cow
-
అప్పుల ఊబిలో అన్నదాత.. ఆవు వచ్చి రక్షించింది..
సాక్షి ప్రతినిధి, వరంగల్/వేలేరు: కుమ్మరిగూడెం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో కేవలం 300 జనాభా, 72 ఇళ్లున్న ఓ కుగ్రామం.. ఇక్కడి అన్నదాతలు ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడారు. ఇప్పుడదే గ్రామం అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని స్థానికంగా విక్రయించడంతోపాటు అమెరికా, యూకే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే అప్పుల ఊబి నుంచి బయటపడి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది. జర్మన్ మహిళ దాతృత్వంతో.. సత్యసాయి బాబా భక్తురాలు, దాతృత్వశీలి అయిన మోనికా రేటరింగ్(జర్మనీ) భారత్లో పర్యటిస్తూ.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలను, ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలేకర్ సాగు విధానంపై శిక్షణ పొందిన కుమ్మరిగూడెంవాసి మారుపాక కోటి, మహర్షి గోశాల నిర్వాహకుడు సర్జన రమేష్ ద్వారా కుమ్మరిగూడెం సహా చుట్టుపక్కల గ్రామాల్లో స్వయంగా పర్యటించారు.అన్నదాతల ఇబ్బందులను ఆమె గుర్తించారు. వారిని ఎలాగైనా ఆదుకోవాలనుకున్న మోనికా రేటరింగ్.. గ్రామస్తులను పాడిపరిశ్రమ వైపు ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన 30 మంది రైతులను గుజరాత్ తీసుకెళ్లి రూ. 50 వేల చొప్పున 30 గిర్ జాతి ఆవులను కొనిచ్చారు. అలాగే నెయ్యి తీసే యంత్రాన్ని కూడా రైతులకు అందించారు.మోనికా రేటరింగ్ అందించిన ఆర్థిక చేయూతతో కుమ్మరి గూడెం రైతులు క్రమంగా నిలదొక్కుకున్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన గిర్ జాతి ఆవు పాలతో గ్రామస్తులు నెలకు సుమారు 50కిలోల మేర తయారు చేస్తున్న నెయ్యికి భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా కిలో ఆవు నెయ్యి తయారీకి 20 లీటర్ల పాలు అవసర మవుతుంది. కుమ్మరి గూడెం రైతులు మాత్రం కిలో నెయ్యి (Ghee) తయారీకి 30 నుంచి 35 లీటర్ల పాలను ఉపయో గిస్తున్నారు. స్వచ్ఛతకు మారుపేరుగా మారడంతో కిలో రూ.4 వేలకు పైగా వెచ్చించి మరీ కొంటున్నారు. ఆదిలాబాద్, విజయవాడ, విశాఖపట్నం వాసులు కూడా ఫోన్ చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. అమెరికాలోని డాలస్, యూకేలోని లండన్, జర్మనీలో ఉంటున్న వారు సైతం ఫోన్ చేసి నెయ్యి ఆర్డర్ చేస్తున్నారు. వారికి స్పీడ్ పోస్ట్, కార్గో సర్వీస్ల ద్వారా నెయ్యిని పంపిస్తున్నారు. హనుమ కొండ, వరంగల్, హైదరాబాద్లలోని ఆయుర్వేద వైద్యులు సైతం ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు.ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతోంది..నాకున్న ఎకరంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. అలాగే పశుపోషణ చేస్తున్నాను. ప్రస్తుతం ఒక గిర్ ఆవు పాలు ఇస్తోంది. ప్రతి నెలా పాలబిల్లు రూ. 7–8 వేలు వస్తోంది. దీంతో మా కుటుంబ నెలవారీ ఖర్చులు, ఇతర అవసరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది. – మారుపాక రవి, కుమ్మరిగూడెం గ్రామస్తుడుప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలి..మేము గ్రామంలోనే నెయ్యి తయారు చేసి దేశవిదేశాలకు సరఫరా చేస్తున్నాం. ఇక్కడ తయారు చేసిన నెయ్యికి చాలా డిమాండ్ ఉంది. మాకు ప్రభుత్వం సహకారం అందించి రుణాలు మంజూరు చేస్తే చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – మారుపాక రాజు, పాలకేంద్రం నిర్వాహకుడు, కుమ్మరిగూడెంసంతృప్తిగా ఉంది.. కుమ్మరిగూడెం (Kummarigudem) ఏడేళ్లలో సాధించిన ప్రగతిని చూసి ఎంతో ఆనందిస్తున్నా. ఇప్పుడు ఈ గ్రామంలో పర్యటిస్తుంటే ఇంగ్లిష్ మాట్లాడే యువకులు నా వెంట నడుస్తూ విజయగాథలు వివరిస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. గ్రామస్తులు ఫోన్ చేసి వారి ఆవులను చూసేందుకు రావాలని, జీవితంలో ఎంతో బాగుపడ్డామని చెబుతుండటం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. – మోనికా రేటరింగ్ -
180 రోజులు..14 రాష్ట్రాలు.. 4,900 కి.మీలు
తిరుపతి కల్చరల్: గోరక్షణ, భూ సంరక్షణ, దేశ సుభిక్షతను కాంక్షిస్తూ బాలకృష్ణ గురుస్వామి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన గోమాతతో పాదయాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది. తొలిత మంగళం రోడ్డులోని బొంతాలమ్మ ఆలయం వద్ద స్థానికులు, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన సభ్యులు గోమాత పాదయాత్రకు హారతులు పట్టి స్వాగతం పలికారు. గోమాత పాదయాత్ర దారుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ భూ సంరక్షణ గోమాత రక్షణతోనేనని, భరతభూమి రక్షణతో దేశం సుభిక్షతతో వరి్థలిల్లుతుందన్నారు. గోమాతను సంరక్షించి తద్వారా భారతభూమి సారవంతమైన భూమిగా పర్యావరణం పరిమళించడంతో దేశం, మానవాళి సుభిక్షతగా ఉంటారనే నినాదంతో గోమాతతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 180 రోజుల పాటు 14 రాష్ట్రాల మీదుగా 4,900 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పది రాష్ట్రాల మీదుగా 3710 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపతికి నగరానికి చేరుకున్నామన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి పాదయాత్రను కన్యాకుమారికి కొనసాగిస్తామని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం గోమాతను రక్షించాలని కోరుతూ చేపడుతున్న ఈ పాదయాత్ర పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. అనంతరం అక్కడ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం, అలిపిరి వరకు గోమాత పాదయాత్ర సాగించారు. -
కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..
మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం వెళితే సాయంత్రానికి దారి తప్పారు. సిగ్నల్ లేదు. ఎటు చూసినా ఏనుగులు. రాత్రంతా అడవిలోనే. వారికోసం అగ్నిమాపకదళం, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామస్తులు తెగించి అడవిలోకి వెళ్లారు. ‘ఒక్క ఆవు కోసమా ఇదంతా’ అని దాని ఓనరమ్మను అడిగితే ‘నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా’ అంది. కేరళను ఊపేసిన ఈ ఘటన వివరాలు.ఆ ఆవు పేరు మాలూ. ఎర్నాకుళం జిల్లాలోని కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు పల్లెలో మాయా అనే 46 ఏళ్ల స్త్రీ దాని యజమాని. దాని మీద వచ్చే రాబడే ఆ ఇంటికి ఆధారం. రోజూ అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరడం మాలూ అలవాటు. మొన్న బుధవారం (నవంబర్ 27) అది అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకూ చూసిన మాయా తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది. గురువారం మధ్యాహ్నం వరకూ అటూ ఇటూ వెతికి అడవిలోకి వెళ్లడానికి ఇరుగూ పొరుగునూ తోడు అడిగింది. పాపం మాయా ఆందోళన చూసిన పారుకుట్టి (64), డార్లీ (56) సరే మేమూ వస్తాం అన్నారు. వారికి అడవి కొట్టిన పిండి. మధ్యాహ్నం వాళ్లు ముగ్గురూ మాలూను వెతుకుతూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు.అడవి ఒక్కలాగా ఉండదుఅడవిలోపలికి వెళ్లిన ఆ ముగ్గురు స్త్రీలు చాలా దూరం వెళ్లారు. సాయంత్రం నాలుగు వరకూ వాళ్లు సిగ్నల్స్ దొరికేంత దూరం వెళ్లారు. ఆ తర్వాత ఆవు కనిపించక వెనక్కు తిరిగేసరికి ఏనుగుల మంద. కొత్తమంగళం అడవుల్లో ఏనుగులు జాస్తి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురూ రెండోదారి పట్టేసరికి అక్కడ కూడా ఏనుగుల మందే. దాంతో భయపడి మూడోదారిలోకి మళ్లారు. కాని ఈసారి ఒంటరి ఏనుగు కనిపించింది. ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదం. వారు దారి మార్చుకుని నాలుగో దారి పట్టేసరికి దారి తప్పారు. అడవి లోపల తన రంగులు మార్చుకుంటూ ఉంటుందని ఆటవీ శాఖ వారు అంటారు. లోపల అడవంతా ఒక్కలాగే ఉంటూ కనికట్టు చేస్తుంది. అలా తెలిసిన దారే అనుకుని తెలియని దారిలో అడుగుపెట్టి వారు దారి తప్పారు.మొదలైన అన్వేషణఊళ్లోని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లి తప్పిపోయారనే సరికి అట్టికాలంలో గగ్గోలు రేగింది. వెంటనే కబురు మీడియాకు చేరేసరికి వార్తలు మొదలైపోయాయి. తక్షణం ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ అండ సేఫ్టీ వాళ్లు 15 మంది ఒక టీమ్ చొప్పున నాలుగు బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు 50 మంది, వీరితో కలిసి తోడుగా వెళ్లిన గ్రామస్తులు, డ్రోన్లు... ఒక సినిమాకు తక్కువ కాకుండా అన్వేషణ మొదలైంది. ‘అడవిలో ఆ సమయంలో వెళ్లడం ప్రమాదం. ఏనుగులు చూశాయంటే అటాక్ చేసి చంపేస్తాయి. మా టీమ్లు రెండు వెనక్కు వచ్చేశాయి. ఒక టీమ్ ఒక షెల్టర్లో రాత్రి గడిపి తెల్లవారు జామున వెతకాల్సి వచ్చింది’ అని ఫారెస్ట్ అధికారి తెలిపారు.స్మగ్లర్లు అనుకునిఆ ముగ్గురు స్త్రీలు 15 గంటల అన్వేషణ తర్వాత శుక్రవారం ఉదయం 7.30 గంటలకు రెస్క్యూటీమ్కు కనిపించారు. కాని వాస్తవంగా వారు ఆ రాత్రే దొరకాల్సింది. ‘మేము ఆ ముగ్గురు స్త్రీలను వెతుకుతూ మమ్మల్ని గుర్తించడానికి అక్కడక్కడా మంటలు వేశాం. ఏనుగులను చెల్లాచెదురు చేయడానికి టపాకాయలు కాల్చాం. టార్చ్లైట్ల వెలుతురు కూడా దూరం వరకూ వేశాం’ అని అటవీ అధికారి చెప్పారు. ‘అయితే మేము ఆ టార్చ్లైట్ను దూరం నుంచి చూశాం. అడవిలోకి వచ్చిన వారు పోలీసులో, స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది. ఆ సమయంలో స్మగ్లర్లకు దొరికితే అంతే సంగతులు. అందుకే మేం లైట్ వెలుగులు చూసినా చప్పుడు చేయకుండా ఉండిపోయాం’ అని ఆ ముగ్గురు స్త్రీలు చెప్పారు.వారు అడవిని జయించారుగతంలో తెలుగులో రచయిత కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల రాశారు. ఆ నవలలో తన పంది తప్పిపోతే ఒక వృద్ధుడు అడవిలోకి వెళతాడు రాత్రిపూట. అనేక ప్రమాదాలు జయించి తిరిగి వస్తాడు. ఈ ఘటనలో కూడా ఈ ముగ్గురూ అనేక ప్రమాదాలు దాటి తిరిగి వచ్చారు. వారి కోసం అంబులెన్సులు, వైద్య సహాయం సిద్ధంగా ఉంచినా వాటి అవసరం రాలేదు.మరి ఇంతకీ మాలూ అనే ఆ ఆవు?వీరిని వెతకడానికి పెద్ద హడావిడి నడుస్తున్నప్పుడే అంటే గురువారం సాయంత్రం అది ఇంటి దగ్గరకు వచ్చి అంబా అంది. కొడుకు దానిని కట్టేసి తల్లి కోసం అడవిలోకి పరిగెత్తాడు. అదన్నమాట. (చదవండి: -
ఆవును హతమార్చిన పెద్దపులి
నార్నూర్: మండలంలో ని చోర్గావ్ గ్రా మ శివారులో సోమవారం సాయంత్రం తార్యానాయక్ అనే రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం ఉట్నూర్ చిన్నునా యక్ తండా, హస్నాపూర్, చాందోరి మీదుగా మండలంలోని గుంజాల శివారుకు చేరుకున్న పెద్దపులి మధ్యాహ్నం నుంచి అదే ప్రాంతంలో తలదాచుకుంది. రాత్రి జైనూర్ లేదా బేల మీదుగా వెళ్లిపోతుందని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ సోమవారం గుంజాల వద్ద ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సాయంత్రం చోర్గావ్ శివారులో ఆవుపై దాడి చేసి బాబేఝరి వైపు మళ్లిందని స్థానికులు పేర్కొంటున్నారు. -
మేయని ఆవుకు హోమియో చికిత్స
ఈ ఆవు కడపలోని ఒక హోటల్ యజమానిది. ఆ యజమాని ప్రతి రోజూపోషక విలువలు గల మేతతో పాటు కూరగాయలు, దాణా కూడా మేపే వారు. అయితే, ఒక రోజు ఆవు మేత తినటం మానేసింది. నీళ్లు కూడా తక్కువగా తాగుతున్నదని పశువుల ఆసుపత్రికి తోలుకొచ్చారు. మేం రోగ నిర్ధారణ పరీక్షలు చేశాం. లోపల పెద్దపొట్ట ఎన్నిసార్లు తిరుగుతున్నది? పొట్టలోని ద్రావణం పి.హెచ్. ఏ స్థాయిలో ఉంది? పొట్టలో సూక్ష్మజీవులు ఉత్తేజిత స్థాయిలో ఉన్నాయా లేవా? ఈ పరీక్షలు చేశాం. పొట్ట కదలికలు, పిహెచ్, సూక్ష్మజీవులు అన్నీ సాధారణంగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో కాలేయ సంబంధిత టానిక్లు, ఇంజెక్షన్లు, ఆయుర్వేదిక్ పొడులతో పొట్టకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేశాం. పది రోజులైనా మార్పులేదు. ఆ పది రోజులు కేవలం నార్మల్ సెలైన్ బాటిల్తోనే బతికిందని చెప్పవచ్చు. అల్లోపతి, ఆయుర్వేదిక్ చికిత్సలు చేసినా మార్పు లేదు కదా.. హోమియోపతి మందులు ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని ఆలోచన వచ్చింది. నక్స్ వామికా 200, రూస్టాక్స్ 200 గుళికల మందులు రోజుకు 3 సార్లు చొప్పున మూడు రోజులు ఇచ్చాం. వీటిని దాణాలో కలిపి పెట్టొచ్చు లేదా నేరుగా పశువు పెదానికి, దంతాలకు మధ్యలో హోమియో గుళికలు వేస్తే చాలు. ఈ మందులు వేసిన రెండో రోజే ఆవు మేత మేయటం మొదలు పెట్టిందని ఆవు యజమాని ఆశ్చర్యపడుతూ ఆసుపత్రికి వచ్చి మాతో చెప్పారు. పది రోజులు దాదాపుగా రూ. 2 వేలు ఖర్చు చేసినా రాని ఫలితం రూ. 30ల హోమియోపతి మందులతో రావటం సంతృప్తిని కలిగించింది. పశువైద్యంలో అల్లోపతి, ఆయుర్వేదిక్ ఔషధాలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. తక్కువ ఖర్చుతో పశువులకు మంచి చికిత్స, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, అందించవచ్చని మాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. పాడి రైతులకు తెలియజేస్తున్న విషయమేమిటంటే ప్రథమ చికిత్సగా తక్కువ ఖర్చుతో కూడిన ఆయుర్వేద, హోమియోపతి చికిత్సలు చేయటం నేర్చుకోవటం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా పశువైద్యులను సంప్రదించి అల్లోపతి చికిత్సలు తీసుకోవచ్చు. – డాక్టర్. జి.రాంబాబు (94945 88885),పశువైధ్యాధికారి, కడప -
పిచ్చెక్కి దాడి చేసిన ఆవు
ఎడపల్లి (బోధన్): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో పిచ్చెక్కిన ఆవు స్వైర విహారం చేసి 13 మందిని గాయపరిచింది. గ్రామంలో మూడు రోజుల క్రితం ఒక ఆవును కుక్కలు కరిచాయి. ఈ క్రమంలో మతిస్థిమితం తప్పిన ఆవు.. గురువారం ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతూ పలువురిపై దాడి చేసి గాయపరిచింది. సాయంత్రం ఆటోపై దాడి చేయడంతో అందులోని ముగ్గురికి గాయాలయ్యాయి. ఆవు సైతం గాయపడి మృతి చెందింది. సమాచా రం అందుకున్న ఎస్ఐ వంశీచందర్ రెడ్డి గ్రామానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వెటర్నరీ సిబ్బంది ఆవును పరీక్షించి కళేబరాన్ని తరలించారు. -
గో హంతకునిపై పోలీసుల కాల్పులు
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్లో గో హంతకునిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.గోవులను వధించి, వాటి అవశేషాలను బహిరంగంగా పారవేసిన కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని గమనించిన నిందితుని సహచరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులలో గాయపడిన వ్యక్తిని మహతాబ్ ఆలం ఖురేషీగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అన్వర్ నగర్, కృష్ణ నగర్లలో గోవులను వధించారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోహత్యపై విచారణ చేపట్టి, వారికి లభ్యమైన ఆవుల అవశేషాలను పాతిపెట్టారు. అయితే దీనిపై కలకలం చెలరేగడంతో పోలీసు అధికారి సోనమ్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గోహత్య ఘటనలో ప్రమేయమున్న నిందితులపై కాల్పులు జరిపారు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
ఆవురా... ఎంత క్రమశిక్షణ!
క్రమశిక్షణ తప్పిన వారిని ‘పశువులా ప్రవర్తించకు’ అంటాం. ఈ వైరల్ వీడియోను చూస్తే మాత్రం ‘పశువును చూసి నేర్చుకో’ అంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ను పట్టించుకోకుండా ఎడా పెడా దూసుకుపోయేవాళ్లు ఈ వీడియోను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పుణెలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చిన ఒక ఆవు ఎరుపురంగు ట్రాఫిక్ లైట్ను చూసి అడుగు ముందుకు వెయ్యలేదు. ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చ రంగులో మారే వరకు ఓపికగా ఎదురు చూసింది. ఆ తరువాతే ముందుకు కదిలింది. మ్యూజిక్ జోడించి ఈ వీడియోను పుణె పోలీసులు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. రోడ్డు భద్రత గురించి ప్రచారం చేయడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. ఆవు క్రమశిక్షణకు ముచ్చటపడిన నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!
మనదేశంలో గోమాతలను దేవతగా పూజించడం వంటివి చేస్తారు. అయితే మనవాళ్లు వాటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ మన కంటే బాగా శ్రద్ధ చూపించే మరో దేశం ఉంది. మనం దేవతలా ఆవుని పూజించినా..ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఏ వ్యాన్లోనో తీసుకువెళ్తాం కదా!. కానీ వీళ్లు ఆవుని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు.! ఆవుని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదేంటి ఆవుని ఇలా తీసుకువెళ్తున్నారు అనుకోకండి. ఎందుకంటే దానికి గాయాలు కావడంతో స్విట్జర్లాండ్ అధికారులు ఏకంగా హెలికాప్టర్ని రంగంలోకి దింపి మరి ఆస్పత్రికి తరలిస్తునన్నారు. అయతే ఇలాంటి ఆవులు మన దేశంలో ఉండవు. వీటిని'హెవెన్ ఆన్ ఎర్త్' అని పిలుస్తారు. 23 సెకన్ల నిడివిగల ఈ వీడియో అమెజింగ్ నేచుర్ అనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఈ ఘటన మనకు వింత గానీ స్విట్జర్లాండ్ వాసులకు మాత్రం కాదట. ఇలా హెలికాప్టర్తో ఆవుని తరలించిన ఘటనలు అక్కడ పలుమార్లు జరిగాయట. గాయపడిన ఆవులను పర్వతాల మీద నుంచి హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తారట అక్కడ అధికారులు. ఏదీఏమైనా ఆవుల పట్ల ఇంతలా శ్రద్ధని, ప్రేమను చూపడం నిజంగా గ్రేట్ కదూ!. A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024 (చదవండి: 'అరుంధతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
గోపాల మురిపాల బాల
కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్తో దూసుకుపోతోంది. -
అత్యంత రమణీయంగా గోమాత కళ్యాణం.. స్వయంవరంతో ఒక్కటాయెనె..
కాకినాడ రూరల్: కల్యాణం... కమనీయమంటారు పెద్దలు. పచ్చని పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు, వేద మంత్రాలు, భాజా భజంత్రీలు, కన్యాదానం, మాంగళ్యధారణ ఇలా... వివాహం ప్రతిఒక్కరి జీవితంలో కలకాలం గుర్తుండిపోతుంది. అయితే అన్నింటి కంటే భిన్నంగా సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవి స్వరూపం గోమాత కల్యాణం జరిగితే అది మధురానుభూతే. గోమాత సారణ కల్యాణోత్సవం ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్ కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల ఆసుపత్రి వైద్యుడు గౌరీశేఖర్, రమాదేవి దంపతులు తమ పెంపుడు గోవు సారణకు స్వయంవరం ప్రకటించారు. దీంతో ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద కొండ తిమ్మాపురంలోని నాడీపతి గోశాల ఆవరణలోని 89 నందీశ్వరులు (గిత్తలు)ను తొలుత ఎంపిక చేశారు. వాటి నుంచి 24కు కుదించారు. మళ్లీ ఇందులో 16ను ఎంపిక చేయగా స్వయంవరంలో 10 గిత్తలు పాల్గొన్నాయి. ఇందులో ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు గిత్తలు ఉండడం విశేషం. తిరుపతి, కంచి, తిరువణ్ణామలై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు తొలుత డాక్టర్ గౌరీశేఖర్, రమాదేవి దంపతులతో విఘ్నేశ్వర, గౌరీ పూజలు జరిపించారు. అనంతరం స్వయంవరం ప్రకటించగా భైరవ, కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, యువరాజు నిద్రవర్మ, యువరాజు మహేంద్ర కన్నయ్య, బుద్ధుడు, మంగరాజు, ధర్మరాజు, షణ్ముఖ కన్నయ్య తదితర పేర్లతో పిలిచే నందీశ్వరులను ప్రవేశపెట్టారు. డాక్టర్ గౌరీశేఖర్ వధువు సారణను తీసుకువచ్చి స్వయంవరంలో నందులు వద్ద ఉంచగా వాటిని పరీక్షించి మధ్యలో ఉన్న షణ్ముఖ కన్నయ్యను ఎంపిక చేసుకుంది. షణ్ముఖ కన్నయ్య తరఫున తల్లిదండ్రులుగా పాకలపాటి నారాయణరాజు, సీతాదేవి వివాహ వేడుకను జరిపించారు. వరుడు కాళ్లను డాక్టరు గౌరీశేఖర్ దంపతులు కడిగి వివాహం జరిపించారు. అత్యంత రమణీయంగా జరిగిన వేడుకను భారీగా తరలివచ్చిన ప్రజలు తిలకించారు. గోమాత లక్ష్మీ స్వరూపం గోమాత లక్ష్మీ స్వరూపమని, ఎక్కడ గోపూజలు జరుగుతాయో అక్కడ సుభిక్షంగా ఉంటుందని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యా«తి్మక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువు అన్నారు. ఈ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గోమాత కల్యాణోత్సవం తలపెట్టిన డాక్టర్ గౌరీశేఖర్ దంపతులు అభినందనీయులన్నారు. నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు మాట్లాడుతూ స్వయంవరం ద్వారా గోమాత కల్యాణోత్సవం అరుదు అన్నారు. డాక్టర్ గౌరీశేఖర్ మాట్లాడుతూ తాను సారణను దత్తత తీసుకుని కూతురుగా భావించి ఇప్పుడు కల్యాణోత్సవం జరిపించామన్నారు. ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ భద్రయ్య, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గోమాతకు స్వయంవరం ప్రకటించిన వైద్యుడు
కాకినాడ రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న గో మాత పేరు సారణ. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఏపీఎస్పీ ఎదురుగా తిరుమల ఆస్పత్రి వైద్యుడు గౌరీశేఖర్ గారాల పట్టి. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా.. వారి కంటే ఎక్కువ ప్రేమను సారణపై చూపుతారు. సరిగ్గా 20 నెలల కిత్రం అనగా 2022జనవరి 22న సారణకు బారసాల, ఊయల వేడుకను శాస్తోక్తంగా నిర్వహించి సారణగా నామకరణం చేశారు. అప్పట్లో మీడియాలో గోమాతకు బారసాల పెద్ద వైరల్ అయ్యింది. ఇప్పుడు 21వ మాసంలోకి అడుగిడిన సారణకు వివాహ వయసు రావడంతో వైద్యులైన గౌరీశేఖర్, రమాదేవీ దంపతులు స్వయంవరం ప్రకటించారు. ఆదివారం ఉదయం 9గంటలకు నుంచి స్వయంవరం ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాలలోని నందీశ్వరులకు ఆహ్వానం పంపారు. ఏపీఎస్పీ ఫంక్షన్ హాలు వద్ద ఖాళీ స్థలంలో సుమారు 12 నందీశ్వరులను వరుసలో ఉంచగా వరమాలతో సారణ తనకు నచ్చిన నందీశ్వరుడిని ఎంపిక చేసుకోనుంది. తరువాత ఫంక్షన్ హాలులో వివాహ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం కంచి, తిరుపతి, తిరువణ్ణామలై నుంచి వేద పండితులు వస్తున్నారని, శాస్తోక్తంగా కల్యాణం జరుపుతారని డాక్టరు గౌరీశేఖర్ తెలిపారు. -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్గా హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్లో మా కుటుంబం అంతా హైదరాబాద్లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్కి కమిటీ మెంబర్గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కౌ క్లాత్ స్టోర్
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉన్న ఓ క్లాత్స్టోర్కు గత ఏడు సంవత్సరాలుగా చంద్రమణి డైలీ విజిటర్. అయితే చంద్రమణి అనేది మహిళ పేరు కాదు. ఒక ఆవు పేరు. చంద్రమణి రోజూ క్లాత్స్టోర్లోకి వచ్చి కాసేపు ఉండి పోతుంది. క్లాత్స్టోర్ యజమాని పదమ్ డాక్లియా ఎప్పుడూ ఆవును విసుక్కోలేదు. పైగా భక్తిభావంతో పూజిస్తాడు. వస్త్ర దుకాణానికి వచ్చే కొనుగోలుదారులకు ఈ ఆవు స్పెషల్ ఎట్రాక్షన్గా మారింది. ‘మహాలక్ష్మి క్లాత్ స్టోర్’ అనే పేరు కాస్త ‘కౌ క్లాత్ స్టోర్’గా మారింది. -
ప్రస్తుతం దేశంలో 26 శాతం విదేశీ జాతుల ఆవులే
-
పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది?
-
ఇదేం విచిత్రం! ఆవు, పాము రెండు అలా..
రెండు విరుద్ధ జంతువులు ఎదురుపడితే కాసేపు కోట్లాడుకుంటాయి. లేదా తప్పుకోవడమో చేస్తాయి. ఔనా! అదికూడా కాదు అంటే..వాటిలో ఒకటి కాస్త ప్రమాదమైంది అయితే మరోకటి అక్కడ నుంచి పారిపోయేందుకు యత్నిస్తుంది. ఇది కామన్. కానీ ఇక్కడ అలా ఇలా కాకుండా ప్రకృతికే విరుద్ధంగా ఓ విచిత్రమైన ఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నో డౌట్!.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా షాక్ అవ్వుతారు. ఆ వీడియోలో ఓ పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది? అనిపిస్తుంది. అవి అసలు ఎలా ఉన్నాయంటే..ఆ రెండు చాలా అన్యోన్యంగా ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటూ ప్రేమగా ఉంటాయి. పైగా ఏ మాత్రం దాడి చేసుకోకుండా చాలా సఖ్యంగా ఉంటాయి. చూస్తున్నంత సేపు మనకేమో ఆ పాము ఎక్కడ ఆవుపై దాడి చేస్తుందో అని టెన్షన్ పడిపోతుంటాం. కానీ ఆ పాము దానికి సహకరిస్తున్నట్లుగా ఏం చేయదు. పైగా ఆవుతో సరదాగా ఉంటుంది ఆ పాము. దీన్ని 'వివరించడం చాలా కష్టం', ఆ రెండింటి మధ్య చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉంది కాబోలు అని సదరు అధికారి సుశాంత నంద ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు కూడా వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: సముద్రగర్భంలో సంగీత కచేర!..ఈదుకుంటూ వచ్చి మరీ వింటారట!) -
కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలా జీవులు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే తమ జీవితాన్ని పూర్తి చేస్తాయి. అడవిలో ఉన్న జంతువుకు దాని ప్రాణాలు కాపాడుకోవడమే అతి పెద్ద లక్ష్యం. ఆకాశంలో తిరిగే పక్షులకు, నీళ్లలో ఈదే చేపలకు ఆ పూట కడుపు నింపుకోవడమే తమ ముందున్న లక్ష్యం. మరి మెదడున్న మనిషికి మాత్రం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని దేవుడు నిర్ణయించాడు. జంతువులా కాకుండా.. భిన్నంగా కొంతైనా సమాజానికి ఉపయోగపడాలని నిర్దేశించాడు. ఆ కర్తవ్య బోధను అర్థం చేసుకున్న వాడు గొప్పవాడయ్యాడు. అది అర్థమయ్యేందుకు చిన్న కథలు రెండు. మొదటి కథ ఒక కుక్క కాశీకి వెళ్దామని బయలు దేరింది. ఎలాగైనా విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నది దాని లక్ష్యం. బ్రహ్మండమైన పట్టుదలతో బయల్దేరింది. దారి మధ్యలో ఒక బొక్క కనిపించింది. కాశీకి తర్వాత పోదాంలే.. ముందు బొక్క సంగతి చూద్దామనుకుంది. ఆ బొక్క నోట కరుచుకున్నాక.. పరవశమయింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కథ షరా మామూలే. మనిషి పాత్ర అలాగే… మనిషి పాత్ర కూడా అంత గొప్పేమీ కాదు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత.. భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు. రెండో కథ చదివితే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఓ పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరుగెత్తింది. పులి కూడా అంతే వేగంగా వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో చెరువులోకి దూకేసింది. పులి ఆకలి మీదుంది. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలన్న తాపత్రయంలో అది కూడా చెరువులోకి దూకేసింది. క్షణాల్లో మారిన ప్రాధాన్యతలు ఆ చెరువులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, పైగా అందులో లోతైన బురద ఉంది. ముందు వెనకా చూసుకోకుండా దూకడం వల్ల ఆవు పీకల్లోతున బురదలో కూరుకుపోయింది. ఆవుని చంపాలని వచ్చిన పులి కూడా అదే బురదలో చిక్కుకుంది. ఇప్పుడు రెండింటి లక్ష్యాలు మారిపోయాయి. ఆ క్షణం వరకు పులి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆవుకు ఇప్పుడు బురదనుంచి బయటపడడం ముఖ్యం. పులి సంగతి కూడా అంతే. ఆవు కాకపోతే మరేదైనా తినొచ్చు కానీ ఈ బురద బారి నుంచి ఎలా బయటపడాలన్నది అర్థం కావడం లేదు. ఆవులో ఆలోచన, పులిలో ఆహంకారం ఇప్పుడు ఆవు, పులీ రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక్కడే ఆవులో ఆలోచన ప్రకాశవంతమయింది. పులి నుంచి తప్పించుకున్నానన్న ఉత్తేజం, ఈ దుస్థితి నుంచి బయటపడతానన్న నమ్మకం దానిలో ఉన్నాయి. అందుకే పులితో మాట్లాడడం మొదలెట్టింది. "నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది. ఎప్పుడు చస్తానో తెలియని పులికి ఇంకా బింకం పోలేదు. "నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు మళ్లీ వేరేగా ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయికదా..”అంది. అప్పుడు ఆ పులి, ఆవుతో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు.?” అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే పరిస్థితి గమనించాడు. జాగ్రత్తగా ఓ తాడును కట్టి ఆవుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగాడు. ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తలుచుకుంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ కథలో... ఆవు - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo. పులి- అహంకారం నిండి ఉన్న మనస్సు. యజమాని - సద్గురువు/పరమాత్మ బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఇందులో నీతి ఏంటేంటే.. ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు. వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. లోకా సమస్తా సుఖినోభవన్తు! -
ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్త పనులుచేసే ముసలోడికి అరదండాలు!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవు మొదలుకొని ఆడ కుక్క వరకూ.. ఇలా పలు జంతువులపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చిన ఒక వృద్దుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఈ ఉదంతంలో గుజైనీ నివాసి విజేంద్ర మిశ్రా(62)ను అరెస్టు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితునిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా నిందితునిపై గతంలోనూ పలు నేరారోపణలు వచ్చాయని తెలిపారు. జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారి మాట్లాడుతూ పోలీసులు తమ దర్యాప్తులో పలు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారని, వాటిలో మిశ్రా బహిరంగ ప్రదేశాల్లో వివిధ జంతువులతో లైంగిక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమయ్యిందన్నారు. మిశ్రా మానసికంగా అనారోగ్యానికి గురయ్యాడని, అతనిని ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించామన్నారు. దీనికిముందు బులంద్షహర్లోనూ ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 65 ఏళ్లవృద్దుడు పెంపుడు కుక్కతో లైంగిక చర్య జరిపాడు. దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ శునకం యజమాని ప్రేమ్చంద్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వృద్దుడుని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది కూడా చదవండి: అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే.. -
‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్ స్టేషన్కు వచ్చి..
ఏదో ఒక జంతువును చంపి, అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి నన్ను అరెస్టు చేసి, జైలుకు పంపించడంటూ వేడుకున్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా? ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ, గోవధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తాను గోవధ చేశానని,ఇప్పుడు లొంగిపోవాలనుకుంటున్నానంటూ ఒక పోస్టర్ ప్రదర్శిస్తూ, తనను అరెస్ట్చేసి, జైలుకు తరలించాలని పోలీసులను వేడుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోగల రూదౌలీ పోలీస్స్టేషన్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్టేషన్లో శనివారం సమాధాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే ప్రజల సమస్యలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్బర్ అలీ అనే వ్యక్తి ఒక పోస్టర్ పట్టకుని, అక్కడి పోలీసు అధికారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు గోవధ చేసి.. ఇప్పుడు పశ్చాత్తాపం అక్బర్ అలీ పోలీసులతో మాట్లాడుతూ ‘నేను గోవధ ఆరోపణలు ఎదుర్కొంటూ కొంతకాలంగా పరారీలో ఉన్నాను. ఈ కేసులో నా భార్య జైలులో ఉంది. మా సంసారం ముక్కలయ్యింది. నాకు పోలీసులపై నమ్మకముంది. అందుకే నేను లొంగిపోవాలని అనుకుంటున్నాను. మరోమారు నేను ఇలాంటి నేరాలకు పాల్పడను’అని చెప్పాడు. అక్బర్ మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. అనంతరం పోలీసులు అతనిని స్టేషన్లో కూర్చోబెట్టారు. 2022 నాటి ఉదంతంలో.. రూధౌలీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎథర్ గ్రామంలో 2022లో కొంతమంది గోవులను హత్య చేశారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ వీరిలో ఒకడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే జైలుకు తరలించారు. అయితే అక్బర్ అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. జైలుకు వెళ్లిన భార్య ఈ ఉదంతంలో అక్బర్ భార్య ఇంతకుమందే జైలుకు వెళ్లి, శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు అక్బర్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసు అధికారి సత్యేంద్ర భూషన్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ గోవధ నిందితుడు.. సమాధాన దినోత్సవం నాడు లొంగిపోయాడన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇది కూడా చదవండి: చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు! -
నెల్లూరు జాతి ఆవు @ రూ. 35 కోట్లు!
ఎక్కడైనా మేలు జాతి ఆవు ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ. లక్షల్లో ఉంటుందంటారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే బ్రెజిల్లో ఇటీవల జరిగిన వేలంలో నెల్లూరు జాతికి (ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి దశాబ్దాల కిందట కొన్ని ఆవులను బ్రెజిల్ తీసుకెళ్లి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్న ఆవులు) చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని అత్యధిక ధర పలికింది. తద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. వియాటినా–19 ఎఫ్4 మారా ఇమ్విస్ అనే నాలుగున్నరేళ్ల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ. 11.82 కోట్లకు అమ్ముడుపోయింది!! గతేడాది ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ. 6.5 కోట్లు పలకడం అప్పట్లోనే రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. మొత్తంమీద ఈ ఆవు విలువ రూ. 35.30 కోట్లు పలికింది. అత్యంత నాణ్యౖమెన జన్యులక్షణాలు గల బ్రెజిల్లోని నెల్లూరు జాతి ఆవును రికార్డు ధరకు సొంతం చేసుకొనేందుకు డెయిరీ వ్యాపారులు పోటీపడటం దీని అసలుసిసలు విలువను చాటిచెబుతోంది. బ్రెజిల్లోని ముఖ్యమైన ఆవు జాతుల్లో నెల్లూరు జాతి ఆవులు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మాంసం కోసం పెంచుతారు. వీటి మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చాలా దేశాల్లో ఈ ఆవుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం బ్రెజిల్లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయి. బ్రెజిల్లో ఉన్న మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం. ఈ జాతికి చెందిన శ్రేష్టమైన ఎద్దుల వీర్యం సైతం అర మిల్లీలీటర్కు రూ. 4 లక్షలు పలుకుతోంది. నెల్లూరు జాతి ఆవుల ప్రత్యేకతలు ఇవీ... ♦ ఈ ఆవులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా చిక్కటి తెలుపు రంగులో ఉంటాయి. ♦ దళసరి చర్మంతో ఉండటం వల్ల రక్తం పీల్చే కీటకాలు వాటిని దరిచేరవు. ♦ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వాటి స్వేద గ్రంథులు యూరోపియన్ జాతి ఆవులతో పోలిస్తే రెండు రెట్లు పెద్దగా ఉండటంతోపాటు గ్రంథుల సంఖ్య సైతం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. ♦ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ఇన్ఫెక్షన్లను సమర్థంగా తట్టుకోగలవు. ♦ సమర్థమైన జీవక్రియ కారణంగా నాసిరకం గడ్డి జాతుల రకాలను సైతం తిని అరిగించుకోగలవు. ♦ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం, సరై న యాజమాన్య పద్ధతులు పాటించనప్పటికీ దూ డలు సులువుగా పెరగగలగడం మరో ప్రత్యేకత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే..
గుజరాత్: ఒక రైతు సింహం బారి నుండి తన ఆవును రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. చివరకు ఎలాగోలా సింహాన్ని భయపెట్టి గంగిగోవును కాపాడుకున్నాడు. గుజరాత్ లోని గిర్ సోమ్ నాట్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చగడ్డిని ఆదమరచి తింటోన్న ఆవుపై అక్కడే మాటు వేసి ఉన్న ఆడ సింహం ఒక్క ఉదుటున దూకి దాని గొంతు పట్టుకుంది. పాపం ఆ ఆవు నొప్పితో విలవిలలాడిపోయింది. పంటిబిగువున నొప్పిని భరిస్తూ తన యజమానికి వినిపించేలా పెద్దగా అరిచింది. తన గోవు అరుపులు విన్న ఆ రైతు వెంటనే అక్కడికి చేరుకొని ఎలాగైనా తనని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ధైర్యంగా సింహం వైపు నడుచుకుంటూ వచ్చాడు. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సింహం పట్టు నుండి విడిపించుకునే ప్రయత్నంలో ఆవు రోడ్డు పక్కకు జరిగింది. అంతలో తనవైపుగా వస్తోన్న రైతును చూసిన సింహం భయపడి వెంటనే అవును విడిచిపెట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయింది. ఈ వీడియోని జునాగఢ్ లోని కేశోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు సింహానికి ఎదురెళ్ళిన ఆ రైతు గుండె ధైర్యానికి ఫిదా అయ్యి కామెంట్లు పెడుతున్నారు. ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ. ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ — Vivek Kotadiya🇮🇳 BJP (@VivekKotdiya) June 29, 2023 ఇది కూడా చదవండి: ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా.. -
షాకింగ్ విషయాలు: ఆవు సాధు జంతువు... అదేగానీ దాడికి దిగితే..
వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్ పలు ఆసక్తిక వివరాలు వెల్లడించింది. ప్రతీయేటా ఆవుల కారణంగా అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. వీరంతా ఆవుల దాడికి బలవుతున్నారని తెలియజేసింది. భారతీయులు ఆవును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పూజలు కూడా చేస్తుంటారు. ఆవును గోమాత అని కూడా అభివర్ణిస్తుంటారు. ఆయుర్వేద పరిభాషలో ఆవు పాలు అమృతంతో సమానం. అయితే అప్పుడప్పుడు మనుషులపై జంతువుల దాడులు జరుగుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో మనుషుల మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా వందల మంది మృత్యువు బారిన పడుతున్నారు. ఆవుల దాడుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నారనే వివరాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్ తెలియజేసింది. ఆ వివరాలు ఎంతో ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి. Tbh, Id not get close to a cow too. They have no jokes really, when they attack they do it so hard😳 One time we stopped near a fountain to drink water. And cows came and i went to car. I was getting in and one of cows attacked me but car door protected me. It was like a shield pic.twitter.com/BDmZ7ip5M9 — ヒジExodus (@siriusm46) June 17, 2023 గణాంకాలు ఏమి చెబుతున్నాయి? వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్లో ప్రచురితమైన డేటా ప్రకారం ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా అమెరికాలో 20 నుంచి 22 మంది మరణిస్తున్నారు. ఆవుల గుంపు తొక్కివేయడం కారణంగా మరణించారంటూ ప్రతీయేటా సుమారు 5 కేసులు వెలుగు చూస్తున్నాయి. లండన్లో ప్రతీయేటా ఆవుల దాడులలో కనీసం నలుగురు కన్నుమూస్తున్నారు. దీనిని షార్క్ దాడులతో పోల్చి చూస్తే.. షార్క్ దాడుల కారణంగా ప్రతీయేటా కనీసం ఐదుగురు మరణిస్తున్నారు. ప్రతీయేటా ఆవుల దాడులకు కనీసం 22 మంది బలవుతున్నారు. భారత్లో ఆవుల దాడుల సంగతేమిటి? సోషల్ మీడియాలో జంతువుల దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతుంటాయి. వీటిలో ఆవుల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తాయి. ఇటీవల ఒక ఎద్దు ఒక వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీనికిముందు కూడా ఉత్తరప్రదేశ్లో ఒక మహిళపై ఆవు దాడి చేసినట్లు ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎద్దుల దాడులతో పోల్చి చూస్తే, ఆవుల దాడులు స్వల్పమేనని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: రైలు రిజర్వేషన్లో సరిదిద్దలేని పొరపాట్లివే.. -
చిరుతతో పోరాడి.. రైతు ప్రాణాలు కాపాడిన ఆవు
బనశంకరి: తన యజమానిపై దాడి చేసిన చిరుత పులితో తీవ్రంగా పోరాడి రైతు ప్రాణాలు ఆవు కాపాడిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... చెన్నగిరి తాలూకా ఉబ్రాణి హొబళి కొడతికెరె గ్రామానికి చెందిన రైతు కరిహాలప్ప(58) గత సోమవారం తన ఆవును తోటలో వదిలిపెట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే మాటువేసిన చిరుత పులి ఒక్కసారిగా కరిహాలప్పపై దాడి చేసింది. గమనించిన ఆవు పరుగెత్తుకొచ్చి చిరుతపైకి దూకింది. కొమ్ములతో పొడిచింది. దీంతో చిరుత కిందపడిపోగా, అక్కడే ఉన్న శునకం కూడా దానిపైకి దూకింది. దీంతో చిరుత అక్కడి నుంచి ఉడాయించింది. ఈ సందర్భంగా రైతు కరిహాలప్ప మాట్లాడుతూ తాను పోషించిన ఆవు గౌరీ, శునకం మాత్ర శౌర్యాన్ని ప్రదర్శించి చిరుత బారి నుంచి తన ప్రాణాలు కాపాడాయని చెప్పాడు. -
పేద రైతు కుటుంబం నుంచి కోట్ల రూపాయల సంపాదన ఎలా ?
-
ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు
ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో రైసెన్ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్ శిల్పాకర్ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ గ్రామంలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ రైతు ఇంటికి క్యూకట్టారు. ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు పశువైద్యాధికారి ఎన్కే తివారీ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి అద్భుతం కాదన్నారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు. అయితే ఆ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడిందని చెప్పారు. చనిపోయిన సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామానికి సుదూరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. (చదవండి: మణిపూర్లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
అమ్మలాంటి ఆవు..బుజ్జోడి నవ్వులు
-
రాజస్తాన్లో కిడ్నాప్.. హరియాణాలో హత్య
జైపూర్: హరియాణాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. గో సంరక్షకులుగా అనుమానిస్తున్న కొందరు రాజస్తాన్కు చెందిన ఇద్దరు ముస్లింలను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి కాలిన మృతదేహాలు ఒక కారులో లభించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన అరడజను మందికిపైగా బజరంగ్ దళ్ కార్యకర్తల్ని రాజస్తాన్ పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యలను రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజస్తాన్లోని భరత్పూర్ జిల్లా ఘట్మీక గ్రామానికి చెందిన నజీర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గురువారం వారిద్దరి మృతదేహాలు హరియాణాలోని భివానిలో లోహారు ప్రాంతంలో ఒక దగ్ధమైన కారులో కనిపించాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ఇద్దరు ముస్లిం యువకుల్ని కిడ్నాప్ చేశారని వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు అరడజనుకుపైగా బజరంగ్దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ‘‘వారికి ఈ నేరంలో ప్రమేయం ఉందో లేదో తేలాల్సి ఉంది’’ అని పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ చెప్పారు. మృతి చెందిన వారిలో జునైద్కి నేరచరిత్ర ఉందని, ఐదుకి పైగా కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. రింకూ సైనీ అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. -
సోషల్ మీడియాలో మీమ్స్.. కౌ హగ్ డే నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం
ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగించుకోవాలన్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రేమికుల దినోత్సవం రోజున కౌ హగ్ డే జరుపుకోవాంటూ ఇచ్చిన పిలుపును ఉపసంహరించుకుంది. ఈ మేరకు భారత జంతు సంరక్షణ బోర్డు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలంటూ ఇచ్చిన పిలుపును వెనక్కి తీసుకొంటున్నట్టు కేంద్ర పశు సంరక్షణ బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా ఓ నోటీసులో పేర్కొన్నారు. కాగా గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డేకి బదులుగా కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర జంతు సంక్షేమ శాఖ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయ పురాతన సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని.. గోమాత ప్రాధాన్యతను గుర్తించి ఫిబ్రవరి 14న గోవులను ఆలింగనం చేసుకోవాలంటూ పేర్కొంది. గోవును కౌగిలించుకోవడం ద్వారా భావ సంపద వృద్ధి చెందుతుందని.. తద్వారా వ్యక్తిగత, సామూహిక సంతోషం పెరుగుతుందని తెలిపింది. అయితే ఈ ప్రకటన చే'rనప్పటి నుంచి కౌ హగ్ డే అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అప్పటి నుంచి దీనిపై రచ్చ జరుగుతూనే ఉంది. కొంతమంది దీనిపై సానుకూలంగా స్పందిస్తుంటే.. మరికొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు. దీంతో నెట్టింట్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అటు విపక్షాలు కౌ హగ్ డేపై సైతం విమర్శలు గుప్పించాయి. కౌ హగ్ డే పిలుపు హాస్యాస్పదమని.. ప్రధాని మోదీకి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఓ ‘పవిత్ర గోవు’ అంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు ‘కౌ హగ్ డే’ పాటించాలంటూ ఇచ్చిన పిలుపును తాజాగా ఉపసంహరించుకోవడం గమనార్హం. చదవండి: మోదీ సర్కార్ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్సీ కవిత -
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని అందరికీ తెలుసు. యువతీ, యువకులు తాము ప్రేమించిన వారికి ఈరోజే ప్రపోజ్ చేస్తుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వాములకు ప్రత్యేక కానుకలు ఇచ్చి సర్ఫ్రైజ్ చేస్తుంటారు. భారతీయ యువతలో ఈ ఆలోచనను మార్చాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ భావిస్తోంది. పాశ్చాత్య దేశాల పట్ల ప్రభావితమై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలనుకుంటోంది. అందుకే ఫిబ్రవరి 14ను 'కౌ హగ్ డే'గా జరుపుకొని గోవులను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చింది. 'భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవులు వెన్నెముక. పశుసంపదకు, జీవ వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవాళికి సకల సంపదలను అందించే తల్లి వంటి పోషకాహార స్వభావం ఉన్నందున ఆవును కామధేను, గోమాత అని పిలుస్తారు. గోవును ఆలింగనం చేసుకుంటే మానసిక ఆనందం కలుగుతుంది. అందుకే ఫిబ్రవరి 14 కౌ హగ్ డే జరుపుకోండి' అని పేర్కొంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సూచన మేరకు ఆ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన విడుదల చేశారు. చదవండి: పార్లమెంట్లో విపక్షాలను ఏకిపారేసిన మోదీ.. -
అమ్మా.. ఏమైందమ్మా.. లేమ్మా!
లేద్దామంటే శరీరం సహకరించదు.. తిందామంటే మేత లేదు.. యజమాని ఎక్కడో తెలియదు.. చుట్టూ ఎవరూ కనిపించరు.. అంబా అని అరిచినా పట్టించుకునే దిక్కు లేదు. మలమూత్రాలు చేస్తున్న చోట అలా కూలబడిపోయింది ఓ గోమాత. ఒకటి కాదు, రెండు కాదు, ఐదు రోజులు గడిచిపోయింది. అరిచీ అరిచీ నీరసించింది. ఓ దూడ తల్లి చుట్టూ తిరుగుతోంది. తల్లికి ఏమైందో తెలియక అక్కడక్కడే తచ్చాడుతోంది. మౌనంగా రోదిస్తూ.. తల్లికేసి చూస్తూ అలా నిల్చుండిపోతోంది. ఏమైందమ్మా.. లేమ్మా.. అన్నట్లు దీనంగా చూస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కర్నూలు: అది మండలంలోని క్రిష్టిపాడు గ్రామ శివారు ప్రాంతం. చుట్టూ పొలాలే తప్ప నివాస ప్రాంతాలు కనిపించవు. ప్రతిరోజూ రైతులు పొలం పనులు చేసుకుని వెళ్తున్నారు. అయితే ఎక్కడి నుంచో ఓ ఆవు అరుపులు వినిపిస్తున్నా, మంద నుంచి తప్పిపోయి ఉంటుందనుకుని మళ్లీ పనుల్లో ఉండిపోయారు. ఇలా ఐదు రోజులు గడిచిపోయాయి. జొన్న పైరు కావడంతో ఏపుగా పెరగడం, పొలం మధ్యలో ఆవు పడిపోవడంతో రైతులు గుర్తించే అవకాశం లేకపోయింది. చివరకు ఇక్కడే ఎక్కడో ఉన్నట్లుగా అనుమానించి అందరూ వెతకడంతో ఎట్టకేలకు గురువారం ఆనవాలు లభించింది. దగ్గరికి వెళ్లి చూడగా కుప్పకూలిన ఓ అవు, దాని పక్కనే దూడ కనిపించాయి. ఆవు వెనుక కాలు విరిగి గాయమవడంతో అక్కడే కూలబడింది. దూడ వయస్సు కూడా పది రోజులకు మించి ఉండదని తెలుస్తోంది. ఈ రెండూ ఐదు రోజులుగా నరకం అనుభవించాయి. ఈ దృశ్యం చూసి చలించిన రైతులు వెంటనే ఆవు, దూడకు నీళ్లు తాపించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనం గుర్తుకు వచ్చి 1962 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన సిబ్బందికి నిముషాల్లో అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం సర్జరీ కోసం ఆవుతో పాటు దూడను వాహనంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు తరలించారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. మారుమూల ప్రాంతానికి సంచార వాహనం రావడం.. మూగజీవి వేదన తీర్చే ప్రయత్నం చేయడం అందరి అభినందనలు అందుకుంది. -
బట్టల షాప్కు వెళ్లిన ఆవు.. పాపం ఏం నచ్చలేదేమో!
-
వైరల్ వీడియో: బట్టల షాప్కు వెళ్లిన ఆవు
-
Viral: బట్టల షాప్కు వెళ్లిన ఆవు.. పాపం ఏం నచ్చలేదేమో!
మనకు ఏమైనా వస్తువు కావాలంటే షాప్లోకి వెళ్లి తెచ్చుకుంటాం. కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మాల్కు వెళ్లి సెలెక్ట్ చేసుకొని మరీ కొనుక్కుంటాం. మరి జంతువులకు కూడా ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే ఎక్కడికి వెళ్తాయి. వాటికి కూడా షాపింగ్ చేయాలనిపిస్తే ఎలా ఉంటుంది. అచ్చం ఇలాంటి ఆలోచనే ఓ ఆవుకి వచ్చింది. స్టైలిష్ బట్టలు వేసుకొని అందంగా తయారవ్వాలనిపించిందేమో.. అనుకున్నదే తడువుగా బట్టల షాప్లోకి వెళ్లి షాపింగ్ చేసింది. అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి? అనుకుంటున్నారా.. ఈ మాటలు వినడానికి కొంచెం విడ్డూరంగానే అనిపించినా సరిగ్గా ఇలాంటి ఓ సరదా ఘటనే అస్సాంలో గత వారం చోటుచేసుకుంది. ధుబ్రి ప్రాంతంలో దారి తప్పిందో ఏమో గానీ ఓ ఆవు బట్టల షాప్లోకి ప్రవేశించింది. స్టోర్ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. షాప్లో ఆవు తిరుగుతుంటే అక్కడున్న సిబ్బంది, షాపింగ్ చేస్తున్న మిగతా జనాలు భయంతో దూరంగా పరుగులు తీశారు. చివరికి దానంతట అదే బయటకు వెళ్లిపోయింది. అక్కడున్న కొంతమంది ఈ తతంగాన్ని ఫోన్లో వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఆవు వాలకం చూస్తుంటే నిజంగా షాపింగ్ చేయడానికి వచ్చిన్నట్లే అనిపిస్తుంది. తనకు సంబంధించిన దుస్తులు ఎక్కడ ఉన్నాయా అనుకుంటూ అచ్చం కస్టమర్లాగే స్టోర్ మొత్తం షికారు చేసింది. చివరికి ఏవి నచ్చకపోవడంతో నిరుత్సాహ చెందింది. అంతేగాక.. బట్టల షాప్ వాళ్లు డబ్బులు అడగంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇలాగే భావిస్తూ నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. Cow entered in mall, #dhubri #Assam pic.twitter.com/aS2XYd5hg1 — Nitish Sarmah (@sarmah_nitish) December 30, 2022 -
పైన ఎల్లిగడ్డలు.. కింద పశువులు.. ట్రక్కులో కుక్కి...
సాక్షి, ఎడపల్లి (నిజామాబాద్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.ఎడపల్లి (బోధన్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. గాయపడిన ఎద్దు సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు. చదవండి: అందం హిందోళం.. అధరం తాంబూలం -
వైరల్ వీడియో: ఆవు ఫుట్బాల్తో ఆడటం ఎప్పుడైనా చూశారా
-
వాట్ ఏ సెల్ఫీ! ఎంతా బాగా ఫోజ్ పెట్టిందో...
ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. చాలా వీడియోల్లో మనకు నచ్చిన రకరకాల జంతువుల సెల్ఫీ వీడియోలు చూసుంటాం. క్రూరమైన మృగాలతో కూడా డేర్గా చేసిన వైరల్ వీడియోలు కూడా చూసి ఉంటాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒక ఆవుతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ఏంటి ప్రత్యేకత అనే కదా.! ఏంలేదండి...జంతువులతో కలిసి తీసే సెల్ఫీ వీడియోలు చాలా వరకు మనం చెప్పినట్లు అవి వినవు. అది ఆహారం తింటున్నప్పుడో లేక ప్రశాంతంగా కూర్చొన్నప్పుడో జస్ట్ అలా క్లిక్మనిపించి చకచక వీడియో తీస్తాం. ఔనా! కానీ ఈ వ్యక్తి మాత్రాం ఆ ఆవును సెల్ఫీ తీస్తున్న ఫోజు పెట్టమంటే వెంటనే సెట్రైట్ అయిపోయి ఫోజు పెట్టింది. చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Vivek vyas 🇮🇳 (@vivek_127) (చదవండి: బలవంతంగా జుట్టు పట్టుకుని ఈడ్చేసిన నర్సు.. వీడియో దుమారం) -
పులి వద్దు.. గోమాత ముద్దు! సుప్రీం ఏమందంటే..
న్యూఢిల్లీ: జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ టైగర్ స్థానే ఆవును ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం.. సోమవారం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అసలు ఎలాంటి ప్రాథమిక హక్కులు ప్రభావితం అవుతాయి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం కోర్టు పనా?.. మేము ఖర్చులు విధించవలసి వచ్చినప్పుడు మీరు అలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తారు?.. అసలు ఇప్పుడు ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడింది? మీరు కోర్టుకు వచ్చినందునా మేము చట్టాన్ని గాలికి విసిరేస్తామా?’’ పిటిషనర్ తరపు న్యాయవాదిని మందలించింది బెంచ్. పిటిషన్ దాఖలు చేసినందుకుగానూ ఖర్చులు విధించాల్సి వస్తుందని పిటిషనర్ తరపున న్యాయవాదిని బెంచ్ హెచ్చరించింది. దీంతో సదరు న్యాయవాది అభ్యర్థన పిటిషన్ను ఉపసంహరించుకోగా, పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఎన్జీవో గోవాన్ష్ సేవా సదన్, ఇతరులు కలిసి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్)ను దాఖలు చేసింది. ఇదీ చదవండి: ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు! కానీ..’ -
స్వదేశీ సాహివాల్కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్గా గుర్తింపునిచ్చింది. నాగర్కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని..
లక్నో: కుక్కలు విశ్వాసానికి మారు పేరుగా వర్ణిస్తుంటారు. కానీ కొన్ని రకాల కుక్కలు మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా మనుషులపై దాడి చేస్తుంటాయి. ఎక్కడి పడితే అక్కడ కొరికి కరిచేస్తుంటాయి. ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు దాడి చేస్తున్న ఘటన ఎక్కువ అవుతున్నాయి. అంతేగాక కుక్కల బారిన పడి అనేక చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను చాలానే చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కుక్క దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో చోటుచేసుకుంది. పిట్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహింతంగా దాడికి తెగబడింది. క్రూరమైన కుక్క ఆవు దవడను తన నోటితో బలంగా కరిచి పట్టుకుంది. దీంతో ఆవు నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించింది. ఆవును రక్షించడానికి కుక్క యాజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. చేతులు, కర్రతో కొట్టినప్పటికీ కుక్కు ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు. మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి సాయం చేయగా చివరికి విడిచిపెట్టింది. అయితే అప్పటికే ఆవు నోటిపై లోతైన గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుక్క లైసెన్స్ చూపించాల్సిందిగా యాజమానిని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కుక్కను కూడా స్వాధీనం చేసుకొని బోనులో ఉంచారు. ఆవును పశువైద్యశాలకు పంపించారు. అలాగే దానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే నిరంజన్ తెలిపారు. కాగా పిట్బుల్ జాతికి చెందిన కుక్కలు మనుషులపై దాడి చేసే ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గత రెండు నెలల్లో వేర్వేరు సంఘటనల్లో దాదాపు అర డజను మంది పిట్బుల్ దాడిలో గాయపడ్డారు. कानपुर के सरसैया घाट पर ‘पिटबुल कुत्ते’ ने कर दिया गाय पर हमला। - ग्रामीणों की काफी देर की मशक्कत के बाद गाय को पिटबुल की कैद से छुड़ाया जा सका। - इस बीच पिटबुल डॉग ने गाय का जबड़ा चबा लिया। - इस घटना के बाद घाट पर जाने से कतरा रहे हैं सैलानी। pic.twitter.com/yvbBN5EgSS — Shubhankar Mishra (@shubhankrmishra) September 22, 2022 -
బీజేపీ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన గోమాత!
జైపూర్: రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆవును అసెంబ్లీ ఆవరణలోకి తీసుకెళ్లారు. లంపీ స్కిన్ వ్యాధితో అనేక పశువులు చనిపోతున్నాయని, కానీ గాఢ నిద్రలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గోవుతో వచ్చినట్లు చెప్పారు. అయితే రావత్ ప్రయత్నం బెడిసికొట్టింది. అసెంబ్లీ గేటు వద్ద గోవు పక్కన నిల్చోని ఆయన మీడియాతో మాట్లాడే సమయంలోనే అది పారిపోయింది. దాన్ని చైన్తో పట్టుకుని ఉన్న వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా పరుగులు పెట్టింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోమాతను అసెంబ్లీకి తీసుకొచ్చిన బీజేపీ ఎమ్మెల్యేకు ఏం జరిగిందో చూడండి అని కాంగ్రెస్ దీనిపై సెటైర్లు వేసింది. What happened when Bjp mla from Pushkar reached Rajasthan assembly with a cow🤣🤣🤣 pic.twitter.com/I7UHaxjqQ6 — Surbhi✨ (@SurrbhiM) September 20, 2022 అయితే రావత్ మాత్రం దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. చివరకు గోవులు కూడా ఈ కఠినమైన ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయని, అందుకే ఆ ఆవు పారిపోయిందని చెప్పుకొచ్చారు. కాగా.. సోమవారం పశుసంవర్ధక శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం లంపీ స్కిన్ వ్యాధితో 59,027 పశువులు చనిపోయాయి. 13,02,907 మూగజీవాలు ప్రభావితమయ్యాయి. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు -
ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రియ దేశీ ఆవుపాల (ఏ–2) ఉత్పత్తులు మార్కెట్లోకి రాబోతున్నాయి. ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట పాలు, వెన్న, నెయ్యి, పన్నీరు ఇలా వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడలో ఈ నెలాఖరున తొలి కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఏర్పాటుచేయనున్నారు. జెర్సీ, హెచ్ఎఫ్ జాతి పశువుల నుంచి వచ్చే పాలను ఏ–1 పాలుగానూ.. ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రెడ్సింధీ జాతి దేశీ ఆవుల నుంచి వచ్చే పాలను ఏ–2 పాలుగా పిలుస్తారు. చదవండి: మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే! మూపురం కల్గిన పశువుల పాలల్లో హానికర రసాయనాలు (బీసీఎం–7) ఉండవని, వీటిలో కేసిన్ ప్రొటీన్ పదార్థం అధికంగా ఉండడంవల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు చక్కని ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో నిర్ధారణ కావడంతో ఈ పాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ. విజయవాడ, వైజాగ్లో లీటర్ రూ.80–100 చొప్పున విక్రయిస్తుంటే, హైదరాబాద్లో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. ఇక వీటి పేడ ద్వారా తయారుచేసే ఎరువును కిలో రూ.7 చొప్పున, మూత్రాన్ని లీటరు రూ.75 చొప్పున స్థానికంగా విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో దేశీవాళీ గోజాతి రెట్టింపు లక్ష్యం రాష్ట్రంలో 2019 పశుగణన ప్రకారం.. 7.87లక్షల దేశీ ఆవులు, 11.93 లక్షల సంకర, విదేశీ జాతి పశువులున్నాయి. రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రాతి, రెడ్సింధీ వంటి అంతరించిపోతున్న దేశీ నాటు ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ పాలు, పాల ఉత్పత్తులను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 50 శాతం సబ్సిడీపై ఒక్కోటి రూ.30లక్షల అంచనా వ్యయంతో వైఎస్సార్ దేశవాళీ గో జాతుల పెంపకం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో గతేడాది 57 కేంద్రాలు ఏర్పాటుచేయగా, మలివిడతలో 52 కేంద్రాలు మంజూరు చేశారు. 27 కేంద్రాలు త్వరలో గ్రౌండింగ్ కానున్నాయి. ఒక్కో క్షేత్రంలో 20 దేశీ ఆవులు, ఓ ఆంబోతును అందిస్తుండగా, పునరుత్పత్తి ద్వారా వీటి సంతతిని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్ర గో పుష్టి పేరిట బ్రాండింగ్ ఒక్కో ఆవు రోజుకు 6–8 లీటర్ల చొప్పున ఏడాదిలో 220 రోజులపాటు పాలు ఉత్పత్తి చేస్తాయి. పాల ఉత్పత్తి, వినియోగం క్రమేపి పెంచడం, ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడంతో పాటు ఆవుపేడ, గో మూత్రం, పంచగవ్య, జీవామృతం వంటి ఉప ఉత్పత్తులకు ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ఎస్ఓపీ) ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాలకు అదితి ఆర్గానిక్ సరి్టఫికేషన్ (బెంగళూరు) ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయిస్తున్నారు. ఏ–2 పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల కోసం రైతుల ద్వారా ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రముఖ నగరాల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో తొలిస్టాల్ను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో సేంద్రీయ పాలతో పాటు నెయ్యి, పన్నీరు వంటి ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మలివిడతలో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి 50కు పైగా నగరాల్లో నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర రిటైల్ అవుట్లెట్స్తో పాటు త్వరలో ఏర్పాటుచేస్తున్న అమూల్ అవుట్లెట్స్, రైతుభరోసా కేంద్రాల ద్వారా కూడా మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. త్వరలో ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ ‘జైవిక్ ఖేతి’ ద్వారా ఆన్లైన్లో విక్రయించేందుకు కసరత్తు జరుగుతోంది. సేంద్రియ పాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అంతరించిపోతున్న దేశీవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ దేశవాళి గో జాతుల పెంపకం కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఈ క్షేత్రాల్లోని దేశీ ఆవుల పాలు, పాల ఉత్పత్తులతోపాటు ఉప ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్ఠి పేరిట మార్కెటింగ్ చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. పాడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేకంగా స్టాల్స్ను ఏర్పాటుచేస్తున్నాం. తొలిస్టాల్ ఈనెలాఖరున విజయవాడలో అందుబాటులోకి రానుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, పశుసంవర్థక శాఖ -
హర్ ఘర్ తిరంగాలో అపశ్రుతి.. మాజీ మంత్రికి గాయం
అహ్మదాబాద్: డెబ్భై ఐదేళ్ల భారత దేశ స్వాతంత్ర ఉత్సవాల్లో భాగంగా.. బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగాకు పిలుపు ఇచ్చింది. ఇంటా వాకిట బడి బండ్లు అనే తేడా లేకుండా అంతటా మూడు రంగుల మయం అయిపోయింది. మరోవైపు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి ప్రభుత్వం. ఇదిలా ఉండగా.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో గుజరాత్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గాయపడ్డారు. శనివారం మెహ్సనా జిల్లా కడి ప్రాంతంలో ఆయన నేతృత్వంలో ర్యాలీ జరిగింది. అయితే వీధుల్లో తిరిగే ఆ ఆవు నినాదాలకు భయపడి.. ర్యాలీ వైపు దూసుకొచ్చింది. ఆవు ఢీ కొట్టి వెళ్లిపోవడంతో.. ఆయన కింద పడిపోయారు. కాలికి గాయం కాగా.. సిబ్బంది అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. ఆపై ఎస్కార్ట్ సాయంతో అహ్మదాబాద్ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. ఆయన కాలికి చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని, నెలరోజుల రెస్ట్ అవసరమని బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. Stray cow attacks Gujarat's former Deputy CM Nitin Patel during "Har Ghar Tiranga" yatra in Mehsana. pic.twitter.com/pwlmqRi7nT — Saral Patel (@SaralPatel) August 13, 2022 He is former Dy. CM @Nitinbhai_Patel today he got injured by a running cow. May Allah grant him speedy recovery. Questions that come to my mind 1.Who is responsible 4 dis accident? 2.The security personnel r private or still provided by d govt? @SandeepPathak04@SanjayAzadSln pic.twitter.com/Nsx8yYJNjm — Dr. Tohid Alam khan AAP 🇮🇳 (@aapkatohid) August 13, 2022 ఇదీ చదవండి: రాఖీలో విషాదం.. గాలిపటం దారం యమపాశమై! -
మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!
ఆవులు, గేదెల్లో ఏ దూడలు కావాలని కోరుకుంటారు... సహజంగా ఎవరైనా పెయ్య దూడలు (ఆడ) కావాలని ఆకాంక్షిస్తారు. కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తున్నా.. పుట్టేది ఆడదూడా.. మగదూడా అనేది తెలియని పరిస్థితి. ఇక నుంచి పాడి అభివృద్ధికి ఆడదూడలే పుట్టించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లింగ నిర్ధారణ వీర్యం (సార్టెడ్ సెక్స్ సెమన్) ద్వారా 95 శాతం పెయ్య దూడలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. కర్నూలు (అగ్రికల్చర్): పెయ్య దూడల జననం ద్వారా పాల దిగుబడిని, రైతు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. లింగనిర్ధారణ వీర్యం సాంకేతికతను కృత్రిమ గర్భధారణ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం, పాడి పరిశ్రమను మరింత అభివృద్ది చేసేందుకు దోహదపడుతోంది. నేడు విద్యావంతులైన నిరుద్యోగులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది జిల్లాలో 5,000 పశువులకు లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూది వేసి పెయ్య దూడలు అభివృద్ధి చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని రైతుల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. సబ్సిడీపై కృత్రిమ గర్భధారణ వీర్యం లింగనిర్ధారణ వీర్యాన్ని పూణే, అహమ్మదాబాద్ల్లోని వెటర్నరీ రీసెర్చ్ కేంద్రాల్లో అధిక పాలసార ఉన్న ఆంబోతుల నుంచి సేకరించారు. ఆడదూడలే పుట్టే విధంగా లింగనిర్ధారణ వీర్యాన్ని వృద్ధి చేశారు. రెండేళ్ల క్రితం జెర్సీ, హెచ్ఎఫ్ ఆవుల్లో ఈ ప్రయోగం చేశారు. 200 ఆవులకు ఇటువంటి వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయగా 52 దూడలు పుట్టాయి. ఇందులో 47 పెయ్యదూడలు ఉండటం విశేషం. తాజాగా మరింత సాంకేతికతతో అభివృద్ధి చేసిన లింగనిర్ధారణ వీర్యంతో ముర్రా గేదెలతో పాటు జెర్సీ, ఆవు జాతులైన గిర్, సాహివాల్, హెచ్ఎఫ్ ఆవులకు కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తారు. ఒక డోసు పూర్తి ధర రూ.700 ఉండగా... కేంద్రం రూ.450 సబ్సిడీ ఇస్తుంది. రైతు రూ.250 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5,000 పశువులకు సార్టెడ్ సెక్స్ సెమన్ ద్వారా సూదులు వేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. 95 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం లింగనిర్ధారణ వీర్యం ద్వారా 95 శాతంపైగా పెయ్యదూడలే పుట్టే అవకాశం ఉంది. ఒక ఆవు లేదా గేదెకు మూడు డోసుల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆవులు, గేదెలు ఎదకు రావడాన్ని గుర్తించి ఈ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఎదకు వచ్చిన 12 గంటల నుంచి 24 గంటలలోపు సూదులు వేయించాల్సి ఉంది. మొదటి డోసు వేసినపుడు చూడికట్టకపోతే రెండవసారి వేయంచవచ్చు. అపుడు కూడా చూడికట్టకపోతే మూడవ డోసు వేయించవచ్చు. ప్రతి డోసుకు రైతు సబ్సిడీ పోను రూ.250 చెల్లించాల్సి ఉంది. మూడు డోసులు వేసినా చూడికట్టకపోతే రూ.500 రైతుకు వెనక్కి ఇస్తారు. మూడు డోసుల సార్టెడ్ సెక్స్ సెమన్తో కృత్రిమ గర్భధారణ చేసినా మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు. ఈ సెమన్ ప్రధాన లక్ష్యం పెయ్యదూడల అభివృద్ధి. ఈ కార్యక్రమాన్ని గోపాలమిత్రలు అమలు చేస్తారు. సార్టెడ్ సెక్స్ సెమన్తో సూది వేస్తే రూ.100 ప్రోత్సాహకం ఇస్తారు. మొదటి డోసుతోనే చూడి కడితే రూ.150, రెండవ డోసుతో చూడి కడితే రూ.100 ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం లింగనిర్ధారణ వీర్యంతో ఒంగోలు జాతి మినహా మిగిలిన అన్ని ఆవు, గేదె జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. దీని ద్వారా 90 నుంచి 95 శాతం వరకు ఆడదూడలే పుట్టే అవకాశం ఉంది. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోంది. – రాజశేఖర్, కార్యనిర్వహణాధికారి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, కర్నూలు -
ఆవుకు ‘డిజిటల్’ కృత్రిమ గర్భధారణ
సాక్షి, హైదరాబాద్: పశువుల కృత్రిమ గర్భధారణ విధానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పశువైద్య నిపుణులు ముందడుగు వేశారు. ఇప్పటివరకు నాటు పద్ధతిలో (జననాంగంలోకి చేయి పెట్టడం ద్వారా) జరుపుతున్న ఈ ప్రక్రియను తొలిసారి డిజిటల్ పద్ధతిలో నిర్వహించారు. ఇందుకు పీవీ నరసింహా రావు పశువైద్య విశ్వవిద్యాలయం వేదిక అయింది. ఈ ప్రయోగంలో భాగంగా లేజర్ కిరణాలతో కూడిన ఎండోస్కోపీ ట్యూబ్ ఇచ్చే డిస్ప్లే సమా చారం ఆధారంగా వీర్యాన్ని ఓ ఆవు గర్భాశయంలోకి పంపారు. ఎండోస్కోపీ ట్యూబ్తోపాటు వచ్చే పెన్డ్రైవ్ను కాలర్ హ్యాంగింగ్ మొబైల్ ఫోన్కు అటాచ్ చేయడం ద్వారా గర్భాశయ ముఖద్వారం, వీర్యం వెళుతున్న విధానం కనిపించేలా ఏర్పాట్లు చేసుకొని ఈ ప్రయోగం నిర్వహించారు. అలా పంపిన వీర్యం పూర్తిస్థాయిలో పశువు గర్భాశయం లోకి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగంలో పశువైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంసింగ్ లకావత్తోపాటు ఇంటర్న్షిప్, ఫైనలియర్ విద్యార్థులు పాల్గొన్నారు. సర్జరీ విభాగం హెచ్వోడీ ప్రొఫెసర్ ఇ.ఎల్. చంద్రశేఖర్ సమక్షంలో ఈ ప్రయోగం నిర్వహించారు. నాటు పద్ధతి వల్ల 30–40% ఫలదీకరణే జరుగుతుండగా డిజిటల్ గర్భధారణ విధానంలో 60–70 శాతం వరకు ఫలదీకరణ అవకాశం ఉందని పశువైద్య నిపుణులంటున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోందని పేర్కొన్నారు. -
ముప్పయ్యేళ్ల క్రితం సాహసం.. వెచ్చూరు ఆవుల పరిరక్షణ
సోసమ్మ ఐపె.. ఈ మహిళా వెటర్నరీ ప్రొఫెసర్ ముప్పయ్యేళ్ల క్రితం సాహసంతో తన ఉద్యోగాన్నే దేశీ గోజాతి పరిరక్షణ ఉద్యమ కేంద్రంగా మార్చుకొని ఉండకపోతే.. ఇవ్వాళ అపురూపమైన వెచ్చూరు గోజాతి మనకు కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయేది. అందుకే ఆమెను ‘వెచ్చూరమ్మ’ అని కేరళ రైతులు ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన 80 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సోసమ్మ విశేష కృషి గురించి మహిళా దినోత్సవం సందర్భంగా ముచ్చటించుకుందాం.. ‘వెచ్చూరు’ అత్యంత అరుదైన పొట్టి దేశీయ గోజాతి. మన ‘పుంగనూరు’ కన్నా ఎత్తు తక్కువగా ఉండే ఆవులు ఇవి. కొట్టాయం జిల్లాలోని వెచ్చూరు గ్రామం ఈ జాతి పుట్టిల్లు. ‘1960లలో అధిక పాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం విదేశీ గోజాతులతో సంకరీకరణ విధానాన్ని భారీఎత్తున అమలు చేయటం ప్రారంభించింది. 1980ల నాటికి వెచ్చూరు దేశీయ జాతి ఆవుల సంతతి దాదాపుగా అంతరించిపోయింది..’ అని డా. సోసమ్మ గుర్తుచేసుకున్నారు. అటువంటి దశలో కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీలో బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న డా. సోసమ్మ దృష్టి వెచ్చూరు ఆవుల పరిరక్షణ వైపు మళ్లింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైన పనిని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. ఆమె ప్రయత్నాలకు 15–20 మంది వెటర్నరీ విద్యార్థులు, వ్యక్తులు మద్దతుగా నిలిచారు. మొదటి పని.. నికార్సయిన వెచ్చూరు ఆవులు ఎక్కడైనా మిగిలి ఉన్నాయా అని కొట్టాయం తదితర దక్షిణ కేరళ జిల్లాల్లో 1989లో వెతకడం ప్రారంభించారు. సెలవు రోజుల్లో ఆమె, విద్యార్థులు బృందాలుగా విడిపోయి కాలికి బలపం కట్టుకొని తిరిగారు. సొంత ఖర్చులతో ఊళ్లమ్మట తిరుగుతూ రైతులను వాకబు చేసేవారు. విద్యార్థుల కుటుంబాలు కూడా ఇందులో భాగస్వాములు కావటం విశేషం. ‘నా ఉద్యోగ జీవితంలోనే అవి అత్యుత్తమ ఘడియలు. మేం అంతా ఆ ప్రయాణంలో సంతోషదాయకంగా నిమగ్నమయ్యాం..’ అన్నారామె. ఒక్కోసారి చాలా రోజులు తిరిగినా ఒక్క వెచ్చూరు ఆవు జాడ కూడా దొరికేది కాదు. ఎట్టకేలకు మనోహరన్ అనే రైతు దగ్గర మొదటి ఆవును గుర్తించాం. ఆయన ఆవును మాకు అమ్మటానికి మొదట అంగీకరించలేదు. పరిశోధన చేసి జాతిని బతికిస్తాం అని నచ్చజెప్పిన తర్వాత అంగీకరించారు. మా అందరికీ పట్టలేని సంతోషం కలిగిన రోజు అది. ఒక ఏడాదిలో 24 నికార్సయిన 24 వెచ్చూరు ఆవులను సేకరించగలిగాం. మరింత సంతోషం ఏమిటంటే.. వీటి కొనుగోలుకు, పోషణకు యూనివర్సిటీ నుంచి రూ. 65 వేల గ్రాంటు అందటం. మన్నుతిలోని వెటర్నరీ యూనివర్సిటీ క్షేత్రంలోనే ఆవులను ఉంచి పోషించటం ప్రారంభించారు. అయితే, ఆ తర్వాత పనులూ సులువుగా ఏమీ జరగలేదు. ‘మేం చేస్తున్న పని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైనది. మా పనిని యూనివర్సిటీలో కొందరు వ్యతిరేకించేవారు కూడా. అయితే, ఈ లోగా వెచ్చూరు దేశీ గోజాతి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తింపు వచ్చింది’ అన్నారామె. సంవత్సరం గడిచేలోగానే పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనేక ఆవులు చనిపోయాయి. అందుకు పాల్పడింది ఎవరో తెలీదు. దర్యాప్తు కొనసాగింది. ‘నా జీవితంలో అతి కష్టమైన రోజులవి.. అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా సరే.. లక్ష్యసాధనకు మా పోరాటాన్ని మాత్రం ఆపలేద’న్నారు డా. సోసమ్మ. 1998లో స్కాట్లండ్కు చెందిన రోస్లిన్ ఇన్స్టిట్యూట్ వెచ్చూర్ గోజాతి డిఎన్ఎపై పేటెంట్ పొందటం పరిశోధనారంగంలో సంచలనం కలిగించింది. ‘వెచ్చూరు జాతి పరిరక్షణకు మేం చేస్తున్న కృషికి చాలా ప్రతిఘటన ఎదురైన రోజులవి. రెండేళ్ల దర్యాప్తు తర్వాత.. వారిది తప్పుడు పని అని తేలిపోవడంతో ఊపిరిపీల్చుకున్నాం’ అన్నారు డా. సోసమ్మ. వెచ్చూరు జాతి పరిరక్షణ కృషిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం తప్పనిసరి అని భావించి వెచ్చూరు కన్సర్వేషన్ ట్రస్టును 1998లో రిజిస్టర్ చేయించారు. ట్రస్టు తరఫున మేలైన వెచ్చూరు ఆబోతుల వీర్యాన్ని సేకరించి రైతులకు అందించడం ప్రారంభించారు. వెచ్చూరుతోపాటు కాసర్గోడ్ గోజాతుల చిల్డ్/ఫ్రోజెన్ వీర్యాన్ని రైతులకు 2008 నుంచి ఈ ట్రస్టు అందిస్తోంది. మరోవైపు యూనివర్సిటీ తరఫున బయోడైవర్సిటీ బోర్డు, నాబార్డులతో కలసి వెచ్చూరు జాతిపై పరిశోధనా ప్రాజెక్టులు చేశారు. ఎఫ్.ఎ.ఓ., యు.ఎన్.డి.పి.ల నుంచి డా. సోసమ్మకు ప్రశంసలు, అవార్డులు సైతం లభించాయి. ఇప్పుడు కేరళ తదితర రాష్ట్రాల్లో 5 వేలకు పైగా వెచ్చూరు జాతి పశువులు ఉన్నాయని డా. సోసమ్మ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చెప్పారు. facebook.com/vechur – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి 2 అడుగులు.. 3 లీటర్లు.. వెచ్చూరు ఆవు సగటు ఎత్తు 90 సెంటీమీటర్లు (3 అడుగులు). అయితే, 61.5 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన వెచ్చూరు ఆవు గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. కేరళకు చెందిన రైతు, పర్యావరణవేత్త బాలకృష్ణన్ నంబుకుడి కుటుంబంలో భాగంగా మారిపోయిన ఈ ఆవు పేరు ‘మాణిక్యం’. తమ కుటుంబానికి దైవమిచ్చిన కానుక మాణిక్యం అని ఆయన మురిసిపోతూ ఉంటారు. వెచ్చూరు ఆవు తక్కువ మేత తింటుంది. సగటున 3 లీటర్ల పాలు ఇస్తుంది. పెరట్లోనూ పెంచుకోవచ్చు. నిర్వహణ సులభం. దీని పాలు ఔషధ విలువలతో కూడి ఉంటాయని చెబుతారు. -
బంగారు నెక్లెస్ని మింగిన ఆవు.. యజమానికి తెలియడంతో..
సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు చాలా మందికే ఉంటుంది. కొందరు కుక్కలను, పిల్లులను, మరి కొందరు ఆవులను కూడా పెంచుకుంటారు. కాకపోతే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఒక్కోసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఓ కుటుంబం కాస్త ఏమరుపాటులో ఉండేసరికి ఆ ఇంట్లోని ఆవు గొలుసు మింగేసింది. దాన్ని ఆవు కడుపులోంచి బయటకు తీసేందుకు ఆ కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడ్డారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిర్సీ తాలూకాలోని హీపనహళ్లిలో నివసిస్తున్న శ్రీకాంత్ హెగ్డే ఇంట్లో ఒక ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి ముందురోజు గోవు పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఆవు, దూడకు స్నానం చేయించి పూజలు చేశారు. భారతదేశంలో ఆవును ఆ సమయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఆవులను పూల దండలతో అలంకరించడం మామూలే. హెడ్జ్ కుటుంబం సభ్యులు మాత్రం పూల దండలతో పాటు 20 గ్రాముల బంగారు గొలుసుతో కూడా దూడకి అలంకరించారు. వాటికి పూజ చేసిన అనంతరం పూల దండలతో పాటు గొలుసును తీసి పక్కన ఉంచారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొద్దిసేపటి తర్వాత పూలు , ఆ బంగారు గొలుసు మాయమయ్యాయి. కుటుంబీకులు ఆ గొలుసు కోసం గోశాల మొత్తం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆ ఆవు గొలుసు మింగేసి ఉంటుందని కుటుంబసభ్యులకు భావించారు. అవు పేడ వేస్తే.. దానితో పాటు నెక్లెస్ కూడా వస్తుందిలే అని అనుకున్నారు. అలా ఓ నెల రోజుల పాటు.. దాని పేడను రోజూ చెక్ చేస్తూ వచ్చారు కానీ.. ఫలితం మాత్రం శూన్యం. దీంతో ఆ ఆవును వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నెక్లెస్ను తీయడం కోసం దానికి సర్జరీ చేయించి గొలుసుని బయటకు తీశారు. కాకపోతే 20 గ్రామలు ఉండాల్సి గొలుసు కాస్త 18 గ్రాములే బయటకు వచ్చింది. నెక్లెస్లోని ఒక చిన్న భాగం మాత్రం మిస్ అయినా.. చివరకి ఆ గొలుసు ఆవు కడుపులోంచి తీసినందుకు ఆ ఫ్యామిలీ మొత్తం ఊపిరిపీల్చుకుంది. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం బాగున్నట్లు ఆ హెడ్జ్ కుటుంబం తెలిపింది. చదవండి: Bengaluru Suburban Railway Project: కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో.. -
గేదె పాలు ఇవ్వడం లేదని ఆపరేషన్.. కడుపులో 5 కిలోల ప్లాస్టిక్
సాక్షి, ఆదిలాబాద్(నిర్మల్): ప్లాస్టిక్ కవర్లు పశువులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. యథేచ్ఛగా వినియోగిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండడంతో ఆహారంగా భావించి తింటున్న పశువులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మామడ మండలం కొరిటికల్ గ్రామంలో లింగన్నకు చెందిన గేదె ప్లాస్టిక్ తినడం వల్ల అనారోగ్యానికి గురైంది. మేత మేయకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, పాలు ఇవ్వకపోవడం వంటి లక్షణాలను గుర్తించిన పోషకుడు పశువైద్యులు ఓంప్రకాష్, శ్రీకర్రాజులకు సమాచారం అందించాడు. గురువారం గేదెను పరీక్షించిన పశువైద్యాధికారులు ప్లాస్టిక్ ఆహారంగా తీసుకోవడం ద్వారా అనారోగ్యానికి గురైందని గుర్తించారు. ఆపరేషన్ ద్వారా గేదె కడుపులోపల ఉన్న ఐదు కిలోలకు పైగా ప్లాస్టిక్ను తొలగించారు. పశుపోషకులు పశువుల మేత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (చదవండి: తెలంగాణలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..) -
ఛీ చాలా సిగ్గుచేటు!... అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు!
కొంత మంది మూగ జీవాలను, చిన్న పిల్లలను దారుణంగా హింసిస్తూ చాలా పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. అంతేకాదు వాళ్లకు మతిస్థిమితం లేక అలా చేస్తున్నారో లేక వారి ప్రవృత్తే అలా ఉంటుందో అర్థంకాదు. ఏదిఏమైన ఇలాంటి ఘటనలు చూస్తే చాలా అసహ్యంగానూ, అమానుషంగానూ అనిపిస్తుంది. అచ్చం అలాంటి క్రూరమైన ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. (చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!) అసలు విషయంలోకెళ్లితే....తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కెట్టి అనే చిన్న పట్టణంలో ఒక వ్యక్తి గాయపడిన ఆవుని చాలా దారుణంగా హింసిస్తుంటాడు. పాపం ఆ ఆవు తనను రక్షించే నిమిత్తం ఆ వ్యక్తి పై దాడి చేసేందుకు ప్రయత్నించి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆ నిందితులను అటవీశాఖ అరెస్ట్ చేసింది" అని క్యాప్షన్ పెట్టి మరీ రీట్వీట్ చేశారు. అంతేకాదు ఆమె ఆ ట్వీట్లో ఆ క్రూరమైన చర్యను ఖండిచేలా ఒక భయంకరమైన చట్టం ఒకటి ఉందని గుర్తుచేయడమే కాక తప్పకుండా తాము ఆ దిశగా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు కూడా "ఛీ చాలా సిగ్గుచేటు, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కొన్నా స్కూటీ!.... ఏం లాభం నడిపేందుకు లేకుండాపోయింది) Unidentified man mercilessly beating what looks like an injured #indian Gaur at #nilgiri district #TamilNadu The gaur is seen struggling to walk & almost trips as it runs away in fear.. People heard yelling expletives at the attacker, ask him to show mercy#wildlife #TNGovt pic.twitter.com/AKTx2YXrVq — Sidharth.M.P (@sdhrthmp) November 30, 2021 -
గోమాతకు ఘనంగా సీమంతం
-
ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..
మనుషులు ప్రాణాలను రక్షించుకోవటం కోసం లేదా తనను ఇబ్బందికి గురిచేసే వారి నుంచి లేదా బాధపెట్టే వారి నుంచి దూరంగా స్వేచ్ఛగా బయటికి వచ్చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. అచ్చం అదే విధంగా ఇక్కొడొక ఆవు అలానే తన ప్రాణాలను రక్షించుకువడానికి బయటకు వచ్చేస్తుంది. (చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...) అసలు విషయంలోకెళ్లితే...బ్రెజిల్లోని ఒక ఆవు జంతు వధ కబేళా నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అది రియో డి జనీరోకు పశ్చిమాన 800 కి.మీ దూరంలో ఉన్న నోవా గ్రెనడాలోని వాటర్ పార్క్లోకి వెళ్లుతుంది. అక్కడ నుంచి నెమ్మదిగా ఓపెన్-ఎయిర్ స్విమ్మింగ్ పూల్కి చేరుకుని అక్కడ ఉన్న కొన్ని మెట్టు ఎక్కి నీటి స్లైడ్ పైకి చేరుకుంటుంది. కానీ అక్కడ ఆ ఆవు నడవలేక జారిపోతుంటుంది. దీంతో ఆ ఆవు అక్కడే కూర్చొండిపోతుంది. నిజానికి ఆ స్విమ్మింగ్ పూల్ 200 కేజీల బరువును మాత్రమే భరించగలదు కానీ 317 కిలోలు ఉన్న ఆవు ఎక్కినప్పుడు ఆ పూల్ పై భాగం ఏ మాత్రం ధ్వంసం కాలేదు. అంతేకాదు ఆ స్విమ్మింగ్ పూల్ యజమాని కార్లోస్ మిగ్యుల్ సెరాంటె ఆ ఆవుకి టోబోగా పేరు పెట్టి దత్తతగా తీసుకుని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రాణలను రక్షించేకునేందుకు ఎంతలా ప్రయత్నించిందంటూ ఆ ఆవుని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) -
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్పర్స్న్గా ప్రశాంతి ప్రమాణం
-
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్ పర్సన్ గా ప్రశాంతి రెడ్డి ప్రమాణం..
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలికి చైర్పర్సన్గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయ గర్భగుడిని అలాగే ఉంచి.. మిగిలిన ప్రాంతాన్ని పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో టీటీడీ ఆలయంలో గానీ, భజన మండలి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోని 29 పీఠాధిపతులతో తిరుమలలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అన్నారు. దేశంలోని ఏ గుడిలో నైనా.. గోవును అడిగితే ఉచితంగా అందజేస్తామని తెలిపారు. దేశంలో అనేక చోట్ల గోవులకు సరైన పోషణ ఉండటం లేదని ఆవేదన సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. గోసంరక్షణ కోసం అవసరమైన నిధులను కూడా.. టీటీడీ కేటాయిస్తుందని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం
గుమటాపుర: చాలా ప్రాంతాలలో పండుగల సందర్భంగా కొన్ని వింతైన ఆచారాలు ఉంటాయి. వాటి వెనుక ఎంతో కొంత ప్రయోజనాల దృష్ట్య కూడా మన పూర్వీకులు ఇలాంటి వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేస్తారని చెప్పక తప్పదు. అదేవిధంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉన్న గుమటాపుర గ్రామంలో దీపావళి పండుగ ముగింపు సందర్భంగా ఒక వింతైన ఆచారం ఉంది. (చదవండి: అమ్మ బాబోయ్ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్గా చేతులు పెట్టేస్తున్నాడు!) అంతేకాదు వారు మొదట ఆలయానికి వెళ్లి గుడిలోని పూజారితో ఆశీర్వాదం తీసుకునేముందు స్థానిక చుట్టుపక్కల గ్రామాలలోని ఇళ్లలో నుంచి పెద్ద ఎత్తున ఆవుపేడను ట్రాక్టర్ల సాయంతో దేవలయానికి తరలిస్తారు. ఆ తర్వాత అబ్బాయిలంతా జరగబోయే కార్యక్రమానికి కావల్సిన బాణసంచా వంటి మందు గుండు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఈ మేరకు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మగవాళ్లంతా ఒకరి నొకరు ఆవుపేడతో కొట్టుకుంటారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి సుదూర నగరాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున గుమటాపురానికి తరలి వస్తుంటారు. అంతేకాదు ఈ వేడుక చిన్న పాటి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సరదా సరదాగా సాగుతుంటుంది. పైగా ఆ గ్రామంలోని ప్రజలు ఇది ఆరోగ్య ప్రయోజని నిమిత్తం ఇలా చేస్తుంటామని చెబుతుండం విశేషం. ఈ మేరకు ఆ గ్రామంలోని రైతు ఈ ఆవు పేడతో ఇలా కొట్టించుకుంటే ఏదైనా వ్యాధి ఉన్న అది త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. (చదవండి: పునీత్కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!) #WATCH | Villagers of Gumatapura on the Tamil Nadu-Karnataka border throw cow dung on each other as part of Deepavali celebrations, marking the end of the festival. (06.11.2021) pic.twitter.com/w1fhrp0na5 — ANI (@ANI) November 8, 2021 -
Viral Video: ద్విచక్రవాహన దారుడిని కుమ్మేసిన ఆవు
-
వామ్మో.. వాహనదారుడిని కుమ్మేసిన ఆవు.. వీడియో వైరల్
బ్రస్సీలియా: ఒక్కొసారి మూగజీవాలు రోడ్డుదాటుతున్నప్పుడు వేగంగా ప్రయాణిస్తున్న వాహానాలకు అడ్డుపడుతుంటాయి. ఈ క్రమంలో వాహనాలతోపాటు మూగజీవాలు కూడా ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఇలాంటి సంఘటనలు మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం. ఈ కోవకు చెందిన ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన బ్రెజిల్లోని శాంటా కాటరినాలో చోటుచేసుకుంది. చాపెకో వీధి సందులో నుంచి ఒక ఆవు ఒక్కసారిగి రోడ్డుపైకి దూసుకొచ్చింది. అప్పుడు రోడ్డుపై అనేక వాహానాలు ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో ఆవు రోడ్డుపైకి వచ్చి ద్విచక్రదారుడిని వెళ్లి ఢీకొట్టింది. ఈ హఠాత్పరిమాణంతో బైకర్ రోడ్డుపై పడ్డాడు. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనాలు కూడా ఆగిపోయాయి. ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండటం.. ఎక్కువ స్పీడ్ లేకపోవడం వలన చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఈ సంఘటన గత నెల అక్టోబరు 27న జరిగింది. దీన్నిరోడ్డుపై ఉన్న ఒక వ్యక్తి తన మిత్రుడికోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆవు పరుగెత్తుకురావడాన్ని గమనించి వీడియోతీశాడు. ఈ తర్వాత.. వైరల్ హగ్ అనే యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు..’, ‘పాపం.. ఆవుకు కూడా గాయమైనట్టుంది..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా గోమాహా సమ్మేళనం
-
ఘనంగా ‘సావిత్రి’కి సీమంతం
యడ్లపాడు(గుంటూరు): ఉమ్మడి కుటుంబాలే కాదు.. రక్తసం‘బంధం’ బలం తగ్గిపోతున్న కాలమిది. కన్నవారే కాదు..కట్టుకున్న ఆలిని సైతం మరిచిపోతున్న రోజులివి. మానవత్వాని మించి ‘మనీ’కే మనిషి విలువిస్తున్న కలియుగం ఇది. తొలి చూలాలైన గోవుకు సంప్రదాయ బద్దంగా ‘సీమంతం’ చేసి సమానత్వాన్ని చాటాడో యువకుడు. పశువులపై మనిషికున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆదినుంచే ప్రకృతిలోని ప్రతిజీవితో అనుబంధం ఉందన్న విషయాన్ని తెలియజేశాడు. పశువు రూపాన ఉన్న పరమాత్మ స్వరూపమని, గోవుని మించి దైవం లేదని నిరూపించారు. ఎక్కడంటే... గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన గుంటుపల్లి వెంకటేశ్వరబాబు ‘లా’ పూర్తిచేసినా వ్యాపార రంగంవైపే మొగ్గుచూపాడు. తన కుటుంబ సభ్యుల నుంచి గోసేవ, గోపూజను వారసత్వంగా పొందాడు. పట్టణంలోని పురుషోత్తమపట్నం షిరిడిసాయి మందిరంలో గోశాల, సుబ్బయ్యతోట గోశాల, ఆవులదొడ్డిగా పిలిచే గుండయ్యతోట గోశాలను సందర్శిస్తాడు. ఉదయాన్నే వెళ్లి మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు, కూరగాయలు శుభ్రపరిచి గోవులకు తినిపిస్తాడు. వాటిచుట్టూ ప్రదక్షిణలు చేసి నమ్కరించాక దినచర్యలు ప్రారంభం అవుతాయి. శుభకార్యనికి...శుభముహూర్తం ఆవులదొడ్డిలోని గోవులన్నింటికీ ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. వీటిలో పూజ అనేగోవుకు పుట్టిన సావిత్రి ఇటీవల కాలంలో గర్భం దాల్చింది. అక్కడి పనివార్ల ద్వారా బాబుకు ఆ విషయం తెలిసి ఆనందపడ్డాడు. తమ ఇంటి ఆడపడుచు గర్భం దాల్చిన విధంగా పొంగిపోయారు. తమ ఇంట ఆడపడుచుకు ఎలా శుభకార్యం చేసేవారో అలాగే చేయాలని బాబు కుటుంబం నిర్ణయించింది. గోవుకు సీమంతం చేస్తున్నామంటూ బంధుమిత్రులకు ఆహ్వానం పలికాడు. వేద పండితుడి వద్దకెళ్లి ముహుర్తం ఖరారు చేయించాడు. కదిలొచ్చిన నాలుగు కుటుంబాలు సావిత్రి సీమంత ఆహ్వానం అందుకున్న వెంకటేశ్వరబాబు అక్కాబావలు ఉదయ్శంకర్, మహాలక్ష్మి దంపతులు, ఆక శేషసాయి, శాంతిలక్ష్మికుమారి దంపతులు, మిత్రులైన విప్రొ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి ఏఎస్వీఎస్ శాస్త్రి, విజయ దంపతులు, మిత్రబ్యాంక్ ఫీల్డ్ఆఫీసర్ ప్రసాదరావు, శ్యామలా దంపతులు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సేవలోనూ, పూజలోనూ తమవంతు భాగస్వామ్యాన్ని సంతోషంగా స్వీకరించారు. ఘనంగా సావిత్రికి సీమంతం 9నెలల నిండు గర్భిణీ సావిత్రిని గోవును పూలతో చక్కగా ముస్తాబు చేశారు. పసుపు, కుంకుమను పూసి కొమ్ములకు రంగురంగుల గాజుల్ని తొడిగారు. కాళ్లకు గజ్జెలు కట్టారు. స్వయంగా వండి తెచ్చిన చలిమిడి, పిండివంటల్ని తృప్తిగా తినిపించారు. నూతన వస్త్రాలను సమర్పించారు. పండితుల వేదమంత్రాలతో ముత్తయిదువులచే మంగళ హారతులు ఇచ్చారు. ఈ శుభకార్యానికి హాజరైన బంధుమిత్రులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. మనఃపూర్వకంగా ఆవును ఆశీర్వదించారు. తమ ప్రేమను చాటుకున్నారు. చివరిగా గోశాలలోని పనివార్లకు తాంబూలాలు, స్వీట్లను పంపిణీ చేశారు. మనుషుల కంటే గోవు సీమంతానికి ఎక్కువమంది హాజరు కావడం విశేషం. కన్నతల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న ఈ రోజుల్లో ఓ ఆవుకు ఇలా సీమంతం చేయడం గొప్ప విషయమని పట్టణ వాసులు కార్యక్రమం నిర్వహించిన దంపతులను అభినందించారు. వినిగానే విశేషంగా అనిపించింది...శ్యామలా, గృహిణి సావిత్రికి సీమంతం చేయడం ఎంతో విశేషంగా అనిపించింది. ఆవు యొక్క విశిష్టత, పవిత్రత నేటì తరానికి తెలీదు. తొలిసారిగా చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇలా చేయడం వలన భావితరాలకు తెలియజేసే అవకాశం ఉంటుంది. ఈ శుభకార్యంలో మేము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. -
వృద్దురాలిపై సడన్ గా దాడి చేసిన ఆవు
-
వృద్ధురాలిపై దాడి చేసిన ఆవు
-
ఆవుల సంరక్షణ కోసం గాయత్రి కృషి
-
ఆవు పాలు పితికిన హీరోయిన్... వీడియో వైరల్
సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూస్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా సినీ తారల విషయంతో ఇది చాలా ఎక్కువ. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఆ వీడియోలు చూసి అభిమానులు మురిసిపోతుంటారు. తాజాగా హీరోయిన్ నివేదా థామస్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: నేహాకక్కడ్: అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వుమెన్ సింగర్..) ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ ప్రశ్న. అందులో నివేదా బ్లాక్ కలర్ జాకెట్ ధరించి ఆవు పాలు పితికింది. డైరీ ఫామ్కి వెళ్లిన నివేదా.. స్వయంగా తానే ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితికి చక్కటి కాఫీ పెట్టుకుంది. దీన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ 'జాయ్' అని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొంతమంది వాటి దగ్గరకు వెళ్లడానికే భయపడతారు.. కానీ నువ్వు వెళ్లడమే కాకుండా పాలు పితికే సాహసం చేశావంటే నువ్వు చాలా గ్రేట్ అక్కా’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నివేదా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. -
ఆవు మాత్రమే అలా చేయగలదు: అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు
అలహాబాద్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ మరోమారు ఆవుపై వ్యాఖ్యలు చేశారు. అన్ని జంతువుల్లోనూ కేవలం ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ను వదులుతుందని సైంటిస్టులు నమ్ముతారన్నారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ద్వారా మందు లేని పలు జబ్బులు కూడా నమయవుతాయని చెప్పారు. ఆవును దొంగలించి చంపిన కేసును విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాంభల్ జిల్లాకు చెందిన జావెద్ గతంలోనూ పలు మార్లు ఆవులను దొంగలించి చంపాడని, బెయిల్ ఇస్తే మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడతాని వ్యాఖ్యానిస్తూ బెయిల్ నిరాకరించారు. హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతలు నివాసముంటారన్నారు. అందుకే గోవధకు హిందువులు వ్యతిరేకమన్నారు. -
భీమవరం ఉండి రోడ్డులో భారీ పేలుడు
పశ్చిమ గోదావరి: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్డులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి అక్కడ భారీ గుంత ఏర్పడింది. ఖాలీ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
వైరల్: పితకకుండానే పాలొచ్చేస్తున్నాయి.. ఆవు నుంచి ‘పాలధార’
వడమాలపేట: చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని ఎన్వీఆర్ కండ్రిగలో ఓ ఆవు పాలు పితకకుండానే ఇస్తోంది. చూడి కట్టకనే.. ఈత ఈనకుండానే .. పొదుగు లేకున్నా.. ఆవుకు పాలు కారడాన్ని వింతగా మారింది. ఈ వార్త వైరల్గా మారింది. గ్రామానికి చెందిన రైతు వెంకటరమణారెడ్డికి ఆవు ఉంది. ఆదివారం పితకుండానే పాలు కారుతుండడాన్ని రైతు గుర్తించాడు. దీంతో పితకగా ఆ ఆవు రెండు లీటర్ల పాలిచ్చింది. ఈ వార్త స్థానికంగా హాట్టాపిక్ అయ్యింది. ఇలా ఆవు పాలు ఇవ్వడంపై వడమాలపేట పశువైద్యశాల లైవ్స్టాక్ ఆఫీసర్ లోకనాథం వివరణ ఇచ్చారు. పశువుల్లో హర్మోన్ల సమస్యతో ఇలా జరుగుతుంటుందని తెలిపారు. -
గిన్నిస్ రికార్డుల్లోకి బుజ్జి ఆవు?
లేగ దూడ ఎంత ముద్దుగా ఉందో కదూ..! ఈ దూడ చూడటానికి చుట్టుపక్కల ఊర్లకు చెందిన వందల మంది వస్తున్నారట. ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంతమంది ఎందుకు వస్తారనే కదా మీ అనుమానం. ఈ లేగ దూడ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు ఉన్న ఆవుగా రికార్డుల్లోకి ఎక్కనుంది. ఇది ఎంత ఎత్తు ఉందో తెలుసా 21 అంగుళాలు (51 సెంటీమీటర్లు) మాత్రమే. పైగా 26 కిలోలు మాత్రమే ఉన్నట్లు దీని యజమానులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ చారిగ్రామ్లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ వయసు 23 వారాలు. భూటాన్ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.అయితే ఇప్పటివరకు అతి చిన్న ఆవుగా భారత్కు చెందిన మాణిక్యం (వేచూర్ జాతి) గిన్నిస్ రికార్డుల్లో ఉంది. మాణిక్యం 24 అంగుళాలు (31 సెంటీమీటర్లు) ఎత్తు ఉంటుంది. దీన్ని బట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు కనుక పరిశీలిస్తే కచ్చితంగా మాణిక్యం రికార్డును రాణి ఎత్తుకుపోతుందని దాని యజమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
మూగజీవాల మృత్యుఘోష ..
సాక్షి, అనంతపురం(గుత్తి): మండల పరిధిలోని ఊటకల్లు వద్ద కురుబ రాజు మామిడి తోటలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. మామిడి తోటలోని ఓ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లో 22 కేఫ్లు (పేలుడు పదార్థాలు) ఉంచారు. టమాట పండ్ల మాదిరి ఉండటంతో అటువైపు వెళ్లిన రైతు నారాయణరెడ్డికి చెందిన ఆవు తినడానికి ప్రయత్నించింది. దీంతో ఒక కేఫ్ పెద్ద శబ్దంతో పేలింది. ఆవు తల భాగం ఛిద్రమైంది. గ్రామస్తులు వెంటనే గుత్తి సీఐ రాముకు సమాచారం ఇచ్చారు. ఆయనతో పాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, ఎస్ఐ సుధాకర్ యాదవ్, పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పేలని 21 కేఫ్లను గుర్తించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ సాధారణంగా కేఫ్ను అడవి పందులను చంపడానికి వినియోగిస్తారని చెప్పారు. అయితే అడవ పందులను చంపడానికైతేఅక్కడక్కడా ఒకటి చొప్పున మాత్రమే ఉంచుతారు. ఒకేచోట 22 ఎందుకు ఉంచారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా రొళ్లపాడు, గుడిసెల గ్రామాలకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో ఊటకల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ తరహా పేలుడు పదార్థాలు ఉంచారోనని భయపడుతున్నారు. గ్రామంలో ఎవరినైనా టార్గెట్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కేఫ్ పేలితే సుమారు కిలో మీటరు దూరం వరకు శబ్ధం వినిపిస్తుందని పోలీసులు చెబుతున్నారు. మూగజీవాల మృత్యుఘోష అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని రామాంజులపల్లి బస్షెల్టర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు ఎద్దులు మృతి చెందాయి. మరో ఏడు ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదానికి గురైన మూగజీవాలు విలవిలలాడడం చూసి స్థానికులు చలించిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి చెన్నైకు ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ లారీ తెల్లవారుజామున రామాంజులపల్లి బస్షెల్టర్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్ర మత్తులో తూగాడు. దీంతో లారీ అదుపుతప్పి ఎదురుగా ఉన్న బస్షెల్టర్ను వేగంగా ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులోని 12 ఎద్దులలో ఐదు అక్కడికక్కడే మృతి చెందాయి. మిగిలిన ఏడు కొమ్ములు, కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాయి. అవి విలవిలలాడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. లారీలోనే మృతి చెందిన ఎద్దులను జేసీబీ సాయంతో తొలగించారు. లారీ వేగంగా ఢీ కొనడంతో బస్షెల్టర్ సైతం దెబ్బతింది. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి గుర్నాథరెడ్డి గోపాలమిత్రలను సంఘటనా స్థలానికి పంపి గాయపడిన పశువులకు చికిత్స చేయించారు. అనంతరం వాటిని చెన్నైకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
మాణిక్యం రికార్డును బ్రేక్ చేసిన 23 నెలల రాణి
ఢాకా : 23 నెలల రాణి అనే ఆవు ప్రస్తుతం సోషల్ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది. రాణిని చూడటానికి నిత్యం వేల సంఖ్యలో జనం క్యూ కడుతున్నారు. జనం అంతలా ఎగబడి చూడ్డానికి రాణిలో అంత ప్రత్యేక ఏంటని అనుకుంటున్నారా? ఆ ఆవు నిజంగానే ప్రత్యేకమైనదే.. 23 నెలల రాణి ఎత్తు 51 సెంటీమీటర్లు మాత్రమే. ఈ మరుగుజ్జు రూపమే దాన్ని సెలెబ్రిటీని చేసింది. బంగ్లాదేశ్, ఢాకా దగ్గరలోని చారిగ్రామ్కు చెందిన ఎమ్ఏ హాసన్ హవాల్దార్ ఈ ఆవును పెంచుకుంటున్నాడు. 51 సెం.మీ ఎత్తు ఉన్న ఈ ఆవు బరువు 26 కేజీలు. ప్రపంచంలో అత్యంత పొట్టి ఆవుగా గిన్నిస్ రికార్డుకెక్కిన కేరళకు చెందిన మాణిక్యం అనే ఆవు కంటే రాణి 10 సెంటీమీటర్లు పొట్టిది. దీనిపై హాసన్ మాట్లాడుతూ.. ‘‘ కరోనా లాక్డౌన్ను లెక్కచేయకుండా జనం రాణిని చూడటానికి వస్తున్నారు. చాలా మంది రాణితో సెల్ఫీలు తీసుకోవటానికి ఎగబడుతున్నారు. గత మూడు రోజుల్లో దాదాపు 1500 మంది రాణిని చూడటానికి వచ్చారు. నిజం చెప్పాలంటే వాళ్లను కంట్రోల్ చేయలేక మేము అలసిపోయాం. చాలా రోజుల క్రితమే గిన్నిస్ రికార్డు వాళ్లను సంప్రదించాం. మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు’’ అని అన్నాడు. -
ఆవు కడుపులోని ఆ ద్రవాలతో ప్లాస్టిక్ భూతానికి చెక్!
తినడానికి తిండి లేక నగర వీధుల్లోని ఆవులు ప్లాస్టిక్ సంచులను తినడం సాధారణంగా చూసే ఉంటారు. అయితే.. ఆస్ట్రియా శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టే ఓ మార్గాన్ని సూచించింది! ఎందుకంటే.. ప్లాస్టిక్ను సైతం ముక్కలుగా చేసేయగల శక్తి ఆవు కడుపులోని ద్రవాలకు ఉంటుందని వీరు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే కొన్ని ఎంజైమ్లు ప్లాస్టిక్ చెత్తను నాశనం చేయగలవన్నమాట. పాస్టిక్ చెత్త భూమి లోపలికి చేరి నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పడుతుందన్నది మనకు తెలిసిన విషయమే. కానీ ఇటీవల బ్యాక్టీరియా సాయంతో ఈ సమయాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే ఎంజైమ్లు కూడా అలాంటివే. ప్లాస్టిక్ సంచీల తయారీ సమయంలోనే ఇలాంటి ఎంజైమ్లు చేర్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆస్ట్రియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆవు కడుపులోని ద్రవాలను పరిశీలించగా.. అందులోని సూక్ష్మజీవులు కనీసం మూడు రకాల ప్లాస్టిక్లను ముక్కలు చేయగలవని కనుగొన్నారు. ఒక రకమైన సూక్ష్మజీవులతో పోలిస్తే ద్రవంలోని వివిధ రకాల బ్యాక్టీరియా కలసికట్టుగా మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే వేర్వేరు ఎంజైమ్లు ఇందుకు కారణమని శాస్త్రవేత్త డాక్టర్ డోరిస్ రిబిట్ వివరించారు. కబేళాల్లో నిత్యం ఈ ద్రవం అందుబాటులో ఉంటుంది కాబట్టి.. అక్కడికక్కడే ప్లాస్టిక్ చెత్తను నాశనం చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. -
గోవుకు ముస్లింల అంతిమ సంస్కారాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లాలో ఓ గోమాతకు ముస్లింలు అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లాలోని నాగిరెడ్డిపేట మండల కో–ఆప్షన్ సభ్యుడు షాహెద్పాషా ఆరేళ్ల క్రితం దేవుడి పేరుతో ఓ ఆవును వదిలి పెట్టారు. ఆ గోవు ఆదివారం మరణించింది. ఈ విషయం తెలిసిన షాహెద్పాషా కుటుంబ సభ్యులు ముస్లిం యువకులతో కలిసి గోమాతకు అంత్యక్రియలు నిర్వహించారు. -
పోలీస్ స్టేషన్లో ఆవు.. వెరైటీగా నిరసన..
చండీఘడ్: సాధారణంగా రైతులు తమ పంటకు మద్దతు ధర కోసమో లేదా వారికి పంట విషయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటారు. ఇలా ఏదో విషయమై ధర్నా చేసిన ఇద్దరు హర్యానా రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, వారికి మద్దతు తెలుపుతూ ఇతర రైతులు పోలీస్ స్టేషన్ ముందు వెరైటీగా నిరసన తెలిపిన ఘటన వార్తల్లో నిలిచింది. వివరాలు.. హర్యానాలోని ఫతేహబాద్ జిల్లాకు చెందిన వికాస్ సిసర్, రవి ఆజాద్ అనే ఇద్దరు రైతులు స్థానిక జెజెపీ ఎమ్మేల్యే దేవేంద్ర సింగ్ బాబ్లీ ఇంటిని ముట్టడించారు. కారణం ఇతడు అధికార బిజేపీతో పొత్తు పెట్టుకోవడం వారికి అస్సలు నచ్చలేదు. వారి మాత్రమే కాదు, స్థానిక రైతు సంఘాల నాయకులు కూడా ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టిన వికాస్, రవి ఆజాద్లను పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో రైతు సంఘాల నాయకులు అలర్ట్ అయ్యారు. ఫతేహబాద్ తోహనాలో ఉన్న పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. అంతటితో ఆగకుండా, ఒక ఆవును తీసుకొచ్చి స్టేషన్ ఆవరణలో ఉన్న ఒక స్థంభానికి కట్టారు. ఆవు బాధ్యత పోలీసులదే.. దానికి నీరు, దాణా పెట్టడం వారి కర్తవ్యమే అని తెలిపారు. మాతో పాటే ఆవుకూడా నిరసన తెలుపుతుందన్నారు. ఈ ధర్నాలో ప్రముఖ రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ కూడా పాల్గొన్నారు. 'తమ సహచరులను విడిచిపెట్టాలని రైతు నాయకులకు, జిల్లా యంత్రాంగానికి మధ్య చర్చలు జరిగాయి. మొదట్లో దీనికి జిల్లా యంత్రాంగం అంగీకరించలేదు. దీంతో రైతులు నిరసన కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో వెనక్కు తగ్గిన పోలీసులు అర్దరాత్రి ఇద్దరు రైతులను బెయిల్ పై విడుదల చేశారని' తెలిపాడు. దీంతో రైతులు స్టేషన్ ముట్టడిని విరమించారు. చదవండి: గప్చుప్లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే -
గప్చుప్లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే
ముంబై: గోల్ గప్పా.. గప్చుప్.. పానీపూరి ఇలా ఏ పేరుతో పిలిచినా దీనిని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. నోట్లో పెట్టుకోగానే నాలుకకు మంచి రుచిని అందించే గప్చుప్ను తినేందుకు జనాలు పెద్ద ఎత్తున్న ఎగబడతారు. ఇక ముంబై వీధుల్లో గప్చుప్ హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గప్చుప్లు మనుషులకే కాదు మాకు ఇష్టమే అన్న చందంగా ఒక ఆవు.. దాని లేగ దూడ లొట్టేలేసుకుంటూ ఆరంగించాయి. సాధారణంగా ఆవులు ఇంటిముందుకు వస్తే చాలామంది ఆహారాన్ని కిందపడేసి వెళ్లిపోతారు. అలా పడేసిన ఆహారాన్ని తినేసి వెళ్లిపోతాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన దగ్గరకు వచ్చిన ఆవు, లేగ దూడను దగ్గర్లోని చాట్ బండి వద్దకు తీసుకెళ్లి గప్చుప్ తినిపించాడు. అయితే కింద పెట్టకుండా స్వయంగా తానే తన చేతులతో వాటికి తినిపించాడు. ఇంకేముంది.. అంత ప్రేమగా తినిపిస్తుంటే అవి కూడా సంతోషంగా ఆరగించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 58వేల మంది వీక్షించారు. చదవండి: వైరల్: రైతు దుశ్చర్య.. పాపం ఎలుకల దండుని.. View this post on Instagram A post shared by sree130920 (@sree130920) -
హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..!
సాక్షి, మంచిర్యాల: నేనొస్తే గేటు తీయరా..? అనుకున్నదేమో ఓ కొడే. మంచిర్యాల పట్టణం నుంచి హమాలీవాడకు వెళ్లే రైల్వే గేటు వద్ద గురువారం బీభత్సం సృష్టించింది. రైల్వే గేటు విరగ్గొట్టి ట్రాక్ దాటి అవతలి వైపు హమాలీవాడ వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. ఉదయం మార్కెట్లో మేతకు వచ్చిన ఆ కోడె 10 గంటలకు వెళ్తుండగా గేటు వద్దకు వచ్చి ఆగిపోయింది. రైలు వెళ్లిపోయినా గేటు తీయకుండా ఉంచుతారా అనుకుందేమో మూడు నాలుగు సార్లు గేటు విరగ్గొట్టేందుకు విశ్వప్రయత్నం చేసింది. రైల్వే సిబ్బంది కర్రతో కొట్టి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా ఆగలేదు. అక్కడున్న వాహనదారులు కొడెను చూసి బెదిరిపోయారు. కోడె దాడి రైల్వేగేటు వంగి పోయింది. ఆ గేటును సరి చేసేందుకు రెండు గంటల సమయం పట్టింది. మరమ్మతులతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: గేటు కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కోడె గేటును సరి చేస్తున్న సిబ్బంది -
అయ్యో! పులి ఎంతపని చేసింది..
పెంచికల్పేట్/దహెగాం (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కమ్మర్గాం గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన పశువులపై మంగళవారం పులి దాడి చేసింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన తలండి పోశయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. పేదం సురేష్కు చెందిన గేదెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దహెగాం మండలం దిగిడ గ్రామంలోనూ పశువులపై పులి దాడి చేసింది. రైతు కుర్సింగ వెంకటేష్కు చెందిన ఆవు మేతకు వెళ్లి వస్తుండగా సాయంత్రం సమయంలో దాడి చేసి హతమార్చింది. -
ఆవును కత్తితో పొడిచి చంపిన పండ్ల వ్యాపారి
ముంబై : పండు తిన్నదన్న కారణంతో ఓ వ్యక్తి ఆవును చంపిన దారణ ఘటన మహారాష్ట్రలోని రాయ్గడ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తౌఫిక్ బషీర్ ముజావర్ అనే వ్యక్తి రాయ్గడ్లోని మురుద్ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అయితే తన దుకాణం నుంచి ఆవు బొప్పాయి పండును దొంగలించి తిన్నదన్న కోపంతో ఆవుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆవు పొత్తి కడుపులో కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. దీన్ని గమనించిన ఓ బాటసారి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆవును వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆవు చనిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై జంతు నిరోధక చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై హిందుత్వ సంఘాలు, పలువురు బీజేపీ నాయకులు మండిపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చదవండి : ( రేండేళ్లుగా ప్రియురాలపై అత్యాచారం: ప్రియుడి అరెస్టు) (ప్రియుడి దొంగతనం.. ప్రేమికుల అరెస్టు) -
నెట్టింట్లో హల్చల్ చేస్తోన్న అరుదైన జాతి దూడ
సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చాక చిన్న చిన్న విషయాలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఇదేదో రాజకీయాలు, సినిమాలకు సంబంధించినది అని అనుకుంటే పొరపాటే. ఓ చక్కటి అందమైన చిన్న లేగదూడకు చెందినది. ఇది సాధారణ లేగ దూడ కాదు. ఇదో ప్రత్యేకమైన జాతికి చెందినది. చిత్తూరు జిల్లాలోని పంగనూరులో ఈ జాతి ఆవులు ఉంటాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా చేస్తున్న రాజీవ్ కృష్ణ ట్విటర్లో పోస్టే చేశారు. ఇతను వైఎస్సార్సీపీ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇక ఆవు గురించి చెబుతూ.. ఈ ఆవులు మహా అయితే 3, 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగవని, బరువు కూడా 150 నుంచి 200 కేజీలే ఉంటాయని తెలిపారు. కానీ పాలు మాత్రం రోజూ 4 నుంచి 5 లీటర్ల దాకా ఇస్తాయనీ, ఆ పాలు చాలా చిక్కగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా వీడియో విషయానికొస్తే.. ఈ లేగ దూడను ముచ్చటగా అలంకరించారు దాని యజమాని. అందమైన గంటలు కట్టడంతో.. అది కదులుతుంటే గంటలు మ్రోగుతూ ఇళ్లంతా సందడి చేస్తోంది. ఈ ప్రత్యేకమైన జాతి ఆవు వీడియోను చూస్తుంటే ప్రతి ఒక్కరికి క్యూట్ ఫీల్ కలిగిస్తోంది. అందుకే 50 సెకండ్ల వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు నెటిజన్లు. జనరల్గా పిల్లులు, కుక్కల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్ల వీడియోలను కూడా మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఇది మాత్రం ప్రత్యేకమైన వీడియోనని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్ Awwwww, I want one of these. pic.twitter.com/AGVtiB9Lw5 — Shefali Vaidya. (@ShefVaidya) February 14, 2021 -
సేంద్రీయ స్వదేశీ నాటు ఆవు పెంపకం క్షేత్రాలు
సాక్షి, అమరావతి: సేంద్రీయ ఏ2 పాల ఉత్పత్తి లక్ష్యంగా స్వదేశీ ఆవుల పెంపకం క్షేత్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఇందుకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం రాత్రి జీవో జారీ చేశారు. గతంలో నేషనల్ ఎడాప్షన్ ఫండ్ ఫర్ క్లైమేమెట్ చేంజ్ (ఎన్ఏఎఫ్సీసీ) ప్రాజెక్టు కింద నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో రూ.5.40 కోట్ల అంచనాతో 18 యూనిట్లు, మిగిలిన పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రూ.12 కోట్ల అంచనాతో 40 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాగా, తాజా గైడ్లైన్స్లో ఆర్కేవీవై, ఎన్ఏఎఫ్సీసీ ఆర్థిక చేయూతతో అన్ని జిల్లాల్లోనూ ఒకే రీతిలో 58 యూనిట్లు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలను జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. 25 దేశీయ ఆవులు అందజేత ఈ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. వీరికి ఒక్కొక్కటి రూ.75 వేల అంచనాతో రూ.17.50 లక్షల అంచనాతో 25 దేశీయ ఆవులు (గిర్, సాహివాల్, ఒంగోలు, పుంగనూరు తదితర జాతులు) అందజేస్తారు. ఇలా 58 యూనిట్ల కోసం రూ.10.15 కోట్లు ఇవ్వనున్నారు. ఈ గోవుల కోసం నిర్మించే షెడ్లు, ఫెన్సింగ్ కోసం ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల చొప్పున రూ.5.80 కోట్లు, పాలు, పాల ఉత్పత్తిల తయారీ కోసం ఉపయోగించే పరికరాల కోసం ఒక్కో యూనిట్కు రూ.1,12,750 చొప్పున రూ.65.54 లక్షలు, నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో యూనిట్కు రూ.1,37,250 చొప్పున రూ.79.46 లక్షలు చెల్లించనున్నారు. ఈ విధంగా ఒక్కోయూనిట్ రూ.30 లక్షలుగా నిర్ణయించగా, దీంట్లో రూ.3 లక్షలు లబ్ధిదారులు భరించాల్సి ఉంది. రూ.18 లక్షలను ఆర్కేవీవై, ఎన్ఏఎఫ్సీసీ నిధుల నుంచి సమకూర్చనుండగా, రూ.9 లక్షలను వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేయనున్నారు. కన్సల్టెంట్గా సురభి గోశాల నిర్వాహకుడు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరకలపూడికి చెందిన సురభి గోశాల నిర్వాహకుడు వి.రవికుమార్ను కన్సల్టెంట్గా నియమించారు. లబ్ధిదారులకు శిక్షణనిచ్చే బాధ్యతను విశాఖపట్నం స్మైల్ అడిషనల్ డైరెక్టర్గు అప్పగించారు. ఈ ఆవులకు అవసరమైన ఇన్పుట్స్ను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. ఈ క్షేత్రాల నుంచి వచ్చే ఏ2 పాలు, పాల ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్టి బ్రాండ్ నేమ్తో మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే అమూల్, ఫిషరీస్ అవుట్లెట్స్తో పాటు జనతా బజార్లు, ఈ–మార్కెటింగ్ ద్వారా విక్రయాలను ప్రోత్సహించనున్నారు. మార్కెటింగ్ విక్రయాల కోసం జైవిక్ భారత్, ఇండియా ఆర్గానిక్ అనే యూనిఫైడ్ లోగోలను గుర్తించారు. ఇందుకోసం హైదరాబాద్కు చెందిన ఎన్ఐఎన్ సంస్థతో పశుసంవర్థక శాఖ ఎంవోయూ చేసుకోనుంది. -
ఎల‘మంద’కు కాసుల పంట
సాక్షి, కోరుట్ల: రసాయనిక ఎరువుల వినియోగంతో భూమి సారం కోల్పోతూ వస్తోంది. పంట దిగుబడిపైనా ప్రభావం చూపుతోంది. వ్యవసాయ భూముల్లో ఆవుల మందతో భూమికి సారం.. ఎలమందకు రాబడి.. రైతుకు ప్రయోజనం కలుగుతోంది. దీంతో భూసారం పెంపుపై రైతాంగం ఆవుల మందలపై దృష్టి సారిస్తోంది. ఈ మంద వారం పాటు సాగు భూముల్లో నిద్ర తీసిందంటే చాలు సదరు ఎలమందకు రూ.50 వేలకు మించి చేతికొస్తుంది. ఆవుల మంద విసర్జకాలకు ఉన్న డిమాండే ఇందుకు కారణమని చెబుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రుద్రంగి మండలం మానాల, చందుర్తి, కోనరావుపేట మండలాల పరిసరాల్లోని తండాల్లో పశుపోషణ పెద్ద ఎత్తున సాగుతోంది. అటవీ ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు పెద్ద ఎత్తున ఉండటంతో ఆవుల మందలను ఎక్కువగా పోషిస్తున్నారు. నెలల తరబడి సంచార పశుపోషణ చేస్తూ ఆదాయం కోసం మందలను సాగు భూముల్లో నిద్రకు ఉంచుతారు. పశ్చిమ డివిజన్ సరిహద్దుల్లోని తండాల్లో ఇలా ఆవుల మందలను పోషించేవారు దాదాపు 150 మంది దాకా ఉంటారు. వంద వరకు మందలు ఉండగా.. ఒక్కో మందలో వందకు పైగా ఆవులు ఉన్నాయి. వారానికి రూ.50 వేలు పంటల సాగుకు సిద్ధమయ్యే ముందు రైతులు భూసారం పెంపు కోసం ఆవుల మందల నిద్రపై ఆసక్తి చూపుతున్నారు. సహజసిద్ధంగా ఆవుల మల, మూత్ర విసర్జకాలతో సాగుభూములు సార వంతంగా మారుతాయి. రసాయన ఎరువులు వాడ కుండానే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మం దలో ఉన్న ఆవుల సంఖ్యను బట్టి రైతులు మందల యజమానులకు డబ్బులు చెల్లిస్తున్నారు. వందకు పైబడి ఉన్న ఆవుల మంద వారం పాటు సాగు భూమిలోనే కట్టేస్తే రోజుకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు చెల్లిస్తున్నారు. కనీసం వారంపాటు మంద సాగుభూమిలో ఉంటే పశు మల, మూత్ర విసర్జకాలతో భూసారం చక్కగా పెరుగుతుంది. ఇవీ లాభాలు ► సాగు భూమిలో కర్బన శాతం పెరుగుతుంది ► సూక్ష్మ, స్థూల పోషకాలు సమతూకం అవుతాయి ► భూమి సహజ లక్షణాలు కోల్పోకుండా ఉంటుంది ► నత్రజని, భాస్వరం, పొటాషియం సహజసిద్ధంగా అంది నేల సారవంతం అవుతుంది -
58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలు
సాక్షి, అమరావతి: దేశీయ ఆవుల పెంపకం, ఏ–2 పాల ఉత్పత్తి, మార్కెటింగ్ను ప్రోత్సహించే లక్ష్యంతో 58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పశుసంవర్ధక, డెయిరీల అభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సోమవారం రాత్రి విడుదల చేశారు. ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం రాష్ట్రంలో 30.50 లక్షల మంది పాడిరైతులున్నారు. వారివద్ద 13,56,523 ఆవులు, 21,46,695 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. జెర్సీ, హెచ్ఎఫ్ జాతి పశువుల పాలను ఏ–1 మిల్క్ గా పిలుస్తారు. గిర్ (గుజరాత్), షాహివాలా (హరియాణా, పంజాబ్), ఒంగోలు జాతి పశువుల పాలను ఏ–2 మిల్క్గా పిలుస్తారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడే ఏ–2 పాల ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచడం, స్వదేశీ జాతులను సంరక్షించడం, తద్వారా సేంద్రియ సాగును ప్రోత్సహించడం లక్ష్యాలుగా ప్రభుత్వం ఈ క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎన్ఏఎఫ్సీసీ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లా నార్త్ ఆములూరు, బిరదవోలు, విజయనగరం జిల్లా పెరిమి, వీరసాగరం, అనంతపురం జిల్లా గొట్లూరు, వెంకటరాజుకాలువ ప్రాంతాల్లో రూ.5.40 కోట్లతో 18 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి లబి్ధదారులు రూ.7.50 లక్షలు భరించాలి. మిగిలిన రూ.22.50 లక్షల్ని ఎన్ఏఎఫ్సీసీ నుంచి సమకూరుస్తారు. లబ్ధిదారుల ఎంపిక ఇలా.. ఈ క్షేత్రాలు ఏర్పాటు చేయదలిచిన రైతులు, ఔత్సాహికులకు షెడ్ నిర్మాణానికి సొంతంగా లేదా కౌలుకు తీసుకున్న 2.5 ఎకరాల భూమి ఉండాలి. జాయింట్ లయబులిటీ గ్రూపు (జేఎల్జీ)లకు ప్రాధాన్యతనిస్తారు. జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ ద్వారా గ్రామసభల్లో అర్హులను ఎంపిక చేస్తారు. జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే) చైర్మన్గా ఉండే ఈ కమిటీకి పశుసంవర్ధక శాఖ జేడీ మెంబర్ కన్వీనర్గా, నాబార్డు ఎజీఎం, లీడ్ బ్యాంక్ మేనేజర్, వ్యవసాయశాఖ జేడీ సభ్యులుగా ఉంటారు. -
'కౌ'గిలింత
ఆవు మనకు గోమాత.కాని ఆవు యాంగ్జయిటీని తగ్గించే డాక్టర్ కూడా అని హాలెండ్వాసులే ముందు కనిపెట్టి దశాబ్దం నుంచి‘కౌ హగింగ్’ను సాధన చేస్తున్నారు. ఆవును కావలించుకుని కొంతసేపు గడిపితే యాంగ్జయిటీ పోతుందనివారు చెబుతున్న అనుభవం ఇప్పుడు మన దేశానికి కూడా వ్యాపించింది. కోవిడ్ సమయంలో ఆందోళనలు పోగొట్టుకోవడానికికౌ హగింగ్ను ప్రయత్నిస్తున్నారు. ‘కో నఫ్లెన్’ అంటారట డచ్లో ‘ఆవు కావలింత’ని. మన దేశంలో ఆవును గోమాతగా తలిచే వారుంటే ఆ దేశంలో ఆవును ఒక డాక్టర్గా చూసే వారున్నారు. ఆవును కావలించుకుని కాసేపు గడిపితే, ఆవును నిమిరితే, ఆవుతో బాధలు చెప్పుకుంటే, ఆవు నిర్మలమైన కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే, ఆవుకు ప్రేమ ఇస్తే, ఆవు నుంచి ప్రేమ పొందితే మనసు, శరీరం స్వస్థత పొందుతాయని కౌ హగింగ్ని ఒక థెరపీగా వారు భావిస్తారు. పదేళ్ల నుంచి ఉన్న సాంత్వన వైద్య భావన ఇప్పుడు అమెరికాకు మిగిలిన దేశాలకు కూడా ఒక నమ్మకంలా విస్తరిస్తోంది. అమెరికాలో అయితే కౌ హగింగ్ కోసం గోశాలలు నిర్వహిస్తున్నారు. కొన్ని గోశాలల్లో ఒక గోవును పట్టుకుని కూచోవడానికి దాదాపు 75 డాలర్లు (5 వేల రూపాయలు) వసూలు చేస్తున్నారు. అయితే అక్కడి గోశాలలు చాలా శుభ్రంగా, వాసన లేకుండా మెయింటెయిన్ చేస్తున్నారు. గరిక మీద తిరిగే ఆవులను అక్కడ చూడవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి కనుక కౌగిలింత మంచి ఫలితాలిస్తుందని సైకియాట్రిస్ట్లు కూడా చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన సైకియాట్రిస్ట్ ‘పసిపిల్లలనో, గోవు, శునకం వంటి పెంపుడు జంతువులనో కావలించుకుంటే ఆక్సీటోసిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు విడుదలయ్యి వత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్ను అదుపు చేస్తాయి’ అంటున్నారు. భారతదేశంలో విశ్వాసాల వల్ల కాని విధానాల వల్లగాని ప్రతి జీవి నుంచి, జీవజాలం నుంచి స్వస్థత పొందడానికే చూస్తారు. పశువులున్న వారి ఇళ్లల్లో పశువులతో అనుబంధం వల్ల పొందే ఆనందం తెలుసు.. -
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్
సాక్షి, పటాన్చెరు: అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం అమీన్పూర్ గోశాలకు తరలించారు. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా.. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో అమీన్పూర్ పశువైద్యాధికారి విశ్వచైతన్య ఆ ఆవుకు శస్త్ర చికిత్స చేసి దాని పొట్టలో పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్, కాటన్ బట్టలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. -
పులి బలమేంటో మరోసారి నిరూపించింది!
ఒక్కోసారి జంతువుల బలం కూడా విస్మయానికి గురిచేస్తుంది. పులి బలమేంటో మరోసారి నిరూపించే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆవును చంపి, కేవలం తన నోటితోనే ఆవు బరువును మోస్తూ పులి చూపిన పవర్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు చెందిన సుశాంత నందా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 14 సెకన్లు ఉన్న ఈ వీడియోలో పెద్ద పులి ఆవును చంపేశాక కేవలం నోటితో దాన్ని ఈడ్చుకొచ్చింది. ఇప్పటికే ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ 3000మందికి పైగా వీక్షించారు. (ఫ్రాన్స్లో ఘటన.. ఇది రాజమౌళి ఈగ అనుకుంటా..!) The strength of the tiger is awe inspiring. It drags a cow through the sheer power of its mouth. Not without the reason that it’s the king.... From a central Indian Tiger Reserve. A rare footage shared by Surya Keshari👍 pic.twitter.com/qohUm1ubeu — Susanta Nanda IFS (@susantananda3) September 10, 2020 -
‘ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగం’
బెంగుళూరు: ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగమని, అలాంటి ఆవులను చంపడం నేరమని కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ తెలిపారు. చిక్కబల్లాపూర్లో గోశాల ప్రారంభత్సంలో సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోసంరక్షణ, గోవధ నిషేధ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. వ్యాధి కారకాలను ఆవు నిరోదిస్తుందని ఇది వరకే రుజువు అయిన విషయాన్ని సుధాకర్ గుర్తు చేశారు. గోవద నిషేద చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి యడియూరప్ప సిద్దంగా ఉన్నారని తెలిపారు. కాగా కరోనా వ్యాప్తి తగ్గగానే ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, గోవద నిషేద చట్టానన్న అమలు చేస్తున్న గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాలకు వెళ్లి గోవద నిషేద చట్టాన్ని అధ్యయనం చేస్తామని పశుశాఖ అధికారులు తెలిపారు. అయితే బీజేపీ గోవద నిషేద చట్టాన్ని 2018అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తమ మేనిఫెస్టేలో చేర్చిన విషయం తెలిసిందే. చదవండి: నిఖిల్ పెళ్లిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం -
ఆవును హెలికాప్టర్లో ఇంటికి చేర్చిన రైతు
స్విట్జర్లాండ్ : మన దేశంలో ఆవును గోమాతగా పూజిస్తూ కుటుంబంలోని వ్యక్తిలా చూస్తాం. ఆవుకు ఏమైనా అయితే విలవిల్లాడిపోతాం. తాజాగా ఇలాంటి ఘటనే స్విట్జర్లాండ్లోనూ చోటుచేసుకుంది. ఆవుకు గాయం కావడంతో ఆ రైతు తట్టుకోలేకపోయాడు. దీంతో విమానం తీసుకొచ్చి మరీ ఆవును ఇంటికి తరలించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అయ్యింది. వివరాల ప్రకారం..స్విట్జర్లాండ్ స్విస్ ఆల్ప్స్లోని ఓ పర్వతం వద్ద మేతకు వెళ్లిన ఆవు గాయపడింది. నొప్పితో కుంటుతూ నడుస్తున్న దృశ్యం రైతు కంట పడింది. దీంతో ఇంటిదాకా నడిస్తే మళ్లీ ఆవుకు నొప్పి ఎక్కువవుతుంది అనుకున్నాడు. వెంటనే హెలికాప్టర్ సాయం కోరగా రెస్క్యూ టీమ్ వచ్చి ఆవుకి తాళ్లు కట్టి క్షేమంగా ఇంటికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో తీసి ఓ న్యూస్ ఛానల్కి ట్యాగ్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. లక్షలమంది ఈ వీడియోను వీక్షించి రీట్వీట్లు చేస్తున్నారు. ఆవు మీద మీరు కురిపించిన ప్రేమకు ముగ్ధులమయ్యాం అంటూ పలువురు నెటిజన్లు రైతును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. (వైరల్ : అందుకే అవంటే మాకు ప్రాణం! ) WHEN COWS FLY: A Swiss farmer decided to use a helicopter to airlift one of his beloved bovines down the mountain. The farmer says the cow had been walking with a limp and he didn't want to risk further injury to the animal. https://t.co/HSjcKh5oy6 pic.twitter.com/5qZgRdcWWs — ABC News (@ABC) August 19, 2020 -
ఆన్లైన్ చదువు కోసం ఆవు అమ్మకం
పాలంపూర్: తమ ఇద్దరు పిల్లల ఆన్లైన్ పాఠాల కోసం, కుటుంబానికున్న ఏకైక జీవనాధారమైన ఆవుని రూ.6,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్వాలాముఖిలోని గుమ్మర్ గ్రామానికి చెందిన కుల్దీప్ కుమార్కు. కుల్దీప్ పిల్లలు అన్నూ నాల్గవ తరగతి, డిప్పు రెండవ తరగతి చదువుతున్నారు. మార్చి నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో పాఠశాలలు మూత పడ్డాయి. ఆన్లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయి. చదువు కొనసాగించాలంటే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల్సిందేనని కుల్దీప్పై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. ఎవ్వరూ రుణం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో విసిగిపోయిన కుల్దీప్ తన బిడ్డల చదువుకోసం తన ఏకైక జీవనాధారమైన ఆవుని ఆరువేల రూపాయలకు అమ్ముకొని, పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిపెట్టారు. విషయం తెల్సి జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ దావ్లా విస్మయం వ్యక్తంచేశారు. తక్షణమే కుల్దీప్కి ఆర్థిక సాయం చేయాల్ సిందిగా స్థానిక బీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. -
ఆ కథనంపై చలించిన సోనూసూద్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభం నుంచి వలస కార్మికులను గట్టెక్కించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. బిడ్డల స్మార్ట్ (ఆన్లైన్) చదువుల కోసం ఆవును అమ్ముకున్న వ్యక్తికి సాయం చేసేందుకు సూపర్హీరో ముందుకు వచ్చారు. స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేందుకు కుటుంబ జీవనాధారమైన ఆవును అమ్ముకున్నాడన్న మీడియా కథనాలపై చలించిన సోనూ సూద్ సంబంధిత వ్యక్తికి ఆవును తిరిగి ఇచ్చేద్దాం..వివరాలు కావాలంటూ ట్విటర్ ద్వారా అభ్యర్థించారు. దీంతో సోనూపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (వారి కోసం సోనూసూద్ మరో గొప్ప ప్రయత్నం) కరోనా వైరస్,లాక్డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల నెత్తిన మరింత భారాన్ని మోపుతోంది. హిమాచల్ ప్రదేశ్, జ్వాలాముఖిలోని గుమ్మర్ గ్రామానికి చెందిన కుల్దీప్ కుమార్ తన పిల్లలను చదువు కొనసాగించాలనుకుంటే స్మార్ట్ఫోన్ అవసరమని ఉపాధ్యాయులు తెగేసి చెప్పారు. దీంతో 500 రూపాయలు కూడా లేని కుమార్ 6 వేల స్మార్ట్ఫోన్ కొనలేక ఇబ్బంది పడ్డాడు. చివరికి బ్యాంకులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. తనకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా పంచాయతీలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించు కోలేదు. ఇక చేసేదేమీలేక అతని ఏకైక ఆదాయ వనరు ఆవును అమ్మి మరీ 6 వేల స్మార్ట్ఫోన్ కొనివ్వడం పలువురిని కదిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ ధవాలా కుల్దీప్ కుమార్కు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. (పిల్లల కోసం ఆ కాస్త ఆసరా వదిలేశాడు!) Ravinder ji. Can you please share his details. https://t.co/dsKG4eCAmw — sonu sood (@SonuSood) July 23, 2020 इस जन्म में भी आपके भाई ही हैं मेरे भाई। https://t.co/w0WSbLxiDm — sonu sood (@SonuSood) July 23, 2020 -
స్మార్ట్ఫోన్ కోసం ఆవును అమ్మేశాడు
సిమ్లా : ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాస్ల పేరుతో పేద, మధ్యతరగతి తల్లితండ్రుల జేబులు గుల్లచేస్తున్నాయి. తమ ఇద్దరు చిన్నారుల ఆన్లైన్ క్లాస్ల కోసం స్మార్ట్ఫోన్ కొనేందుకు హిమాచల్ ప్రదేశ్లో ఓ వ్యక్తి తన జీవనాధారమైన ఆవును అమ్మిన ఉదంతం అందరినీ కలిచివేసింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో స్కూళ్లన్నీ విద్యార్ధుల కోసం ఆన్లైన్ క్లాస్ల బాట పట్టాయి. కాంగ్రా జిల్లా జ్వాలాముఖికి చెందిన కుల్దీప్ కుమార్ పిల్లలు స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఈ క్లాస్లకు హాజరు కాలేకపోయారు. నాలుగో తరగతి, రెండో తరగతి చదువుతున్న తమ పిల్లలు ఆన్లైన్ క్లాస్లకు హాజరవడంలో ఇబ్బందులు పడుతుండటంతో కుల్దీప్పై స్మార్ట్ఫోన్ కొనాలనే ఒత్తిడి పెరిగింది. పిల్లలు చదువు కొనసాగించాలంటే స్మార్ట్ఫోన్ తప్పనిసరని ఉపాధ్యాయులు సైతం కుల్దీప్కు సూచించారు. స్మార్ట్ఫోన్ కొనేందుకు తాను బ్యాంకులు, వడ్డీవ్యాపారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని కుల్దీప్ వాపోయారు. దిక్కుతోచని పరిస్థితిలో కేవలం 6000 రూపాయల కోసం తన జీవనాధారమైన ఆవును అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు. తాను తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జ్వాలాముఖిలో ఉంటానని, తనకు కనీసం రేషన్ కార్డు కూడా లేదని కుల్దీప్ పేర్కన్నారు. ఆర్థిక సాయం కోసం తాను పలుమార్లు పంచాయితీని సంప్రదించినా ఎలాంటి సాయం అందలేదని కుల్దీప్ ది ట్రిబ్యూన్కు వెల్లడించారు. ఈ ఉదంతంపై జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ ధవాలా స్పందిస్తూ కుల్దీప్ కుమార్కు సత్వరమే ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. చదవండి : ఆన్లైన్ విద్యతో లక్ష్యాలు నెరవేరేనా! -
ఆవుపై అత్యాచార ఘటనలో నిందితుడి అరెస్ట్
భోపాల్ : ఆవుపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. అతనిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4న మధ్యప్రదేశ్ సుందర్నగర్ ప్రాంతంలోని పశువుల పాడిలోకి చొరబడి సబ్బీర్ అలీ అనే 55 ఏళ్ల వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆవు రోదనలు విన్న ఇంటి యజమని అక్కడి వెళ్లి చూడగా నిందితుడు పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా ఆవుపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఘటనపై అశోక్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు భోపాల్ ఇన్చార్జి శ్రీ వాస్తవ అన్నారు. (తండ్రికొడుకుల మృతిపై సీబీఐ కేసులు నమోదు ) One 55-yr-old man arrested after CCTV footage showed that he was involved in unnatural sex with a cow at a dairy in Sundar Nagar. Incident took place at around 4 am on 4 July. Case registered. Accused arrested: A Srivastava, Ashoka Garden Police Station In-Charge, Bhopal. pic.twitter.com/DXN29nF01K — ANI (@ANI) July 7, 2020 -
ఆవుపైనా అమానుషత్వం
సిమ్లా: కేరళలో పైనాపిల్లో పేలుడుపదార్థాలు పెట్టి దాంతో ఏనుగును హతమార్చిన అమానవీయ ఘటనను మరువకముందే హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఆవు నోట్లో టపాసులు పెట్టి, అలాంటి దారుణానికే ఒడిగట్టారు దుండగులు. ఝన్దూతలోని ఓ సూడి ఆవు నోట్లో టపాసులు పెట్టి పేల్చడంతో ఆవుకి తీవ్రగాయాలయ్యాయి. నోరంతా రక్తసిక్తమైన ఆవు ఏమీ తినలేక అవస్థపడుతోంది. ఆవు యజమాని గురు దయాళ్æ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్గా మారింది. ఆవుపై దాడికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆవు యజమాని కోరారు. ఈ ఘటనకు తన పొరుగున నివసించే నందాలాల్ కారణమని ఆరోపించారు. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. యానిమల్ క్రూయాలిటీ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్లో టపాసులు పెట్టిన పైనాపిల్ తినడంతో ఏనుగు మరణించిన ఘటన తర్వాత యానిమల్ క్రూయాలిటీ యాక్ట్ను చేశారు. పేలుడు ధాటికి ఏనుగు తీవ్రంగా గాయపడటంతో కొన్ని రోజులపాటు ఏమీ తినలేక, నొప్పి నుంచి ఉపశమనం కోసం నీటిలోనే ఉండి చనిపోయింది. ఈ ఘటనలో సంబంధం ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఘోరం: అప్పుడు ఏనుగు.. ఇప్పుడు ఆవు
సిమ్లా : నోరులేని మూగ జీవాలపై మనుషుల దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేరళ ఏనుగు ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన ఒకటి హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. పేలుడు పదార్ధాల కారణంగా గర్భంతో ఉన్న ఓ ఆవు నోరు ఛిద్రమైంది. పదిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్, బిలాశ్పూర్ జిల్లా జాన్దుతా ప్రాంత వాసి గురిదాల్ సింగ్కు చెందిన ఆవు అక్కడి మైదానంలో గడ్డి మేస్తోంది. ఈ నేపథ్యంలో గడ్డిలో ఉన్న పేలుడు పదార్థాన్ని అది కొరకటంతో నోటిలోనే పేలింది. ( గర్భిణి ఏనుగు మృతి: వెలుగులోకి కొత్త విషయం) దీంతో ఆవు నోరు తీవ్రంగా ఛిద్రమైంది, దవడ భాగం బాగా దెబ్బతింది. తన ఆవు గాయపడటానికి కారణం పొరిగింటి నందలాలేనని దాని యాజమాని సింగ్ ఆరోపిస్తున్నారు. ఉద్ధేశపూర్వకంగానే అది గడ్డి తినే చోట పేలుడు పదార్థాలు ఉంచినట్లు తెలిపాడు. ఆవు గాయపడిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో వీడియో కాస్తా వైరల్గా మారి ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు ‘యానిమల్ క్రూయాల్టీ యాక్ట్’కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.(ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్ నిజాలు) -
ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం
లక్నో: వివాహాలకు 50, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయం విదితమే. కానీ ఇక్కడ మాత్రం ఓ గోవు అంత్యక్రియలకు వందలాది జనాలు తరలి వచ్చి లాక్డౌన్ నిబంధనలను తుంగలో తుక్కారు. ఉత్తర ప్రదేశ్లోని అలీఘర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. అలీఘర్లోని మెమ్దీ గ్రామంలో దినేశ్ చంద్ర శర్మ అనే వ్యక్తికి చెందిన ఆవు గురువారం మరణించింది. దానికి అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించాలని గ్రామస్థులు తలిచారు. అనుకున్నదే తడవుగా 150 - 200 మంది జనాలు ఊరేగింపుగా బయలు దేరారు. (5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు) కనీసం మాస్కు ధరించకుండా, సామాజిక ఎడబాటును సైతం పట్టించుకోకుండా వీధులు, రోడ్ల వెంబడి తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన పోలీసులు ఆవు అంత్యక్రియల్లో పాల్గొన్న సుమారు 150 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో వంద మంది మహిళలే ఉండటం గమనార్హం. ఇక ఈ ఘటనపై ఆవు యజమాని శర్మ మాట్లాడుతూ.. "అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వచ్చినవారిని ఎలా అడ్డుకోగలను? నేను ఆవును ఖననం కోసం తీసుకెళుతుంటే గ్రామస్థులూ వచ్చారు. ఇందులో తప్పేముంది? అయిన్పటికీ దీన్ని తప్పుగా పరిగణించి మాపై చర్యలు తీసుకుంటానంటే అందుకు సిద్ధమే"నని బదులిచ్చాడు. (ప్లాట్ఫామ్పై ఆహార పొట్లాలు.. ఎగబడ్డ జనం!) -
గోవు అంత్యక్రియలు: గుంపులుగా జనం
-
పులి ఆవును తింటే శిక్షించరా..?
పనాజీ : పులుల సంహారంపై గోవా అసెంబ్లీ చర్చిస్తున్న క్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనుషులు ఆవులను తింటే శిక్షిస్తున్న తరహాలోనే ఆవులను భక్షించే పులులను కూడా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు. గత నెలలో మహాధాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పులిని దాని పిల్లలను స్ధానికులు చంపిన అంశాన్ని గోవా అసెంబ్లీలో విపక్ష నేత దిగంబర్ కామత్ ప్రస్తావించారు. ఈ దశలో అలెమావో జోక్యం చేసుకుని పులి ఆవును భక్షిస్తే ఏ శిక్ష విధిస్తారని ప్రశ్నించారు. మనిషి ఆవును తింటే శిక్షిస్తున్నారు..మరి వన్యప్రాణుల విషయంలో పులులు ప్రాధాన్యమైతే..మనుషులకు సంబంధించి ఆవులకే ప్రాధాన్యం అంటూ అలెమావో అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మనిషి కోణంలో ఆలోచించడాన్ని విస్మరించరాదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. సీఎం ప్రమోద్ సావంత్ ఈ అంశంపై స్పందిస్తూ పులి పిల్లలు తమ పశుసంతతిపై దాడి చేయడంతో స్ధానికులు వాటిని చంపారని చెప్పారు. జంతువుల దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు మూడు నాలుగురోజుల్లో పరిహారం అందచేస్తామని ఆయన వెల్లడించారు. చదవండి : మంత్రి పేరుతో గోవాలో జల్సా.. -
జైళ్లలో గోశాలలు ఏర్పాటు చేయాలి : మోహన్ భగత్
సాక్షి, పుణె : ఖైదీలలో మానసిక పరివర్తన కోసం దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అభిప్రాయపడ్డారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. శనివారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆవుల పెంపకం వల్ల ఖైదీల మానసిక స్థితిలో మార్పును తీసుకురాగలిగామని కొందరు జైలర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ పద్ధతిని దేశంలో ఉన్న అన్ని జైళ్లలో అమలు పరచాల్సిన అవసరం ఉంది. ఖైదీల మానసిక పరిస్థితిని ఆవుల పెంపకానికి ముందు, ఆ తర్వాత ఎలా ఉందనేది మానసిక నిపుణులతో శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలి. ఆ తర్వాత వాటిని రికార్డు చేసి డాక్యుమెంటేషన్ చేయాలి. ఇలా వేలాది జైళ్ల నుంచి ఒకే రకమైన ఫలితాలతో రిపోర్టులు వస్తే అది ఒక వాస్తవంగా అంతర్జాతీయ సమాజం ముందు ఆవిష్కరించవచ్చ’ని తెలిపారు. మరోవైపు ఆవు పట్ల విదేశీయుల ధృక్కోణాన్ని వివరించారు. ఆవు అంటే పాలు, మాంసం కోసం పెంచుకునేదిగా విదేశీయులు భావిస్తారని, అదే భారతీయ సంస్కృతిలో ఆవు పట్ల ప్రజలు మానసిక బంధం ఏర్పరచుకుంటారని వెల్లడించారు. దానికి ఉదాహరణగా మన దేశంలో ఆవును వాణిజ్య వస్తువుగా చూడరని, ఆవు సంబంధిత ఉత్పత్తులను అమ్ముకోరని తెలిపారు. ఆవు ప్రాముఖ్యత తెలిసిన మన పూర్వీకులు రసాయన ఎరువులు లేకుండా ఆవు పేడతో వ్యవసాయం చేసేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రజలు ఆవుల సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
అమెరికాలో పిడకల వేట!
మన గొప్పదనమేమిటో అమెరికా వాడు గుర్తించేదాకా మనకు తెలియదు కదా. ఈ మాట మరోమారు రుజువైంది. అక్కడ అమ్ముతున్న కౌ–‘డంగ్’ కేక్ను చూసి ఇప్పుడు యావత్ ప్రపంచ ప్రజలంతా ‘డంగై’పోతున్నారు. ‘ఉదరపోషణార్థం బహుకృత వేషమ్’ అనే సామెత మనమందరమూ విన్నదే. ఉదరం లేకపోయినా పేడ కూడా చాలా వేషాలే వేస్తుంటుంది. నీళ్లలోకి జారి కళ్లాపి (సాన్పి) అవుతుంది. గోడకు చేరి పిడకవుతుంది. ముగ్గులో దిగి గొబ్బెమ్మవుతుంది. చేనుకు చేరి చేవవుతుంది. ఎందరెందరో ఉదరాలు నింపడానికిలా పాపమది ఇన్ని వేషాలూ వేస్తుంది. అంతేకాదు.. పవిత్రమైంది పేడ. అందునా ఆవుపేడ. ‘కాదేదీ మార్కెట్కనర్హం’ అన్న మాట తెలిసిందే.మరి ఓ హీరో రెండు వేషాలేసి, డబుల్ యాక్షన్ చేసి, పాన్–ఇండియా ఫిల్మ్ తీస్తేనే బాక్సాఫీసు బద్దలవుతుందే... అలాంటిది మరి ‘పేడ’? పైన చెప్పిన వేషాలన్నీ వేసి పాన్–అమెరికన్ అయిపోయాక... మరెన్ని కాసులు కురిపిస్తుందో ఊహించండి. అదలా కాసుల వర్షం కురిపించగలదని గుర్తించేశారు అమెరికన్ మార్కెటీర్లు. అంతే... పవిత్ర క్రతువుల్లో వాడటానికి వీలుగా పిడకలు తయారు చేశారు. వాటిని న్యూజెర్సీలోని ఓ పెద్ద మాల్లో అమ్మకానికి పెట్టారు. ధర కూడా చాలా సరసమే. పది పిడకల పాకెట్ 2.99 డాలర్లు. అంతే... ఇక ఇప్పుడీ కౌడంగ్ కేక్లు హాట్కేకుల్లాగా అమ్ముడవుతున్నాయట. ఈ న్యూస్ ఇంటర్నెట్లోకి రాగానే నెటిజన్లు ఎన్నో జోకులు విసురుకుంటున్నారు. మనకు నచ్చని హీరో పోస్టర్ మీద పేడ విసరడం మనకలవాటే కదా. అలాగే... కుకీలను నిరసిస్తూ... కేకుల్ని బాగా ఇష్టపడే ఒకాయన... ‘‘నా మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటిని కౌడంగ్ కుకీస్ అని పిలవండి. కేక్లు అనకండి’’ అంటూ ఫేస్బుక్ గోడమీదికి పేడ విసరనే విసిరాడు. ఇంకో ఆయన శంకరాభరణం శంకరశాస్త్రిగారిలా కండువా సవరించుకుంటూ... ‘పవిత్రమైన ఆవు పేడ ఒకలా ఉంటుంది. తుచ్ఛమైన ఆ మ్లేచ్ఛావు పేడ మరోలా ఉంటుంది. ఒక్కొక్క పేడకు ఒక్కొక్క నిర్దిష్టమైన పర్పసుంది. పనుంది. ఇంతకీ అక్కడ అమ్ముతున్నది పవిత్రమైన గోమాత పేడేనా... లేక సంకరజాతి పశువుల పేడా?’’ అంటూ విసుక్కుంటూ విసుర్లు విసురుతున్నాడు. వాళ్లంతే... వాళ్లంతే... ప్రతిదీ మార్కెట్ దృష్టితోనే చూస్తారు. కానీ... మన పేడ మనకెంత గొప్పది? పశువుల కొట్టంలో పశువులూ, ఆవులు పేడ వేయగానే చెక్కదంతితో సిబ్బి లోకి లాగేసి కుప్ప మీద వేస్తారు. తొలకరికి కాస్తంత ముందుగా పొలానికి తరలించి సారంగా మార్చేస్తారు. గరిసెలోని ధాన్యానికి చీడ పట్టకుండా పేడ రాసేస్తారు. పండగ ముందు రోజున ఇల్లలికేస్తారు. గంపా, గరిసే, తట్టా, బుట్టా, తడకా, చేటా... ప్రతిదానికీ రాసి చీడపీడల నుంచి కాపాడతారు. పండగ ముందు రోజున అలకాల్సిన మన వసారా పేడకుప్పలు రాసుకుని ఎలా ఉంటుంది? అచ్చం భూమాత తన తలకు హెన్నా పెట్టుకున్నట్టుంటుంది. ఆ మర్నాడు తలస్నానం చేశాక జుట్టు మెరిసినట్టుగా... మన గచ్చూ మిలమిలలాడుతుంటుంది. ఆ పేడ అలికిన గచ్చు ఇకపై ప్రతిరోజూ చక్కగా, చల్లగా మన పాదాలకి ముద్దెడుతూ, అడుగులకు మడుగులొత్తుతూ ఉంటుంది. ఇప్పుడీ పిడకలవేట గురించి మనం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే... ‘చూశారా... అమెరికావాడెంత వ్యాపారదక్షుడో!’ అంటూ అచ్చెరువొందడానికి. ఒక్క పిడక గురించి తెలిసినందుకే ఇంత మార్కెటింగ్ అయితే... ఈ విషయాలన్నీ ఎవరైనా విడమరిచి చెబితే... ఇంకేముందీ? ఇకనుంచి ‘బుల్షిట్’ అంటూ విసుక్కోవడం మానేస్తాడేమో. పేడకు పేటెంట్ అడిగేస్తాడేమో! పేడ తాలుకు కంటెంటంతా తనదే అనేస్తాడేమో!! – యాసీన్ -
పగబట్టిన పేగుబంధం!
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల జరిగిన సంఘటన జంతువుల్లో పేగుబంధం ఎంత బలమైందో చాటిచెబుతోంది. లక్ష్మీటాకీస్ సెంటర్లో గత నెల 29న గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగ దూడ చనిపోయింది. తల్లి ఆవు రోజంతా బిడ్డ వద్దే పడుకుంది. చనిపోయిన ఆ దూడను మున్సిపల్ సిబ్బంది ఆదేశాలతో ఓ రిక్షా కార్మికుడు తీసుకెళ్లి ఖననం చేశాడు. అయితే ఇప్పుడు ఆవు ఆ రిక్షా కార్మికుడిపై పగబట్టింది. బిడ్డను తనకు కాకుండా తీసుకెళ్లిపోయాడని అనుకుందో ఏమో ఆ కార్మికుడు ఎక్కడ కనిపించినా కొమ్ములతో పొడిచేస్తోంది. గురువారం రాత్రి బస్టాండ్ సెంటర్లో కన్పించిన ఆ రిక్షావాలాపై దాడి చేసి కిందపడేసింది. స్థానికులు వచ్చి రక్షించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ ఆవు బారి నుంచి ఎలా బయటపడాలా? అని రిక్షా కార్మికుడు తలపట్టుకుంటున్నారు. -
రిక్షావాలాపై దాడి చేసిన ఆవు
-
బాదం పాలకన్నా ఆవు పాలే భేష్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా శాఖాహార ప్రచారం పెరిగిపోవడంతో జంతుజాలానికి చెందిన ఆవు పాలకు కూడా దూరంగా ఉండాలంటూ శుద్ధ శాకాహారుల ఉద్యమం ఇంగ్లండ్తోపాటు భారత్లోనూ ఊపందుకుంది. బాదం, ఓట్స్, సోయా తదితర మొక్కల మూలాల నుంచి వచ్చే పాలను రోజూ తాగినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండవచ్చనే ప్రచారం కొనసాగుతోంది. దాంతో పలు కార్పొరేట్ కంపెనీలు కూడా అందమైన బాటిళ్లలో ప్లాంట్ బేస్డ్ పాలను సరఫరా చేస్తున్నాయి. అయితే ఇవేవి కూడా ఆవు పాలంత శ్రేష్టమైనవి కావని కేమ్బ్రిడ్జ్ యూనివర్శిటీలో బయో మెడికల్ సైన్స్లో పీహెచ్డీ చేసిన డాక్టర్ అలెక్సీస్ విల్లెట్ తన పరిశోధనల సాక్షిగా తెలిపారు. ఆవు పాలకు, గింజల నుంచి తీసే పాలకు విటమిన్స్, ప్రోటీన్స్ విషయంలో ఎంతో తేడా కూడా ఉందని ఆయన చెప్పారు. గింజల నుంచి తీసిన పాలలో కేవలం రెండున్నర శాతమే గింజ పదార్థం ఉంటుందని, మిగతా అంతా ఒట్టి నీళ్లేనని ఆయన చెప్పారు. శాకాహార పాలుగా పేర్కొనే వీటిలో ఆవు పాలకన్నా కొలస్ట్రాల్ తక్కువ, కొవ్వు ఎక్కువే ఉన్నప్పటికీ ప్రొటీన్లు కూడా బాగా తక్కువని ఆయన తేల్చి చెప్పారు. మొక్కల్లో కాల్షియం, విటిమిన్ బీ ఉన్నమాట వాస్తవమేగానీ అది తక్కువ స్థాయిలో ఉంటుందని, వాటిని శరీరం ఇముడ్చుకోవడం కూడా కష్టమేనని డాక్టర్ విల్లేట్ చెప్పారు. బాదం, బీన్స్లలో కాల్షియం 20–25 శాతం ఉంటే, ఆవు పాలలో 30 శాతం కాల్షియం ఉంటుందని, పైగా అది సులభంగా రక్తంతో కలుస్తుందని చెప్పారు. ఆవు పాలలో అదనంగా డీ విటమిన్ కూడా ఉంటుందని ఆయన చెప్పారు. మొత్తంగా తక్కువ ఆవు పాలలో ఎక్కువ పోషకాలు, ఎక్కువ శాకాహార పాలల్లో తక్కువ పోషకాలు ఉంటాయని, ఏ విధంగా చూసిన ఆవు పాలే అన్ని విధాల శ్రేష్టమైనవని ఇటీవల రాసిన ఓ సైన్స్ వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. -
ప్రయాణం చేసొచ్చాయి; జాగ్రత్త : మంత్రి హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట : రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధరతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుందని ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో ఆయన 200 మంది రైతులకు పాడి ఆవులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆవులు మంచి సెంటిమెంట్ అని ఏ పూజ చేసినా, పుణ్యకార్యం చేసినా గోపూజ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆవులను తరలించామని, అలసిపోయుంటాయి కాబట్టి రైతులు వాటికి వేడి నీళ్లతో స్నానం చేయించాలని సూచించారు. లక్ష రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఆవులకు తగిన ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఒక ప్రక్రియలా నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించిన నియోజకవర్గ రైతులను హరీష్రావు సన్మానించారు. -
అటెండెన్స్ ప్లీజ్! అంటున్న ఆవు
ముంబై: అటెండెన్స్ ఇవ్వడానికి ఆలస్యమైపోతున్న విద్యార్థిలా ఓ ఆవు నేరుగా తరగతి గదిలోకే వెళ్లింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడి విద్యార్థులు షాక్ అవగా.. ఆవు మాత్రం ఉపాధ్యాయిలా దర్జాగా క్లాస్ రూమ్ అంతా తిరిగి ఇన్విజిలేటర్లా బయటకు వెళ్లిపోయింది. విద్యార్థులు దాన్ని తరిమే ప్రయత్నం చేసినప్పటికీ అది ఆ గది చుట్టూనే తిరుగుతూ ప్రదక్షిణలు చేయసాగింది. ఈ అరుదైన ఘటన ఐఐటీ బాంబే క్యాంపస్లో జరిగింది. బయట తీవ్ర వర్షం కురుస్తుండటంతో దానికి ఎటు వెళ్లాలో తెలీక సరాసరి క్యాంపస్ గదిలోకే వచ్చిందని అక్కడి విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారిన ఈ వీడియోకి సరదా కామెంట్లు వెల్లువెత్తాయి. ‘జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఇదెలా పాసయిపోంది’ అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పరీక్ష రాయకుండా దీన్ని ఎలా రానిచ్చారు’ అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఐఐటీలో ఇలాంటి ఘటనలు జరగడం వింతేమీ కాదు! గతంలో పశువుల మంద ఐఐటీ క్యాంపస్లో సంచరించగా, ఓ చిరుతపులి సైతం వర్షానికి జడిసి ఐఐటీలో ఆశ్రయం పొందిన సంగతి విదితమే..! Cow entering IIT BOMBAY without clearing JEE Advanced?? 🐄🐄🐄. A cow entering an IIT Bombay classroom 😂 pic.twitter.com/i7taJ2TPOd — Mayur Borkar (@imayurborkar) July 29, 2019 -
జాతీయ జంతువుగా గోమాత
పెందుర్తి: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ ప్రతిపాదించారు. గోవుల పరిరక్షణకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా నడుం బిగించాలని కోరారు. చాతుర్మాస్య దీక్షా యాత్రలో భాగంగా ఆదివారం రుషికేష్ శారదాపీఠంలో సాధుసంతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ రుషికేష్, హరిద్వార్లో నివసించే స్వాములు ఈ తపో భూమికే అంకితం కాకుండా యావత్ భారతదేశం పర్యటిస్తూ హిందూధర్మ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. గోహత్యలు జరగకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరభారతంలో హిందూధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో సదస్సులో చర్చించారు. పలు ఆధ్యాత్మిక విషయాలపై సందేహాలను స్వామీజీ నివృత్తి చేశారు. అనంతరం స్వాములు, సాధుసంతులకు బండారా (అన్నదానం) ఏర్పాటు చేశారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి అందరికీ నూతన వస్త్రాలు, విశేష దక్షిణ అందజేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తరఫున రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆయనకు కుమారుడు ఎమ్మెల్యే సతీష్ స్వామీజీకి నూతన వస్త్రాలు అందజేశారు. పవిత్ర గంగాతీరంలో ప్రత్యేక పూజలు ఆచరించారు. తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. వచ్చే జవవరిలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్లో నిర్వహించే అశ్వమేధ యాగంలో పాలుపంచుకోవాలని స్వామీజీని ఆహ్వానించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాఘవేంద్రరావు, రంగారావు, డాక్టర్ ఓంప్రకాశ్, ఎలక్షణ్రెడ్డి, ప్రసాద్ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. -
ఆవును ఆవహించిన ఫుట్బాలర్.. వీడియో!
క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్గా మారింది. ఆవు ఫుట్బాల్ ఆడుతున్న వీడియోను ఆయన తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. నవ్వు తెప్పించే ఈ వీడియో చూడండి అంటూ క్యాప్షన్ పెట్టారు. నిజంగానే ఈ వీడియోలోని దృశ్యాలు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన దగ్గరకు వచ్చిన ఫుట్బాల్ను వదిలిపెట్టకుండా ఆటగాళ్లతో పాటు చేసిన ఆవు విన్యాసాలు తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియోకు 74 వేల లైక్లు, 2,500 కామెంట్లు వచ్చాయి. 24 మంది రిట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. గత జన్మలో ఈ ఆవు ఫుట్బాలర్ అని ఒకరంటే, ఫుట్బాలర్ ఆత్మ ఆవులోకి ప్రవేశించిందని మరొకరు వ్యాఖ్యానించారు. ఫుట్బాల్ను తన దూడగా భావించి కాపాడుకునేందుకు ఆవు అలా చేసిందని ఇంకొరు అభిప్రాయపడ్డారు. బెస్ట్ మిడ్ ఫీల్డర్ మరొకరు కితాబిచ్చారు. ఫుట్బాల్ను పుచ్చకాయ అనుకునివుండొచ్చని ఆవు పొరబడిందని కూడా కామెంట్ చేశారు. అయితే వీడియోలో ఉన్నది ఆవో, ఎద్దో స్పష్టంగా కనబడటం లేదు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలేమి లేవు. -
ఆవు దెబ్బకు పరుగులు పెట్టిన మంత్రి
సాక్షి, చెన్నై : కుంభకోణం ఆలయంలో శనివారం మంత్రి దురైకన్నును ఓ ఆవు పరుగులు తీయించింది. వర్షం కోసం శనివారం అన్నాడీఎంకే ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో యాగం నిర్వహించారు. కుంభకోణం కుంభేశ్వరన్ ఆలయంలో శనివారం యాగం జరిగింది. ఇందులో వ్యవసాయశాఖా మంత్రి దురైకన్ను, అన్నాడీఎంకే నిర్వాహకులు పాల్గొన్నారు. యాగం జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభం సమీపానికి ఒక ఆవు, దూడను తీసుకువచ్చి గోపూజ జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వంద మందికి పైగా గుమికూడారు. ఈ గుంపును చూడగానే ఆవు బెదిరిపోయింది. మంత్రి దురైకన్ను ఆవుకు నమస్కరించి గోపూజ జరిపేందుకు నిర్ణయించారు. ఆయన ఆవు వద్దకు వెళుతుండగా ఆయన వెంట అన్నాడీఎంకే కార్యకర్తలు వెళ్లారు. గమనించి ఆవు పరుగులు తీసింది. తనను ఢీకొనేలా వస్తున్న ఆవును చూసి మంత్రి దురైకన్ను భయంతో పరుగులు తీశారు. ఆ ఆవును తీసుకువచ్చిన వ్యక్తి తాడును పట్టుకుని ఆవు వెంట పరుగెత్తాడు. అయినప్పటికీ ఆవు తాడు వదిలించుకుని పరుగుతీసింది. ఇందులో అన్నాడీఎంకే కార్యకర్త తిరువిడైమరుదూర్ విఘ్నేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తర్వాత జరిగిన యాగంలో కూడా మంత్రి భయంతోనే పాల్గొన్నారు. -
అమ్మదనం.. అపూర్వం
బైరెడ్డిపల్లె :అమ్మదనం.. సృష్టిలో అపూర్వమైనది. అనిర్వచనీయమైనది. ఇందులో జంతువులకూ మినహాయింపు ఉండదు. మండలంలోని పిచ్చిగుండ్లపల్లె గ్రామానికి చెందిన సుబ్బన్న పాడిఆవు ఇటీవల ఓ దూడకు జన్మనిచ్చింది. అయితే సుబ్బన్న ఇంటి వద్ద కాపలాగా ఉన్న శునకం ఆ దూడతో చనువుగా ఉండేది. దీంతో పాడిఆవు వద్ద దూడతో పాటు శునకం కూడా వెళ్లి పాలు తాగుతోంది. అయినా ఆవు కుక్కను పక్కకుతోసేయడం లేదు. దీన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న వేటగాళ్లు
-
గోవుల కమిషన్కు ఆమోదం
న్యూఢిల్లీ: ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధి కోసం కొత్తగా ఓ కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ పేరుతో ఏర్పాటయ్యే ఈ కొత్త కమిషన్ ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధికి సబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుందనీ, దీని ద్వారా దేశీయ జాతులకు చెందిన పశుసంపద పెరుగుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు. రైతులు, మహిళల ఆదాయం పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయ మార్కెట్ మౌలిక నిధి (ఏఎంఐఎఫ్)ను రూ. 2 వేల కోట్లతో సృష్టించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. నాబార్డ్ ద్వారా సృష్టించే ఈ నిధి గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, క్రమబద్ధీకరించిన హోల్సేల్ మార్కెట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడనుంది. సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణకు ఆమోదం సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 10 లక్షల వరకు జరిమానా లేదా ఈ రెండూ కలిపి విధించాలని ప్రతిపాదించారు. దీనిద్వారా హరియాణాలో ఉన్న ఎన్ఐఎఫ్టీఈఎం, తమిళనాడు తంజావూరులోని ఐఐఎఫ్పీటీలకు జాతీయ విద్యా సంస్థల హోదా లభిస్తుంది. ప్రసార భారతికి వచ్చే మూడేళ్లలో వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల కోసం రూ. 1,054 కోట్లను కేటాయించనున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో సవరించిన ఆఫీస్ మెమొరాండం (ఓఎం)కు ఆమోదం తెలిపింది. -
అదృష్టం కలిసి వస్తుందని...
సంక్రాంతి అంటేనే ముఖ్యంగా రైతన్నల పండుగ. పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకొనే తొలి పండుగ కావడంతో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకొంటారు. అందమైన రంగవల్లులు, డూడూ బసవన్నల ఆటలు, పతంగుల విహారాలు, హరిదాసుల గానామృతంతో పల్లెలు పరవశిస్తుంటాయి. పంటను పండించే క్రమంలో కర్షకుడికి చేదోడువాదోడుగా ఉండే ఎద్దులు, గోమాతలను అందంగా అలంకరించి పూజించుకుంటారు. అంతేకాకుండా ఎడ్ల బండ్లను తిప్పే కార్యక్రమంతో సందడి తెలుగు రాష్ట్రాల రైతన్నలు సందడి చేస్తే.. కోడి పందాలతో పందెం రాయుళ్లు హల్చల్ చేస్తుంటారు. ఇదే తరహాలో బెంగళూరులో కూడా మకర సంక్రాంతి రోజును ఘనంగా జరుపుకొంటారు. తమ పంటలకు, పశువులకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటూ తరతరాలుగా అగ్నిపై నుంచి పశువులను దాటించే ఆచారాన్ని పాటిస్తారు. ఇందులో భాగంగా గోమాతలకు పూలమాలలు అలంకరించి, మెడలో గంటలు కడతారు. ఆ తర్వాత కొంతమంది యువకులు కలిసి మంటలపై నుంచి వాటిని దాటిస్తారు. ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని, పంటలు బాగా పండుతాయని అదే విధంగా పశుపక్ష్యాదులు ఆరోగ్యంగా ఉంటాయని వారు నమ్ముతారు. ఇక పొంగల్ వేడుకల్లో భాగంగా సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టును తమిళ తంబీలు ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. -
పాలు పితికితే రక్తమొస్తోంది!
విశాఖ , నర్సీపట్నం: ముందు చూపు లేకుండా వ్యవహరిస్తే నిధులు వృథా కాక తప్పదనడానికి ప్రభుత్వం చేపట్టిన పాడి పశువుల పంపిణీయే ఓ ఉదాహరణ. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్కు పాడి రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రుణాలు మంజూరు చేయాలంటే తప్పనిసరిగా పాడి పశువును లబ్ధిదారులు కొనుగోలు చేసి చూపిస్తే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఈ కారణంగా పాడి రైతులు ఆసక్తి చూపకపోవడంతో కార్పొరేషన్ నిధులు మురుగుపోతున్నాయి. వీటి కొనుగోలు బాధ్యతను ప్రభుత్వం పశుసంవర్థకశాఖ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు వారు పంజాబ్, హర్యానా, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి పాడి పశువులను ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేసి తీసుకువచ్చారు. వీటిలో మేలురకానికి బదులు నాసిరకం పశువులు ఎక్కువగా ఉన్నాయి. కొనుగోళ్లలో అక్రమాలు జిల్లాలో 2,200 పాడి పశువులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 12 వేల పశువులు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో లొసుగులు చోటుచేసుకున్నాయి. అధిక సంఖ్యలో కొనుగోలు చేయాల్సి ఉండటంతో పొరుగు రాష్ట్రాల్లో గేదెలు, ఆవులకు డిమాండ్ పెరిగింది. అందువల్ల ధర కూడా ఎక్కువగా ఉందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి తీసుకువచ్చిన పశువుల్లో అధికశాతం అనారోగ్యంతో కూడినవి కూడా ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారు. పశువైద్యాధికారులు ఒత్తిడి మేరకు తీసుకువెళ్లిన రైతులు వాటితో ఇబ్బందులు పడుతున్నారు. పాల ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగా ఉన్నందున ఏంచేయాలో దిక్కుతోచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు నుంచి 8 లీటర్లు పాలిచ్చే పశువులను లబ్ధిదారులకు అందించాలి. వసతుల్లేని కెసాసిటీ కేంద్రం నర్సీపట్నం పరిసర ప్రాంతాల విషయానికొస్తే పెదబొడ్డేపల్లి మార్కెట్యార్డులో కెసాసిటీ కేంద్రం ఏర్పాటుచేశారు. ఇతర రాష్ట్రాలనుంచి తీసుకువచ్చిన పశువులను ఇక్కడ పదిరోజులపాటు పశువైద్యాధికారుల పరిశీలనలో ఉంచుతున్నారు. అయినా వాటి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అరలీటరు, లీటర్కు మించి పాలు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక్కడ వాటికి సరియైన దాణా అందించకపోవడం వల్ల బక్కచిక్కి పోతున్నాయి. కనీస సౌకర్యాలు కూడా లేవు. నర్సీపట్నం కెపాసిటీ కేంద్రం నుంచి నాలుగు రోజులక్రితం తీసుకువెళ్లిన రెండు గేదెలకు పాలు తీస్తుంటే రక్తం వస్తోందని గొలుగొండ మండలం అనంతసాగరం గ్రామానికి చెందిన లింగేటి చినగంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. గేదెలకు బదులు ఆవులు ఇస్తుండటంతో కొయ్యూరు మండలం చీడిపాలెం గ్రామానికి చెందిన బాలరాజు తిరస్కరించారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాయితీ పశువుల పంపిణీలో కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. పది రోజుల పాటు కెపాసిటీ కేంద్రాల్లో ఉంచి పశువులు కోలుకున్న తరువాత రైతులకు ఇస్తున్నాం. రైతులు పాలు పితికి చూసుకున్న తరువాతే తీసుకువెళ్తే ఇబ్బందులు ఉండవు. పాలు ఇవ్వని పశువులను వెనక్కి పంపించి, ఆరోగ్యంగా ఉన్న పశువులను తీసుకువచ్చి రైతులకు ఇస్తాం. మృతి చెందిన గేదెలకు బీమా వర్తింపజేస్తాం. – సీహెచ్ గణేష్, పశుసంవర్థకశాఖ ఏడీ, నర్సీపట్నం -
మోదీ ఓ ఎద్దు.. స్మృతి బలిష్టమైన ఆవు
మథుర: రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని ఆయన ఎద్దు–దూడ–బలిష్టమైన ఆవుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని కోసీకలాన్లో రైతులతో చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘తప్పుడు వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే ఐదేళ్ల తర్వాత మార్చగలిగే హక్కు ప్రజలకు ఉండటం నిజంగా ప్రజాస్వామ్యం గొప్పతనమే. మీ ఆవులు, ఎద్దులు, దూడలు ఈ మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వార్తాపత్రికల్లో చూస్తున్నాను. వాటిని మీరు స్కూళ్లు, కాలేజీ భవనాల్లో కట్టేస్తున్నారు. ప్రజలేమో వాటిని మోదీ–యోగి అని పిలుస్తున్నారు. మరికొందరేమో బాగా బలిష్టమైన ఆవు ఒకటి వచ్చిందని చెబుతున్నారు. స్మృతీ ఇరానీ కూడా ఈ మధ్య బాగా తిరుగుతున్నారు’ అని అజిత్ సింగ్ వ్యాఖ్యానించారు. -
‘తూర్పు’లో మూగజీవిపై లైంగికదాడి!
పిఠాపురం రూరల్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో గుర్తు తెలియని దుండగులు ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత రైతు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోకివాడ– బి.కొత్తూరు ప్రధాన రహదారి పక్కన గోకివాడకు చెందిన నామా బుచ్చిరాజుకు పశువుల మకాం ఉంది. శనివారం రాత్రి దుండగులు మకాంలో ఉన్న 3 నెలల చూడి ఆవును సమీపంలోని తాడిచెట్టుకు బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున రైతు బుచ్చిరాజు సమీపంలోని ఓ తాడిచెట్టు వద్ద కదల్లేని స్థితిలో పడి ఉన్న తన ఆవును గుర్తించాడు. తోటి రైతుల సాయంతో ఆవును బంధించిన తాళ్లను తొలగించాడు. ఆవు కదల్లేని స్థితిలో ఉండటం, దాని జననేంద్రియంపై రక్తపు గాయాలు కనిపించడంతో లైంగిక దాడి జరిగిందని రైతులు గుర్తించారు. దీంతో బుచ్చిరాజు కుమారుడు లక్ష్మీనారాయణ పిఠాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశువైద్య సిబ్బంది ఆవుకు వైద్య సేవలందిస్తున్నారు. సంఘటన స్థలంలో ఒక ఖాళీ మద్యం సీసా దొరికింది. దీన్ని బట్టి దుండగులు తాగిన మైకంలో ఈ అకృత్యానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. -
రాష్ట్రమాతగా గోవు.. అసెంబ్లీ తీర్మానం
ధర్మశాల : ఆవును రాష్ట్రమాతగా గుర్తిస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గోవును రాష్ట్రమాతగా ప్రకటించాలని బీజేపీ శాసనసభ్యుడు అనిరుధ్ సింగ్ ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర శాసనసభ శుక్రవారం అమోదించి, బిల్లును కేంద్రానికి పంపింది. ఆవు ఓ కులానికి, మతానికి చెందినది కాదని అది జాతి సంపదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వీరేంద్ర కన్వార్ అన్నారు. ఆవు పాలు ఇవ్వడం ఆపగానే వద చేయకూడదని, గో సంక్షణకు ప్రభుత్వం చర్యలను చేపట్టాలని పలువురు శాసన సభ్యులు కోరారు. కాగా గో సంరక్షణ పేరిటి రాజస్తాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆవుల అభయారణ్యా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆవును రాష్ట్రమాతగా గుర్తిస్తూ ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు దేశంలో తొలిసారి తీర్మానించారు. -
ఆవూ పోయే, ఆనందమూ పోయే
గోరక్షక మంత్రిత్వ శాఖ, హ్యాపీనెస్ శాఖ .. ఇవీ ఈ మధ్యకాలంలో కొత్తగా ఏర్పాటైన మంత్రిత్వ శాఖలు. వాటిని తొలిసారి నిర్వహించిన మంత్రులిద్దరూ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాజస్తాన్లో వసుంధరా రాజె కేబినెట్లో గోరక్షక మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసిన ఒటారమ్ దేవాసి 10 వేల ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి చేతిలో కంగుతిన్నారు. ఇక మధ్యప్రదేశ్ హ్యాపీనెస్ శాఖ మంత్రి లాల్సింగ్ ఆర్య కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో 25 వేల ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. గోసంక్షరణ ఉద్దేశం మంచిదే అయినా ఆ సాకుతో మూకదాడులకు పాల్పడటమే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2015లో గోరక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేవాసి రాజస్తాన్లో కొత్తగా ఆస్తులు కొనుక్కునే వారిపై గో పన్ను అంటూ 20 శాతం సర్చార్జ్ విధించారు. గోవుల్ని రక్షించడానికి 2,300 షెల్టర్లు ఏర్పాటు చేశారు. అయితే 2016లో ప్రభుత్వ గోశాలల్లో 500గోవులు ఆకలికి తాళలేక మరణించడంతో దేవాసిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకే విష ప్రయోగంతో మరిన్ని ఆవులు చనిపోయాయన్న వార్తలతో దేవాసి ప్రతిష్ట పూర్తిగా మంట గలిసింది. ఇక, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రజలు సంతోష స్థాయిలు పెంచడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్లో హ్యాపినెస్ మంత్రిత్వ శాఖను సీఎం శివరాజ్సింగ్ కొత్తగా సృష్టించి లాల్సింగ్ ఆర్యను మంత్రిగా నియమించారు. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసుకోవడం కోసం ఆర్య భూటాన్ తరహాలో సంతోష సూచీ తయారీకి మార్గదర్శకాలు రూపొందించారు. 2009లో జరిగిన తన ప్రత్యర్థి హత్యానేరం కేసు మెడకు చుట్టుకోవడంతో ఆర్య జీవితంలో సంతోషం లేకుండా పోయింది. -
జాతి పిత - మహాత్మ గాంధీ.. జాతి మాత..?
డెహ్రడూన్ : ఆవును గో మాతగా పూజించడం హిందూ సంప్రదాయం. కానీ త్వరలోనే ఆవు ఖాతాలో మరో రికార్డ్ చేరబోతుంది. ఆవును జాతీయ మాతగా గుర్తించాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీర్మానించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ పశు సంవర్ధక శాఖ మంత్రి రేఖ ఆర్య ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయం గురించి రేఖ ఆర్య మాట్లాడుతూ ‘చెట్లు కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుని, ఆక్సిజన్ని విడుదల చేస్తాయనే సంగతి తెలుసు. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆవులు ఆక్సిజన్ శ్వాసించడమే కాక.. ఆక్సిజన్న్నే విడుదల చేస్తాయి. అంతే కాకా గో మూత్రం చాలా శ్రేష్ఠమైనది. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాల తర్వాత ఆవు పాలు ఎంతో ఉత్తమం’ అంటూ ఆవులు, వాటి వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. చివర్లో ‘ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్న ఆవును జాతి మాత(మదర్ ఆఫ్ ద నేషన్)గా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా చేయడం వల్ల గో సంరక్షణ ప్రయత్నాలు మరింత బలపడతాయని రేఖా ఆర్య తెలిపారు. అందువల్లనే మేం ఆవును జాతి మాతా గుర్తించే బిల్లును ప్రవేశ పెట్టాం. ప్రతిపక్షం కూడా దీనికి పూర్తి మద్దతు తెలిపింది అని ప్రకటించారు. -
ఆ ఒక్క ఆవు
ఓ గ్రామంలో ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న దగ్గర తొంభై తొమ్మిది ఆవులు, తమ్ముడి దగ్గర ఒకే ఒక్క ఆవు ఉన్నాయి. తమ్ముడు ఆ ఒక్క ఆవు పాలు పితికి ఇంటికి అవసరమైనంత వాడుకుని మిగిలిన వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడుపుతున్నాడు. తొంభై తొమ్మిది ఆవులున్న అన్నయ్యకు మాత్రం తన దగ్గరున్న ఆవులకు మరొక ఆవును కలిపి వంద ఆవులకు యజమానిని అని చెప్పుకోవాలని తాపత్రయం. ఇందుకోసం తన తమ్ముడి దగ్గరున్న ఆ ఒక్క ఆవుని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఓ రోజు తమ్ముడి ఇంటికి వెళ్లాడు. ‘‘తమ్ముడూ.. నీదగ్గరున్న ఆ ఆవు కాస్తా ఉన్నట్టుండి తప్పిపోయిందనుకో ఏం చేస్తావు’’ అని అడిగాడు. అప్పుడు తమ్ముడు.. ‘‘ఏముంది.. కష్టంగానే అనిపిస్తుంది. ఉన్న కాస్త పొలంతోనే సరిపెట్టుకుంటాను’’ అన్నాడు. దాంతో అన్నయ్య ‘‘నిజమేరా నువ్వన్నది. నువ్వు ఒక ఆవును ఉంచుకోవడమూ, అసలు ఆవే లేకపోవడమూ ఒక్కటే. నన్ను చూడు. తొంభై తొమ్మిది ఆవులున్నాయి కదా, మరొక్క ఆవుగానీ ఉంటే నేను వంద ఆవులకు యజమానినవుతాను. ఆ మాట ఈ ఊళ్లో ఉన్నవారందరూ చెప్పుకోవాలని నా ఆశ’’ అని అన్నాడు. అందుకు ఆ తమ్ముడు ‘‘అవునన్నా.. అప్పుడు నిన్నందరూ వంద ఆవుల యజమాని అంటారు. కనుక నా దగ్గరున్న ఈ ఒక్క ఆవునీ నువ్వే తీసేసుకో.. నిన్నలా అనుకోవడం నాకానందమే’’ అని చెప్పాడు. అందుకోసమే ఎదురుచూస్తున్న అన్న ఎంతో ఆనందించాడు. జెన్ గురువులు ఈ కథను చెప్తూ మనిషి మనసు ఇలానే ఆలోచిస్తుంది. తమ దగ్గర ఎంత ఉన్నా సరే, ఇంకా ఇంకా కావాలనే కోరుకుంటుంది తప్ప తృప్తి పడదు. ఇలాంటి మనసు నరకం లాంటిది. అదే ఉన్న దానితోనే సంతృప్తి పడే వారి మనసు స్వర్గమే అవుతుంది. కాబట్టి మీరు మనసును స్వర్గధామం చేసుకోండి అని వారు చెప్పేవారు. – యామిజాల జగదీశ్ -
ఆవుతో మాట్లాడిస్తా..
చెన్నై : వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. జంతువులతో తాను మాట్లాడిస్తానని శాస్ర్తీయంగా దీన్ని నిరూపిస్తానని చెప్పారు. గోవులు మీతో తమిళం, సంస్కృతంలో మాట్లాడేలా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అత్యున్నత స్పృహ ద్వారా జంతువులకు భాషపై స్పృహ, మాట్లాడే వరం ప్రసాదించవచ్చని నిత్యానంద చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. శాస్త్ర ఆధారాలతో తాను దీన్ని నిరూపిస్తానని ఆయన అంటున్నారు. కోతులు సహా ఇతర జంతువులకు మనకు ఉన్నన్ని శరీర అవయవాలు లేకున్నా నిత్యచైతన్య శక్తిని ప్రేరేపించడం ద్వారా అవి ఆయా అవయవాలను పెంపొందించుకోగలుగుతాయని, శాస్త్రపరంగా, వైద్యపరంగా ఈ అంశాన్ని తాను రుజువు చేస్తానని చెప్పారు. ఏడాదిలోగా తాను దీన్ని ప్రజల ముందుకు తీసుకువస్తానన్నారు. తాను త్వరలోనే కోతులు, పులులు, సింహాల కోసం ఫోనెటిక్, భాషా సామర్థ్యమున్న వోకల్ కార్డును అభివృద్ధి చేస్తానన్నారు. మనతో సంస్కృతంలో, తమిళంలో స్పష్టంగా మాట్లాడే ఎద్దులు, ఆవులను మనం చూడబోతున్నామని చెప్పుకొచ్చారు. -
ఆవుతో అసహజ శృంగారం : నిందితుడి అరెస్ట్
భోపాల్ : హర్యానాలోని మెవాత్ జిల్లాలో మేకపై సామూహిక లైంగిక దాడి అనంతరం మధ్యప్రదేశ్లో ఒళ్లు గగుర్పొడిచే అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాజ్గఢ్ జిల్లా సుతాలియా ప్రాంతంలో ఆవుపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి స్ధానిక వ్యాపారి ఇంటికి తిరిగివస్తుండగా ఆవుపై ఓ ప్రబుద్ధుడు ఈ అసహజ లైంగిక దాడికి పాల్పడటం గమనించారు. నిందితుడిని ఛోటేఖాన్గా గుర్తించారు. గ్రామంలోని దేవాలయం సమీపంలో ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. ఛోటేఖాన్ దురాగతాన్ని తాను చూశానని, అతడిని వారించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రధాన నిందితుడి పక్కే మరికొందరు చోద్యం చూస్తూ ఉన్నారని వ్యాపారి మహేష్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ఘటనకు నిరసనగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. దర్యాప్తు అనంతరం నిందితుడిపై కఠిన చర్యలు చేపడతామని పోలీసులు స్ధానికులకు హామీ ఇచ్చారు. నిందితుడు ఛోటే ఖాన్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేశారు. -
మైలారంలో దేవుని ఆవుకు స్వర్గయాత్ర
నస్రుల్లాబాద్ నిజామాబాద్ : హిందువులు పవిత్రంగా కొలిచి గోమాతగా పిలుచుకునే పశువు ఆవు. మండలంలోని మైలారంలో ఎనిమిదేళ్లుగా ఇంటింటికి తిరిగిన ఆవు సోమవారం అకస్మాత్తుగా మృతి చెందింది. గ్రామంలోని శ్రీరాజరాజేశ్వరుని ప్ర తి రూపంగా గ్రామస్తులు కొలిచేవారు. అలాం టి మరణంతో కనుమరుగవుతుందని మైలారం వాసులు శోక సంద్రంలో మునిగారు. ఆ గోవు కు సోమవారం ఆరోగ్యం క్షీణించింది. దీంతో గ్రామపెద్దలు వెటర్నరీ డాక్టర్ను పిలిచి చికిత్స చేయించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు చెప్పడంతో అదేరోజు సాయంత్రం గోమాత తనువు చాలించింది. తమ మధ్య ఇన్నేళ్లు ఉన్న గోవు ఇక కానరాదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. రెండు దూడలు తల్లి ఆవు మళ్లి తిరిగి రాదని తెలియక బిక్కుబిక్కుమంటున్నాయని గ్రామస్తులు ఏడ్చారు. గ్రామస్తులు గోమాతను సకల లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించి మంగళవారం స్వర్గయాత్ర నిర్వహించారు. బాజాభజంత్రీలు, భజనలు, కీర్తనలు, భక్తి పాటల మధ్య ఊరేగించారు. గ్రామంలోని ఇంటింటి ముందు ఆపి గోమాతకు అశ్రు నివాళులు అర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తీసుకెళ్లి శ్రీ రాజరాజేశ్వరుని గుట్ట కిందిభాగంలో పూడ్చి పెట్టారు. గ్రామ సర్పంచ్ సాయిరాం యాదవ్, ఎంపీటీసీ మహేందర్, ప్రభాకర్రెడ్డి, చంద్రా గౌడ్, బొట్టె రాములు యాదవ్, సుభాష్ గౌడ్, వడ్ల వెంకటి యువకులు ప్రశాంత్గౌడ్, లక్కియాదవ్, ఆనంద్, మహేందర్ గౌడ్, సాయాగౌడ్, వడ్ల సతీష్, గ్రామస్తులుభారీగాపాల్గొన్నారు. -
మధ్యప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, భోపాల్ : సాధువులు, సన్యాసులకు క్యాబినెట్ హోదా కట్టబెట్టి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలను ఎదుర్కొంటున్న క్రమంలో మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జీవాలను కాపాడేందుకు గో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఎంపీ మంత్రి అఖిలేశ్వరానంద్ వ్యాఖ్యానించారు. గత వారం అఖిలేశ్వరానాంద్కు గో పరిరక్షణ బోర్డు ఛైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్ కట్టబెట్టారు. ‘రాష్ట్రంలో గోవులను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.. దీనికోసం గో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి..సీఎం స్వయంగా రైతు కావడంతో పాటు తనలాంటి వారు ఈ విషయంలో ఆయనకు సాయపడతా’మని అఖిలేశ్వరానంద్ చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై ట్విట్టర్ సహా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందించారు. రాష్ట్రంలో తక్షణం దృష్టిసారించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయని, ముందుగా వాటిని పరిష్కరించాలని సూచించారు. కాగా, గతంలో వీహెచ్పీ సైతం కేంద్ర, రాష్ట్ర స్ధాయిల్లో గో మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. -
పెంకా.. బతుకుతుంది ఇంకా..
పెంకా బతకనుంది.. మరికొన్ని రోజుల్లో మరో బుల్లి పెంకాకు బతుకునివ్వనుంది. అక్రమంగా దేశ సరిహద్దును దాటినందుకు పెంకా అనే ఆవుకు బల్గేరియా ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, పెంకాను రక్షించాలంటూ అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి ఆ దేశ సర్కారు తలొగ్గింది. గర్భంతో ఉన్న పెంకాకు ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లోనూ దానికి ఏ విధమైన వ్యాధులు సోకలేదని నిర్ధారణ అయింది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతోపాటు పెంకాను రక్షించాలంటూ పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమమూ మొదలైంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పెంకాకు విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తోడేళ్లు వెంటబడటంతో పెంకా సరిహద్దును దాటి సెర్బియాలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న దాని యజమాని తిరిగి తెస్తున్నప్పుడు సరిహద్దు భద్రతాధికారులు అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా యూరోపియన్ యూనియన్లో సభ్యదేశం కాని సెర్బియాకు వెళ్లడం.. తిరిగి రావడం సహించరాని నేరమంటూ పెంకాకు మరణశిక్ష విధించారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
మీకు పెంకా తెలుసా?
కొన్ని రోజుల క్రితం వరకు మీకే కాదు.. ఆమె యజమాని ఇవాన్కు తప్పిస్తే.. పెంకా అంటే ఎవరికీ తెలియదు.. ఆవులు, గేదెలు అంటే.. అలా పక్కనున్న పొలాల్లో, తోటల్లో గడ్డి మేయడం కోసం వెళ్లడం మామూలే.. పెంకా కూడా అలాగే వెళ్లింది.. అలా వెళ్లినందుకు పెంకాకు విధించిన శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష!! ► పెంకా ఓ ఆవు.. బల్గేరియాలోని సరిహద్దు గ్రామం కొపిలోట్సీలో ఉంటుంది.. ఓ 20 రోజుల క్రితం గడ్డి మేస్తూ.. మేస్తూ.. అలా కొంచెం దూరం వెళ్లింది.. తోడేళ్లు వెంటపడ్డాయి.. పరిగెడుతూ.. పరిగెడుతూ అనుకోకుండా సరిహద్దును దాటింది.. సెర్బియాలోకి వెళ్లిపోయింది.. పెంకా కనిపించకపోయేసరికి ఆమె యజమాని ఇవాన్, అతని కుమారులు అన్ని చోట్లా వెతికారు. సరిహద్దు భద్రత అధికారులకు విషయం తెలియజేశారు. ► కొన్ని రోజుల క్రితం.. పెంకా సెర్బియాలోని బోసిల్గ్రాడ్ గ్రామంలో ఉందని తెలిసింది.. ఇవాన్ ఆనందానికి అవధుల్లేవు.. వెంటనే బయల్దేరాడు.. బోసిల్గ్రాడ్ చేరుకున్నాడు.. దారితప్పి వచ్చిన పెంకాను అక్కడివాళ్లు బాగానే చూసుకున్నారు. పెంకా ఆరోగ్యంగానే ఉందని.. ఇంటికి తీసుకెళ్లొచ్చని సెర్బియా పశు వైద్యుడు కూడా ధ్రువీకరించడంతో దాన్ని పట్టుకుని.. ఇవాన్ తిరుగు ప్రయాణమయ్యాడు. ► పేపర్స్ ఏవి.. ప్రశ్నించాడు బల్గేరియాలోని సరిహద్దు భద్రతాధికారి.. పేపర్స్ ఏమిటి అన్నాడు ఇవాన్. పెంకా దారి తప్పిన విషయం చెప్పాడు.. యూరోపియన్ యూనియన్ రూల్స్ గురించి తెలియవా అంటూ çహూంకరించాడా అధికారి. బల్గేరియా ఈయూ సభ్య దేశం.. సెర్బియా కాదు.. సరైన ధ్రువపత్రాలు లేకుండా.. ఈయూ సభ్యదేశంలోని వారు వేరే దేశానికి వెళ్లడం.. తగు పత్రాలు లేకుండా తిరిగి దేశంలోకి రావడం నిషేధం.. వాళ్ల లెక్క ప్రకారం పెంకా అక్రమంగా సరిహద్దు దాటింది.. ఇప్పుడు కూడా సరైన పత్రాలు లేకుండా అక్రమంగా సరిహద్దు దాటి రావాలని చూస్తోంది. అక్కడి చట్టాల ప్రకారం ఆ అపరాధానికి శిక్ష.. మరణమే.. ► మరికొన్ని రోజులే.. ఇవాన్కు చెప్పాడు అతడి గ్రామంలోని పశువైద్యుడు. నేను చేయగలిగింది ఏమీ లేదు.. చట్టాలు అలాగున్నాయని అన్నాడు.. పెంకా అక్రమంగా సరిహద్దు దాటడమొక్కటే కాదు.. సెర్బియా నుంచి ఏమైనా రోగాలను మోసుకొచ్చిందేమోనన్న అనుమానం కూడా అధికారులకు ఉంది. అలాగని పరీక్షలు చేయలేదు. సెర్బియా వైద్యుడు పరీక్ష చేసి ఇచ్చిన పత్రాన్నీ నమ్మలేదు.పెంకాకు మరణ శిక్ష విధించడంపై తొలుత అక్కడి సోషల్మీడియాలో గగ్గోలు రేగింది. తర్వాత తర్వాత అది ఈయూ అంతా వ్యాపించింది. పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది.. ఏమిటి హద్దు.. ఏమిటి సరిహద్దు అన్నది పశువులకు ఎలా తెలుస్తుంది? చట్టాలు కఠినమే.. కానీ కామన్సెన్స్ అన్నది కూడా ఒకటుండాలిగా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. పెంకాను రక్షించాలంటూ సంతకాల ఉద్యమమూ ఉధృతమైంది. ఏం జరగనుందో అన్న ఉత్కంఠ అంతటా పెరిగింది. ► మీకో విషయం తెలుసా? పెంకా.. గర్భవతి.. రెండు, మూడువారాల్లో మరో బుల్లి పెంకాకు జన్మనివ్వనుంది.. మరి.. పెంకా బతుకుతుందా? మరో బుల్లి పెంకాకు బతుకునిస్తుందా? -
కలకలం రేపిన ‘సంచిలో శవం’
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని ములకలచెరువు మండలం బురకాయలకోట గురుకుల పాఠశాల వద్ద ఉన్న చెన్నాయన చెరువులో ఓ సంచి శుక్రవారం కలకలం రేపింది. వ్యక్తిని హత్యచేసి సంచిలో పెట్టి చెరువులో పడేసినట్లు వదంతులు చుట్టుపక్కల ఉండే గ్రామాలకు అలుముకుంది. స్థానికులు ఎస్ఐ ఈశ్వరయ్యకు సమాచారం అందించారు. విషయం తెలిసిన ఎస్ఐ హుటాహూటిన తన సిబ్బందితో చెరువు వద్దకు చేరుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సంచిని విప్పారు. సంచి లోపల చనిపోయిన ఆవుదూడ ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా 20 రోజుల కిందట ఇదే చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహం ఆచూకి ఇంత వరకు తెలియ లేదని ఎస్ఐ చెప్పారు. -
దాహం తీరింది..
నిర్మల్అర్బన్: ఎండలు మండుతున్నాయి. వేసవి దాహార్తికి పశు, పక్ష్యాదులు విలవిల్లాడుతున్నాయి. అందుకు ఈ చిత్రాలే నిదర్శనం. జిల్లా కేంద్రంలోని మార్కెట్లో ఓ ఆవు దాహార్తితో మసీద్ వద్ద ఉన్న నల్లా వద్దకు చేరింది. నల్లా నుంచి నీరు రాకపోవడంతో అటూ.. ఇటూ దీనంగా చూసింది. ఫోన్లో మాట్లాడుతూనే ఆవును గమనించిన మొజాన్ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని నల్లాను తెరిచాడు. ఒక్కసారిగా నల్లా నుంచి నీరు రావడంతో నీటిని తాగిన ఆవు తన దాహార్తిని తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
వేములవాడలోని రాజన్న ఆలయంలో విషాదం
-
ఆవు తొక్కడంతో బాలుడి మృతి
వేములవాడ: ఆవు బాలుడిని తొక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన వేములవాడలోని రాజన్న ఆలయ ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు..భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన తిరుపతి దంపతులు వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చారు. రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆదివారం రాత్రి ఆలయ ఆవరణంలో నిద్రకు ఉపక్రమించారు. అయితే ఎక్కడి నుంచో వచ్చిన ఓ ఆవు, తల్లిదండ్రుల పక్కనే నిద్ర పోతున్న ఎర్రబోయిన అనూష్పై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలోనే మృతిచెందాడు. బాలుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
ఆవు ఆయువు తీసింది..
సాక్షి, శంషాబాద్(రాజేంద్రనగర్): ఓ ఆవు యువకుడిని తాడుతో సహా ఈడ్చుకెళ్లడంతో తీవ్రగాయాల పాలై దుర్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామంలో చోటుచేసుకుంది. అయినాల హరీష్రెడ్డి(21) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తల్లి ఉమకు చేదోడువాదోడుగా ఉంటూ పొలం పనులతో పాటు ఆవుల పోషణ చూస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో తమ మూడు ఆవులను మేపడానికి గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఒక ఆవుకు కట్టిన తాడును తన నడుముకు చుట్టుకున్నాడు. ఇంతలో ఆవు బెదిరి తాడుతో పాటు అతన్ని ఈడ్చుకెళ్లింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతని అరుపులు విన్న సమీపంలోని రైతులు అక్కడకు వెళ్లేసరికే హరీష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఏడాది కిందట తండ్రి మృతి.. హరీష్ తండ్రి వెంకట్రెడ్డి ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం తల్లి ఉమ మోయడంతో హరీష్ ఆమెకు చేదోడుగా ఉండేవాడు. ఇతనికి ఓ చెల్లెలు ఉంది. చేతికంది వచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లి రోదనలు మిన్నంటాయి. -
అతి చిన్న ఆవుకు దూడ జననం
కైకలూరు: ఏపీ రాష్ట్రంలో అతి చిన్న ఆవుకు 16.5 అంగుళాల దూడ జన్మించింది. గురువారం కృష్ణాజిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన పశుపోషకుడు అల్లూరి శ్యాంప్రసాద్ ఇంటి వద్ద ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం కేరళ నుంచి కాసర్గడ్ జాతికి చెందిన ఆవును రైతు శ్యాంప్రసాద్ కొనుగోలు చేశాడు. ఆ ఆవుకు రెండు దూడలు పుట్టి చనిపోయాయి. మూడో విడత పుట్టిన దూడ ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రముఖ వెటర్నరీ సర్జన్ ప్రతాప్ తెలిపారు. గతేడాది గిన్నిస్బుక్ రికార్డు కోసం ఈ ఆవు ఎత్తును పంపామన్నారు. 29 అంగుళాలతో అతి చిన్న ఆవుగా రెండో స్థానంలో నిలిచిందన్నారు. కేరళకు చెందిన వేచూర్ ఆవు 28.5 అంగుళాలతో మొదటి స్థానం సాధించిందన్నారు. ప్రపంచంలో కాసర్గడ్ ఆవులు కేవలం 70 మాత్రమే ఉన్నాయని తెలిపారు. -
కన్నీరు పెట్టించిన ఆవు ప్రేమ
-
అంబా... గొయ్యి తీసి వదిలేశారేమయ్యా!
ముంచంగిపుట్టు : మండల కేంద్రంలో స్థానిక దూర్గదేవి ఆలయ సమీపంలో మరుగుదొడ్డి కోసం తీసిన గోతిలో ఓ ఆవు పడిపోయి పైకి రాలేక అరుస్తూ సుమారు మూడు గంటలపాటు నరకయాతన పడింది. అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గోతిలో నుంచి ఆవు అరుపులు విని దగ్గరకు వెళ్లి చూశారు. పైకి వచ్చేందుకు ఆవు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. దీంతో స్థానికులు తాళ్లను తీసుకు వచ్చి గంటకుపైగా శ్రమించి అతికష్టం మీద ఆవును బయటకు తీశారు. చిన్నచిన్న గాయలతో ఆవు ఉండడం బయటకు వచ్చిన వెంటనే కన్నీరు కారుస్తుండడం స్థానికులను ఒక్కింత అవేదనకు గురి చేసింది. మరుగుదొడ్ల కోసం తీసే గోతులపై పైకప్పులు ఏర్పాటు చేయాలని, ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే మూగజీవులతో పాటు చిన్నరులు సైతం గోతుల్లో పడి గాయాలు పాలు అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని స్థానికులు అంటున్నారు. -
గో హంతకులకు ఉరి శిక్ష విధించాలి
కోలారు: గో హత్యలు చేసే వారికి మరణ దండన వంటి కఠిన శిక్షలు విధించాలని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అప్పుడే ఆ హత్యలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని గంగాపుర గ్రామంలో అభయ మంగళ గో యాత్ర ముగింపు వేడుకలో ఆయన మాట్లాడారు. గోహత్యలు మానవ హత్యలతో సమానమైనవి కావడం వల్ల వీటి హంతకులకు కూడా మరణ శిక్షలు విధించాలని, ఇందుకు తగినట్లు చట్టాల్లో మార్పులు తేవాలని కోరారు. దీనిపై తాను పార్లమెంట్లో త్వరలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టబోతున్నానని వెల్లడించారు. గో రక్షణ నిధుల కోసం 1 శాతం సెస్సు విధించాలని, గోవులకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. చైనాలో గోవధ వల్ల గో సంతతి తగ్గి నేడు సోయాబీన్స్తో తయారు చేసిన పాలను ఉపయోగిస్తున్నారని, ఈ పరిస్థితి మన దేశంలో రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ఈ సందర్భంగా గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ప్రధానికి అభయ మంగళ గో యాత్ర కార్యకర్తలు రక్తాక్షరాలతో లేఖలు రాశారు. -
చిన్నకందుకూరులో గోరక్షకుల దాడి
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో దళితులపై దాడి చేశారు. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంక్రాంతి పండగ సందర్భంగా 14న చిన్నకందుకూరులో దళితులు అర్ధరాత్రి గోవును కోస్తున్న క్రమంలో 30 మంది ఆర్ఎస్ఎస్, గోరక్షక్, వీహెచ్పీ కార్యకర్తలు బైక్లపై వచ్చారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ, ఆర్ఎస్ఎస్ జిందాబాద్ అంటూ కర్రలతో దాడి చేశారు. దీంతో ఎర్ర చంద్రయ్య, ఎర్ర ఉప్పల య్య, బొల్లారం యాదయ్య, ఎర్ర పోచయ్య, ఎర్ర మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గోవును వధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దళితులపై కేసులు నమోదు చేశారు. నిందితులను శిక్షించాలి: టీమాస్ విషయం తెలుసుకున్న టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్లు బాధితులను శనివారం పరామర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయా లని యాదగిరిగుట్ట ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని ఏసీపీ సముద్రాల శ్రీనివాసాచార్యులు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. -
‘ఆవును చంపితే.. మిమ్మల్ని హత్య చేస్తాం’
జైపూర్ : గోవులను అక్రమంగా రవాణా, గోవులను మాంసం కోసం చంపిన వారిని హత్య చేస్తామంటూ బీజేపీకి చెందిన రాజస్థాన్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆవులను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తి అరెస్టుపై మాట్లాడిన రామ్ఘర్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా గోవులను చంపిన వారి ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన జకీర్ను అరెస్టు చేయబోయే ముందు చితక్కొట్టారు. అయితే, జకీర్ను ఎవరూ కొట్టలేదని అహూజా పేర్కొన్నారు. ఆవులను తరలిస్తున్న ట్రక్కును ప్రజలు వెంబడించారని, ఆందోళనతో జకీర్ చేసిన పొరబాటు వల్ల ట్రక్కు తిరగబడిందని చెప్పారు. అందుకే జకీర్కు గాయాలయ్యాయని తెలిపారు. కానీ, జకీర్ మాత్రం గ్రామస్థులు కొట్టారని అబద్దం చెబుతున్నాడని అన్నారు. -
టీటీడీ ఎరువులు, ఫ్లోర్క్లీనర్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి వెంకన్న లడ్డూకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక సేంద్రియ ఎరువులు, ఫ్లోర్ క్లీనర్లు, సువాసన వెదజల్లే సుగంధాల తయారీపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. ఈ వనరులను పుష్కలంగా కలిగిన టీటీడీ త్వరలో ఉత్పత్తుల తయారీ యూనిట్లు నెలకొల్పనుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్లోని పతంజలి గో ఆశ్రమం, పంజాబ్లోని దివ్యజ్యోతి సంస్థాన్ ఆయుర్వేద కేంద్రాలను సందర్శించిన టీటీడీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే తరహాలో తిరుపతిలోనూ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీటీడీ వద్ద 3 వేలకుపైగా గోవులు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాలలో 3,000కుపైగా ఆవులున్నాయి. పలమనేరు దగ్గర వంద ఎకరాల్లో టీటీడీ ఏర్పాటు చేసిన గోశాలలో మరో 400 ఆవులున్నాయి. గో సంరక్షణలో భాగంగా వట్టిపోయిన గోవులకు ఆశ్రయం కల్పించి పోషిస్తున్నారు. పాలిచ్చే గోవుల కన్నా వట్టిపోయిన ఆవులు సంఖ్య పెరగటంతో నిర్వహణ వ్యయం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గోవుల మూత్రం, పేడను వినియోగించి ఎరువులు, ఫ్లోర్క్లీనర్లు తయారు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల గోశాలల నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. త్వరలో యూనిట్ ప్రారంభం.... ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, గో మూత్రంతో ఫ్లోర్ క్లీనర్ల తయారీకి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం ముగిసిం ది. గోశాల ఆవరణ లో తయారీ యూనిట్ను నెలకొల్పనున్నాం. మిషనరీ, టర్నర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. నాలుగు నెలల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. –హరినాథరెడ్డి, తిరుపతి గోశాల డైరెక్టర్. నెలకు 150 టన్నులు.. తిరుపతి గోశాలలో నిత్యం 15 టన్నుల మేర పేడ లభ్యమవుతోంది. దీన్ని ఎండబెడితే తేమ శాతం పోయాక నెలకు సుమారు 150 టన్నుల పేడ మిగులుతుంది. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, గో మూత్రం మిశ్రమాలతో కలిపి దీన్ని నిల్వ చేసి శాస్త్రీయ విధానంలో కొన్ని ముడి పదార్థాలు కలపటం ద్వారా ఎరువుగా మారుతుంది.గో మూత్రానికి పైనాయిల్, లెమన్ గ్రాస్ ట్రీ ఆయిల్ లాంటి ఆయుర్వేద ఉత్పత్తులను కలిపి మిశ్రమాన్ని వేడి చేయటం ద్వారా ఫ్లోర్క్లీనర్గా మార్చవచ్చు. ఆవు పేడతో తయారైన సేంద్రియ ఎరువులను వరి, చెరకు, వేరు శెనగ, కూరగాయల సాగుకు వినియోగించటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తొలిదశలో ఈ ఎరువులను టీటీడీ నిర్వహించే ఉద్యాన వనాలు, పండ్ల తోటలకు వినియోగిస్తారు. తరువాత బయట మార్కెట్లోకి ప్రవేశ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వాడిన పుష్పాలతో సుగంధాల తయారీ తిరుమల శ్రీవారికి నిత్యం అలంకరించే వివిధ రకాల పుష్పాలను వాడిపోగానే తొలగిస్తారు. ఇవి టన్నుల్లోనే ఉంటాయి. వీటిని వృథాగా పారవేయకుండా సువాసనలు వెదజల్లే సుగంధాలను తయారు చేయాలని టీటీడీ తోటల విభాగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. -
ఇలా చేస్తే మీ అందానికి తిరుగుండదు..
అహ్మదాబాద్ : మీ చర్మం ధగధగ మెరిసిపోవాలా?. 108 సాధారణ జబ్బుల నుంచే కాకుండా ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే సహజ సిద్ధమైన ప్రొడక్టులను వాడాలని గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆవు మూత్రం, పేడలకు జబ్బులను నయం చేయగల శక్తి ఉందని చెప్పింది. మహిళలు ఈజిప్టు రాణి క్లియోపాత్రలా అందంగా కనిపించాలంటే గో మూత్రం, పేడలతో తయారు చేసిన 'పంచగవ్య' ఉత్పత్తులను వినియోగించాలని గుజరాత్ వికాస్ బోర్డు పేర్కొంది. పంచగవ్య డార్క్ సర్కిల్స్, బ్లాక్ స్పాట్స్, మొటిమలను తొలగిస్తుందని చెప్పింది. ప్రపంచలోనే అందగత్తె అయిన క్లియోపాత్ర ప్రతిరోజూ ఆవు పాలతో స్నానం చేసేవారని 'ఆరోగ్య గీత' అనే పేరుతో విడుదల చేసిన సలహాల్లో పేర్కొంది. ఆవు ఉత్పత్తుల గురించి మహిళలకు అవగాహన లేదని గో సంరక్షణ సమితి అధ్యక్షుడు వల్లభ్ కృష్ణ చెప్పారు. ఆవు పాలు, మూత్రం, పేడల గురించి మహిళలు తెల్సుకోవాల్సింది చాలా ఉందని అన్నారు. మహిళ శరీరాన్ని రూపవంతంగా తీర్చిదిద్దగలిగే శక్తి గో ఉత్పత్తులకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. -
పాడి ఎంపికతోనే క్షీరధారలు
అనంతపురం అగ్రికల్చర్: పాడి గేదె ఎంపికపైనే పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుందని పశుసంవర్ధకశాఖ అనంతపురం డివిజన్ డీడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. దీంతోపాటు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దాణ తగినంత అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నపుడే పాడి ద్వారా మంచి ఆదాయం పొందవచ్చన్నారు. పశువుల ఎంపిక ఇలా అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతి జర్సీ, సంకర జాతి హెచ్ఎఫ్, గ్రేడెడ్ ముర్రా జాతులు గురించి తెలుసుకోవాలి. ఒకటి లేదా రెండు ఈతలు కలిగిన పశువులను ఎంపిక చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం, మరుసటి రోజు ఉదయం ఇలా మూడు పూటలు పాలు పితికి సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటే మేలు. చర్మం మృదువుగా, మెడ పొట్టిగా, పైనుంచి చూస్తే త్రికోణాకారం ఉన్న పశువు బాగుంటుంది. డొక్కలు నిండుగా, వెనుక కాళ్ల మధ్య పొదుగు బాగా విస్తరించి, నాలుగు చనులు సమాన దూరంలో అమరిఉన్నట్లు ఉండాలి. పొదుగుకు ఇరువైపులా పాలసిరలు (నరాలు) పెద్దవిగా ఉబ్బి, వంకర్లు తిరిగి ఉడాలి. పశుగ్రాసంపై దృష్టి పాడి, పశుపోషణలో ఎక్కువగా మేతకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పశువులు కొనేముందు రెండు నెలలకు సరిపడా గడ్డి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరగా కోతకు వచ్చే స్పీడ్ సూడాన్ గ్రాస్, అధిక దిగుబడినిచ్చే బహు వార్షికాలైన ఏపీబీఎన్ లేదా కో–3 లాంటి రకాల గడ్డిని పెంచితే ఐదారు పశువులను పోషించుకోవచ్చు. చౌడు, నీరు నిలిచే భూముల్లో పారాగడ్డి, పొలం గట్లపైన సుబాబుల్, కాలువగట్టపై అవిశ చెట్లు, పండ్ల తోటల మధ్య స్టైలో హమటా లాంటి గడ్డి రకాలను పెంచుకోవచ్చు. ఎటువంటి భూమి లేని రైతులు ‘అజొల్లా’, హైడ్రోఫోనిక్ విధానంలో పచ్చిగడ్డిని పెంచుకోవచ్చు. చాఫ్ కట్టర్ (గడ్డిని కత్తిరించే యంత్రం) ఉంటే మేత వృథా కాదు. అధిక పాల దిగుబడికి పచ్చిమేత, ఎండుగడ్డి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సమీకృత దాణ, ఖనిజ లవణ మిశ్రమం, దాణను జొన్న, సజ్జ, మొక్క జొన్న, చింతగింజల పొడి, వరి తౌడు, వేరు శనగ (చెక్క) పిండి ద్వారా తయారు చేసుకోవచ్చు. -
వధువు గోవు.. వరుడు బసవన్న..
-తాటిపర్తిలో వైభవంగా వివాహ వేడుక -ఊరేగింపు, ఊరంతటికీ విందు గొల్లప్రోలు (పిఠాపురం) : సంరక్షణలేక వేలాది పశువులు మృత్యువాత పడుతున్న రోజులివి. కసాయి కత్తులకు బలవడానికి వేలాదిపశువులు కబేళాలకు తరలిపోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో పశువులకు కల్యాణం జరిపించి, వాటితో అనుబంధాన్ని, వాటి పరిరక్షణ అవసరాన్ని చాటారు మండలంలోని తాటిపర్తి గ్రామస్తులు. ఆవు–తాడిపెద్దు(బసవన్న)ల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిపించారు. ఆవును, బసవన్నను పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడుగా అలంకరించి..నుదుటిని బాసికం కట్టి...శరీరంపై వస్త్రాలు పరచి పొరుగుగ్రామమైన శంఖవరానికి చెందిన రెండు తాడిపెద్దులు తోటి పెళ్లి కొడుకులుగా, గ్రామస్తులు పెళ్లిపెద్దలుగా హాజరై వేదమంత్రోచ్చారణల మధ్య కల్యాణం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. అనంతరం గ్రామస్తులు ఊరి బంతితో విందు ఆరగించారు. స్థానిక పెదరామాలయం వద్ద జరిగిన ఈ పెళ్లి తంతు మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. కాకినాడకు చెందిన భాగవతుల నాగమహాసయ తాడిపెద్దును చిన్నవయసులో ఉండగా స్థానిక అపర్ణాదేవి అమ్మవారికి కానుకగా ఇచ్చారు. ఇన్నాళ్లూ ఆలయసంరక్షణలో పెరిగిన తాడిపెద్దుకు పెళ్లిచేయాలనే సంకల్పంతో దైవజ్ఞరత్న ఆకొండి వెంకటేశ్వరశర్మ సూచనతో గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు, శేషారత్నం దంపతులు ఆవును కన్యాదానంగా చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా విఘ్నేశ్వరపూజ, లక్ష్మి పూజ నిర్వహించారు. అనంతరం తాడిపెద్దుకు దాసుడితో అచ్చు వేయించారు. వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో పూజాదికాలు నిర్వహించి, కల్యాణం జరిపించారు. అనంతరం ఆవు, తాడిపెద్దుల గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద ఆవు, తాడిపెద్దుల కాళ్లుకడిగి..నుదుట బొట్టుపెట్టి పూజలు చేశారు. దుస్తులు, తవుడు, బియ్యం వంటివి కానుకగా సమర్పించారు. తప్పెటగుళ్లు, శూలాల సంబరం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటేశ్వరశర్మ మాట్లాడుతూ తాటిపర్తిలో గతంలో తాడిపెద్దులకు కల్యాణం చేయించి, అచ్చు వేయించినట్టు చెప్పారు. పదేళ్ల తరువాత ఇప్పుడు ఈకార్యక్రమం జరిపించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకృష్ణుడు గోవర్థనగిరి పర్వతం ఎత్తే సమయంలో బసవన్నకు పూజలు చేశాడని దామాల కొండలరావు తెలిపారు. ప్రతి గ్రామానికి తాడిపెద్దు, రామాలయం, పెరుమాళ్ల స్తంభం ఉండాలని పురాణాలు చెబుతున్నాయన్నారు. -
గోమాతకు సీమంతం
అ అంటే అమ్మ అని.. ఆ అంటే ఆవు అని చిన్నారులకు అక్షరాలు నేర్పుతుంటాం. అమ్మ తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన గోమాతకు పండుగలు, వ్రతాల సమయంలో విశిష్ట పూజలు చేస్తారు. అదేవిధంగా వైఎస్సార్ జిల్లా పాత కడపకు చెందిన పల్లా నరసింహులు పెంచుతున్న గోవుకు నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆ ఆవు చూడిదైంది (గర్భం దాల్చింది). సంప్రదాయం ప్రకారం మహిళలకు ఏ విధంగా అయితే సీమంతం చేస్తారో నరసింహులు తన కూతురులాగా భావించే గోమాతకు శనివారం సాయంత్రం సీమంతం చేశారు. గ్రామంలోని మహిళలందరు వచ్చి గోమాత చుట్టూ తిరుగుతూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ.. ఈ గోమాత చూడిదైన ప్రతిసారి కోడెదూడలే పుడుతున్నా యని తెలిపారు. వాటిని చాలా మంది కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. – కడప అగ్రికల్చర్ -
భర్తే... దూడైతే...!
‘‘నా భర్త మళ్లీ పుట్టాడు.. నా భర్త మళ్లీ పుట్టాడు..’’ అంటూ ఎంతో సంతోషంగా ఊరంతా చెప్పుకుంటోంది కంబోడియా దేశానికి చెందిన ఖిమ్హాంగ్ అనే 74ఏళ్ల మహిళ. అసలు ఆమె అనుకుంటున్నట్టు తన భర్త పుట్టింది మనిషి రూపంలో కాదు.. ఆవుదూడగానట. అదేంటీ అని ఆశ్చర్యపోకండి. ఖిమ్హాంగ్ భర్త టోల్ ఏడాది క్రితమే మరణించాడు. అయితే అయిదు నెలల క్రితం వాళ్లింట్లోని ఆవుకు ఓ దూడ జన్మించింది. సాక్షాత్తు తన భర్తే ఆ దూడగా పుట్టాడని నమ్ముతోంది ఖిమ్. ఆమె నమ్మకానికి తగ్గట్టే ఆ దూడ కూడా కొన్ని విషయాల్లో మనిషిలాగే ప్రవర్తిస్తోందట. కేవలం ఖిమ్ బంధువులు వచ్చినప్పుడు మాత్రమే.. వారి చేతులను తాకి, నాకుతోందట. దాంతో ఆ దూడను ఖిమ్ కుటుంబ సభ్యులు ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. తన భర్త టోల్ గదిలోనే అతని బెడ్, దిండు పైనే దాన్ని పడుకోబెడుతున్నారు. అది టోల్లాగే ఆ గది కిటికీలో నుంచి ఎప్పుడూ బయటికి చూస్తోందట. దాంతో వారి నమ్మకం మరింత బలపడింది. ‘‘నేను బతికి ఉన్నంత కాలం ఆ దూడను... అంటే నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటాను. ఒకవేళ నేను త్వరగా చనిపోతే, మీరు కూడా దాన్ని కంటికిరెప్పలా చూసుకోవాలి. అది చనిపోతే.. మనిషికి చేసినట్టే అంత్యక్రియలు నిర్వహించాలి’’ అని ఖిమ్ ఎప్పుడూ తన వాళ్లకి చెబుతూ ఉంటుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆ దూడను చూడటానికి ఖిమ్ ఇంటికి సందర్శకుల రాక మొదలైందట. అయినా.. ఇలాంటివి విన్నప్పుడు మనకూ ఆశ్చర్యంతో కూడిన ఉత్సాహం కలుగుతుంది కదా..! -
ధర్మం కాదిది మీ ఖర్మం!
రెచ్చిపోతున్న గోమాఫియా కేసులు నమోదవుతున్నా యథేచ్ఛగా రవాణా ఎక్కడికక్కడ పకడ్భందీ ఏర్పాట్లు కోట్ల రూపాయల్లో వ్యాపారం బంగ్లాదేశ్, దుబాయ్లకు మాంసం ఎగుమతి జంగారెడ్డిగూడెం: భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుతున్నారు పాలు మూతులు బిగియగట్టి... నాటి స్వాతంత్య్రోద్యమ సంగ్రామంలో భరతఖండాన్ని గోమాతతో కవి అభివర్ణించారు. అదే విధంగా యుగాలకు ఆది అయిన కృతయుగం నాడే సకల దేవతలు ఒకే చోట కొలువై ఉండేలా గోమాతను సృజియించి, అందులో దేవతలు అణువణువై నిలిచిపోయారు. ఇలా ఎన్నెన్నో పూజలు అందుకున్న గోమాత నేడు తన ఆత్మఘోష వినిపిస్తోంది. నేను గోమాతను. భరత ఖండంలో పవిత్రంగా నన్ను కొలుస్తారు. నా నుంచి పుట్టే ప్రతీ అంశం మానవులకే ధారపోస్తున్నాను. సాక్షాత్తు నన్ను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. గృహ ప్రవేశానికి నేను కావాలి. పూజా కార్యక్రమాలకు నేను కావాలి. ఔషధాలకు నా పొదుగు నుంచి వచ్చే పాలు, నా నుంచే వచ్చే మూత్రం, పేడ కావాలి. ఎన్నో రకాలుగా నేను మానవ జీవన గమనంలో భాగమై పోయాను. కృతయుగం నాటి నుంచి కలియుగం వరకు నన్ను పూజిస్తున్నారు. నా తనువు మొత్తం వ్యర్ధం లేని అర్థం. అటువంటి నన్ను నేడు కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు బలి చేస్తున్నారు. అమ్మ తరువాత అమ్మగా కొలిచే నన్ను మాంసం అంగడిలో విక్రయ వస్తువుగా మార్చి నా రక్తమాంసాలు అమ్ముకుంటూ నా ఉనికే రూపు మార్చేస్తున్నారు. నా నాలుగు కాళ్లను విరగ్గొట్టి, ట్రక్కులు, కంటైనర్లలో కుక్కి జీవశ్ఛవాన్ని చేసి కాసులు దండుకుంటున్నారు. జాలి కూడా చూపకుండా కర్కశంగా నాపట్ల వ్యవహరిస్తున్నారు. మీకిది తగునా..... రెచ్చిపోతున్న మాఫియా: గోమాత ఆత్మఘోష ఇలా ఉన్నప్పటికీ చాలామందికి కనీసం మానవత్వం లేకుండా పోతోంది. ఎవరికి వారే తమకేంటిలే అని గోవుల అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. దీంతో గోవులను అక్రమంగా రవాణా చేస్తూ ’గో’మాఫియా రెచ్చిపోతోంది. దీనికి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, కొంతమంది పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు కూడా సహకరించడంతో పశువుల అక్రమ రవాణాకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. ఏటా కోట్లాది రూపాయలు ఈ అక్రమ రవాణా ద్వారా గో మాఫియా చేతులు మారుతోంది. ఒడిశా నుంచి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిగోదావరి జిల్లాల మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు లక్షలాది పశువుల అక్రమ రవాణా జరిగిపోతోంది. బంగ్లాదేశ్, దుబాయిలకు కూడా అక్రమంగా రవాణా జరిగిపోతోంది. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. పశువుల రవాణా యథేచ్ఛగా జరిగిపోతోందంటే అధికారుల ఉదాశీనత, పెచ్చరిల్లుతున్న గోమాఫియా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికి పశ్చిగోదావరి జిల్లా అడ్డాగా మారింది. జిల్లాలో పదుల సంఖ్యలో దళారులు తయారై పశువుల రవాణా వాహనాలను సరిహద్దు దాటించడం వీరి పని. దీని కోసం వీరు పైలెట్లుగా కూడా వ్యవహరిస్తారు. రాష్ట్ర సరిహద్దు నుంచి రవాణా: ఒడిశా, రాష్ట్ర సరిహద్దు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి గోవులను ఆయా మార్కెట్లలో కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా కంటైనర్లలో పశువులను సామర్ధ్యానికి మించి లోడ్ చేసి పైన టార్పాలిన్ కప్పి రవాణా చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఎటువంటి ఆంటకాలు లేకుండా వాహనాలు వచ్చినప్పటికీ జిల్లాలోకి ప్రవేశించే సరికి పోలీసులకు సమాచారం అందడం, వెంటనే పోలీసులు లారీలను సీజ్ చేయడం జరుగుతోంది. అయితే కొందరు పోలీసులు పశువులు రవాణా చేస్తున్న వ్యక్తులతో కుమ్మక్కై లారీలను వదిలి వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రవాణా మరీ దారుణంగా తయారైంది. ఒక కంటైనర్ను రెండు అంచెలుగా విభజించి పైన కింద గోవులను విచక్షణ మరిచి మరీ కుక్కేస్తూ సుదూర ప్రాంతాలు రవాణా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని గోవులు ఊపిరి ఆడక, ఆహార పానీయాలు అందక మృతి చెందుతున్నాయి. అయినా రవాణాదారుల్లో ఎక్కడా మానవత్వం కనిపించడం లేదు. పెద్దల ప్రమేయం: ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయంతో ఏటా కోట్లాది రూపాయల పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. ఇందులో మీడియా వ్యక్తులు కూడా ఉండటంతో మాఫియా పని సులభమవుతోంది. ఇటీవల కొయ్యలగూడెంలో పోలీసులు గోవులు రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని సీజ్ చేయగా సాక్షాత్తు ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని, ఈ జిల్లాకు చెందిన ఒక మంత్రితో స్వయంగా జిల్లా ఎస్పీకే ఫోన్ చేయించి వాహనాన్ని విడుదల చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికే కేసు నమోదు కావడంతో పోలీసులు చేతులెత్తేశారు. దళారుల హవా: పశువులను అక్రమ రవాణా చేసే వాహనాలకు దళారులు అండదండగా ఉంటున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ కొంతమంది బృందాలుగా ఏర్పడి వాహనాలను జిల్లా దాటిస్తున్నారు. ఒకవేళ తమకు సంబంధించిన వాహనం కాకపోతే వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే పోలీసులకు పట్టివ్వడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పశువుల వాహనాలు జిల్లాను దాటించేందుకు దళారులకు ప్రతీనెలా లక్షలాది రూపాయలు గోమాఫియా ముట్టజెబుతోంది. చెక్పోస్టుల్లో కూడా వాహనాలను తనిఖీచేయకుండా మామూళ్ళు తీసుకుని వదిలివేస్తున్నారు. పంథామార్చిన గో మాఫియా: జిల్లా మీదుగా సరిహద్దును దాటించేందకు గోమాఫియా పంథాను మార్చింది. ఒకవేళ జిల్లాలో ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువుల వాహనాలను సీజ్ చేస్తే వాటిని గోశాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గోశాలకు తరలించడం, అక్కడి నుంచి తిరిగి మళ్లీ యథావిధిగా రవాణా చేయడం పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. తరలించడానికి రూ. లక్ష: జిల్లా సరిహద్దు దాటించేందుకు ఒక్కొక్క వాహనానికి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నారు. దీనికి హైదరాబాద్కు చెందిన బడా వ్యాపారులు నేరుగా వారి ఖాతాలో జమచేస్తారు. ఈ దళారులు వాహనాలు, సరిహద్దు దాటించే వ్యక్తులు అవసరమైతే పశువుల రవాణా చేసే వాహనానికి పైలెట్లుగా వ్యవహరిస్తారు. దీనిలో ప్రత్యేకంగా మీడియా వ్యక్తులు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో న్యాయపరమైన, చట్టపరమైన అడ్డంకులు తొలగించుకోవడానికి కిందిస్థాయి నుంచి హైకోర్టు వరకు న్యాయ సలహాదారులు ఎక్కడికక్కడ ఉన్నారంటే గోమాఫియా స్థాయి అర్థం చేసుకోవచ్చు. రవాణా చేయాలంటే నిబంధనలు పాటించాల్సిందే: ప్రివెన్షన్ ఆఫ్ యానియల్ యాక్ట్ 1960 (59 ఆఫ్ 1960)లోని సెక్షన్ 38 (1), (2) ప్రకారం పశువులను తరలించాలంటే కచ్చితంగా యాక్టులో పేర్కొన్న విధంగా నిబంధనలు పాటించి రవాణా చేయాల్సి ఉంటుంది. గోవుల పరిమాణం, బరువుని బట్టి అవి స్వేచ్ఛగా తిరిగేలా రవాణా చేసే వాహనంలో ఖాళీఏర్పాటు చేయాలి. రోడ్డు ద్వారా గాని, రైల్వే ద్వారా గాని రవాణా చేసే సమయంలో రవాణా చేసే వాహనాన్ని బట్టి పశువులను నిర్ధేశించిన సంఖ్య మేరకే రవాణా చేయాలి. గాలి వెలుతురు ధారాళంగా ఉండటంతో పాటు మేత, నీరు అందుబాటులో ఉండాలి. ఎటువంటి హింసకు గురికాకూడదు. ఇవన్నీ పాటించకపోతే యానియల్ క్రూయల్టీ యాక్టు ప్రకారం రవాణా చేసే యజమానులు, రవాణాదారులు కూడా శిక్షార్హులే. 08)నిఘా ఏర్పాటు చేశాం: పశువుల అక్రమ రవాణా పై నిఘా ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. సాధ్యమైనంత వరకు పోలీసులే పశువుల అక్రమ రవాణా వాహనాలను పట్టుకుంటున్నారు. పశువుల అక్రమ రవాణా, కిక్కిరిసి రవాణా చేయడం నేరం. ఇకపై యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటాం. సీహెచ్ మురళీకృష్ణ, డీఎస్పీ, జంగారెడ్డిగూడెం 09) అక్రమ రవాణాను అడ్డుకోవాలి: పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలి. పశువులను చాలా దారుణంగా కాళ్లు విరగ్గొట్టి ట్రక్కులో పడవేసి కిక్కిరిసి రవాణా చేస్తున్నారు. ఇది అమానుషమైన చర్య. దీనిని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలి. ప్రతీ రెవెన్యూ డివిజన్కు ఒక గోసంరక్షణ శాల ఏర్పాటు చేయాలి. అప్పుడు పశువుల అక్రమ రవాణా సాధ్యమైనంత అడ్డుకోవచ్చు. కొప్పాక శ్రీనివాసరావు, గో సంరక్షకుడు, జంగారెడ్డిగూడెం 10) మొగల్ పాలకులు సైతం గోహత్యను నిషేధించారు. భారతీయులైన మనం గోమాఫియాను అడ్డుకోలేకపోతున్నాం. గోసంరక్షణ పేరుతో దాడులు చేయడం అన్యాయం. కాని గోసంరక్షకులంతా సంఘ వ్యతిరేకులు కారు. వేదుల జనార్ధన్, ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్, కొయ్యలగూడెం -
cow, mafia, eluru
విచారణ తప్పుదోవ గోసంరక్షణ శాల నిర్వాహకుడిపైనే దృష్టి మాఫియా నుంచి ఫిర్యాదుల స్వీకరణ కేసులో నుంచి బయటపడేందుకు పోలీసుల తిప్పలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమంగా రవాణా అవుతున్న గోవులు మృత్యువాత పడిన కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులు తిప్పలు పడుతున్నారు. ఈ వ్యవహారంలో తమ బాధ్యత లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గోసంరక్షణ శాల నిర్వాహకుడు శ్రీనివాస్ లక్ష్యంగా విచారణ చేపడుతున్నారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పిలిపించి వారి నుంచి శ్రీనివాస్కు ఫిర్యాదులు స్వీకరించడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ రవాణాదారుల అరెస్ట్లేవీ? అసలు గోవుల అక్రమ రవాణాకు కారణమైన వారిని ఇంతవరకూ పోలీసులు అరెస్టు చేయలేదు. ఆ దిశగా యత్నాలూ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వదిలేసి గో సంరక్షణ శాల నిర్వాహకుడిపై పోలీసులు పడ్డారు. జిల్లాలో ఇప్పటి వరకూ 23 అక్రమ రవాణా కేసులు నమోదు చేసిన పోలీసులు పట్టుబడిన సుమారు 1800 అవులను ఆవపాడులోని గోసంరక్షణ సమితికి అప్పగించినట్టు సమాచారం. అయితే ఇప్పుడు అక్కడ 210 గోవులు మాత్రమే ఉండటంతో మిగిలినవి ఏమయ్యాయి? ఎవరికి ఇచ్చారు? అక్రమ రవాణా చేశారా? అన్న విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో గోశాల నిర్వాహకుడిని లక్ష్యంగా చేశారు. చాలాకాలంగా అక్రమ రవాణా జిల్లా మీదుగా పశువుల అక్రమ రవాణా చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల పశువుల అక్రమ రవాణాను జిల్లా సరిహద్దులు దాటించే వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పశువుల రవాణా అవుతున్న వాహనాల వివరాలను వారిలో వారే పోలీసులకు చేరవేస్తున్నారు. దీనిని తెలుసుకున్న పశువుల అక్రమ రవాణా పెద్దలు వీరందరినీ తిరిగి సిండికేట్ చేసే యత్నం చేశారు. గతంలో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా పశువులను జిల్లా సరిహద్దులు దాటించేవారు. అయితే పోలీసులకు సమాచారం అందుతుండటంతో ఇటీవల రూట్ మార్చి నల్లజర్ల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా జిల్లా దాటిస్తున్నట్టు సమాచారం. ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువుల వాహనాలు సీజ్ చేస్తే దగ్గరలోని గోశాలకు తరలించి అక్కడి నుంచి రాత్రికిరాత్రే మళ్లీ తెలంగాణకు తరలిస్తున్నట్టు సమాచారం. దీనికి దళారులు వాహనాలు, సరిహద్దు దాటించే వ్యక్తులు అవసరమైతే పశువుల రవాణా చేసే వాహనానికి పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. శనివారం దేవరపల్లి పోలీసుస్టేషన్లో దళారులు గోమాఫియాకు చెందిన వారిని పిలిపించి పంచాయితీ చేస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో గోసంరక్షణ సమితి నిర్వాహకుడిదే తప్పు అనేలా వారితో పోలీసులు ఫిర్యాదులు ఇప్పిస్తున్నట్టు తెలిసింది. అసలు మాఫియాను పట్టుకోకుండా కొసరు వ్యక్తులను బాధ్యులుగా చూపించి వ్యవహారాన్ని సెటిల్ చేసే యత్నాలు జరుగుతున్నాయి. పోలీసుల అదుపులో శ్రీనివాస్ మరోవైపు వెంకట్రామన్నగూడెం రిజర్వు ఫారెస్ట్లో ఆవపాడు రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్న గోశాల కన్వీనర్ కొండ్రెడ్డి శ్రీనివాస్ను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గోశాలలో గోవులకు ఆలనాపాలనా కరువైంది. కన్వీనర్ శ్రీనివాస్ను అరెస్ట్ చేయడంతో మిగతా పరివారం కూడా పరారయ్యారు. ఆవులను దత్తత తీసుకోవడానికి వస్తున్న రైతులే ఇక్కడ సేవకులయ్యారు. గురువారం ముందు నాటికి ఉన్న 180 ఆవులతోపాటు, తదనంతరం దేవరపల్లి పోలీసులు అప్పగించిన 30 ఆవులకు గడ్డి, నీరు రైతులే అందిస్తున్నారు. ప్రస్తుతం గోశాల వద్ద దేవరపల్లి పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ పహారా కాస్తున్నాడు. -
‘గో’ మాఫియా
ఎట్టకేలకు పోలీసుల్లో కదలిక ’గోమాఫియాపై దృష్టి ఆవుల మృతితో కళ్లుతెరిచిన వైనం గోసంరక్షణ సమితిపై కేసు దర్యాప్తు ప్రారంభం చిత్రహింసలు పెట్టారని సమితి నిర్వాహకుని ఆవేదన సాక్షి ప్రతినిధి, ఏలూరు, దేవరపల్లి : అక్రమంగా తరలి వెళ్తున్న గోవులు అత్యంత హృదయవిదారక పరిస్థితిలో మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు పోలీసులు నిద్రమత్తు వీడారు. గో మాఫియాపై దృష్టి పెట్టారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తూ చెరేగిపోతున్న మాఫియా ఆగడాలపై రెండు నెలల క్రితమే ’సాక్షి’ కథనం ఇచ్చింది. ఈ మాఫియాకు రాష్ట్రంలోని అధికార పార్టీలోని కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలూ సహకరిస్తున్న విషయాన్ని బయటపెట్టింది. అయినా స్పందించని పోలీసులు తాజా ఘటనతో కళ్లుతెరిచారు. తమదాకా వచ్చేసరికి... బుధ, గురువారాల్లో అక్రమంగా తరలిపోతున్న గోవులను పోలీసులు పట్టుకున్నారు. వీటిల్లో 40 వరకూ మృత్యువాత పడటంతో ఆ శాఖలో కదలిక వచ్చింది.. 72 గోవులతో వెళుతున్న కంటెయినర్ను బుధవారం మ«ధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద త్యాజంపూడికి చెందిన గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నల్లజర్ల మండలం ఆవపాడు వద్ద గల గోసంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాసుకు సమాచారం వచ్చారు. అతను తమవద్ద ఖాళీ లేదని.. దేవరపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కంటెయినర్ను పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి రాత్రి 9 గంటల సమయంలో కాకినాడ ప్రభుత్వ గోసంరక్షణ సమితికి పంపించారు. అప్పటికే కంటెయినర్లో ఉన్న 30 గోవులు మృతి చెందినప్పటికీ దానిని కాకినాడ పంపించారు. అక్కడ నిర్వాహకులు గోవులను దించుకోవడానికి నిరాకరించారు. అక్కడి నుంచి గురువారం ఉదయం కంటెయినర్ను దేవరపల్లి పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి సాయంత్రం 6 గంటల సమయంలో మళ్లీ ఆవపాడు వద్ద గల గోసంరక్షణ సమితికి పంపించారు. అయితే మృతి చెందిన గోవులను దించుకోవడానికి నిర్వాహకుడు శ్రీనివాస్ నిరాకరించాడు. బతికున్న వాటిని మాత్రమే తీసుకున్నాడు. మృతి చెందిన గోవులను లారీ డ్రెవర్ నల్లజర్లతాడేపల్లిగూడెం రోడ్డులో రోడ్డు పక్కన దింపుతుండగా.. పరిసర ప్రజలు అడ్డుకున్నారు. రాత్రి 11 గంటల సయంలో మృతి చెందిన 32 గోవుల కళేబరాలను దేవరపల్లి, నల్లజర్ల ఎస్సైలు కంటెయినర్తో తీసుకువచ్చి యర్నగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టున గొయ్యితీసి పాతిపెట్టారు. మిగిలిన వాటిని గోసంరక్షణ సమితికి అప్పగించారు. చిత్రహింసలు పెట్టారు. ఇదిలా ఉంటే గోవులను దించుకోవడానికి నిరాకరించడంతోపాటు కంటెయినర్ డ్రైవర్ను డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలతో గోసంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాస్, సహాయకుడు రాఘవేంద్రరావును దేవరపల్లి ఎస్సై వాసు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ముందుగా నల్లజర్ల పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అక్కడ శ్రీనివాస్ను చిత్రహింసలకు గురిచేసిన అనంతరం రాత్రి 12 గంటల సమయంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి దారుణంగా కొట్టినట్టు శ్రీనివాస్ విలేకరులకు చెప్పారు. పోలీసులు బాగా కొట్టడంతో అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు. మంత్రుల దృష్టికి వివాదం పోలీసుల చిత్రహింసలపై నిర్వాహకుడు హోంమంత్రి చినరాజప్ప, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రుల జోక్యంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గతంలో జిల్లాలోని ఏయే పోలీస్ స్టేషన్ల పరిధిలో గోవులను స్వాధీనం చేసుకున్నారు. ఆవపాడు గోసంరక్షణ సమితికి ఎన్ని గోవులను అప్పగించారు అనే దానిపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అప్పగించిన గోవులన్నీ సమితిలో ఉన్నాయా, లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. గో సంరక్షణ సమితి వెనుక మాఫియా! : ఎస్సై గోసంరక్షణ సమితి నిర్వాహకుడిపై వచ్చిన ఫిర్యాదులపై శ్రీనివాసు, మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్టు దేవరపల్లి ఎస్సై పి.వాసు తెలిపారు. కేసు నుంచి బయటపడడానికి తాము కొట్టినట్టు శ్రీనివాస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, కొట్టడం వాస్తవం కాదన్నారు. కంటెయినర్ దేవరపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చే టప్పటికే 30 గోవులు మృతి చెందినట్టు ఆయన తెలిపారు. గోసంరక్షణ సమితి వెనుక పెద్ద మాఫియా ఉందని వివరించారు. విచారణ తర్వాత వివరాలను చెబుతామని ఆయన పేర్కొన్నారు. ఒడిశా నుంచి రవాణా ఒడిశా, శ్రీకాకుళం నుంచి, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ప్రతిఏటా వేలాది పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కే కాక, బంగ్లాదేశ్కూ పశువుల రవాణా యథేచ్ఛగా జరుగుతోందని సమాచారం. దీనికి పశ్చిమ గోదావరి జిల్లా అడ్డాగా మారింది. జిల్లాలో పదుల సంఖ్యలో దళారులు తయారై పశువుల రవాణా చేస్తున్న వాహనాలను సరిహద్దు దాటించడం పనిగా పెట్టుకున్నారు. వివిధ జిల్లాల నుంచి పశువులను ఆయా మార్కెట్లలో కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా కంటెయినర్లలో పశువులను సామర్థ్యానికి మించి లోడ్ చేసి పైన్ టార్పాలిన్ కప్పి అనుమానం రాకుండా రవాణా చేసేస్తున్నారు. ఈ విషయాలను రెండు నెలల క్రితమే సాక్షి వెలుగులోకి తీసుకువచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు తమదాకా వచ్చే సరికి హైరానా పడుతున్నారు. -
అంబా...అని అరిచినా...
