cow
-
180 రోజులు..14 రాష్ట్రాలు.. 4,900 కి.మీలు
తిరుపతి కల్చరల్: గోరక్షణ, భూ సంరక్షణ, దేశ సుభిక్షతను కాంక్షిస్తూ బాలకృష్ణ గురుస్వామి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన గోమాతతో పాదయాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది. తొలిత మంగళం రోడ్డులోని బొంతాలమ్మ ఆలయం వద్ద స్థానికులు, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన సభ్యులు గోమాత పాదయాత్రకు హారతులు పట్టి స్వాగతం పలికారు. గోమాత పాదయాత్ర దారుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ భూ సంరక్షణ గోమాత రక్షణతోనేనని, భరతభూమి రక్షణతో దేశం సుభిక్షతతో వరి్థలిల్లుతుందన్నారు. గోమాతను సంరక్షించి తద్వారా భారతభూమి సారవంతమైన భూమిగా పర్యావరణం పరిమళించడంతో దేశం, మానవాళి సుభిక్షతగా ఉంటారనే నినాదంతో గోమాతతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 180 రోజుల పాటు 14 రాష్ట్రాల మీదుగా 4,900 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పది రాష్ట్రాల మీదుగా 3710 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపతికి నగరానికి చేరుకున్నామన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి పాదయాత్రను కన్యాకుమారికి కొనసాగిస్తామని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం గోమాతను రక్షించాలని కోరుతూ చేపడుతున్న ఈ పాదయాత్ర పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. అనంతరం అక్కడ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం, అలిపిరి వరకు గోమాత పాదయాత్ర సాగించారు. -
కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..
మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం వెళితే సాయంత్రానికి దారి తప్పారు. సిగ్నల్ లేదు. ఎటు చూసినా ఏనుగులు. రాత్రంతా అడవిలోనే. వారికోసం అగ్నిమాపకదళం, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామస్తులు తెగించి అడవిలోకి వెళ్లారు. ‘ఒక్క ఆవు కోసమా ఇదంతా’ అని దాని ఓనరమ్మను అడిగితే ‘నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా’ అంది. కేరళను ఊపేసిన ఈ ఘటన వివరాలు.ఆ ఆవు పేరు మాలూ. ఎర్నాకుళం జిల్లాలోని కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు పల్లెలో మాయా అనే 46 ఏళ్ల స్త్రీ దాని యజమాని. దాని మీద వచ్చే రాబడే ఆ ఇంటికి ఆధారం. రోజూ అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరడం మాలూ అలవాటు. మొన్న బుధవారం (నవంబర్ 27) అది అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకూ చూసిన మాయా తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది. గురువారం మధ్యాహ్నం వరకూ అటూ ఇటూ వెతికి అడవిలోకి వెళ్లడానికి ఇరుగూ పొరుగునూ తోడు అడిగింది. పాపం మాయా ఆందోళన చూసిన పారుకుట్టి (64), డార్లీ (56) సరే మేమూ వస్తాం అన్నారు. వారికి అడవి కొట్టిన పిండి. మధ్యాహ్నం వాళ్లు ముగ్గురూ మాలూను వెతుకుతూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు.అడవి ఒక్కలాగా ఉండదుఅడవిలోపలికి వెళ్లిన ఆ ముగ్గురు స్త్రీలు చాలా దూరం వెళ్లారు. సాయంత్రం నాలుగు వరకూ వాళ్లు సిగ్నల్స్ దొరికేంత దూరం వెళ్లారు. ఆ తర్వాత ఆవు కనిపించక వెనక్కు తిరిగేసరికి ఏనుగుల మంద. కొత్తమంగళం అడవుల్లో ఏనుగులు జాస్తి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురూ రెండోదారి పట్టేసరికి అక్కడ కూడా ఏనుగుల మందే. దాంతో భయపడి మూడోదారిలోకి మళ్లారు. కాని ఈసారి ఒంటరి ఏనుగు కనిపించింది. ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదం. వారు దారి మార్చుకుని నాలుగో దారి పట్టేసరికి దారి తప్పారు. అడవి లోపల తన రంగులు మార్చుకుంటూ ఉంటుందని ఆటవీ శాఖ వారు అంటారు. లోపల అడవంతా ఒక్కలాగే ఉంటూ కనికట్టు చేస్తుంది. అలా తెలిసిన దారే అనుకుని తెలియని దారిలో అడుగుపెట్టి వారు దారి తప్పారు.మొదలైన అన్వేషణఊళ్లోని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లి తప్పిపోయారనే సరికి అట్టికాలంలో గగ్గోలు రేగింది. వెంటనే కబురు మీడియాకు చేరేసరికి వార్తలు మొదలైపోయాయి. తక్షణం ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ అండ సేఫ్టీ వాళ్లు 15 మంది ఒక టీమ్ చొప్పున నాలుగు బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు 50 మంది, వీరితో కలిసి తోడుగా వెళ్లిన గ్రామస్తులు, డ్రోన్లు... ఒక సినిమాకు తక్కువ కాకుండా అన్వేషణ మొదలైంది. ‘అడవిలో ఆ సమయంలో వెళ్లడం ప్రమాదం. ఏనుగులు చూశాయంటే అటాక్ చేసి చంపేస్తాయి. మా టీమ్లు రెండు వెనక్కు వచ్చేశాయి. ఒక టీమ్ ఒక షెల్టర్లో రాత్రి గడిపి తెల్లవారు జామున వెతకాల్సి వచ్చింది’ అని ఫారెస్ట్ అధికారి తెలిపారు.స్మగ్లర్లు అనుకునిఆ ముగ్గురు స్త్రీలు 15 గంటల అన్వేషణ తర్వాత శుక్రవారం ఉదయం 7.30 గంటలకు రెస్క్యూటీమ్కు కనిపించారు. కాని వాస్తవంగా వారు ఆ రాత్రే దొరకాల్సింది. ‘మేము ఆ ముగ్గురు స్త్రీలను వెతుకుతూ మమ్మల్ని గుర్తించడానికి అక్కడక్కడా మంటలు వేశాం. ఏనుగులను చెల్లాచెదురు చేయడానికి టపాకాయలు కాల్చాం. టార్చ్లైట్ల వెలుతురు కూడా దూరం వరకూ వేశాం’ అని అటవీ అధికారి చెప్పారు. ‘అయితే మేము ఆ టార్చ్లైట్ను దూరం నుంచి చూశాం. అడవిలోకి వచ్చిన వారు పోలీసులో, స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది. ఆ సమయంలో స్మగ్లర్లకు దొరికితే అంతే సంగతులు. అందుకే మేం లైట్ వెలుగులు చూసినా చప్పుడు చేయకుండా ఉండిపోయాం’ అని ఆ ముగ్గురు స్త్రీలు చెప్పారు.వారు అడవిని జయించారుగతంలో తెలుగులో రచయిత కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల రాశారు. ఆ నవలలో తన పంది తప్పిపోతే ఒక వృద్ధుడు అడవిలోకి వెళతాడు రాత్రిపూట. అనేక ప్రమాదాలు జయించి తిరిగి వస్తాడు. ఈ ఘటనలో కూడా ఈ ముగ్గురూ అనేక ప్రమాదాలు దాటి తిరిగి వచ్చారు. వారి కోసం అంబులెన్సులు, వైద్య సహాయం సిద్ధంగా ఉంచినా వాటి అవసరం రాలేదు.మరి ఇంతకీ మాలూ అనే ఆ ఆవు?వీరిని వెతకడానికి పెద్ద హడావిడి నడుస్తున్నప్పుడే అంటే గురువారం సాయంత్రం అది ఇంటి దగ్గరకు వచ్చి అంబా అంది. కొడుకు దానిని కట్టేసి తల్లి కోసం అడవిలోకి పరిగెత్తాడు. అదన్నమాట. (చదవండి: -
ఆవును హతమార్చిన పెద్దపులి
నార్నూర్: మండలంలో ని చోర్గావ్ గ్రా మ శివారులో సోమవారం సాయంత్రం తార్యానాయక్ అనే రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం ఉట్నూర్ చిన్నునా యక్ తండా, హస్నాపూర్, చాందోరి మీదుగా మండలంలోని గుంజాల శివారుకు చేరుకున్న పెద్దపులి మధ్యాహ్నం నుంచి అదే ప్రాంతంలో తలదాచుకుంది. రాత్రి జైనూర్ లేదా బేల మీదుగా వెళ్లిపోతుందని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ సోమవారం గుంజాల వద్ద ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సాయంత్రం చోర్గావ్ శివారులో ఆవుపై దాడి చేసి బాబేఝరి వైపు మళ్లిందని స్థానికులు పేర్కొంటున్నారు. -
మేయని ఆవుకు హోమియో చికిత్స
ఈ ఆవు కడపలోని ఒక హోటల్ యజమానిది. ఆ యజమాని ప్రతి రోజూపోషక విలువలు గల మేతతో పాటు కూరగాయలు, దాణా కూడా మేపే వారు. అయితే, ఒక రోజు ఆవు మేత తినటం మానేసింది. నీళ్లు కూడా తక్కువగా తాగుతున్నదని పశువుల ఆసుపత్రికి తోలుకొచ్చారు. మేం రోగ నిర్ధారణ పరీక్షలు చేశాం. లోపల పెద్దపొట్ట ఎన్నిసార్లు తిరుగుతున్నది? పొట్టలోని ద్రావణం పి.హెచ్. ఏ స్థాయిలో ఉంది? పొట్టలో సూక్ష్మజీవులు ఉత్తేజిత స్థాయిలో ఉన్నాయా లేవా? ఈ పరీక్షలు చేశాం. పొట్ట కదలికలు, పిహెచ్, సూక్ష్మజీవులు అన్నీ సాధారణంగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో కాలేయ సంబంధిత టానిక్లు, ఇంజెక్షన్లు, ఆయుర్వేదిక్ పొడులతో పొట్టకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేశాం. పది రోజులైనా మార్పులేదు. ఆ పది రోజులు కేవలం నార్మల్ సెలైన్ బాటిల్తోనే బతికిందని చెప్పవచ్చు. అల్లోపతి, ఆయుర్వేదిక్ చికిత్సలు చేసినా మార్పు లేదు కదా.. హోమియోపతి మందులు ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని ఆలోచన వచ్చింది. నక్స్ వామికా 200, రూస్టాక్స్ 200 గుళికల మందులు రోజుకు 3 సార్లు చొప్పున మూడు రోజులు ఇచ్చాం. వీటిని దాణాలో కలిపి పెట్టొచ్చు లేదా నేరుగా పశువు పెదానికి, దంతాలకు మధ్యలో హోమియో గుళికలు వేస్తే చాలు. ఈ మందులు వేసిన రెండో రోజే ఆవు మేత మేయటం మొదలు పెట్టిందని ఆవు యజమాని ఆశ్చర్యపడుతూ ఆసుపత్రికి వచ్చి మాతో చెప్పారు. పది రోజులు దాదాపుగా రూ. 2 వేలు ఖర్చు చేసినా రాని ఫలితం రూ. 30ల హోమియోపతి మందులతో రావటం సంతృప్తిని కలిగించింది. పశువైద్యంలో అల్లోపతి, ఆయుర్వేదిక్ ఔషధాలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. తక్కువ ఖర్చుతో పశువులకు మంచి చికిత్స, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, అందించవచ్చని మాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. పాడి రైతులకు తెలియజేస్తున్న విషయమేమిటంటే ప్రథమ చికిత్సగా తక్కువ ఖర్చుతో కూడిన ఆయుర్వేద, హోమియోపతి చికిత్సలు చేయటం నేర్చుకోవటం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా పశువైద్యులను సంప్రదించి అల్లోపతి చికిత్సలు తీసుకోవచ్చు. – డాక్టర్. జి.రాంబాబు (94945 88885),పశువైధ్యాధికారి, కడప -
పిచ్చెక్కి దాడి చేసిన ఆవు
ఎడపల్లి (బోధన్): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో పిచ్చెక్కిన ఆవు స్వైర విహారం చేసి 13 మందిని గాయపరిచింది. గ్రామంలో మూడు రోజుల క్రితం ఒక ఆవును కుక్కలు కరిచాయి. ఈ క్రమంలో మతిస్థిమితం తప్పిన ఆవు.. గురువారం ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతూ పలువురిపై దాడి చేసి గాయపరిచింది. సాయంత్రం ఆటోపై దాడి చేయడంతో అందులోని ముగ్గురికి గాయాలయ్యాయి. ఆవు సైతం గాయపడి మృతి చెందింది. సమాచా రం అందుకున్న ఎస్ఐ వంశీచందర్ రెడ్డి గ్రామానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వెటర్నరీ సిబ్బంది ఆవును పరీక్షించి కళేబరాన్ని తరలించారు. -
గో హంతకునిపై పోలీసుల కాల్పులు
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్లో గో హంతకునిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.గోవులను వధించి, వాటి అవశేషాలను బహిరంగంగా పారవేసిన కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని గమనించిన నిందితుని సహచరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులలో గాయపడిన వ్యక్తిని మహతాబ్ ఆలం ఖురేషీగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అన్వర్ నగర్, కృష్ణ నగర్లలో గోవులను వధించారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోహత్యపై విచారణ చేపట్టి, వారికి లభ్యమైన ఆవుల అవశేషాలను పాతిపెట్టారు. అయితే దీనిపై కలకలం చెలరేగడంతో పోలీసు అధికారి సోనమ్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గోహత్య ఘటనలో ప్రమేయమున్న నిందితులపై కాల్పులు జరిపారు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
ఆవురా... ఎంత క్రమశిక్షణ!
క్రమశిక్షణ తప్పిన వారిని ‘పశువులా ప్రవర్తించకు’ అంటాం. ఈ వైరల్ వీడియోను చూస్తే మాత్రం ‘పశువును చూసి నేర్చుకో’ అంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ను పట్టించుకోకుండా ఎడా పెడా దూసుకుపోయేవాళ్లు ఈ వీడియోను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పుణెలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చిన ఒక ఆవు ఎరుపురంగు ట్రాఫిక్ లైట్ను చూసి అడుగు ముందుకు వెయ్యలేదు. ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చ రంగులో మారే వరకు ఓపికగా ఎదురు చూసింది. ఆ తరువాతే ముందుకు కదిలింది. మ్యూజిక్ జోడించి ఈ వీడియోను పుణె పోలీసులు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. రోడ్డు భద్రత గురించి ప్రచారం చేయడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. ఆవు క్రమశిక్షణకు ముచ్చటపడిన నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!
మనదేశంలో గోమాతలను దేవతగా పూజించడం వంటివి చేస్తారు. అయితే మనవాళ్లు వాటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ మన కంటే బాగా శ్రద్ధ చూపించే మరో దేశం ఉంది. మనం దేవతలా ఆవుని పూజించినా..ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఏ వ్యాన్లోనో తీసుకువెళ్తాం కదా!. కానీ వీళ్లు ఆవుని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు.! ఆవుని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదేంటి ఆవుని ఇలా తీసుకువెళ్తున్నారు అనుకోకండి. ఎందుకంటే దానికి గాయాలు కావడంతో స్విట్జర్లాండ్ అధికారులు ఏకంగా హెలికాప్టర్ని రంగంలోకి దింపి మరి ఆస్పత్రికి తరలిస్తునన్నారు. అయతే ఇలాంటి ఆవులు మన దేశంలో ఉండవు. వీటిని'హెవెన్ ఆన్ ఎర్త్' అని పిలుస్తారు. 23 సెకన్ల నిడివిగల ఈ వీడియో అమెజింగ్ నేచుర్ అనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఈ ఘటన మనకు వింత గానీ స్విట్జర్లాండ్ వాసులకు మాత్రం కాదట. ఇలా హెలికాప్టర్తో ఆవుని తరలించిన ఘటనలు అక్కడ పలుమార్లు జరిగాయట. గాయపడిన ఆవులను పర్వతాల మీద నుంచి హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తారట అక్కడ అధికారులు. ఏదీఏమైనా ఆవుల పట్ల ఇంతలా శ్రద్ధని, ప్రేమను చూపడం నిజంగా గ్రేట్ కదూ!. A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024 (చదవండి: 'అరుంధతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
గోపాల మురిపాల బాల
కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్తో దూసుకుపోతోంది. -
అత్యంత రమణీయంగా గోమాత కళ్యాణం.. స్వయంవరంతో ఒక్కటాయెనె..
కాకినాడ రూరల్: కల్యాణం... కమనీయమంటారు పెద్దలు. పచ్చని పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు, వేద మంత్రాలు, భాజా భజంత్రీలు, కన్యాదానం, మాంగళ్యధారణ ఇలా... వివాహం ప్రతిఒక్కరి జీవితంలో కలకాలం గుర్తుండిపోతుంది. అయితే అన్నింటి కంటే భిన్నంగా సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవి స్వరూపం గోమాత కల్యాణం జరిగితే అది మధురానుభూతే. గోమాత సారణ కల్యాణోత్సవం ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్ కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల ఆసుపత్రి వైద్యుడు గౌరీశేఖర్, రమాదేవి దంపతులు తమ పెంపుడు గోవు సారణకు స్వయంవరం ప్రకటించారు. దీంతో ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద కొండ తిమ్మాపురంలోని నాడీపతి గోశాల ఆవరణలోని 89 నందీశ్వరులు (గిత్తలు)ను తొలుత ఎంపిక చేశారు. వాటి నుంచి 24కు కుదించారు. మళ్లీ ఇందులో 16ను ఎంపిక చేయగా స్వయంవరంలో 10 గిత్తలు పాల్గొన్నాయి. ఇందులో ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు గిత్తలు ఉండడం విశేషం. తిరుపతి, కంచి, తిరువణ్ణామలై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు తొలుత డాక్టర్ గౌరీశేఖర్, రమాదేవి దంపతులతో విఘ్నేశ్వర, గౌరీ పూజలు జరిపించారు. అనంతరం స్వయంవరం ప్రకటించగా భైరవ, కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, యువరాజు నిద్రవర్మ, యువరాజు మహేంద్ర కన్నయ్య, బుద్ధుడు, మంగరాజు, ధర్మరాజు, షణ్ముఖ కన్నయ్య తదితర పేర్లతో పిలిచే నందీశ్వరులను ప్రవేశపెట్టారు. డాక్టర్ గౌరీశేఖర్ వధువు సారణను తీసుకువచ్చి స్వయంవరంలో నందులు వద్ద ఉంచగా వాటిని పరీక్షించి మధ్యలో ఉన్న షణ్ముఖ కన్నయ్యను ఎంపిక చేసుకుంది. షణ్ముఖ కన్నయ్య తరఫున తల్లిదండ్రులుగా పాకలపాటి నారాయణరాజు, సీతాదేవి వివాహ వేడుకను జరిపించారు. వరుడు కాళ్లను డాక్టరు గౌరీశేఖర్ దంపతులు కడిగి వివాహం జరిపించారు. అత్యంత రమణీయంగా జరిగిన వేడుకను భారీగా తరలివచ్చిన ప్రజలు తిలకించారు. గోమాత లక్ష్మీ స్వరూపం గోమాత లక్ష్మీ స్వరూపమని, ఎక్కడ గోపూజలు జరుగుతాయో అక్కడ సుభిక్షంగా ఉంటుందని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యా«తి్మక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువు అన్నారు. ఈ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గోమాత కల్యాణోత్సవం తలపెట్టిన డాక్టర్ గౌరీశేఖర్ దంపతులు అభినందనీయులన్నారు. నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు మాట్లాడుతూ స్వయంవరం ద్వారా గోమాత కల్యాణోత్సవం అరుదు అన్నారు. డాక్టర్ గౌరీశేఖర్ మాట్లాడుతూ తాను సారణను దత్తత తీసుకుని కూతురుగా భావించి ఇప్పుడు కల్యాణోత్సవం జరిపించామన్నారు. ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ భద్రయ్య, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గోమాతకు స్వయంవరం ప్రకటించిన వైద్యుడు
కాకినాడ రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న గో మాత పేరు సారణ. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఏపీఎస్పీ ఎదురుగా తిరుమల ఆస్పత్రి వైద్యుడు గౌరీశేఖర్ గారాల పట్టి. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా.. వారి కంటే ఎక్కువ ప్రేమను సారణపై చూపుతారు. సరిగ్గా 20 నెలల కిత్రం అనగా 2022జనవరి 22న సారణకు బారసాల, ఊయల వేడుకను శాస్తోక్తంగా నిర్వహించి సారణగా నామకరణం చేశారు. అప్పట్లో మీడియాలో గోమాతకు బారసాల పెద్ద వైరల్ అయ్యింది. ఇప్పుడు 21వ మాసంలోకి అడుగిడిన సారణకు వివాహ వయసు రావడంతో వైద్యులైన గౌరీశేఖర్, రమాదేవీ దంపతులు స్వయంవరం ప్రకటించారు. ఆదివారం ఉదయం 9గంటలకు నుంచి స్వయంవరం ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాలలోని నందీశ్వరులకు ఆహ్వానం పంపారు. ఏపీఎస్పీ ఫంక్షన్ హాలు వద్ద ఖాళీ స్థలంలో సుమారు 12 నందీశ్వరులను వరుసలో ఉంచగా వరమాలతో సారణ తనకు నచ్చిన నందీశ్వరుడిని ఎంపిక చేసుకోనుంది. తరువాత ఫంక్షన్ హాలులో వివాహ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం కంచి, తిరుపతి, తిరువణ్ణామలై నుంచి వేద పండితులు వస్తున్నారని, శాస్తోక్తంగా కల్యాణం జరుపుతారని డాక్టరు గౌరీశేఖర్ తెలిపారు. -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్గా హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్లో మా కుటుంబం అంతా హైదరాబాద్లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్కి కమిటీ మెంబర్గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కౌ క్లాత్ స్టోర్
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉన్న ఓ క్లాత్స్టోర్కు గత ఏడు సంవత్సరాలుగా చంద్రమణి డైలీ విజిటర్. అయితే చంద్రమణి అనేది మహిళ పేరు కాదు. ఒక ఆవు పేరు. చంద్రమణి రోజూ క్లాత్స్టోర్లోకి వచ్చి కాసేపు ఉండి పోతుంది. క్లాత్స్టోర్ యజమాని పదమ్ డాక్లియా ఎప్పుడూ ఆవును విసుక్కోలేదు. పైగా భక్తిభావంతో పూజిస్తాడు. వస్త్ర దుకాణానికి వచ్చే కొనుగోలుదారులకు ఈ ఆవు స్పెషల్ ఎట్రాక్షన్గా మారింది. ‘మహాలక్ష్మి క్లాత్ స్టోర్’ అనే పేరు కాస్త ‘కౌ క్లాత్ స్టోర్’గా మారింది. -
ప్రస్తుతం దేశంలో 26 శాతం విదేశీ జాతుల ఆవులే
-
పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది?
-
ఇదేం విచిత్రం! ఆవు, పాము రెండు అలా..
రెండు విరుద్ధ జంతువులు ఎదురుపడితే కాసేపు కోట్లాడుకుంటాయి. లేదా తప్పుకోవడమో చేస్తాయి. ఔనా! అదికూడా కాదు అంటే..వాటిలో ఒకటి కాస్త ప్రమాదమైంది అయితే మరోకటి అక్కడ నుంచి పారిపోయేందుకు యత్నిస్తుంది. ఇది కామన్. కానీ ఇక్కడ అలా ఇలా కాకుండా ప్రకృతికే విరుద్ధంగా ఓ విచిత్రమైన ఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నో డౌట్!.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా షాక్ అవ్వుతారు. ఆ వీడియోలో ఓ పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది? అనిపిస్తుంది. అవి అసలు ఎలా ఉన్నాయంటే..ఆ రెండు చాలా అన్యోన్యంగా ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటూ ప్రేమగా ఉంటాయి. పైగా ఏ మాత్రం దాడి చేసుకోకుండా చాలా సఖ్యంగా ఉంటాయి. చూస్తున్నంత సేపు మనకేమో ఆ పాము ఎక్కడ ఆవుపై దాడి చేస్తుందో అని టెన్షన్ పడిపోతుంటాం. కానీ ఆ పాము దానికి సహకరిస్తున్నట్లుగా ఏం చేయదు. పైగా ఆవుతో సరదాగా ఉంటుంది ఆ పాము. దీన్ని 'వివరించడం చాలా కష్టం', ఆ రెండింటి మధ్య చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉంది కాబోలు అని సదరు అధికారి సుశాంత నంద ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు కూడా వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: సముద్రగర్భంలో సంగీత కచేర!..ఈదుకుంటూ వచ్చి మరీ వింటారట!) -
కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలా జీవులు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే తమ జీవితాన్ని పూర్తి చేస్తాయి. అడవిలో ఉన్న జంతువుకు దాని ప్రాణాలు కాపాడుకోవడమే అతి పెద్ద లక్ష్యం. ఆకాశంలో తిరిగే పక్షులకు, నీళ్లలో ఈదే చేపలకు ఆ పూట కడుపు నింపుకోవడమే తమ ముందున్న లక్ష్యం. మరి మెదడున్న మనిషికి మాత్రం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని దేవుడు నిర్ణయించాడు. జంతువులా కాకుండా.. భిన్నంగా కొంతైనా సమాజానికి ఉపయోగపడాలని నిర్దేశించాడు. ఆ కర్తవ్య బోధను అర్థం చేసుకున్న వాడు గొప్పవాడయ్యాడు. అది అర్థమయ్యేందుకు చిన్న కథలు రెండు. మొదటి కథ ఒక కుక్క కాశీకి వెళ్దామని బయలు దేరింది. ఎలాగైనా విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నది దాని లక్ష్యం. బ్రహ్మండమైన పట్టుదలతో బయల్దేరింది. దారి మధ్యలో ఒక బొక్క కనిపించింది. కాశీకి తర్వాత పోదాంలే.. ముందు బొక్క సంగతి చూద్దామనుకుంది. ఆ బొక్క నోట కరుచుకున్నాక.. పరవశమయింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కథ షరా మామూలే. మనిషి పాత్ర అలాగే… మనిషి పాత్ర కూడా అంత గొప్పేమీ కాదు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత.. భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు. రెండో కథ చదివితే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఓ పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరుగెత్తింది. పులి కూడా అంతే వేగంగా వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో చెరువులోకి దూకేసింది. పులి ఆకలి మీదుంది. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలన్న తాపత్రయంలో అది కూడా చెరువులోకి దూకేసింది. క్షణాల్లో మారిన ప్రాధాన్యతలు ఆ చెరువులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, పైగా అందులో లోతైన బురద ఉంది. ముందు వెనకా చూసుకోకుండా దూకడం వల్ల ఆవు పీకల్లోతున బురదలో కూరుకుపోయింది. ఆవుని చంపాలని వచ్చిన పులి కూడా అదే బురదలో చిక్కుకుంది. ఇప్పుడు రెండింటి లక్ష్యాలు మారిపోయాయి. ఆ క్షణం వరకు పులి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆవుకు ఇప్పుడు బురదనుంచి బయటపడడం ముఖ్యం. పులి సంగతి కూడా అంతే. ఆవు కాకపోతే మరేదైనా తినొచ్చు కానీ ఈ బురద బారి నుంచి ఎలా బయటపడాలన్నది అర్థం కావడం లేదు. ఆవులో ఆలోచన, పులిలో ఆహంకారం ఇప్పుడు ఆవు, పులీ రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక్కడే ఆవులో ఆలోచన ప్రకాశవంతమయింది. పులి నుంచి తప్పించుకున్నానన్న ఉత్తేజం, ఈ దుస్థితి నుంచి బయటపడతానన్న నమ్మకం దానిలో ఉన్నాయి. అందుకే పులితో మాట్లాడడం మొదలెట్టింది. "నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది. ఎప్పుడు చస్తానో తెలియని పులికి ఇంకా బింకం పోలేదు. "నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు మళ్లీ వేరేగా ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయికదా..”అంది. అప్పుడు ఆ పులి, ఆవుతో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు.?” అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే పరిస్థితి గమనించాడు. జాగ్రత్తగా ఓ తాడును కట్టి ఆవుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగాడు. ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తలుచుకుంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ కథలో... ఆవు - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo. పులి- అహంకారం నిండి ఉన్న మనస్సు. యజమాని - సద్గురువు/పరమాత్మ బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఇందులో నీతి ఏంటేంటే.. ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు. వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. లోకా సమస్తా సుఖినోభవన్తు! -
ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్త పనులుచేసే ముసలోడికి అరదండాలు!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవు మొదలుకొని ఆడ కుక్క వరకూ.. ఇలా పలు జంతువులపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చిన ఒక వృద్దుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఈ ఉదంతంలో గుజైనీ నివాసి విజేంద్ర మిశ్రా(62)ను అరెస్టు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితునిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా నిందితునిపై గతంలోనూ పలు నేరారోపణలు వచ్చాయని తెలిపారు. జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారి మాట్లాడుతూ పోలీసులు తమ దర్యాప్తులో పలు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారని, వాటిలో మిశ్రా బహిరంగ ప్రదేశాల్లో వివిధ జంతువులతో లైంగిక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమయ్యిందన్నారు. మిశ్రా మానసికంగా అనారోగ్యానికి గురయ్యాడని, అతనిని ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించామన్నారు. దీనికిముందు బులంద్షహర్లోనూ ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 65 ఏళ్లవృద్దుడు పెంపుడు కుక్కతో లైంగిక చర్య జరిపాడు. దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ శునకం యజమాని ప్రేమ్చంద్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వృద్దుడుని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది కూడా చదవండి: అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే.. -
‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్ స్టేషన్కు వచ్చి..
ఏదో ఒక జంతువును చంపి, అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి నన్ను అరెస్టు చేసి, జైలుకు పంపించడంటూ వేడుకున్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా? ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ, గోవధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తాను గోవధ చేశానని,ఇప్పుడు లొంగిపోవాలనుకుంటున్నానంటూ ఒక పోస్టర్ ప్రదర్శిస్తూ, తనను అరెస్ట్చేసి, జైలుకు తరలించాలని పోలీసులను వేడుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోగల రూదౌలీ పోలీస్స్టేషన్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్టేషన్లో శనివారం సమాధాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే ప్రజల సమస్యలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్బర్ అలీ అనే వ్యక్తి ఒక పోస్టర్ పట్టకుని, అక్కడి పోలీసు అధికారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు గోవధ చేసి.. ఇప్పుడు పశ్చాత్తాపం అక్బర్ అలీ పోలీసులతో మాట్లాడుతూ ‘నేను గోవధ ఆరోపణలు ఎదుర్కొంటూ కొంతకాలంగా పరారీలో ఉన్నాను. ఈ కేసులో నా భార్య జైలులో ఉంది. మా సంసారం ముక్కలయ్యింది. నాకు పోలీసులపై నమ్మకముంది. అందుకే నేను లొంగిపోవాలని అనుకుంటున్నాను. మరోమారు నేను ఇలాంటి నేరాలకు పాల్పడను’అని చెప్పాడు. అక్బర్ మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. అనంతరం పోలీసులు అతనిని స్టేషన్లో కూర్చోబెట్టారు. 2022 నాటి ఉదంతంలో.. రూధౌలీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎథర్ గ్రామంలో 2022లో కొంతమంది గోవులను హత్య చేశారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ వీరిలో ఒకడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే జైలుకు తరలించారు. అయితే అక్బర్ అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. జైలుకు వెళ్లిన భార్య ఈ ఉదంతంలో అక్బర్ భార్య ఇంతకుమందే జైలుకు వెళ్లి, శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు అక్బర్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసు అధికారి సత్యేంద్ర భూషన్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ గోవధ నిందితుడు.. సమాధాన దినోత్సవం నాడు లొంగిపోయాడన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇది కూడా చదవండి: చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు! -
నెల్లూరు జాతి ఆవు @ రూ. 35 కోట్లు!
ఎక్కడైనా మేలు జాతి ఆవు ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ. లక్షల్లో ఉంటుందంటారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే బ్రెజిల్లో ఇటీవల జరిగిన వేలంలో నెల్లూరు జాతికి (ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి దశాబ్దాల కిందట కొన్ని ఆవులను బ్రెజిల్ తీసుకెళ్లి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్న ఆవులు) చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని అత్యధిక ధర పలికింది. తద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. వియాటినా–19 ఎఫ్4 మారా ఇమ్విస్ అనే నాలుగున్నరేళ్ల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ. 11.82 కోట్లకు అమ్ముడుపోయింది!! గతేడాది ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ. 6.5 కోట్లు పలకడం అప్పట్లోనే రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. మొత్తంమీద ఈ ఆవు విలువ రూ. 35.30 కోట్లు పలికింది. అత్యంత నాణ్యౖమెన జన్యులక్షణాలు గల బ్రెజిల్లోని నెల్లూరు జాతి ఆవును రికార్డు ధరకు సొంతం చేసుకొనేందుకు డెయిరీ వ్యాపారులు పోటీపడటం దీని అసలుసిసలు విలువను చాటిచెబుతోంది. బ్రెజిల్లోని ముఖ్యమైన ఆవు జాతుల్లో నెల్లూరు జాతి ఆవులు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మాంసం కోసం పెంచుతారు. వీటి మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చాలా దేశాల్లో ఈ ఆవుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం బ్రెజిల్లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయి. బ్రెజిల్లో ఉన్న మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం. ఈ జాతికి చెందిన శ్రేష్టమైన ఎద్దుల వీర్యం సైతం అర మిల్లీలీటర్కు రూ. 4 లక్షలు పలుకుతోంది. నెల్లూరు జాతి ఆవుల ప్రత్యేకతలు ఇవీ... ♦ ఈ ఆవులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా చిక్కటి తెలుపు రంగులో ఉంటాయి. ♦ దళసరి చర్మంతో ఉండటం వల్ల రక్తం పీల్చే కీటకాలు వాటిని దరిచేరవు. ♦ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వాటి స్వేద గ్రంథులు యూరోపియన్ జాతి ఆవులతో పోలిస్తే రెండు రెట్లు పెద్దగా ఉండటంతోపాటు గ్రంథుల సంఖ్య సైతం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. ♦ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ఇన్ఫెక్షన్లను సమర్థంగా తట్టుకోగలవు. ♦ సమర్థమైన జీవక్రియ కారణంగా నాసిరకం గడ్డి జాతుల రకాలను సైతం తిని అరిగించుకోగలవు. ♦ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం, సరై న యాజమాన్య పద్ధతులు పాటించనప్పటికీ దూ డలు సులువుగా పెరగగలగడం మరో ప్రత్యేకత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే..
గుజరాత్: ఒక రైతు సింహం బారి నుండి తన ఆవును రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. చివరకు ఎలాగోలా సింహాన్ని భయపెట్టి గంగిగోవును కాపాడుకున్నాడు. గుజరాత్ లోని గిర్ సోమ్ నాట్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చగడ్డిని ఆదమరచి తింటోన్న ఆవుపై అక్కడే మాటు వేసి ఉన్న ఆడ సింహం ఒక్క ఉదుటున దూకి దాని గొంతు పట్టుకుంది. పాపం ఆ ఆవు నొప్పితో విలవిలలాడిపోయింది. పంటిబిగువున నొప్పిని భరిస్తూ తన యజమానికి వినిపించేలా పెద్దగా అరిచింది. తన గోవు అరుపులు విన్న ఆ రైతు వెంటనే అక్కడికి చేరుకొని ఎలాగైనా తనని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ధైర్యంగా సింహం వైపు నడుచుకుంటూ వచ్చాడు. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సింహం పట్టు నుండి విడిపించుకునే ప్రయత్నంలో ఆవు రోడ్డు పక్కకు జరిగింది. అంతలో తనవైపుగా వస్తోన్న రైతును చూసిన సింహం భయపడి వెంటనే అవును విడిచిపెట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయింది. ఈ వీడియోని జునాగఢ్ లోని కేశోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు సింహానికి ఎదురెళ్ళిన ఆ రైతు గుండె ధైర్యానికి ఫిదా అయ్యి కామెంట్లు పెడుతున్నారు. ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ. ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ — Vivek Kotadiya🇮🇳 BJP (@VivekKotdiya) June 29, 2023 ఇది కూడా చదవండి: ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా.. -
షాకింగ్ విషయాలు: ఆవు సాధు జంతువు... అదేగానీ దాడికి దిగితే..
వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్ పలు ఆసక్తిక వివరాలు వెల్లడించింది. ప్రతీయేటా ఆవుల కారణంగా అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. వీరంతా ఆవుల దాడికి బలవుతున్నారని తెలియజేసింది. భారతీయులు ఆవును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పూజలు కూడా చేస్తుంటారు. ఆవును గోమాత అని కూడా అభివర్ణిస్తుంటారు. ఆయుర్వేద పరిభాషలో ఆవు పాలు అమృతంతో సమానం. అయితే అప్పుడప్పుడు మనుషులపై జంతువుల దాడులు జరుగుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో మనుషుల మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా వందల మంది మృత్యువు బారిన పడుతున్నారు. ఆవుల దాడుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నారనే వివరాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్ తెలియజేసింది. ఆ వివరాలు ఎంతో ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి. Tbh, Id not get close to a cow too. They have no jokes really, when they attack they do it so hard😳 One time we stopped near a fountain to drink water. And cows came and i went to car. I was getting in and one of cows attacked me but car door protected me. It was like a shield pic.twitter.com/BDmZ7ip5M9 — ヒジExodus (@siriusm46) June 17, 2023 గణాంకాలు ఏమి చెబుతున్నాయి? వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్లో ప్రచురితమైన డేటా ప్రకారం ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా అమెరికాలో 20 నుంచి 22 మంది మరణిస్తున్నారు. ఆవుల గుంపు తొక్కివేయడం కారణంగా మరణించారంటూ ప్రతీయేటా సుమారు 5 కేసులు వెలుగు చూస్తున్నాయి. లండన్లో ప్రతీయేటా ఆవుల దాడులలో కనీసం నలుగురు కన్నుమూస్తున్నారు. దీనిని షార్క్ దాడులతో పోల్చి చూస్తే.. షార్క్ దాడుల కారణంగా ప్రతీయేటా కనీసం ఐదుగురు మరణిస్తున్నారు. ప్రతీయేటా ఆవుల దాడులకు కనీసం 22 మంది బలవుతున్నారు. భారత్లో ఆవుల దాడుల సంగతేమిటి? సోషల్ మీడియాలో జంతువుల దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతుంటాయి. వీటిలో ఆవుల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తాయి. ఇటీవల ఒక ఎద్దు ఒక వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీనికిముందు కూడా ఉత్తరప్రదేశ్లో ఒక మహిళపై ఆవు దాడి చేసినట్లు ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎద్దుల దాడులతో పోల్చి చూస్తే, ఆవుల దాడులు స్వల్పమేనని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: రైలు రిజర్వేషన్లో సరిదిద్దలేని పొరపాట్లివే.. -
చిరుతతో పోరాడి.. రైతు ప్రాణాలు కాపాడిన ఆవు
బనశంకరి: తన యజమానిపై దాడి చేసిన చిరుత పులితో తీవ్రంగా పోరాడి రైతు ప్రాణాలు ఆవు కాపాడిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... చెన్నగిరి తాలూకా ఉబ్రాణి హొబళి కొడతికెరె గ్రామానికి చెందిన రైతు కరిహాలప్ప(58) గత సోమవారం తన ఆవును తోటలో వదిలిపెట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే మాటువేసిన చిరుత పులి ఒక్కసారిగా కరిహాలప్పపై దాడి చేసింది. గమనించిన ఆవు పరుగెత్తుకొచ్చి చిరుతపైకి దూకింది. కొమ్ములతో పొడిచింది. దీంతో చిరుత కిందపడిపోగా, అక్కడే ఉన్న శునకం కూడా దానిపైకి దూకింది. దీంతో చిరుత అక్కడి నుంచి ఉడాయించింది. ఈ సందర్భంగా రైతు కరిహాలప్ప మాట్లాడుతూ తాను పోషించిన ఆవు గౌరీ, శునకం మాత్ర శౌర్యాన్ని ప్రదర్శించి చిరుత బారి నుంచి తన ప్రాణాలు కాపాడాయని చెప్పాడు. -
పేద రైతు కుటుంబం నుంచి కోట్ల రూపాయల సంపాదన ఎలా ?
-
ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు
ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో రైసెన్ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్ శిల్పాకర్ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ గ్రామంలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ రైతు ఇంటికి క్యూకట్టారు. ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు పశువైద్యాధికారి ఎన్కే తివారీ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి అద్భుతం కాదన్నారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు. అయితే ఆ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడిందని చెప్పారు. చనిపోయిన సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామానికి సుదూరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. (చదవండి: మణిపూర్లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
అమ్మలాంటి ఆవు..బుజ్జోడి నవ్వులు
-
రాజస్తాన్లో కిడ్నాప్.. హరియాణాలో హత్య
జైపూర్: హరియాణాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. గో సంరక్షకులుగా అనుమానిస్తున్న కొందరు రాజస్తాన్కు చెందిన ఇద్దరు ముస్లింలను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి కాలిన మృతదేహాలు ఒక కారులో లభించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన అరడజను మందికిపైగా బజరంగ్ దళ్ కార్యకర్తల్ని రాజస్తాన్ పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యలను రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజస్తాన్లోని భరత్పూర్ జిల్లా ఘట్మీక గ్రామానికి చెందిన నజీర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గురువారం వారిద్దరి మృతదేహాలు హరియాణాలోని భివానిలో లోహారు ప్రాంతంలో ఒక దగ్ధమైన కారులో కనిపించాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ఇద్దరు ముస్లిం యువకుల్ని కిడ్నాప్ చేశారని వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు అరడజనుకుపైగా బజరంగ్దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ‘‘వారికి ఈ నేరంలో ప్రమేయం ఉందో లేదో తేలాల్సి ఉంది’’ అని పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ చెప్పారు. మృతి చెందిన వారిలో జునైద్కి నేరచరిత్ర ఉందని, ఐదుకి పైగా కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. రింకూ సైనీ అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. -
సోషల్ మీడియాలో మీమ్స్.. కౌ హగ్ డే నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం
ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగించుకోవాలన్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రేమికుల దినోత్సవం రోజున కౌ హగ్ డే జరుపుకోవాంటూ ఇచ్చిన పిలుపును ఉపసంహరించుకుంది. ఈ మేరకు భారత జంతు సంరక్షణ బోర్డు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలంటూ ఇచ్చిన పిలుపును వెనక్కి తీసుకొంటున్నట్టు కేంద్ర పశు సంరక్షణ బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా ఓ నోటీసులో పేర్కొన్నారు. కాగా గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డేకి బదులుగా కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర జంతు సంక్షేమ శాఖ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయ పురాతన సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని.. గోమాత ప్రాధాన్యతను గుర్తించి ఫిబ్రవరి 14న గోవులను ఆలింగనం చేసుకోవాలంటూ పేర్కొంది. గోవును కౌగిలించుకోవడం ద్వారా భావ సంపద వృద్ధి చెందుతుందని.. తద్వారా వ్యక్తిగత, సామూహిక సంతోషం పెరుగుతుందని తెలిపింది. అయితే ఈ ప్రకటన చే'rనప్పటి నుంచి కౌ హగ్ డే అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అప్పటి నుంచి దీనిపై రచ్చ జరుగుతూనే ఉంది. కొంతమంది దీనిపై సానుకూలంగా స్పందిస్తుంటే.. మరికొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు. దీంతో నెట్టింట్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అటు విపక్షాలు కౌ హగ్ డేపై సైతం విమర్శలు గుప్పించాయి. కౌ హగ్ డే పిలుపు హాస్యాస్పదమని.. ప్రధాని మోదీకి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఓ ‘పవిత్ర గోవు’ అంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు ‘కౌ హగ్ డే’ పాటించాలంటూ ఇచ్చిన పిలుపును తాజాగా ఉపసంహరించుకోవడం గమనార్హం. చదవండి: మోదీ సర్కార్ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్సీ కవిత -
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని అందరికీ తెలుసు. యువతీ, యువకులు తాము ప్రేమించిన వారికి ఈరోజే ప్రపోజ్ చేస్తుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వాములకు ప్రత్యేక కానుకలు ఇచ్చి సర్ఫ్రైజ్ చేస్తుంటారు. భారతీయ యువతలో ఈ ఆలోచనను మార్చాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ భావిస్తోంది. పాశ్చాత్య దేశాల పట్ల ప్రభావితమై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలనుకుంటోంది. అందుకే ఫిబ్రవరి 14ను 'కౌ హగ్ డే'గా జరుపుకొని గోవులను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చింది. 'భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవులు వెన్నెముక. పశుసంపదకు, జీవ వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవాళికి సకల సంపదలను అందించే తల్లి వంటి పోషకాహార స్వభావం ఉన్నందున ఆవును కామధేను, గోమాత అని పిలుస్తారు. గోవును ఆలింగనం చేసుకుంటే మానసిక ఆనందం కలుగుతుంది. అందుకే ఫిబ్రవరి 14 కౌ హగ్ డే జరుపుకోండి' అని పేర్కొంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సూచన మేరకు ఆ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన విడుదల చేశారు. చదవండి: పార్లమెంట్లో విపక్షాలను ఏకిపారేసిన మోదీ.. -
అమ్మా.. ఏమైందమ్మా.. లేమ్మా!
లేద్దామంటే శరీరం సహకరించదు.. తిందామంటే మేత లేదు.. యజమాని ఎక్కడో తెలియదు.. చుట్టూ ఎవరూ కనిపించరు.. అంబా అని అరిచినా పట్టించుకునే దిక్కు లేదు. మలమూత్రాలు చేస్తున్న చోట అలా కూలబడిపోయింది ఓ గోమాత. ఒకటి కాదు, రెండు కాదు, ఐదు రోజులు గడిచిపోయింది. అరిచీ అరిచీ నీరసించింది. ఓ దూడ తల్లి చుట్టూ తిరుగుతోంది. తల్లికి ఏమైందో తెలియక అక్కడక్కడే తచ్చాడుతోంది. మౌనంగా రోదిస్తూ.. తల్లికేసి చూస్తూ అలా నిల్చుండిపోతోంది. ఏమైందమ్మా.. లేమ్మా.. అన్నట్లు దీనంగా చూస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కర్నూలు: అది మండలంలోని క్రిష్టిపాడు గ్రామ శివారు ప్రాంతం. చుట్టూ పొలాలే తప్ప నివాస ప్రాంతాలు కనిపించవు. ప్రతిరోజూ రైతులు పొలం పనులు చేసుకుని వెళ్తున్నారు. అయితే ఎక్కడి నుంచో ఓ ఆవు అరుపులు వినిపిస్తున్నా, మంద నుంచి తప్పిపోయి ఉంటుందనుకుని మళ్లీ పనుల్లో ఉండిపోయారు. ఇలా ఐదు రోజులు గడిచిపోయాయి. జొన్న పైరు కావడంతో ఏపుగా పెరగడం, పొలం మధ్యలో ఆవు పడిపోవడంతో రైతులు గుర్తించే అవకాశం లేకపోయింది. చివరకు ఇక్కడే ఎక్కడో ఉన్నట్లుగా అనుమానించి అందరూ వెతకడంతో ఎట్టకేలకు గురువారం ఆనవాలు లభించింది. దగ్గరికి వెళ్లి చూడగా కుప్పకూలిన ఓ అవు, దాని పక్కనే దూడ కనిపించాయి. ఆవు వెనుక కాలు విరిగి గాయమవడంతో అక్కడే కూలబడింది. దూడ వయస్సు కూడా పది రోజులకు మించి ఉండదని తెలుస్తోంది. ఈ రెండూ ఐదు రోజులుగా నరకం అనుభవించాయి. ఈ దృశ్యం చూసి చలించిన రైతులు వెంటనే ఆవు, దూడకు నీళ్లు తాపించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనం గుర్తుకు వచ్చి 1962 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన సిబ్బందికి నిముషాల్లో అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం సర్జరీ కోసం ఆవుతో పాటు దూడను వాహనంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు తరలించారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. మారుమూల ప్రాంతానికి సంచార వాహనం రావడం.. మూగజీవి వేదన తీర్చే ప్రయత్నం చేయడం అందరి అభినందనలు అందుకుంది. -
బట్టల షాప్కు వెళ్లిన ఆవు.. పాపం ఏం నచ్చలేదేమో!
-
వైరల్ వీడియో: బట్టల షాప్కు వెళ్లిన ఆవు
-
Viral: బట్టల షాప్కు వెళ్లిన ఆవు.. పాపం ఏం నచ్చలేదేమో!
మనకు ఏమైనా వస్తువు కావాలంటే షాప్లోకి వెళ్లి తెచ్చుకుంటాం. కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మాల్కు వెళ్లి సెలెక్ట్ చేసుకొని మరీ కొనుక్కుంటాం. మరి జంతువులకు కూడా ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే ఎక్కడికి వెళ్తాయి. వాటికి కూడా షాపింగ్ చేయాలనిపిస్తే ఎలా ఉంటుంది. అచ్చం ఇలాంటి ఆలోచనే ఓ ఆవుకి వచ్చింది. స్టైలిష్ బట్టలు వేసుకొని అందంగా తయారవ్వాలనిపించిందేమో.. అనుకున్నదే తడువుగా బట్టల షాప్లోకి వెళ్లి షాపింగ్ చేసింది. అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి? అనుకుంటున్నారా.. ఈ మాటలు వినడానికి కొంచెం విడ్డూరంగానే అనిపించినా సరిగ్గా ఇలాంటి ఓ సరదా ఘటనే అస్సాంలో గత వారం చోటుచేసుకుంది. ధుబ్రి ప్రాంతంలో దారి తప్పిందో ఏమో గానీ ఓ ఆవు బట్టల షాప్లోకి ప్రవేశించింది. స్టోర్ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. షాప్లో ఆవు తిరుగుతుంటే అక్కడున్న సిబ్బంది, షాపింగ్ చేస్తున్న మిగతా జనాలు భయంతో దూరంగా పరుగులు తీశారు. చివరికి దానంతట అదే బయటకు వెళ్లిపోయింది. అక్కడున్న కొంతమంది ఈ తతంగాన్ని ఫోన్లో వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఆవు వాలకం చూస్తుంటే నిజంగా షాపింగ్ చేయడానికి వచ్చిన్నట్లే అనిపిస్తుంది. తనకు సంబంధించిన దుస్తులు ఎక్కడ ఉన్నాయా అనుకుంటూ అచ్చం కస్టమర్లాగే స్టోర్ మొత్తం షికారు చేసింది. చివరికి ఏవి నచ్చకపోవడంతో నిరుత్సాహ చెందింది. అంతేగాక.. బట్టల షాప్ వాళ్లు డబ్బులు అడగంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇలాగే భావిస్తూ నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. Cow entered in mall, #dhubri #Assam pic.twitter.com/aS2XYd5hg1 — Nitish Sarmah (@sarmah_nitish) December 30, 2022 -
పైన ఎల్లిగడ్డలు.. కింద పశువులు.. ట్రక్కులో కుక్కి...
సాక్షి, ఎడపల్లి (నిజామాబాద్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.ఎడపల్లి (బోధన్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. గాయపడిన ఎద్దు సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు. చదవండి: అందం హిందోళం.. అధరం తాంబూలం -
వైరల్ వీడియో: ఆవు ఫుట్బాల్తో ఆడటం ఎప్పుడైనా చూశారా
-
వాట్ ఏ సెల్ఫీ! ఎంతా బాగా ఫోజ్ పెట్టిందో...
ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. చాలా వీడియోల్లో మనకు నచ్చిన రకరకాల జంతువుల సెల్ఫీ వీడియోలు చూసుంటాం. క్రూరమైన మృగాలతో కూడా డేర్గా చేసిన వైరల్ వీడియోలు కూడా చూసి ఉంటాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒక ఆవుతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ఏంటి ప్రత్యేకత అనే కదా.! ఏంలేదండి...జంతువులతో కలిసి తీసే సెల్ఫీ వీడియోలు చాలా వరకు మనం చెప్పినట్లు అవి వినవు. అది ఆహారం తింటున్నప్పుడో లేక ప్రశాంతంగా కూర్చొన్నప్పుడో జస్ట్ అలా క్లిక్మనిపించి చకచక వీడియో తీస్తాం. ఔనా! కానీ ఈ వ్యక్తి మాత్రాం ఆ ఆవును సెల్ఫీ తీస్తున్న ఫోజు పెట్టమంటే వెంటనే సెట్రైట్ అయిపోయి ఫోజు పెట్టింది. చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Vivek vyas 🇮🇳 (@vivek_127) (చదవండి: బలవంతంగా జుట్టు పట్టుకుని ఈడ్చేసిన నర్సు.. వీడియో దుమారం) -
పులి వద్దు.. గోమాత ముద్దు! సుప్రీం ఏమందంటే..
న్యూఢిల్లీ: జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ టైగర్ స్థానే ఆవును ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం.. సోమవారం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అసలు ఎలాంటి ప్రాథమిక హక్కులు ప్రభావితం అవుతాయి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం కోర్టు పనా?.. మేము ఖర్చులు విధించవలసి వచ్చినప్పుడు మీరు అలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తారు?.. అసలు ఇప్పుడు ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడింది? మీరు కోర్టుకు వచ్చినందునా మేము చట్టాన్ని గాలికి విసిరేస్తామా?’’ పిటిషనర్ తరపు న్యాయవాదిని మందలించింది బెంచ్. పిటిషన్ దాఖలు చేసినందుకుగానూ ఖర్చులు విధించాల్సి వస్తుందని పిటిషనర్ తరపున న్యాయవాదిని బెంచ్ హెచ్చరించింది. దీంతో సదరు న్యాయవాది అభ్యర్థన పిటిషన్ను ఉపసంహరించుకోగా, పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఎన్జీవో గోవాన్ష్ సేవా సదన్, ఇతరులు కలిసి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్)ను దాఖలు చేసింది. ఇదీ చదవండి: ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు! కానీ..’ -
స్వదేశీ సాహివాల్కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్గా గుర్తింపునిచ్చింది. నాగర్కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని..
లక్నో: కుక్కలు విశ్వాసానికి మారు పేరుగా వర్ణిస్తుంటారు. కానీ కొన్ని రకాల కుక్కలు మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా మనుషులపై దాడి చేస్తుంటాయి. ఎక్కడి పడితే అక్కడ కొరికి కరిచేస్తుంటాయి. ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు దాడి చేస్తున్న ఘటన ఎక్కువ అవుతున్నాయి. అంతేగాక కుక్కల బారిన పడి అనేక చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను చాలానే చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కుక్క దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో చోటుచేసుకుంది. పిట్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహింతంగా దాడికి తెగబడింది. క్రూరమైన కుక్క ఆవు దవడను తన నోటితో బలంగా కరిచి పట్టుకుంది. దీంతో ఆవు నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించింది. ఆవును రక్షించడానికి కుక్క యాజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. చేతులు, కర్రతో కొట్టినప్పటికీ కుక్కు ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు. మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి సాయం చేయగా చివరికి విడిచిపెట్టింది. అయితే అప్పటికే ఆవు నోటిపై లోతైన గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుక్క లైసెన్స్ చూపించాల్సిందిగా యాజమానిని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కుక్కను కూడా స్వాధీనం చేసుకొని బోనులో ఉంచారు. ఆవును పశువైద్యశాలకు పంపించారు. అలాగే దానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే నిరంజన్ తెలిపారు. కాగా పిట్బుల్ జాతికి చెందిన కుక్కలు మనుషులపై దాడి చేసే ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గత రెండు నెలల్లో వేర్వేరు సంఘటనల్లో దాదాపు అర డజను మంది పిట్బుల్ దాడిలో గాయపడ్డారు. कानपुर के सरसैया घाट पर ‘पिटबुल कुत्ते’ ने कर दिया गाय पर हमला। - ग्रामीणों की काफी देर की मशक्कत के बाद गाय को पिटबुल की कैद से छुड़ाया जा सका। - इस बीच पिटबुल डॉग ने गाय का जबड़ा चबा लिया। - इस घटना के बाद घाट पर जाने से कतरा रहे हैं सैलानी। pic.twitter.com/yvbBN5EgSS — Shubhankar Mishra (@shubhankrmishra) September 22, 2022 -
బీజేపీ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన గోమాత!
జైపూర్: రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆవును అసెంబ్లీ ఆవరణలోకి తీసుకెళ్లారు. లంపీ స్కిన్ వ్యాధితో అనేక పశువులు చనిపోతున్నాయని, కానీ గాఢ నిద్రలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గోవుతో వచ్చినట్లు చెప్పారు. అయితే రావత్ ప్రయత్నం బెడిసికొట్టింది. అసెంబ్లీ గేటు వద్ద గోవు పక్కన నిల్చోని ఆయన మీడియాతో మాట్లాడే సమయంలోనే అది పారిపోయింది. దాన్ని చైన్తో పట్టుకుని ఉన్న వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా పరుగులు పెట్టింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోమాతను అసెంబ్లీకి తీసుకొచ్చిన బీజేపీ ఎమ్మెల్యేకు ఏం జరిగిందో చూడండి అని కాంగ్రెస్ దీనిపై సెటైర్లు వేసింది. What happened when Bjp mla from Pushkar reached Rajasthan assembly with a cow🤣🤣🤣 pic.twitter.com/I7UHaxjqQ6 — Surbhi✨ (@SurrbhiM) September 20, 2022 అయితే రావత్ మాత్రం దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. చివరకు గోవులు కూడా ఈ కఠినమైన ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయని, అందుకే ఆ ఆవు పారిపోయిందని చెప్పుకొచ్చారు. కాగా.. సోమవారం పశుసంవర్ధక శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం లంపీ స్కిన్ వ్యాధితో 59,027 పశువులు చనిపోయాయి. 13,02,907 మూగజీవాలు ప్రభావితమయ్యాయి. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు -
ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రియ దేశీ ఆవుపాల (ఏ–2) ఉత్పత్తులు మార్కెట్లోకి రాబోతున్నాయి. ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట పాలు, వెన్న, నెయ్యి, పన్నీరు ఇలా వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడలో ఈ నెలాఖరున తొలి కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఏర్పాటుచేయనున్నారు. జెర్సీ, హెచ్ఎఫ్ జాతి పశువుల నుంచి వచ్చే పాలను ఏ–1 పాలుగానూ.. ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రెడ్సింధీ జాతి దేశీ ఆవుల నుంచి వచ్చే పాలను ఏ–2 పాలుగా పిలుస్తారు. చదవండి: మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే! మూపురం కల్గిన పశువుల పాలల్లో హానికర రసాయనాలు (బీసీఎం–7) ఉండవని, వీటిలో కేసిన్ ప్రొటీన్ పదార్థం అధికంగా ఉండడంవల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు చక్కని ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో నిర్ధారణ కావడంతో ఈ పాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ. విజయవాడ, వైజాగ్లో లీటర్ రూ.80–100 చొప్పున విక్రయిస్తుంటే, హైదరాబాద్లో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. ఇక వీటి పేడ ద్వారా తయారుచేసే ఎరువును కిలో రూ.7 చొప్పున, మూత్రాన్ని లీటరు రూ.75 చొప్పున స్థానికంగా విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో దేశీవాళీ గోజాతి రెట్టింపు లక్ష్యం రాష్ట్రంలో 2019 పశుగణన ప్రకారం.. 7.87లక్షల దేశీ ఆవులు, 11.93 లక్షల సంకర, విదేశీ జాతి పశువులున్నాయి. రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రాతి, రెడ్సింధీ వంటి అంతరించిపోతున్న దేశీ నాటు ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ పాలు, పాల ఉత్పత్తులను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 50 శాతం సబ్సిడీపై ఒక్కోటి రూ.30లక్షల అంచనా వ్యయంతో వైఎస్సార్ దేశవాళీ గో జాతుల పెంపకం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో గతేడాది 57 కేంద్రాలు ఏర్పాటుచేయగా, మలివిడతలో 52 కేంద్రాలు మంజూరు చేశారు. 27 కేంద్రాలు త్వరలో గ్రౌండింగ్ కానున్నాయి. ఒక్కో క్షేత్రంలో 20 దేశీ ఆవులు, ఓ ఆంబోతును అందిస్తుండగా, పునరుత్పత్తి ద్వారా వీటి సంతతిని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్ర గో పుష్టి పేరిట బ్రాండింగ్ ఒక్కో ఆవు రోజుకు 6–8 లీటర్ల చొప్పున ఏడాదిలో 220 రోజులపాటు పాలు ఉత్పత్తి చేస్తాయి. పాల ఉత్పత్తి, వినియోగం క్రమేపి పెంచడం, ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడంతో పాటు ఆవుపేడ, గో మూత్రం, పంచగవ్య, జీవామృతం వంటి ఉప ఉత్పత్తులకు ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ఎస్ఓపీ) ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాలకు అదితి ఆర్గానిక్ సరి్టఫికేషన్ (బెంగళూరు) ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయిస్తున్నారు. ఏ–2 పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల కోసం రైతుల ద్వారా ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రముఖ నగరాల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో తొలిస్టాల్ను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో సేంద్రీయ పాలతో పాటు నెయ్యి, పన్నీరు వంటి ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మలివిడతలో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి 50కు పైగా నగరాల్లో నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర రిటైల్ అవుట్లెట్స్తో పాటు త్వరలో ఏర్పాటుచేస్తున్న అమూల్ అవుట్లెట్స్, రైతుభరోసా కేంద్రాల ద్వారా కూడా మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. త్వరలో ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ ‘జైవిక్ ఖేతి’ ద్వారా ఆన్లైన్లో విక్రయించేందుకు కసరత్తు జరుగుతోంది. సేంద్రియ పాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అంతరించిపోతున్న దేశీవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ దేశవాళి గో జాతుల పెంపకం కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఈ క్షేత్రాల్లోని దేశీ ఆవుల పాలు, పాల ఉత్పత్తులతోపాటు ఉప ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్ఠి పేరిట మార్కెటింగ్ చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. పాడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేకంగా స్టాల్స్ను ఏర్పాటుచేస్తున్నాం. తొలిస్టాల్ ఈనెలాఖరున విజయవాడలో అందుబాటులోకి రానుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, పశుసంవర్థక శాఖ -
హర్ ఘర్ తిరంగాలో అపశ్రుతి.. మాజీ మంత్రికి గాయం
అహ్మదాబాద్: డెబ్భై ఐదేళ్ల భారత దేశ స్వాతంత్ర ఉత్సవాల్లో భాగంగా.. బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగాకు పిలుపు ఇచ్చింది. ఇంటా వాకిట బడి బండ్లు అనే తేడా లేకుండా అంతటా మూడు రంగుల మయం అయిపోయింది. మరోవైపు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి ప్రభుత్వం. ఇదిలా ఉండగా.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో గుజరాత్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గాయపడ్డారు. శనివారం మెహ్సనా జిల్లా కడి ప్రాంతంలో ఆయన నేతృత్వంలో ర్యాలీ జరిగింది. అయితే వీధుల్లో తిరిగే ఆ ఆవు నినాదాలకు భయపడి.. ర్యాలీ వైపు దూసుకొచ్చింది. ఆవు ఢీ కొట్టి వెళ్లిపోవడంతో.. ఆయన కింద పడిపోయారు. కాలికి గాయం కాగా.. సిబ్బంది అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. ఆపై ఎస్కార్ట్ సాయంతో అహ్మదాబాద్ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. ఆయన కాలికి చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని, నెలరోజుల రెస్ట్ అవసరమని బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. Stray cow attacks Gujarat's former Deputy CM Nitin Patel during "Har Ghar Tiranga" yatra in Mehsana. pic.twitter.com/pwlmqRi7nT — Saral Patel (@SaralPatel) August 13, 2022 He is former Dy. CM @Nitinbhai_Patel today he got injured by a running cow. May Allah grant him speedy recovery. Questions that come to my mind 1.Who is responsible 4 dis accident? 2.The security personnel r private or still provided by d govt? @SandeepPathak04@SanjayAzadSln pic.twitter.com/Nsx8yYJNjm — Dr. Tohid Alam khan AAP 🇮🇳 (@aapkatohid) August 13, 2022 ఇదీ చదవండి: రాఖీలో విషాదం.. గాలిపటం దారం యమపాశమై! -
మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!
ఆవులు, గేదెల్లో ఏ దూడలు కావాలని కోరుకుంటారు... సహజంగా ఎవరైనా పెయ్య దూడలు (ఆడ) కావాలని ఆకాంక్షిస్తారు. కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తున్నా.. పుట్టేది ఆడదూడా.. మగదూడా అనేది తెలియని పరిస్థితి. ఇక నుంచి పాడి అభివృద్ధికి ఆడదూడలే పుట్టించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లింగ నిర్ధారణ వీర్యం (సార్టెడ్ సెక్స్ సెమన్) ద్వారా 95 శాతం పెయ్య దూడలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. కర్నూలు (అగ్రికల్చర్): పెయ్య దూడల జననం ద్వారా పాల దిగుబడిని, రైతు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. లింగనిర్ధారణ వీర్యం సాంకేతికతను కృత్రిమ గర్భధారణ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం, పాడి పరిశ్రమను మరింత అభివృద్ది చేసేందుకు దోహదపడుతోంది. నేడు విద్యావంతులైన నిరుద్యోగులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది జిల్లాలో 5,000 పశువులకు లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూది వేసి పెయ్య దూడలు అభివృద్ధి చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని రైతుల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. సబ్సిడీపై కృత్రిమ గర్భధారణ వీర్యం లింగనిర్ధారణ వీర్యాన్ని పూణే, అహమ్మదాబాద్ల్లోని వెటర్నరీ రీసెర్చ్ కేంద్రాల్లో అధిక పాలసార ఉన్న ఆంబోతుల నుంచి సేకరించారు. ఆడదూడలే పుట్టే విధంగా లింగనిర్ధారణ వీర్యాన్ని వృద్ధి చేశారు. రెండేళ్ల క్రితం జెర్సీ, హెచ్ఎఫ్ ఆవుల్లో ఈ ప్రయోగం చేశారు. 200 ఆవులకు ఇటువంటి వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయగా 52 దూడలు పుట్టాయి. ఇందులో 47 పెయ్యదూడలు ఉండటం విశేషం. తాజాగా మరింత సాంకేతికతతో అభివృద్ధి చేసిన లింగనిర్ధారణ వీర్యంతో ముర్రా గేదెలతో పాటు జెర్సీ, ఆవు జాతులైన గిర్, సాహివాల్, హెచ్ఎఫ్ ఆవులకు కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తారు. ఒక డోసు పూర్తి ధర రూ.700 ఉండగా... కేంద్రం రూ.450 సబ్సిడీ ఇస్తుంది. రైతు రూ.250 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5,000 పశువులకు సార్టెడ్ సెక్స్ సెమన్ ద్వారా సూదులు వేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. 95 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం లింగనిర్ధారణ వీర్యం ద్వారా 95 శాతంపైగా పెయ్యదూడలే పుట్టే అవకాశం ఉంది. ఒక ఆవు లేదా గేదెకు మూడు డోసుల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆవులు, గేదెలు ఎదకు రావడాన్ని గుర్తించి ఈ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఎదకు వచ్చిన 12 గంటల నుంచి 24 గంటలలోపు సూదులు వేయించాల్సి ఉంది. మొదటి డోసు వేసినపుడు చూడికట్టకపోతే రెండవసారి వేయంచవచ్చు. అపుడు కూడా చూడికట్టకపోతే మూడవ డోసు వేయించవచ్చు. ప్రతి డోసుకు రైతు సబ్సిడీ పోను రూ.250 చెల్లించాల్సి ఉంది. మూడు డోసులు వేసినా చూడికట్టకపోతే రూ.500 రైతుకు వెనక్కి ఇస్తారు. మూడు డోసుల సార్టెడ్ సెక్స్ సెమన్తో కృత్రిమ గర్భధారణ చేసినా మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు. ఈ సెమన్ ప్రధాన లక్ష్యం పెయ్యదూడల అభివృద్ధి. ఈ కార్యక్రమాన్ని గోపాలమిత్రలు అమలు చేస్తారు. సార్టెడ్ సెక్స్ సెమన్తో సూది వేస్తే రూ.100 ప్రోత్సాహకం ఇస్తారు. మొదటి డోసుతోనే చూడి కడితే రూ.150, రెండవ డోసుతో చూడి కడితే రూ.100 ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం లింగనిర్ధారణ వీర్యంతో ఒంగోలు జాతి మినహా మిగిలిన అన్ని ఆవు, గేదె జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. దీని ద్వారా 90 నుంచి 95 శాతం వరకు ఆడదూడలే పుట్టే అవకాశం ఉంది. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోంది. – రాజశేఖర్, కార్యనిర్వహణాధికారి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, కర్నూలు -
ఆవుకు ‘డిజిటల్’ కృత్రిమ గర్భధారణ
సాక్షి, హైదరాబాద్: పశువుల కృత్రిమ గర్భధారణ విధానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పశువైద్య నిపుణులు ముందడుగు వేశారు. ఇప్పటివరకు నాటు పద్ధతిలో (జననాంగంలోకి చేయి పెట్టడం ద్వారా) జరుపుతున్న ఈ ప్రక్రియను తొలిసారి డిజిటల్ పద్ధతిలో నిర్వహించారు. ఇందుకు పీవీ నరసింహా రావు పశువైద్య విశ్వవిద్యాలయం వేదిక అయింది. ఈ ప్రయోగంలో భాగంగా లేజర్ కిరణాలతో కూడిన ఎండోస్కోపీ ట్యూబ్ ఇచ్చే డిస్ప్లే సమా చారం ఆధారంగా వీర్యాన్ని ఓ ఆవు గర్భాశయంలోకి పంపారు. ఎండోస్కోపీ ట్యూబ్తోపాటు వచ్చే పెన్డ్రైవ్ను కాలర్ హ్యాంగింగ్ మొబైల్ ఫోన్కు అటాచ్ చేయడం ద్వారా గర్భాశయ ముఖద్వారం, వీర్యం వెళుతున్న విధానం కనిపించేలా ఏర్పాట్లు చేసుకొని ఈ ప్రయోగం నిర్వహించారు. అలా పంపిన వీర్యం పూర్తిస్థాయిలో పశువు గర్భాశయం లోకి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగంలో పశువైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంసింగ్ లకావత్తోపాటు ఇంటర్న్షిప్, ఫైనలియర్ విద్యార్థులు పాల్గొన్నారు. సర్జరీ విభాగం హెచ్వోడీ ప్రొఫెసర్ ఇ.ఎల్. చంద్రశేఖర్ సమక్షంలో ఈ ప్రయోగం నిర్వహించారు. నాటు పద్ధతి వల్ల 30–40% ఫలదీకరణే జరుగుతుండగా డిజిటల్ గర్భధారణ విధానంలో 60–70 శాతం వరకు ఫలదీకరణ అవకాశం ఉందని పశువైద్య నిపుణులంటున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోందని పేర్కొన్నారు. -
ముప్పయ్యేళ్ల క్రితం సాహసం.. వెచ్చూరు ఆవుల పరిరక్షణ
సోసమ్మ ఐపె.. ఈ మహిళా వెటర్నరీ ప్రొఫెసర్ ముప్పయ్యేళ్ల క్రితం సాహసంతో తన ఉద్యోగాన్నే దేశీ గోజాతి పరిరక్షణ ఉద్యమ కేంద్రంగా మార్చుకొని ఉండకపోతే.. ఇవ్వాళ అపురూపమైన వెచ్చూరు గోజాతి మనకు కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయేది. అందుకే ఆమెను ‘వెచ్చూరమ్మ’ అని కేరళ రైతులు ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన 80 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సోసమ్మ విశేష కృషి గురించి మహిళా దినోత్సవం సందర్భంగా ముచ్చటించుకుందాం.. ‘వెచ్చూరు’ అత్యంత అరుదైన పొట్టి దేశీయ గోజాతి. మన ‘పుంగనూరు’ కన్నా ఎత్తు తక్కువగా ఉండే ఆవులు ఇవి. కొట్టాయం జిల్లాలోని వెచ్చూరు గ్రామం ఈ జాతి పుట్టిల్లు. ‘1960లలో అధిక పాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం విదేశీ గోజాతులతో సంకరీకరణ విధానాన్ని భారీఎత్తున అమలు చేయటం ప్రారంభించింది. 1980ల నాటికి వెచ్చూరు దేశీయ జాతి ఆవుల సంతతి దాదాపుగా అంతరించిపోయింది..’ అని డా. సోసమ్మ గుర్తుచేసుకున్నారు. అటువంటి దశలో కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీలో బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న డా. సోసమ్మ దృష్టి వెచ్చూరు ఆవుల పరిరక్షణ వైపు మళ్లింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైన పనిని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. ఆమె ప్రయత్నాలకు 15–20 మంది వెటర్నరీ విద్యార్థులు, వ్యక్తులు మద్దతుగా నిలిచారు. మొదటి పని.. నికార్సయిన వెచ్చూరు ఆవులు ఎక్కడైనా మిగిలి ఉన్నాయా అని కొట్టాయం తదితర దక్షిణ కేరళ జిల్లాల్లో 1989లో వెతకడం ప్రారంభించారు. సెలవు రోజుల్లో ఆమె, విద్యార్థులు బృందాలుగా విడిపోయి కాలికి బలపం కట్టుకొని తిరిగారు. సొంత ఖర్చులతో ఊళ్లమ్మట తిరుగుతూ రైతులను వాకబు చేసేవారు. విద్యార్థుల కుటుంబాలు కూడా ఇందులో భాగస్వాములు కావటం విశేషం. ‘నా ఉద్యోగ జీవితంలోనే అవి అత్యుత్తమ ఘడియలు. మేం అంతా ఆ ప్రయాణంలో సంతోషదాయకంగా నిమగ్నమయ్యాం..’ అన్నారామె. ఒక్కోసారి చాలా రోజులు తిరిగినా ఒక్క వెచ్చూరు ఆవు జాడ కూడా దొరికేది కాదు. ఎట్టకేలకు మనోహరన్ అనే రైతు దగ్గర మొదటి ఆవును గుర్తించాం. ఆయన ఆవును మాకు అమ్మటానికి మొదట అంగీకరించలేదు. పరిశోధన చేసి జాతిని బతికిస్తాం అని నచ్చజెప్పిన తర్వాత అంగీకరించారు. మా అందరికీ పట్టలేని సంతోషం కలిగిన రోజు అది. ఒక ఏడాదిలో 24 నికార్సయిన 24 వెచ్చూరు ఆవులను సేకరించగలిగాం. మరింత సంతోషం ఏమిటంటే.. వీటి కొనుగోలుకు, పోషణకు యూనివర్సిటీ నుంచి రూ. 