రంగారెడ్డి(శంషాబాద్): అన్నం తిని అనారోగ్యానికి గురైన ఓ ఆవు బుధవారం మృతి చెందింది. వివరాలు..మండలంలోని ఘాంసిమియాగూడకు చెందిన రవీందర్ ఆవును పోషించుకుంటున్నాడు. రెండు రోజుల కిందట గ్రామంలో బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అమ్మవారికి నైవేధ్యంగా సమర్చించిన అన్నంను సమీపంలో ఓ కుప్పగా పోశారు.
మంగళవారం అటుగా వెళ్లిన ఆవు ఆ అన్నం తినింది. అన్నం తిన్న ఆవు అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందింది. ఆవు మృతితో తనకు ఉపాధి లేకుండా పోయిందని, నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు.
అన్నం తిని అనారోగ్యానికి గురైన ఆవు మృతి
Published Wed, Aug 12 2015 7:56 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement