట్టారని విమర్శిస్తూ మాట్లాడారు. చంద్రబాబు రోడ్డు కూడా లేని ప్రాంతంలో శంకుస్థాపన చేయడంతో ఈనాడు పత్రిక ఈస్ట్మన్ కలర్లో 18 నెలల్లో సాగునీరు అని పెద్దగా ప్రచురించిందని పేర్కొన్నారు. ఇప్పటికీ దేవాదుల పూర్తి కాలేదని.. ఆరేళ్లు సాగునీటి శాఖ మంత్రిగా పని చేసిన పొన్నాల ఏమీ చేయలేదని విమర్శించారు. ఇలా చంద్రబాబు, పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్ విమర్శించే సమయంలో ఆయన పక్కనే ఉన్న శ్రీహరి ఇబ్బందిగా ఫీలయినట్లు కనిపించారు. ఆ సమయంలో కడియం మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఎర్రబల్లి.. ప్రదీప్రావు తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్రావుపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నప్పుడు వేదికపై ముందు వరుసలోనే కూర్చున్న ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు ఇబ్బందిగా కనిపించారు. కేసీఆర్ మాట్లాడుతూ... ‘కంచికి వెళ్తే బల్లి ఉంటది. దాన్ని తాకితే పుణ్యమొస్తది. ఇక్కడ పాలకుర్తిలో ప్రమాదమైన బల్లి ఉంది. అది ఎర్రబల్లి. పొద్దున లేస్తే నా మీద, తెలంగాణ మీద విషం కక్కే బల్లి అది.’ అని అన్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద ఉన్న టీఆర్ఎస్ నేతలంతా నవ్వుతూ కనిపించారు. ప్రదీప్రావు మాత్రం ఇబ్బందిగా కనిపించారు. పెద్ది.. పెళ్లి పంచాయితీ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పరిచయం సందర్భంగా కేసీఆర్ మాటలు అందరినీ నవ్వించాయి. నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డిని కేసీఆర్ ప్రజలకు పరిచయం చేస్తూ... ‘14 ఏళ్లు నాతో అన్ని సందర్భాల్లో ఉన్నారు. సుదర్శన్రెడ్డి ఉద్యమ బిడ్డ. ఎమ్మెల్యే అయితేనే సుదర్శన్రెడ్డి పెళ్లి చేసుకుంట అంటాడు. ఇప్పుడు మీరే పంచాయితీ తెంపాలె. నర్సంపేటలో పెద్దిని గెలిపించాలె’ అనడంతో సభ మొత్తం నవ్వులమయమైంది. కడియం, సీతారాం నాయక్.. ముత్తిరెడ్డి అభ్యర్థుల పరియం సందర్భంగా సభ ప్రారంభం కాగానే కేసీఆర్.. వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం శ్రీహరిని పరిచయం చేశారు. శ్రీహరి గురించి చెప్పడం మొదలుపెట్టడంతో సభలో ఒక్కసారిగా చప్పట్లు, ఈలలు భారీగా వినిపించాయి. ‘కడియం గాలి బాగా ఉన్నట్లుంది’ అని కేసీఆర్ అన్నారు. తర్వాత మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి ఎ.సీతారాం నాయక్ను పరిచయం చేస్తున్నప్పుడు ఇలాగే చప్పుట్లు, ఈలలతో మోగడంతో ‘అంతటా ఇదే గాలి ఉన్నట్లుంది’ అని కేసీఆర్ అనడంతో సభలో నవ్వులు వినిపించాయి. జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని పరిచయం చేస్తుండడంతో... అందరికంటే ఎక్కువ చప్పట్లు, ఈళలు వినిపించాయి. ‘పొన్నాల మీద కోపమా... ముత్తిరెడ్డి మీద ప్రేమా, ఇంత మోగుతాంది. పొన్నాల మీద కోపమే ఉన్నట్లుంది’ అని కేసీఆర్ అనడంతో సభలో మళ్లీ ఈళలు వచ్చాయి. యాకూబ్రెడ్డి.. గాంధీనాయక్ పొన్నాల తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని కేసీఆర్ విమర్శించారు. ఈ మాటలు చెబుతూ కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి యాకూబ్రెడ్డిపై పోలీసుల దాడిని ప్రస్తావించారు. ఆ సమయంలో యాకూబ్రెడ్డి స్టేజీపైన కేసీఆర్ వెనుకే ఉన్నారు. యాకూబ్రెడ్డిని చూపి.. హన్మకొండ, జనగామలో ఇళ్ల చుట్టూ ముళ్ల కంచె పెట్టుకుని విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పొన్నాల లక్ష్మయ్య ఉద్యమంలో పాల్గొనలేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చే వరకు అరగుండు, అర మీసంతోనే ఉంటానని శపథం చేసిన గాంధీనాయక్ బహిరంగసభ వేదికపై పక్కన కూర్చున్నారు. కేసీఆర్ ఆయనను దగ్గరికి పిలిచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
మాపై సస్పెన్షన్లను ఎత్తివేయండి
నర్సాపూర్,న్యూస్లైన్: ఇటీవల జరిగిన ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొని సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం నర్సాపూర్లో నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల పీఓలు, అసిస్టెంటు పీఓలకు శిక్షణ ఇచ్చారు. కాగా శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాణయ్య,కృష్ణస్వామి, యాదగిరి, రవికుమార్, సంగయ్య, శ్రీనివాస్రావు, బుచ్చిరెడి తదితరులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్కు వినతి పత్రం అందచేశారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో ఐదుగురిని సస్పెండ్ చేశారని, ఈ విషయంలో ఉపాధ్యాయుల తప్పు లేకపోయినా వారిని సస్పెండ్ చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంతేగాక పీఓలకు,ఏపీఓలకు సమానంగా అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తాము శిక్షణ కార్యక్రమాన్ని అరగంట పాటు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ సంఘం నేతల డిమాండ్ను రిటర్నింగ్ అధికారి రవీందర్ డీఈఓ రమేశ్ దృష్టికి తీసుకవెళ్లారు. ఈ విషయమై డీఈఓ స్పందిస్తూ వారంలోగా వారిని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో ఉపాధ్యాయ సంఘం నేతలు శాంతించడంతో శిక్షణ కార్యక్రమం యధావిధిగా కొనసాగింది. పీఓలు, ఏపీఓలకు శిక్షణ నర్సాపూర్ నియోజకవర్గంలోని పీఓలు,ఏిపీ ఓలకు బుధవారం శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా వారికి ఏవీఎంల పనితీరు, ఇతర అంశాలపై రిటర్నింగ్ అధికారి రవీందర్, అసిస్టెంటు రిటర్నింగ్ అధికారి నరేందర్, ఇతర అధికారులు శిక్షణ ఇచ్చారు. -
ఏమని చెప్పను!
కాలేజీ రోజుల్లో రవీందర్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. కవిత్వం బాగా రాసేవాడు. అతని కవిత్వాన్ని విని మేమంతా ‘వహ్వా వహ్వా’ అని ఎంజాయ్ చేసేవాళ్లం. మేము మాత్రమే కాకుండా లెక్చరర్లు, కాలేజీ సిబ్బంది కూడా అతని కవిత్వాన్ని ఆస్వాదించేవారు. ఒకరోజు ‘ఆశు కవిత్వం’ పేరుతో ఒక కార్యక్రమం పెట్టాడు. ఎవరు ఏ టాపిక్ చెప్పినా అప్పటికప్పుడు కవిత్వం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రేక్షకుల నుంచి నాగరాజు అనే సీనియర్ లేచి ‘‘ఇలా అప్పటికప్పుడు కవిత్వం చెప్పడం పెద్ద విషయం కాదు.. నేను కూడా చెప్పగలను. కావాలంటే చెక్ చేసుకోండి’’ అని సవాలు విసిరాడు. ‘‘రవి వాన మీద కవిత్వం చెప్పాడు కాబట్టి నువ్వు ఎండ మీద చెప్పు’’ అన్నారు ఎవరో. ‘‘అలాగే’’ అంటూ మొదలు పెట్టాడు నాగరాజు- ‘ఎండ మీద చెప్పమన్నావు... ఏమని చెప్పను! ఏమీ చెప్పకపోతే ఎండలా మండి పడతావు. అందుకే నిండుగా చెబుతున్నా ఎండ అంటే చెమటసముద్రం... అందులో మనం ఈదుతూనే ఉంటాం’ రవీందర్ కవిత్వం విని అందరం నవ్వుకున్నాం. అది ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటుంది. -పి. ప్రశాంత్, విజయనగరం -
అధికారుల దాడులు
మంచిర్యాల రూరల్, న్యూస్లైన్ : ఇసుక మాఫియాపై ఆదివారం అధికారులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల మండలం గోదావరి తీరం నుంచి అనుమతి, పర్మిట్లు లేకుండా ఇసుక తరలిస్తున్న 17 లారీలను పట్టుకుని పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 10వ తేదీన సాక్షిలో ‘తోడేస్తున్నారు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో ఇసుక మాఫియా రవాణాను కొద్ది రోజులు నిలిపి వేసింది. మళ్లీ ఆదివారం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరాంపూర్లోని సింగాపూర్ వద్ద గల గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. గతంలో రాత్రుళ్లు మాత్రమే ఇసుకను రవాణా చేసిన అక్రమార్కులు ఆదివారం ఉదయం అనుమతులు లేకుండా, ఓవర్లోడ్తో అక్రమంగా తరలించారు. సమాచారం అందుకున్న హాజీపూర్ పోలీసులు వాహనాలను తనీఖీ చేయగా, అనుమతి పత్రాలు లేకపోవడంతో జరిమానా విధించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. -
మూడు దశాబ్దాలుగా ఉద్యమ బాట
=నాంది పలికిన కడవెండి భూపోరాటం =సంచలనం సృష్టించిన జీవీకే ప్రసాద్ లొంగుబాటు =దండకారణ్యంలోనే చెల్లెలు దేవరుప్పుల, న్యూస్లైన్: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గుముడవెల్లి వెంకటకృష్ణప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి లొంగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయూంశమైంది. ఉసెండి లొంగుబాటుతో ఆయన స్వగ్రామమైన దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం వార్తల్లోకి ఎక్కింది. మూడు దశాబ్దాల క్రితం స్వగ్రామంలో జరిగిన పడమటి తోట భూపోరాటాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఓ భూస్వామికి చెందిన పడమటితోట(ఆరు ఎకరాలు)లో ఇళ్ల స్థలాల కోసం పోరాటం మొదలైంది. అనంతరం ఆ పోరాటంలోకి సీపీఐ(ఎంఎల్)జనశక్తి ప్రవేశించి ప్రాబల్యం పెంచుకుంది. అరుుతే కొంత మంది విద్యార్థులు, యువకులు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక అప్పట్లో న్యాయవాది విద్యనభ్యసిస్తున్న అదే గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డిని ఆశ్రయించి భూపోరాటంపై చర్చించారు. తన మిత్రుడైన లింగాలఘనపురం మండలం చీటూరుకు చెందిన రవీందర్ను పురుషోత్తంరెడ్డి కలిశారు. రవీందర్కు అప్పటికే పీపుల్స్వార్తో పరిచయం ఏర్పడింది. దీంతో వెంకటకృష్ణప్రసాద్తో పాటు మరికొంత మంది విద్యార్థులు, యువకులు ఆర్వైఎల్(రాడికల్ యూత్ లీగ్), ఆర్ఎస్యు(రాడికల్ స్టూడెంట్ యూనియన్)లో చేరారు. ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డి అలియూస్ ఏపీ సారథ్యంలో వీరు పోరాటం చేసి గ్రామంలోని పడమటితోటను సాధించడంలో సఫలీకృతులయ్యారు. ఆ భూపోరాటంతో పాటు నాటి రైతాంగ సాయుధ ఫోరాట స్పూర్తితో ఇక్కడి నుంచి యువకులు నక్సల్ ఉద్యమంలో కీలక నేతలుగా ఎదిగారు. అందులో వెంకటకృష్ణప్రసాద్ అలియూస్ ఉసెండి ఒకరు. దశాబ్దాల కాలం పాటు అజ్ఞాత జీవితం గడిపిన క్రమంలో 1986లో ఎన్కౌంటర్లో పీపుల్స్వార్ జిల్లా కమిటీ సభ్యుడుగా పైండ్ల వెంకటరమణ అలియాస్ కొండన్న, 1999 డిసెంబర్లో కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో పీపుల్స్వార్ రాష్ర్ట కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్రెడ్డి అలియాస్ మహేష్, అనంతరం నెక్కొండ ఎన్కౌంటర్లో పెద్ది శ్రీను అశువులు బాశారు. కళారూపాలతో చైతన్యం పాటు, ఒగ్గు కథల ప్రదర్శనలతో ఉసెండి ప్రజలను చైతన్యం చేశారు. పీపుల్స్వార్లో ఆయన కళాకారుడిగా రాణించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం మూడు దశాబ్దాలుగా ఆయన అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుముడవెళ్లి వెంకటకృష్ణప్రసాద్ అలియాస్ ఉసెండికి స్వయాన చెల్లెలైన రేణుక అలియాస్ భాను దండకార ణ్య ఉద్యమంలో కొనసాగుతున్నారు. ఉసెండి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యూరు. తమ్ముడు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రసుత్తం ఉసెండి తల్లిదండ్రులు ఆయన సోదరుడి వద్ద ఉంటున్నారు. ఉద్యమంలో వచ్చిన మార్పులతో విభేదించడంతో పాటు అనారోగ్య కారణాలతో చత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోరుునట్టు సమాచారం. ఉసెండిని రాష్ట్ర పోలీసులు బుధవారం హైదరాబాద్కు తీసుకువచ్చినట్టు తెలిసింది. -
అది సెట్ అని చెప్పినా నమ్మలేదు
పురాణాల్లో తరచూ వినిపించే పేరు మయబ్రహ్మ. దేవతల ఆర్ట్ డెరైక్టర్ అన్నమాట. ఆయనకు ఏ మాత్రం తీసిపోరు మన సినీ కళాదర్శకులు. ఏ ముహూర్తాన సినిమా జనాల ముందుకొచ్చిందో గానీ.. అప్పట్నుంచి లోకాలన్నింటినీ తెరపైకి తెచ్చేసి గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను సంభ్రమకు లోను చేస్తున్నారు. మాధవపెద్ది గోఖలే, టీవీఎస్ శర్మ, తోట తరణి లాంటి లెజెండ్స్ సృష్టించిన అద్భుతాలను మనం చూశాం. ఇప్పుడు తెలుగు తెరపై హాట్ ఫేవరెట్ రవీందర్. మగధీర, మర్యాదరామన్న, ఈగ, అత్తారింటికి దారేది... ఈ సినిమాలు చాలు రవీందర్ ప్రతిభ చెప్పడానికి. కళా దర్శకుడంటే... కేవలం సెట్లు వేయడం కాదు, తన సెట్స్ ద్వారా కథను చెప్పాలి, పాత్రల వ్యక్తిత్వాలను సెట్లు ప్రతిబింబించాలి అంటున్న రవీందర్తో కాసేపు. సెట్ కథకు అద్దం పట్టాలి ‘ఐతే’ సినిమా కోసం ఓ కిళ్లీ కొట్టు సెట్ వేశాను. ఆ సినిమా యూనిట్లో పనిచేసే కుర్రాడే ఆ కొట్టు దగ్గరకెళ్లి ‘ఓ సిగరెట్ ఈయమ్మా’ అనడిగాడు. అక్కడున్నవాళ్లందరూ ఒకటే నవ్వులు. తొలి సినిమాకే నాకు అందిన గొప్ప ప్రశంస అది. అలాగే... ‘రాఖీ’ సినిమా కోసం హీరో ఇంటి సెట్ వేశాం. ఛార్మితో షాట్స్ తీస్తున్నారు కృష్ణవంశీ. ఆమె కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేయాలి. లొకేషన్కి దూరంగా ఓ ఇల్లు చూపించారు కో డెరైక్టర్. ఆమెకు కోపం వచ్చేసింది. ‘ఎదురుగా ఇల్లు పెట్టుకొని అక్కడెక్కడికో వెళ్లమంటారేంటి?’ అంటూ చిరాకు పడిపోయారు. ‘అది సెట్ అమ్మా తల్లీ..’ అన్నా ఆమె నమ్మలేదు. సెట్ అనేది వాస్తవికతకు అద్దం పట్టాలని నమ్ముతాను నేను. కళా దర్శకునికి కథ తెలిసుండాలి కళా దర్శకుడికి కథతో పనేంటి? అనేవారు చాలామంది ఉంటారు. కానీ నేను దానికి వ్యతిరేకిని. కళాదర్శకునిగా ‘ఛత్రపతి’కి సైన్ చేయగానే... ముందు కథ చెప్పమని అడిగాను. దానికి నన్ను కిందనుంచి పైకి చూసినవాళ్లు ఉన్నారు. కానీ తర్వాత నా పనితనం చూసి రాజమౌళీగారే అభినందించారు. సముద్రతీరంలో తల్లీ కొడుకుల సెంటిమెంట్ సాంగ్ తీస్తున్నప్పుడు... కొండరాళ్ల మధ్యలో చూచాయగా పాలిస్తున్న తల్లిలా అనిపించే మరో రాయిని ప్రత్యేకంగా చేయించి అమర్చాను. ఆ రాయి ఆ సన్నివేశానికి శోభను తెచ్చింది. ‘మర్యాదరామన్న’లో విలన్ ఇంటి సెట్, అందులోని పాత్రలకు అద్దం పడుతుంది. ఆ సినిమా పతాక సన్నివేశంలో కష్టాలకోర్చి రెండొందల అడుగుల ఎత్తులో వంతెనను నిర్మించాం. ఆ నిర్మాణం నిజంగా అద్భుతమే. ‘మగధీర’ నాకెంతో సంతృప్తినిచ్చింది ‘మగధీర’లో జలపాతాన్ని ఛేదించుకుంటూ గుర్రంపై ఎంటరవుతాడు రామ్చరణ్. అది చాలామంది గ్రాఫిక్స్ అనుకుంటారు. కానీ అది గ్రాఫిక్స్ కాదు. మేం చేసిన మేజిక్. గ్రాఫిక్స్తో ఆ సన్నివేశం తీస్తే జనాలకు తేలిగ్గా అర్థమైపోతుంది. దాంతో ఆసక్తి తగ్గుతుంది. లొకేషన్లో ఆ సీన్ తీసేటప్పుడే అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ సినిమాలోని ఓ సీన్లో చరణ్ డ్రమ్ము వాయిస్తాడు. ఆ డ్రమ్ము నిజంగా తయారు చేశాం. ‘మరీ ఇంత చాదస్తమా?’ అని నిర్మాత వారిస్తున్నా.. వినకుండా... నాగ్పూర్ నుంచి ప్రత్యేకంగా పచ్చిచర్మాన్ని తెప్పించాం. ఆ చర్మం దారుణమైన స్మెల్ వస్తున్నా... భరిస్తూ ఆ డ్రమ్ తయారు చేశాం. చరణ్ ఆ డ్రమ్ వాయిస్తున్నప్పుడు దుమ్ము లేస్తుంటే జనాల్లో వచ్చిన వైబ్రేషన్ తెలిసిందే. ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మాత సహకరించడం వల్లే అంత అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించగలిగాం. సెట్ అనేది పాత్ర వ్యక్తితాన్ని ప్రతిభింబించాలి కళా దర్శకుడు నిర్మాతలతో ఎక్కువ ఖర్చు చేయిస్తారు అనేవాళ్లు కోకొల్లలు. కానీ అందులో నిజం లేదు. సరైన సమయంలో సెట్ అందుబాటులో ఉంటే నిర్మాతకు ఖర్చు తగ్గుతుంది. అందుకు ‘అత్తారింటికి దారేది’ సినిమానే ఓ నిదర్శనం. ఈ సినిమాకు ముందు అనుకున్న పని దినాలు 120. కానీ సెట్ అందుబాటులో ఉండటంతో 103 రోజుల్లో సినిమా పూర్తయింది. కుటుంబ కథలకు ఆర్ట్ డెరైక్టర్తో పనుండదనేది చాలామంది అభిప్రాయం. దాన్ని బ్రేక్ చేసింది ‘అత్తారింటికి దారేది’. నదియా ఇంటి సెట్ నాకు చాలామంచి పేరు తెచ్చింది. ఆ ఇంటి సెట్లో కొన్ని పాతకాలపు వస్తువులను చూపించాం. సెంటిమెంట్లను గౌరవించే నదియా పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికే అలా చేశాం. ‘జూలాయి’ చేస్తున్నప్పుడు 40 లక్షలతో బ్యాంక్ సెట్ వేశాను. ‘బ్యాంక్ సెట్కి అంత ఖర్చా’ అన్నారు. 15 వేల కోట్లు దాచే బ్యాంక్ అది. దానికి 40 లక్షలు వెచ్చించడం తప్పుకాదే. త్రివిక్రమ్ ఈ విషయంలో నాకెంతో సహకరించారు. సినిమా విజయంలో నా పాత్ర గురించి చెప్పుకోవాలి సినిమా సక్సెస్లో పనిచేసిన అందరికీ భాగం ఉంటుంది. కాదని అనను. కానీ.. ఒక ఆర్ట్ డెరైక్టర్గా నా ప్రతిభ గురించి ప్రత్యేకంగా అందరూ చెప్పుకోవాలి. నేను కోరుకునేది అదే. చిన్న సినిమాలకూ అందుబాటులో ఉంటున్నాను. ప్రస్తుతం రాజీవ్మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఓ బాలీవుడ్ సినిమాకు, కరుణాకరన్-నితిన్ల సినిమాకు ఆర్ట్ అందిస్తున్నా. -
కొలతలతో కబ్జా
సర్కారు భూములకే ఎసరు =ఓ సర్వేయర్ బాగోతం =ఆయన ఆడిందే ఆట... పాడిందే పాట =తప్పుడు సర్వేలతో ఖజానాకు ’2.30 కోట్ల నష్టం తూనికలు కొలతల్లో కాంటా కొట్టినంత ఈజీగా... సర్వేయర్లు సర్కారు భూమిని కొల్లగొడుతున్నారు. గొలుసు కొలతల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కోచోట... ఒక్కో గజం మిగిలినా సరే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మిగుల్చుకుంటున్న భూములను రికార్డులకు దొరక్కుండా సొంతం చేసుకుంటున్నారు. ఇందులో ఎస్సారెస్పీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ది అందెవేసిన చేయి. సర్కారు ఖజానాకు ఆయన నష్టం తెచ్చినట్లు నిర్ధారణ అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సర్వేయర్లపై ఉంది. దాన్ని విస్మరించిన కొందరు... సర్వే నంబర్ల హద్దులనే అటుదిటుగా మార్చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వడ్డేపల్లి ప్రాంతంలోని ప్రశాంత్ నగర్లో వంద గజాల స్థలం ఓ ఎమ్మెల్యే కుటుం బీకులు, ఓ సర్వేయరు... మధ్యలో జోక్యం చేసుకున్న రియల్ గ్యాంగ్, సీఐ భార్యకు మధ్య జగడం పెట్టిం చిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. మరింత లోతుగా ఆరా తీయడంతో ఇంటి నిర్మాణం చేపడుతున్న సర్వేయర్ దారబోయిన రవీందర్ లీలలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆయన గతంలో హన్మకొండ సర్వేయర్గా పనిచేశాడు. ఆ సమయంలో జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న సర్కారు భూములను ప్రై వేట్ పట్టాదారులకు అప్పగించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. తప్పుడు సర్వేలతో సర్కారు భూమిని కొల్లగొట్టినందుకు రవీందర్పై చర్యలు తీసుకోవాలని అప్పటి జేసీ వాకాటి కరుణ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. గత ఏడాది జూన్ 23వ తేదీన (ఆర్సీ నంబర్ ఈ 4/3121) జేసీ పంపిన నివేదికలో ఉన్న వివరాల ప్రకారం... కాజీపేట జాగీర్ గ్రామ పరిధి సర్వే నంబర్ 31, 27లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. అధికారులు విచారణ చేపట్టడంతో గతంలో ఆ స్థలాన్ని డీ మార్కేషన్ చేసిన సర్వేయర్ రవీందర్... 1.10 ఎకరాలకు సంబంధించి తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లుగా తేలింది. సర్వే నంబర్ 31లో అప్పటికే ఇళ్లు, నిర్మాణాలు వెలిశాయి. అక్కడ ఉండాల్సిన పట్టా భూములు సైతం సర్వే నంబర్ 27లోని ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లుగా తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా గుర్తించారు. దాదాపు 37 గుంటల భూమి ఆక్రమణకు గురైందని.. ఆ విషయాన్ని సర్వేయర్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు ధ్రువీకరించారు. అప్పటి మార్కెట్ రేటు ప్రకారం చదరపు గజానికి ’ 5,000 చొప్పున ’ 2.23 కోట్ల విలువైన సర్కారు భూమిని తప్పుడు సర్వేతో ఆక్రమణదారులకు దోచిపెట్టినట్లుగా లెక్కలేశారు. అదే తరహాలో హన్మకొండ మండలంలో లష్కర్ సింగారం గ్రామంలో సర్వే నంబర్ 326లో 23 గుంటల ప్రభుత్వ స్థలం, సర్వే నంబర్ 491లో ఐదు గుంటల స్థలానికి సంబంధించి హద్దులు నిర్ణయించే బాధ్యతను సర్వేయర్ రవీందర్కు తహసీల్దార్ అప్పగించారు. 