65 వేల గ్రాంటు అందటం. మన్నుతిలోని వెటర్నరీ యూనివర్సిటీ క్షేత్రంలోనే ఆవులను ఉంచి పోషించటం ప్రారంభించారు. అయితే, ఆ తర్వాత పనులూ సులువుగా ఏమీ జరగలేదు. ‘మేం చేస్తున్న పని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైనది. మా పనిని యూనివర్సిటీలో కొందరు వ్యతిరేకించేవారు కూడా. అయితే, ఈ లోగా వెచ్చూరు దేశీ గోజాతి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తింపు వచ్చింది’ అన్నారామె. సంవత్సరం గడిచేలోగానే పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనేక ఆవులు చనిపోయాయి. అందుకు పాల్పడింది ఎవరో తెలీదు. దర్యాప్తు కొనసాగింది. ‘నా జీవితంలో అతి కష్టమైన రోజులవి.. అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా సరే.. లక్ష్యసాధనకు మా పోరాటాన్ని మాత్రం ఆపలేద’న్నారు డా. సోసమ్మ. 1998లో స్కాట్లండ్కు చెందిన రోస్లిన్ ఇన్స్టిట్యూట్ వెచ్చూర్ గోజాతి డిఎన్ఎపై పేటెంట్ పొందటం పరిశోధనారంగంలో సంచలనం కలిగించింది. ‘వెచ్చూరు జాతి పరిరక్షణకు మేం చేస్తున్న కృషికి చాలా ప్రతిఘటన ఎదురైన రోజులవి. రెండేళ్ల దర్యాప్తు తర్వాత.. వారిది తప్పుడు పని అని తేలిపోవడంతో ఊపిరిపీల్చుకున్నాం’ అన్నారు డా. సోసమ్మ. వెచ్చూరు జాతి పరిరక్షణ కృషిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం తప్పనిసరి అని భావించి వెచ్చూరు కన్సర్వేషన్ ట్రస్టును 1998లో రిజిస్టర్ చేయించారు. ట్రస్టు తరఫున మేలైన వెచ్చూరు ఆబోతుల వీర్యాన్ని సేకరించి రైతులకు అందించడం ప్రారంభించారు. వెచ్చూరుతోపాటు కాసర్గోడ్ గోజాతుల చిల్డ్/ఫ్రోజెన్ వీర్యాన్ని రైతులకు 2008 నుంచి ఈ ట్రస్టు అందిస్తోంది. మరోవైపు యూనివర్సిటీ తరఫున బయోడైవర్సిటీ బోర్డు, నాబార్డులతో కలసి వెచ్చూరు జాతిపై పరిశోధనా ప్రాజెక్టులు చేశారు. ఎఫ్.ఎ.ఓ., యు.ఎన్.డి.పి.ల నుంచి డా. సోసమ్మకు ప్రశంసలు, అవార్డులు సైతం లభించాయి. ఇప్పుడు కేరళ తదితర రాష్ట్రాల్లో 5 వేలకు పైగా వెచ్చూరు జాతి పశువులు ఉన్నాయని డా. సోసమ్మ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చెప్పారు. facebook.com/vechur – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి 2 అడుగులు.. 3 లీటర్లు.. వెచ్చూరు ఆవు సగటు ఎత్తు 90 సెంటీమీటర్లు (3 అడుగులు). అయితే, 61.5 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన వెచ్చూరు ఆవు గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. కేరళకు చెందిన రైతు, పర్యావరణవేత్త బాలకృష్ణన్ నంబుకుడి కుటుంబంలో భాగంగా మారిపోయిన ఈ ఆవు పేరు ‘మాణిక్యం’. తమ కుటుంబానికి దైవమిచ్చిన కానుక మాణిక్యం అని ఆయన మురిసిపోతూ ఉంటారు. వెచ్చూరు ఆవు తక్కువ మేత తింటుంది. సగటున 3 లీటర్ల పాలు ఇస్తుంది. పెరట్లోనూ పెంచుకోవచ్చు. నిర్వహణ సులభం. దీని పాలు ఔషధ విలువలతో కూడి ఉంటాయని చెబుతారు. -
బంగారు నెక్లెస్ని మింగిన ఆవు.. యజమానికి తెలియడంతో..
సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు చాలా మందికే ఉంటుంది. కొందరు కుక్కలను, పిల్లులను, మరి కొందరు ఆవులను కూడా పెంచుకుంటారు. కాకపోతే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఒక్కోసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఓ కుటుంబం కాస్త ఏమరుపాటులో ఉండేసరికి ఆ ఇంట్లోని ఆవు గొలుసు మింగేసింది. దాన్ని ఆవు కడుపులోంచి బయటకు తీసేందుకు ఆ కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడ్డారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిర్సీ తాలూకాలోని హీపనహళ్లిలో నివసిస్తున్న శ్రీకాంత్ హెగ్డే ఇంట్లో ఒక ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి ముందురోజు గోవు పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఆవు, దూడకు స్నానం చేయించి పూజలు చేశారు. భారతదేశంలో ఆవును ఆ సమయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఆవులను పూల దండలతో అలంకరించడం మామూలే. హెడ్జ్ కుటుంబం సభ్యులు మాత్రం పూల దండలతో పాటు 20 గ్రాముల బంగారు గొలుసుతో కూడా దూడకి అలంకరించారు. వాటికి పూజ చేసిన అనంతరం పూల దండలతో పాటు గొలుసును తీసి పక్కన ఉంచారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొద్దిసేపటి తర్వాత పూలు , ఆ బంగారు గొలుసు మాయమయ్యాయి. కుటుంబీకులు ఆ గొలుసు కోసం గోశాల మొత్తం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆ ఆవు గొలుసు మింగేసి ఉంటుందని కుటుంబసభ్యులకు భావించారు. అవు పేడ వేస్తే.. దానితో పాటు నెక్లెస్ కూడా వస్తుందిలే అని అనుకున్నారు. అలా ఓ నెల రోజుల పాటు.. దాని పేడను రోజూ చెక్ చేస్తూ వచ్చారు కానీ.. ఫలితం మాత్రం శూన్యం. దీంతో ఆ ఆవును వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నెక్లెస్ను తీయడం కోసం దానికి సర్జరీ చేయించి గొలుసుని బయటకు తీశారు. కాకపోతే 20 గ్రామలు ఉండాల్సి గొలుసు కాస్త 18 గ్రాములే బయటకు వచ్చింది. నెక్లెస్లోని ఒక చిన్న భాగం మాత్రం మిస్ అయినా.. చివరకి ఆ గొలుసు ఆవు కడుపులోంచి తీసినందుకు ఆ ఫ్యామిలీ మొత్తం ఊపిరిపీల్చుకుంది. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం బాగున్నట్లు ఆ హెడ్జ్ కుటుంబం తెలిపింది. చదవండి: Bengaluru Suburban Railway Project: కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో.. -
గేదె పాలు ఇవ్వడం లేదని ఆపరేషన్.. కడుపులో 5 కిలోల ప్లాస్టిక్
సాక్షి, ఆదిలాబాద్(నిర్మల్): ప్లాస్టిక్ కవర్లు పశువులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. యథేచ్ఛగా వినియోగిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండడంతో ఆహారంగా భావించి తింటున్న పశువులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మామడ మండలం కొరిటికల్ గ్రామంలో లింగన్నకు చెందిన గేదె ప్లాస్టిక్ తినడం వల్ల అనారోగ్యానికి గురైంది. మేత మేయకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, పాలు ఇవ్వకపోవడం వంటి లక్షణాలను గుర్తించిన పోషకుడు పశువైద్యులు ఓంప్రకాష్, శ్రీకర్రాజులకు సమాచారం అందించాడు. గురువారం గేదెను పరీక్షించిన పశువైద్యాధికారులు ప్లాస్టిక్ ఆహారంగా తీసుకోవడం ద్వారా అనారోగ్యానికి గురైందని గుర్తించారు. ఆపరేషన్ ద్వారా గేదె కడుపులోపల ఉన్న ఐదు కిలోలకు పైగా ప్లాస్టిక్ను తొలగించారు. పశుపోషకులు పశువుల మేత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (చదవండి: తెలంగాణలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..) -
ఛీ చాలా సిగ్గుచేటు!... అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు!
కొంత మంది మూగ జీవాలను, చిన్న పిల్లలను దారుణంగా హింసిస్తూ చాలా పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. అంతేకాదు వాళ్లకు మతిస్థిమితం లేక అలా చేస్తున్నారో లేక వారి ప్రవృత్తే అలా ఉంటుందో అర్థంకాదు. ఏదిఏమైన ఇలాంటి ఘటనలు చూస్తే చాలా అసహ్యంగానూ, అమానుషంగానూ అనిపిస్తుంది. అచ్చం అలాంటి క్రూరమైన ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. (చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!) అసలు విషయంలోకెళ్లితే....తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కెట్టి అనే చిన్న పట్టణంలో ఒక వ్యక్తి గాయపడిన ఆవుని చాలా దారుణంగా హింసిస్తుంటాడు. పాపం ఆ ఆవు తనను రక్షించే నిమిత్తం ఆ వ్యక్తి పై దాడి చేసేందుకు ప్రయత్నించి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆ నిందితులను అటవీశాఖ అరెస్ట్ చేసింది" అని క్యాప్షన్ పెట్టి మరీ రీట్వీట్ చేశారు. అంతేకాదు ఆమె ఆ ట్వీట్లో ఆ క్రూరమైన చర్యను ఖండిచేలా ఒక భయంకరమైన చట్టం ఒకటి ఉందని గుర్తుచేయడమే కాక తప్పకుండా తాము ఆ దిశగా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు కూడా "ఛీ చాలా సిగ్గుచేటు, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కొన్నా స్కూటీ!.... ఏం లాభం నడిపేందుకు లేకుండాపోయింది) Unidentified man mercilessly beating what looks like an injured #indian Gaur at #nilgiri district #TamilNadu The gaur is seen struggling to walk & almost trips as it runs away in fear.. People heard yelling expletives at the attacker, ask him to show mercy#wildlife #TNGovt pic.twitter.com/AKTx2YXrVq — Sidharth.M.P (@sdhrthmp) November 30, 2021 -
గోమాతకు ఘనంగా సీమంతం
-
ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..