ఒకే రోజు 20 ఆవుల మృత్యువాత కమిటీ సభ్యుల నిర్లక్ష్యం బట్టబయలు ఏడాదిగా విమర్శలున్నా పట్టించుకోని అధికారులు కాకినాడ రూరల్: గోవు సర్వ దేవతల స్వరూపమని హిందూ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అందుకే గోవును హిందువులు తల్లి లాంటిదని, పాలిచ్చి పెంచేదని, అది ఎంతో పవిత్రమైందిగా భావిస్తూ దాన్ని గోమాతగా పూజిస్తారు. సంక్రాంతి పండుగ సమయంలో చేసే ముత్యాల ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టేందుకు ఆవుపేడను ఉపయోగిస్తారంటే దాని ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. అలాంటి పవిత్ర గోమాతలకు రక్షణగా ఉండాల్సిన జంతు హింస నివారణ సంఘం ఆశ్రమ కమిటీ సభ్యులు నిర్లక్ష్యం చూపించడంతో ఆవులు చనిపోవడం ప్రారంభించాయి. ఈ ఆవరణంతా బురద, దోమలు, అడుగు వేస్తే ఊబిలో దిగబడిపోయే విధంగా ఉండడంతో గత ఐదారు రోజులుగా వందలాది ఆవులు ఒంటి కాళ్లపై నిలబడి ఉండడం, సరైన పశుగ్రాసం లేకపోవడంతో మృత్యువాత పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 20కి పైగా ఆవులు చనిపోవడం చూస్తే నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు, ఇతరేతర సంఘాలకు చెందిన వారు స్థానికంగా రోడ్లపై తిరిగే ఆవులను, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా గోవధకు తరలిస్తున్న ఆవులను పట్టుకొని ఈ సంఘ సభ్యులకు అప్పగిస్తారు. తీరా ఇక్కడకు వచ్చిన తరువాత మేత లేకపోవడంతో అనేక ఆవులు మృత్యువాత పడుతుంటాయి. మరికొన్ని ఆవులను ఇక్కడ నుంచి తరస్తుంటారు... అయితే ఇవి ఎక్కడికి తరలిస్తారనేది ఎవరికీ తెలియని ప్రశ్నగానే ఉందని స్థానికులు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ మొత్తం దాతల విరాళాలపైనే నడుస్తుంది. గతంలో ప్రభుత్వం ఈ సంస్థ నిర్వహణకు కొంత నిధులు కేటాయించేదని, సంఘం తమదంటే తమదని రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల కోర్టుకు వెళ్లడంతో నిధులు నిలిపివేయడంతో కొత్త చిక్కులు ఏర్పడ్డాయని సంఘ సభ్యులే చెబుతున్నారు. తరువాత పూర్తిగా విరాళాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. సంరక్షణ సరిగ్గా లేక... గోవులకు మేత కూడా సరిగ్గా వేయకపోవడంతో అవి బక్కచిక్కి మృత్యువాత పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవగాహన లేకపోవడంతో ఇష్టమొచ్చిన రీతిగా కోత గడ్డికి బదులుగా మిషన్ గడ్డిని పెట్టడంతో అవి తినలేక బక్కచిక్కి ఆకలితో అలమటిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో ఆవుకు 11 కేజీల పచ్చిగడ్డి పెట్టాలి. కాని ఇక్కడ పచ్చిగడ్డి అనేదే కనిపించదు. కదిలిన అధికార యంత్రాంగం... ఈ ప్రాంగణంలో ఒకే రోజు 20కి పైగా ఆవులు చనిపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. పశుగ్రాసం కరువుతోనే ఆవులు మరణించినట్లు అధికారులు నిర్థారించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా పశువైద్య జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్టీవో రఘుబాబుల పర్యవేక్షణలో 27 మంది పశువైద్యులు బుధవారం ఉదయమే జంతుహింస నివారణ సంఘానికి చేరుకొని పశువులకు ఇంజెక్షన్లు చేశారు. 10 నుంచి 20 వరకు ఆవులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. అధికారులు విచారణ చేస్తున్న సమయంలో సంఘ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఒకానొక సమయంలో ముష్టి ఘాతాలకు దిగారు. ప్రస్తుతం ఉన్న సంఘాన్ని రద్దు చేసి, స్థానికంగా ఉన్న పెద్దలకు నిర్వహణ అప్పగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. మూగ జీవులను అమ్ముకొంటున్నారని ఉన్న జీవాలకు కనీసం గడ్డి కూడా వేయడంలేదంటూ స్థానికులు అధికారుల ఎదుట ఆందోళన చేశారు. దీనిపై పూర్తి విచారణ చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తానని జేడీ వెంకటేశ్వరరావు వివరించారు. ప్రత్యేక జేసీబీతో ఆ ప్రాంతంలో ఉన్న ఊబిలా మారిన బురదను తొలగించే పనులు చేపట్టారు. ఈ విచారణ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆలీంబాషా, కాకినాడ అర్బన్ తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఆవును చంపితే 14 ఏళ్లు.. మనిషిని చంపితే రెండేళ్లు:జడ్జి
న్యూఢిల్లీ: లగ్జరీ కారుతో ఓ మోటార్ సైక్లిస్టును ఢీ కొట్టిన ఘటనలో ఇండస్ట్రియలిస్ట్ తనయుడికి ఢిల్లీ కోర్టు 2 సంవత్సరాల శిక్షను శనివారం విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో 2008లో జరిగిన ఈ ఘటనపై గత తొమ్మిదేళ్ల విచారణకు తెరపడింది. 2008 సెప్టెంబర్ 11వ తేదీన బీబీఏ చదువుతున్న భసిన్.. తన బీఎండబ్ల్యూ కారుతో దక్షిణ ఢిల్లీలోని మూల్చంద్ ప్రాంతంలో మోటార్ సైకిల్పై తన స్నేహితుడు మృగాంక్ శ్రీవాస్తవతో కలిసి వెళ్తున్న అనుజ్ చౌహన్ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాద అనంతరం చండీఘర్కు పారిపోతున్న భసిన్ను పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు. ఈ కేసును పలుమార్లు విచారించిన సెషన్స్ కోర్టు భసిన్కు రెండేళ్ల పాటు శిక్షను విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే, భసిన్కు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి సంజీవ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆవును చంపిన వ్యక్తికి 5 నుంచి 14 సంవత్సరాల వరకూ శిక్ష పడుతోందని.. అదే మనిషిని చంపిన వ్యక్తికైతే కేవలం 2 సంవత్సరాల శిక్షే పడుతోందని అన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్ధ అలా ఉందని తామేమైనా చేయడానికి సాయం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. జడ్జిమెంట్ కాపీని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంపుతున్నట్లు చెప్పారు. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 304-ఏలో మార్పులు చేయడానికి ఈ జడ్జిమెంట్ కాపీ ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారు. -
‘గోరక్ష’ దౌర్జన్యాన్ని సహించొద్దు
► రాష్ట్రాలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ► గోవు పేరుతో సమాజంలో అస్థిరతకు ప్రయత్నం ► అఖిలపక్ష సమావేశంలో కోరిన ప్రధాని మోదీ ► దేశ భద్రతపై కేంద్రానికి సహకరిస్తామన్న విపక్షాలు న్యూఢిల్లీ: గోరక్ష పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస, దౌర్జన్యాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. గోరక్షను కారణంగా చూపుతూ ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని.. పలువురు సంఘ వ్యతిరేక శక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమాజంలో అస్థిరతకు కారణమవుతున్నారని మోదీ తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష నేతలతో మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. గోరక్ష పేరుతో జరుగుతున్న మత హింసను అరికట్టడంలో విపక్షాలు సహకారం అందించాలని ప్రధాని కోరారు. ఆవుపేరు చెప్పుకుని రాజకీయ, మత వివాదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ‘గోవును తల్లిగా భావిస్తాం. ఇది మన మనస్సుకు సంబంధించిన అంశం. గోరక్షకు సంబంధించిన చట్టాలున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించటమే సమస్యకు ప్రత్యామ్నాయం కాదు. సంఘ విద్రోహశక్తులు గోరక్షను ఉపయోగించుకుని అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఈ దేశంలోని సామాజిక సామరస్యానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు. ఇలాంటి ఘటనలు దేశ గౌరవానికి భంగం కలిగిస్తాయన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’అని అఖిలపక్ష భేటీలో తెలిపారు. కొంతకాలంగా దేశంలో గోరక్ష పేరుతో జరుగుతున్న అవాంఛిత ఘటనల్లో దళితులు, ముస్లింలే బాధితులవుతున్నారన్న విపక్షాల ఆందోళనల నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం∙సంతరించుకున్నాయి. చర్చలకు సహకరించండి: మోదీ పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగటంలో విపక్షాలు.. ప్రభుత్వానికి సహకరిం చాలని మోదీ కోరారు. దేశ భద్రత, జాతీయ ప్రాముఖ్యత, ప్రజోపయోగ అంశాలపై చర్చ జరగటంలో క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే నిర్మాణాత్మక చర్చతో పరిష్కరించుకోవాలని కోరారని అనంత్ కుమార్ వెల్లడించారు. భేటీలో గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ). సీతారాం ఏచూరి(సీపీఎం), డి. రాజా (సీపీఐ), ములాయం సింగ్ (ఎస్పీ), ఫారూఖ్ అబ్దుల్లా (ఎన్సీ) తదితర నేతలు పాల్గొన్నారు. జేడీయూ నుంచి ఎవరూ హాజరుకాలేదు. పశ్చిమబెంగాల్లో చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో బీజేపీతో తీవ్రస్థాయిలో విభేదాల కారణంగా ఈ భేటీకి హాజరుకాబోమని తృణమూల్ ఇదివరకే చెప్పింది. అవినీతిపై.. అంతా ఒక్కటై! అవినీతిని పారద్రోలటంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు విపక్షాలు పూర్తిగా సహకరించాలని ప్రధాని కోరారు. తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల పేర్లు ప్రస్తావించకుండానే.. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు రాజకీయ వివాదాన్ని సృష్టిం చి తప్పించుకోవాలని చూస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని దోచుకున్న వారికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుంటే.. రాజకీయ వివాదాలను సృష్టించి తప్పించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా మనమంతా ఏకమవ్వాలి’ అని విపక్ష నేతలను మోదీ కోరారు. ‘ప్రజాజీవనంలో నిజాయితీగా ఉండటమే కాదు.. అవినీతికి పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవటమూ ముఖ్యమే. ప్రతి పార్టీ అలాంటి వారి ని గుర్తించాలి. వారిని ఏకాకి చేయాలి’ అని మోదీ కోరారు. సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యుం టే బాగుండేదని ప్రతిపక్ష సభ్యులతో ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ వివరిస్తూ.. జీఎస్టీ అమల్లో సహకరించిన విపక్షాలందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారన్నారు. ‘సహకార సమాఖ్య విధానానికి ఇదొక ఉదాహరణ’గా పేర్కొన్నారన్నారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమానికి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అన్ని పార్టీలూ.. సంబ రాలు జరపాలని మోదీ కోరారన్నారు. కశ్మీర్, చైనా అంశాలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ అన్ని పార్టీలు సానుకూలంగా మాట్లాడాయని అనంత్ కుమార్ తెలిపారు. దేశ భద్రత విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతిస్తామని వెల్లడించాయన్నారు. ‘అన్ని పార్టీలు సంయుక్తంగా గోరక్ష పేరుతో జరుగుతున్న దౌర్జన్యాన్ని ఖండించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సంఘ వ్యతిరేక శక్తులపై కఠినచర్యలు తీసుకోవాలి’ అని అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. -
ఆవును రక్షించిన ముస్లింలు
లక్నో: గో మాంసం కోసం ఆవులను కబేళాలకు తరలిస్తున్నారనే అనుమానాలపై అమాయకులను కొట్టి చంపుతున్న నేటి సమాజంలో ఆపదలో చిక్కుకున్న ఓ ఆవును ముస్లింలు రక్షించడం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా, బిలారి గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. బిలారి గ్రామంలోని ఓ స్మశానంలోకి రెండు రోజుల క్రితం ప్రవేశించిన ఓ ఆవు ప్రమాదవశాత్తు అందులో ఉన్న ఓ గుంతలో పడిపోయింది. బయటకు వచ్చే దారిలేక బాధపడుతుంటే గమనించిన ముస్లిం యువకులు తమ పెద్దలకు చెప్పారు. వారు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తాళ్లు తీసుకొచ్చి ఆవుకు కట్టారు. అప్పటికే దాని నోరు ఎండిపోవడంతో నీళ్లు తెచ్చి తాపించారు. అనంతరం దాన్ని వెలుపలికి తీశారు. గ్రామస్థులు వారి మానవత్వానికి ప్రశంసించారు. -
ఆవులకు ‘రాజ’స్థానం..
రాజస్తాన్లో సామాన్యుడిని మించి సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న జీవి ఏంటో తెలుసా? ఆవు.. అవును ఆవే.. ఎందుకంటే.. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఒక్కో ఆవు పోషణకు రోజుకు రూ.70 అందించనుంది.. దూడ కూడా ఉంటే మరో రూ.35.. అదే సమయంలో సామాన్యులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న మొత్తం ఒక్కొక్కరికి రూ.26.65 మాత్రమే. ఇక్కడ నగరాల్లో నివసిస్తూ రోజుకు రూ.28 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే గ్రామాల్లో రూ.25.16 కంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ఈ కేటగిరీలోకి చేర్చింది. నిరుపేదల సంక్షేమానికి నిధులు వెచ్చించడానికి ఆలోచించే సర్కారు.. ఇలా గోవులకు మాత్రం భారీ మొత్తంలో నిధులు ధారపోస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, సంరక్షణ లేక వేలాది ఆవులు చనిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సమావేశంలో రోజుకు ఆవుకు రూ.32, దూడకు రూ.16 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గత నెల జరిగిన భేటీలో దాన్ని దాదాపు రెట్టింపు చేశారు. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి వివిధ రకాల లావాదేవీలపై 10 శాతం చొప్పున ఆవు పన్నును కూడా విధించారు. ఈ మొత్తం సరిగ్గా వినియోగమవుతుందా లేదా అన్నది చూసేందుకు గోశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధులను ఆవుల ఆహారం నిమిత్తం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆవుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం రాజస్తానే కావడం విశేషం. – సాక్షి, తెలంగాణ డెస్క్ ఒక్కో ఆవు కోసం రోజుకు వెచ్చించనున్న మొత్తం (రూ.లలో) 70 ఒక్కో దూడ కోసం రోజుకు వెచ్చించనున్న మొత్తం (రూ.లలో) 35 బీపీఎల్కు దిగువనున్న పేదలకు (ఒక్కొక్కరికి) వెచ్చిస్తున్న మొత్తం (రూ.లలో) 26.65 -
గోభాగ్యం!
నగరంలో అరుదైన జాతి ఆవులు – పుంగనూరు, కపిల, దేవ్నీల సందడి పెంపకానికి ముందుకొస్తున్న ఔత్సాహికులు – గో ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: అరుదైన దేశీ ఆవులకు భాగ్యనగరం కేరాఫ్గా మారుతోంది! దేశమంతా విదేశీ జాతి ఆవుల వెల్లువలో కొట్టుకుపోతుంటే.. నగరంలో మాత్రం పలువురు పుంగనూరు, దేవ్నీ, కపిల, థార్ పార్కర్, గిర్, కాంక్రేజ్, సాహివాల్ తదితర జాతి ఆవులను పెంచుతున్నారు. వీటిలో అంతరించే దశకు చేరుకున్న జాతి ఆవులు కూడా ఎక్కువగా ఉండటం విశేషం. ఇందులో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు(70–90 సెం.మీ), బరువు (100–150 కేజీలు)తో, భూమిని తాకే తోకతో విలక్షణంగా కనిపించే పుంగనూరు ఆవులు, దూడలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి నగరంలో పలు ఇళ్లలో కనిపిస్తున్నాయి. ఈ ఆవులు తక్కువ మేతతో సగటున రోజుకు రెండు పూటలా 8 లీటర్ల పాలు ఇస్తున్నాయి. 8 నుంచి 8.5 కొవ్వు శాతం ఉండే వీటి పాల కోసం అనేక మంది వీఐపీలు ఎంత మొత్తమైనా చెల్లించేందుకు క్యూ కడుతున్నారు. నిజాం హయాంలో లాతూర్ ప్రాంతం నుంచి నగరానికి వచ్చిన దేవ్నీ ఆవులు ప్రస్తుతం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. బీదర్, బసవకళ్యాణ, బాల్కి తదితర జిల్లాల్లో వేళ్లపై లెక్కపెట్టగలిగే సంఖ్యలో ఉన్న ఈ జాతి (దక్కనీ బ్రీడ్) ఆవులు సైతం నగరంలో కనిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన స్వర్ణ కపిల, రాజస్థాన్కు చెందిన థార్ పార్కర్, గిర్, పంజాబ్ సాహివాల్ జాతుల ఆవులను కూడా నగరంలో పలువురు పెంచుకుంటున్నారు. దేశీ ఆవుపాలు, మూత్రం, పేడ అన్నింట్లో పుష్కలమైన ఔషధ లక్షణాలున్నాయని తేలడంతో వాటి ఉత్పత్తులకూ డిమాండ్ ఏర్పడింది. పాలతోపాటు మూత్రం, పేడతో తయారు చేసే పిడకలను ఆన్లైన్లో విక్రయిస్తుండటం విశేషం. వైఎస్.. ఓ రామదాసు.. అది 2005 జూన్ 2.. రాష్ట్రంలో పాల దిగుబడులపై ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతోంది.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అన్ని సిద్ధం చేసుకున్నాడు ఏపీ డెయిరీ ఉద్యోగి రామదాసు.. అధికారుల కంటే ముందుగానే సీఎం వైఎస్ హాల్లోకి వచ్చేశారు. సమావేశం ప్రారంభం కాకముందే సీఎం వద్దకు చేరుకున్న రామదాసు.. ‘సార్ ఒక్క విన్నపం.. చేసుకోవచ్చా.. నాకో ఆవు కావాలి..’అన్నాడు. అందుకు వైఎస్ ‘ఏమయ్యా.. అందరూ వచ్చి కాంట్రాక్టు కావాలనో లేదా పదవి కావాలనో, మంచి పోస్టింగ్ కావాలనో అడుగుతారు. మీరేంటి ఆవు కావాలని అడుగుతున్నారు? ఎక్కడ్నుంచి తెచ్చివ్వాలి..’’అంటూ నవ్వేశారు. చివరికి ఆయన కోరిక మేరకు.. రామదాసుకు ఓ పుంగనూరు ఆవు–కోడె ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించాడు. అలా వచ్చిన పుంగనూరు ఆవు, కోడెను ఉప్పల్లోని తన ఇంటి ఆవరణలోనే పెంచుకున్నాడు. ఇప్పుడు వాటి సంతానం 17కు చేరింది. ఇటీవలే రామదాసును రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ బ్రీడ్ సేవియర్ అవార్డుతో సత్కరించింది. మా పాలకు మహా గిరాకీ హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలో నా సొంత ఆవరణలో పుంగనూరు, సాహివాల్, గిర్, ఒంగోలు, కపిల జాతి దేశీ ఆవులను పదహారేళ్లుగా పెంచుతున్నా. దేశంలోనే అతి పొట్టి (3 అడుగులు ఎత్తు) పుంగనూరు ఆవు నా వద్దే ఉంది. ఉదయం సాయంత్రం కలిపి 10 లీటర్ల వరకు పాలు ఇస్తోంది. ఈ పాలకు విపరీతమైన గిరాకీ ఉంది. లీటరు పాల ధర రూ.200 వరకు విక్రయిస్తాం. అనేక మంది వీఐపీలు పాల కోసం వస్తుంటారు. –పొనుగోటి శ్రీనివాసరావు స్వదేశీ ఉద్యమకర్త.. నరేశ్రెడ్డి వైద్య వృత్తిని సైతం కాదనుకొని దేశీ జాతుల సంరక్షణ బాధ్యతను భుజాన వేసుకున్నాడు ఈ ముప్పై రెండేళ్ల డాక్టర్ నరేశ్రెడ్డి. అడ్డగుట్టలోని తన నివాసంతోపాటు శామీర్పేట వ్యవసాయ క్షేత్రంలో దేశీ ఆవులు, కోడెల్ని సంరక్షిస్తున్నారు. స్వర్ణ కపిల, పుంగనూరు, గిర్, పల్నాడ్ గిద్డ, వేచూరు, కాసరగోడ్ తదితర ఆవుల పోషణను వృత్తిగా మార్చుకున్నారు. దేశీ ఆవు అమ్మతో సమానమని, అందుకే వాటి పరిరక్షణను హాబీగా కాకుండా వృత్తిగా ఎంచుకున్నానని ఆయన చెప్పారు. గోసంపన్నుడు.. ‘పుంగనూరు’ రామదాసు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడు అరుదైన పుంగనూరు ఆవు–దూడలతో ఏపీ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ రామదాసు నివాసం ఎల్లప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. పన్నెండేళ్ల క్రితం ఆయన ఒక ఆవు–కోడె తీసుకురాగా.. ఇప్పుడు వాటి సంఖ్య 17కు చేరింది. వాటిని రామదాసు దంపతులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తిరుపతిలో స్వామి వారి అభిషేకానికి పుంగనూరు ఆవు పాలను వినియోగిస్తున్న తరహాలోనే.. యాదగిరి లక్ష్మీ నర్సింహస్వామికి పుంగనూరు పాలతో అభిషేకం చేయాలని ఆయన అభిలషించారు. ఆవు ఉంటే అనారోగ్యం ఉండదు దేశీ ఆవు పాలల్లో అనేక ఔషధాలున్నాయి. ఆవు ఉన్న ఇంట్లో అనారోగ్యం ఉండదు. అందుకే నేను పుంగనూరు, సాహివాల్, కపిల జాతుల్ని పోషిస్తున్నా. పుంగనూరు జాతి ప్రపంచంలోనే అత్యంత శ్రేయస్కరమైంది. దేశవాళీ ఆవుల పాలు, నెయ్యితోపాటు పేడలోనూ రేడియేషన్ను తగ్గించే లక్షణం ఉంది. ఆవు పాలతో తయారు చేసే ఔషధాలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. ఇంటింటా దేశీ జాతి ఆవులను పెంచుకుంటే బ్యాంకు అకౌంట్లో కావల్సినంత ధనం ఉన్నట్టే. – సత్యవీర్ -
‘గోరక్షణ’ హత్యలను సహించం
ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక ► గాంధీ, వినోబా భావే కన్నా గొప్ప గోరక్షకులు లేరు ► గోభక్తి పేరుతో హింసకు పాల్పడటం సరికాదు ► ‘సబర్మతి’ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రధాని అహ్మదాబాద్: గోరక్షణ, మూక దాడుల పేరుతో జరిగే హత్యలను ఆమోదించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని హెచ్చరించారు. గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించి వందేళ్లు అయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను మోదీ గురువారం ఇక్కడ ప్రారంభించారు. ‘గోభక్తి పేరుతో హింసను ప్రేరేపించటం.. మహాత్మాగాంధీ ఆలోచనకు పూర్తి వ్యతిరేకం’ అని తర్వాత బహిరంగసభలో అన్నారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల సాధించేదేమీ ఉండదని స్పష్టం చేశారు. ‘నేడు సబర్మతి ఆశ్రమంలో ఉండి ఈ విషయంపై మాట్లాడటం బాధగా ఉంది. చీమలు, వీధికుక్కలు, చేపలకు ఆహారం వేసే గొప్ప సంస్కృతి ఉన్న దేశం మనది. ఈ గడ్డపైనే మహాత్ముడు మనకు అహింసా పాఠాలు నేర్పారు. కానీ ఇప్పుడేమైంది? ఆపరేషన్ విఫలం కావటంతో రోగి చనిపోతే.. బంధువులు ఆసుపత్రిని తగలబెడుతున్నారు. డాక్టర్లను చితగ్గొడుతున్నారు. ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి. ప్రమాదంలో ఎవరో చనిపోతేనో గాయపడితేనో కొందరు కలిసి వాహనాలు తగులబెడుతున్నారు’ అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చంపే హక్కు ఎవరికీ లేదు! ‘గోరక్ష, గోపూజలో మహాత్మాగాంధీ, ఆయన అనుచరుడు వినోబా భావేను మించినవారు లేరు. గోరక్ష ఎలా చేయాలో వారే మనకు నేర్పించారు. దేశమంతా వీరి మార్గాన్నే అనుసరించింది. భారత రాజ్యాంగం కూడా గోరక్ష గురించి చెబుతోంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ఓ వ్యక్తిని చంపే హక్కుందా? ఇదేనా గోభక్తి? ఇదేనా గోరక్ష?’ అని ప్రశ్నించారు. గోభక్తి పేరుతో మనుషులను చంపటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారాయన. ‘గాంధీ కలలుగన్న భారతాన్ని నిర్మించేందుకు అందరం కలిసి పనిచేద్దాం. మన స్వాతంత్య్ర సమరయోధులు గర్వపడేలా భారతదేశాన్ని మార్చుకుందాం’ అని మోదీ పిలుపునిచ్చారు. గోవుకు సంబంధించి తన జీవితంలో జరిగిన ఓ ఘటనను మోదీ గుర్తుచేశారు. గోరక్ష విషయంలో చనిపోయేందుకైనా చనిపోవాలని వినోబా భావే సూచించారన్నారు. సబర్మతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆశ్రమం మొత్తం పరిశీలించిన మోదీ.. మహాత్ముడి గొప్పదనాన్ని, అహింసా వాదాన్ని సూచించే పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. తర్వాత రాజ్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో 18,500 మంది దివ్యాంగులకు సహాయక పరికరాలందించారు. -
సెక్స్డ్ సెమన్తో వంద శాతం పెయ్యలు
అనంతపురం అగ్రికల్చర్ : సెక్స్డ్ సెమన్తో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తే వంద శాతం పెయ్య దూడలు పుడతాయని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి తెలిపారు. మొదటిసారిగా రెండు రోజుల కిందట జిల్లాకు 240 డోసుల సెక్స్డ్ సెమన్ సరఫరా అయిందన్నారు. ఒక్క డోసు పూర్తీ విలువ రూ.1,000 కాగా ఇందులో రైతులు తమ వాటాగా రూ.250 చెల్లిస్తే పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుందన్నారు. దీని వల్ల కచ్చితంగా చూడి (గర్భం) నిలవడమే కాకుండా 100 శాతం పెయ్య (ఆడ) దూడలు పుడతాయని తెలిపారు. మేలుజాతికి చెందిన హెచ్ఎఫ్, జెర్సీ రకాల నుంచి సేకరించిన వీర్యాన్నే సెక్స్డ్ సెమన్గా పిలుస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆవులకు మాత్రమే సెక్స్డ్ సెమన్ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. డీఎల్డీఏ కార్యాలయం, గోపాలమిత్రలను సంప్రదించి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. -
‘గోరక్షణ’ రాజకీయం!
ఆలోచనం ‘‘అనుత్పాదక పసరాన్ని తొలగించకుండా రైతులు.. గోవులను పెంచలేరు’’ అన్నారు కురియన్. శంకరాచార్య దీనిని ఖండించినపుడు ‘‘మీరు అనుత్పాదక గోవులను పోషించే భారం తీసుకోగలరా’’ అని కురియన్ ప్రశ్నించారు. 2017కి నక్సల్బరీకి యాభయ్యేళ్లు నిండాయి. ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సందర్భంలో నా మనసు, గూడ అంజన్న రాయగా లేబ్రాయపు గద్దర్ పాడిన వందనాలు... పాట దగ్గర చిక్కుకుపోయింది. పేద ధనిక అంతరాలు లేని చల్లని ప్రపంచాన్ని కలగని, ప్రాణాలు కోల్పోయిన తమ పిల్లల గురించి ‘‘ఏ దిక్కూ లేనోళ్లకూ మా బిడ్డలూ/ మీరు దిక్కు చూపే చుక్కలయ్యిండ్రా’’ అంటూ సాగే తల్లుల కడుపుశోకం ఆ పాట. జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిషేధించే చట్టానికి చెందిన నియమాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణ చేసినపుడు ‘‘కట్టిన ఆ తెల్ల ఆవును కంటి పాపల చూసుకుంటాం/పచ్చిగడ్డీ పిండి పెట్టి ప్రాణమోలే పెంచుకుంటాం/పురిటి నెప్పులు దానికొస్తే కాపలుండి కాన్పుజేస్తం/తల్లి లేగను నాకుతుంటే తల్లి ప్రేమా గురుతుకొచ్చే/మీరు పురిటి నెప్పూలయ్యి వస్తారా మా బిడ్డలు/మళ్లీ జన్మయ్ మాకే పుడతారా మా బిడ్డలూ’’ అంటూ సాగే ఈ పాట మళ్లీ నన్ను వెంటాడింది. నేపాల్లోని గదిమాయి దేవతకు బలి ఇవ్వడానికి భారత్ నుంచి జరుగుతున్న లక్షలాది పశువుల అక్రమ ఎగుమతిపై చర్య తీసుకోవాలని పీపుల్ ఫర్ ఎనిమల్స్ కార్యకర్త గౌరి మాలేఖి 2014 సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 13 జూలై 2015లో ‘ఇండియా నుంచి ఇతర దేశాలకు పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి, కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలు చేయాలని’ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పశువుల మార్కెట్లలో రైతుల మధ్యే క్రయవిక్రయాలు జరగాలనీ, అది కేవలం వ్యవసాయ సంబంధిత పనుల కోసమే జరగాలని, ఆవులు గేదెలు దూడల వంటి వాటిపై ఎటువంటి హింసా జరగరాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నియమాలను సవరించింది. ఈ అస్పష్టపు సవరణ తిరిగి భారతీయులను గో భక్షకులు, గో రక్షకులు అని రెండు వర్గాలుగా విడకొట్టింది. గోరక్షకులలో ఉన్నత ఆర్థిక వర్గాల వారు, సాధువులు, మఠాధిపతులు ఉండగా, గో భక్షకులలో దళి తులు, ముస్లిములు చేరారు. వీరిపై హింసకు పాల్పడే వారుగా ముద్ర వేస్తున్నారు. ఈ చర్చ నిజానికి రైతు దగ్గర మొదలు పెట్టాలి. కొన్నేళ్ల క్రితం నేను బెంగాల్ లోని కూచ్ బిహార్, సిలిగురి ప్రాంతాలలో ఉండేదానిని. ఇక్కడనుంచి బంగ్లాదేశ్, నేపాల్లకు ప్రతిరాత్రి మందల కొద్దీ పశువుల అక్రమ రవాణా నిత్యకృత్యం. ఈ పశువులను అమ్మేవాళ్లు మాత్రం రైతులూ, పేద దిగువ తరగతి వారు. వీళ్లలో అత్యధికులు హిందువులు. గోవును మాతలా పూజించే ఈ రైతులు వట్టిపోయిన గోవును వధ్యశాలకు లేదా వధ్య వ్యాపారికి ఎందుకు అమ్ముతున్నారు? దీనినే తెల్ల విప్లవ పితామహుడు కురియన్ తన ‘ఐ టూ హేడ్ ఏ డ్రీమ్’లో ‘‘మనం పాలు తాగడమంటే, మాంసం కూడా భక్షించడమే. అనుత్పాదక పసరాన్ని తొలగించకుండా రైతులు పాలు ఇచ్చే గోవులను పెంచలేరు’’ అన్నాడు. శంకరాచార్య ఈ వాదనను ఖండించినపుడు ‘మీరు దేశంలో ఉండే అనుత్పాదక గోవులను పోషించే భారం తీసుకోగలరా’ అని ప్రశ్నించారు. అయితే రైతులో లేదా పసరాలను పెంచే నిమ్నాదాయ వర్గాలవారో జంతువుల పట్ల హింసాయుతంగా ఉంటున్నారా ? లేదూ మాంసం భక్షించే ఆయా జాతుల వాళ్ళు గో రక్షకులంత ప్రేమగా జంతువుల పట్ల ఉండటం లేదా అనేది ప్రశ్న .. నా దగ్గరున్న జంతువులలో ఒక గొర్రె ఉంది. దాని పేరు శాంతి. నాలుగు నెలల పిల్లగా 2007లో అది నా ఇంటికి వచ్చింది. ‘‘మేరీ హాడ్ ఏ లిటిల్ లాంబ్’’ పిల్లల పాటలోలాగా నిత్యం మా అమ్మాయి వెనుకే తిరిగే శాంతికి నోరు ఒక్కటి లేదు కానీ అన్ని మనోభావాలు ఉంటాయి. ఇంత కమ్యూనికేట్ చేసే ఈ జీవిని హత్య చేసి మనుష్యులు ఎలా తినగలుగుతున్నారు అని నాకు అనిపిస్తుం టుంది? ఆ తర్వాతి ప్రశ్న, అంత కాలం పాలిచ్చిన సాత్విక జీవిని మాంసానికి ఎలా అమ్మేస్తున్నారు అని? ఇక్కడే నాకు కురియన్ ప్రశ్న మళ్లీ జ్ఞాపకమొచ్చింది, నేను, లేదా గోవధను వ్యతిరేకించే పశు ప్రేమికులు రైతులకు ఎంత ఇవ్వాలో అంత ధనం ఇచ్చి గోశాలలు ఏర్పరచి గోరక్షణ చేయగలరా? ప్రభుత్వం అలా గోరక్షణ శాలలు ఏర్పరిచే దిశగా ధనికులను ప్రోత్సహిస్తుందా? దీనిపై గాంధీ స్పష్టంగా ఇలా చెప్పాడు ‘‘గోశాలలు, గోరక్షణ సంఘాలు కేవలం కొన్ని గోవులను తెచ్చి కట్టి పడవేయటం కాకుండా, గోవులకు మేతను సమకూర్చడం, పచ్చిక బయళ్లను కాపాడటం, పేద రైతుల నుంచి గోవులను కొనుగోలు చేయడం వంటి విస్తృత చర్యలు చేపట్టాలి’’ అని. ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుండా గో ప్రేమని పేద రైతులపై రుద్దటం అన్యాయం కదా. ‘వందనాలు’ పాటలోనే మరో వాక్యం ఉంది ‘‘ఊర పిచ్చుక జంట వస్తే గూడు కట్టుకోనిస్తాం, మీరు ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు / ఆ గుడ్డులో మా బిడ్డలవుతారా’’ అని. జనజీవనంలో జీవకారు ణ్యం కూడా ఒక భాగమే. అది ఎవరూ నేర్పాల్సిన పని లేదు. నేను ఐచ్ఛిక శాఖాహారిని. ఇది చర్చకి వచ్చిన సందర్భంలో ఒక బెంగాలీ ఆవిడ ఇలా చెప్పింది ‘‘నువ్వు ఆ జీవులను చంపి తింటున్నానని భావించడం నిజం కాదు. మనిషి జన్మ ఎత్తాలంటే కొన్ని కోట్ల జన్మలు దాటాలి. ఈ జీవులను తినడం ద్వారా నీవు వాటికి ముక్తిని ఇచ్చి మానవ జన్మ ఎత్తడానికి సహకరిస్తున్నావ్’’ అని. అలా అనుకోకుంటే మానవ జీవనం ముందుకు సాగదు కదా. చివరిగా ఒక ప్రశ్న.. ప్రభుత్వం వారి ఈ జీవ కారుణ్యం కేవలం జంతువులకేనా? వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి సామాన్య కిరణ్ 91635 69966 -
మనిషి రూపంలో దూడ.. విష్ణు మూర్తేనంటూ..