326 సర్వే నంబర్లో ఉన్న 23 గుంటల స్థలాన్ని ఏకంగా పట్టాదారులకు సంబంధించిన సర్వే నంబర్25లో ఉన్నట్లుగా ఆయన నంబర్లు మార్చేసినట్లు తదుపరి విచారణలో తేలింది. ఆ స్థలం ’ 7.26 లక్షల విలువైనదిగా అధికారులు అంచనా వేశారు. తమ దష్టికి వచ్చిన ఈ రెండు సంఘటనల్లోనూ రవీందర్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసి సర్కారు ఖజానాకు నష్టం తెచ్చినట్లు జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. కానీ.. ఫైలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉండడం గమనార్హం. తాజాగా ప్రశాంత్నగర్లో నిర్మాణంలో ఉన్న వివాదాస్పద స్థలం రవీందర్ భార్య పేరుతో ఉండడం గమనార్హం. మొత్తంగా సర్వేయర్ల లీలలు.. సర్కారు భూములు.. తప్పుడు కొలతలన్నీ.. యజమానుల మధ్య చిచ్చు పెడుతున్నట్లు ఈ సంఘటన రూఢీ చేసింది. -
తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
వలిగొండ, న్యూస్లైన్: తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. మండలకేంద్రంలోని శివసాయి ఫంక్షన్హాల్లో పీఆర్టీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె, పాఠశాలల మూసివేతతో వాడవాడలా తెలంగాణ వాదం బలంగా వెళ్లిందన్నారు. 1100 మంది బలిదానాలు చేసుకున్న చరిత్ర తెలంగాణ ఉద్యమానిదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, ప్రతి వ్యక్తికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చేలా కృషి చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నూతనంగా జోన్లు ఏర్పడుతాయని ఉపాధ్యాయుల సమస్యలు తీరుతాయన్నారు. పీఆర్టీయూ తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. అనంతరం ఆయనను డిప్యూటీ డీఈఓ మదన్మోహన్ చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈ మాసంలో పదవి విరమణ చేయనున్న అరూరు పీఎస్ ప్రధానోపాధ్యాయులు రేపాల వెంకటేశాన్ని కూడా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ పబ్బు ఉపేందర్, జేఏసీ చైర్మన్ రేకల రామదాసు, ఎంఈఓ రాజేందర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు బిక్కి సత్యనారాయణ, సయ్యద్ఖాన్, వెంకటయ్య, ప్రభాకర్రెడ్డి, సత్తయ్య, రాజేశ్వర్, రవీందర్ పాల్గొన్నారు. -
టీడీపీ నేత నివాసంలో నకిలీ మద్యం స్వాధీనం
రంగారెడ్డి జిల్లాలోని దెబ్బడిగల్లో తెలుగుదేశంపార్టీ నేత రవీందర్ నివాసంపై గురువారం తెల్లవారుజామున ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో రూ. 5 లక్షల విలువైన నకిలీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు ఆయన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయన్ని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం ఎక్కడి నుంచి తెస్తున్నారు. ఎన్నాళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు అనే అంశాలపై పోలీసులు రవీందర్ను తమదైన శైలీలో ప్రశ్నిస్తున్నారు.