మనుషులు ప్రాణాలను రక్షించుకోవటం కోసం లేదా తనను ఇబ్బందికి గురిచేసే వారి నుంచి లేదా బాధపెట్టే వారి నుంచి దూరంగా స్వేచ్ఛగా బయటికి వచ్చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. అచ్చం అదే విధంగా ఇక్కొడొక ఆవు అలానే తన ప్రాణాలను రక్షించుకువడానికి బయటకు వచ్చేస్తుంది. (చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...) అసలు విషయంలోకెళ్లితే...బ్రెజిల్లోని ఒక ఆవు జంతు వధ కబేళా నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అది రియో డి జనీరోకు పశ్చిమాన 800 కి.మీ దూరంలో ఉన్న నోవా గ్రెనడాలోని వాటర్ పార్క్లోకి వెళ్లుతుంది. అక్కడ నుంచి నెమ్మదిగా ఓపెన్-ఎయిర్ స్విమ్మింగ్ పూల్కి చేరుకుని అక్కడ ఉన్న కొన్ని మెట్టు ఎక్కి నీటి స్లైడ్ పైకి చేరుకుంటుంది. కానీ అక్కడ ఆ ఆవు నడవలేక జారిపోతుంటుంది. దీంతో ఆ ఆవు అక్కడే కూర్చొండిపోతుంది. నిజానికి ఆ స్విమ్మింగ్ పూల్ 200 కేజీల బరువును మాత్రమే భరించగలదు కానీ 317 కిలోలు ఉన్న ఆవు ఎక్కినప్పుడు ఆ పూల్ పై భాగం ఏ మాత్రం ధ్వంసం కాలేదు. అంతేకాదు ఆ స్విమ్మింగ్ పూల్ యజమాని కార్లోస్ మిగ్యుల్ సెరాంటె ఆ ఆవుకి టోబోగా పేరు పెట్టి దత్తతగా తీసుకుని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రాణలను రక్షించేకునేందుకు ఎంతలా ప్రయత్నించిందంటూ ఆ ఆవుని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) -
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్పర్స్న్గా ప్రశాంతి ప్రమాణం
-
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్ పర్సన్ గా ప్రశాంతి రెడ్డి ప్రమాణం..
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలికి చైర్పర్సన్గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయ గర్భగుడిని అలాగే ఉంచి.. మిగిలిన ప్రాంతాన్ని పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో టీటీడీ ఆలయంలో గానీ, భజన మండలి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోని 29 పీఠాధిపతులతో తిరుమలలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అన్నారు. దేశంలోని ఏ గుడిలో నైనా.. గోవును అడిగితే ఉచితంగా అందజేస్తామని తెలిపారు. దేశంలో అనేక చోట్ల గోవులకు సరైన పోషణ ఉండటం లేదని ఆవేదన సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. గోసంరక్షణ కోసం అవసరమైన నిధులను కూడా.. టీటీడీ కేటాయిస్తుందని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం
గుమటాపుర: చాలా ప్రాంతాలలో పండుగల సందర్భంగా కొన్ని వింతైన ఆచారాలు ఉంటాయి. వాటి వెనుక ఎంతో కొంత ప్రయోజనాల దృష్ట్య కూడా మన పూర్వీకులు ఇలాంటి వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేస్తారని చెప్పక తప్పదు. అదేవిధంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉన్న గుమటాపుర గ్రామంలో దీపావళి పండుగ ముగింపు సందర్భంగా ఒక వింతైన ఆచారం ఉంది. (చదవండి: అమ్మ బాబోయ్ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్గా చేతులు పెట్టేస్తున్నాడు!) అంతేకాదు వారు మొదట ఆలయానికి వెళ్లి గుడిలోని పూజారితో ఆశీర్వాదం తీసుకునేముందు స్థానిక చుట్టుపక్కల గ్రామాలలోని ఇళ్లలో నుంచి పెద్ద ఎత్తున ఆవుపేడను ట్రాక్టర్ల సాయంతో దేవలయానికి తరలిస్తారు. ఆ తర్వాత అబ్బాయిలంతా జరగబోయే కార్యక్రమానికి కావల్సిన బాణసంచా వంటి మందు గుండు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఈ మేరకు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మగవాళ్లంతా ఒకరి నొకరు ఆవుపేడతో కొట్టుకుంటారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి సుదూర నగరాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున గుమటాపురానికి తరలి వస్తుంటారు. అంతేకాదు ఈ వేడుక చిన్న పాటి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సరదా సరదాగా సాగుతుంటుంది. పైగా ఆ గ్రామంలోని ప్రజలు ఇది ఆరోగ్య ప్రయోజని నిమిత్తం ఇలా చేస్తుంటామని చెబుతుండం విశేషం. ఈ మేరకు ఆ గ్రామంలోని రైతు ఈ ఆవు పేడతో ఇలా కొట్టించుకుంటే ఏదైనా వ్యాధి ఉన్న అది త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. (చదవండి: పునీత్కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!) #WATCH | Villagers of Gumatapura on the Tamil Nadu-Karnataka border throw cow dung on each other as part of Deepavali celebrations, marking the end of the festival. (06.11.2021) pic.twitter.com/w1fhrp0na5 — ANI (@ANI) November 8, 2021 -
Viral Video: ద్విచక్రవాహన దారుడిని కుమ్మేసిన ఆవు
-
వామ్మో.. వాహనదారుడిని కుమ్మేసిన ఆవు.. వీడియో వైరల్
బ్రస్సీలియా: ఒక్కొసారి మూగజీవాలు రోడ్డుదాటుతున్నప్పుడు వేగంగా ప్రయాణిస్తున్న వాహానాలకు అడ్డుపడుతుంటాయి. ఈ క్రమంలో వాహనాలతోపాటు మూగజీవాలు కూడా ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఇలాంటి సంఘటనలు మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం. ఈ కోవకు చెందిన ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన బ్రెజిల్లోని శాంటా కాటరినాలో చోటుచేసుకుంది. చాపెకో వీధి సందులో నుంచి ఒక ఆవు ఒక్కసారిగి రోడ్డుపైకి దూసుకొచ్చింది. అప్పుడు రోడ్డుపై అనేక వాహానాలు ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో ఆవు రోడ్డుపైకి వచ్చి ద్విచక్రదారుడిని వెళ్లి ఢీకొట్టింది. ఈ హఠాత్పరిమాణంతో బైకర్ రోడ్డుపై పడ్డాడు. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనాలు కూడా ఆగిపోయాయి. ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండటం.. ఎక్కువ స్పీడ్ లేకపోవడం వలన చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఈ సంఘటన గత నెల అక్టోబరు 27న జరిగింది. దీన్నిరోడ్డుపై ఉన్న ఒక వ్యక్తి తన మిత్రుడికోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆవు పరుగెత్తుకురావడాన్ని గమనించి వీడియోతీశాడు. ఈ తర్వాత.. వైరల్ హగ్ అనే యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు..’, ‘పాపం.. ఆవుకు కూడా గాయమైనట్టుంది..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా గోమాహా సమ్మేళనం
-
ఘనంగా ‘సావిత్రి’కి సీమంతం
యడ్లపాడు(గుంటూరు): ఉమ్మడి కుటుంబాలే కాదు.. రక్తసం‘బంధం’ బలం తగ్గిపోతున్న కాలమిది. కన్నవారే కాదు..కట్టుకున్న ఆలిని సైతం మరిచిపోతున్న రోజులివి. మానవత్వాని మించి ‘మనీ’కే మనిషి విలువిస్తున్న కలియుగం ఇది. తొలి చూలాలైన గోవుకు సంప్రదాయ బద్దంగా ‘సీమంతం’ చేసి సమానత్వాన్ని చాటాడో యువకుడు. పశువులపై మనిషికున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆదినుంచే ప్రకృతిలోని ప్రతిజీవితో అనుబంధం ఉందన్న విషయాన్ని తెలియజేశాడు. పశువు రూపాన ఉన్న పరమాత్మ స్వరూపమని, గోవుని మించి దైవం లేదని నిరూపించారు. ఎక్కడంటే... గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన గుంటుపల్లి వెంకటేశ్వరబాబు ‘లా’ పూర్తిచేసినా వ్యాపార రంగంవైపే మొగ్గుచూపాడు. తన కుటుంబ సభ్యుల నుంచి గోసేవ, గోపూజను వారసత్వంగా పొందాడు. పట్టణంలోని పురుషోత్తమపట్నం షిరిడిసాయి మందిరంలో గోశాల, సుబ్బయ్యతోట గోశాల, ఆవులదొడ్డిగా పిలిచే గుండయ్యతోట గోశాలను సందర్శిస్తాడు. ఉదయాన్నే వెళ్లి మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు, కూరగాయలు శుభ్రపరిచి గోవులకు తినిపిస్తాడు. వాటిచుట్టూ ప్రదక్షిణలు చేసి నమ్కరించాక దినచర్యలు ప్రారంభం అవుతాయి. శుభకార్యనికి...శుభముహూర్తం ఆవులదొడ్డిలోని గోవులన్నింటికీ ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. వీటిలో పూజ అనేగోవుకు పుట్టిన సావిత్రి ఇటీవల కాలంలో గర్భం దాల్చింది. అక్కడి పనివార్ల ద్వారా బాబుకు ఆ విషయం తెలిసి ఆనందపడ్డాడు. తమ ఇంటి ఆడపడుచు గర్భం దాల్చిన విధంగా పొంగిపోయారు. తమ ఇంట ఆడపడుచుకు ఎలా శుభకార్యం చేసేవారో అలాగే చేయాలని బాబు కుటుంబం నిర్ణయించింది. గోవుకు సీమంతం చేస్తున్నామంటూ బంధుమిత్రులకు ఆహ్వానం పలికాడు. వేద పండితుడి వద్దకెళ్లి ముహుర్తం ఖరారు చేయించాడు. కదిలొచ్చిన నాలుగు కుటుంబాలు సావిత్రి సీమంత ఆహ్వానం అందుకున్న వెంకటేశ్వరబాబు అక్కాబావలు ఉదయ్శంకర్, మహాలక్ష్మి దంపతులు, ఆక శేషసాయి, శాంతిలక్ష్మికుమారి దంపతులు, మిత్రులైన విప్రొ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి ఏఎస్వీఎస్ శాస్త్రి, విజయ దంపతులు, మిత్రబ్యాంక్ ఫీల్డ్ఆఫీసర్ ప్రసాదరావు, శ్యామలా దంపతులు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సేవలోనూ, పూజలోనూ తమవంతు భాగస్వామ్యాన్ని సంతోషంగా స్వీకరించారు. ఘనంగా సావిత్రికి సీమంతం 9నెలల నిండు గర్భిణీ సావిత్రిని గోవును పూలతో చక్కగా ముస్తాబు చేశారు. పసుపు, కుంకుమను పూసి కొమ్ములకు రంగురంగుల గాజుల్ని తొడిగారు. కాళ్లకు గజ్జెలు కట్టారు. స్వయంగా వండి తెచ్చిన చలిమిడి, పిండివంటల్ని తృప్తిగా తినిపించారు. నూతన వస్త్రాలను సమర్పించారు. పండితుల వేదమంత్రాలతో ముత్తయిదువులచే మంగళ హారతులు ఇచ్చారు. ఈ శుభకార్యానికి హాజరైన బంధుమిత్రులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. మనఃపూర్వకంగా ఆవును ఆశీర్వదించారు. తమ ప్రేమను చాటుకున్నారు. చివరిగా గోశాలలోని పనివార్లకు తాంబూలాలు, స్వీట్లను పంపిణీ చేశారు. మనుషుల కంటే గోవు సీమంతానికి ఎక్కువమంది హాజరు కావడం విశేషం. కన్నతల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న ఈ రోజుల్లో ఓ ఆవుకు ఇలా సీమంతం చేయడం గొప్ప విషయమని పట్టణ వాసులు కార్యక్రమం నిర్వహించిన దంపతులను అభినందించారు. వినిగానే విశేషంగా అనిపించింది...శ్యామలా, గృహిణి సావిత్రికి సీమంతం చేయడం ఎంతో విశేషంగా అనిపించింది. ఆవు యొక్క విశిష్టత, పవిత్రత నేటì తరానికి తెలీదు. తొలిసారిగా చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇలా చేయడం వలన భావితరాలకు తెలియజేసే అవకాశం ఉంటుంది. ఈ శుభకార్యంలో మేము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. -
వృద్దురాలిపై సడన్ గా దాడి చేసిన ఆవు
-
వృద్ధురాలిపై దాడి చేసిన ఆవు
-
ఆవుల సంరక్షణ కోసం గాయత్రి కృషి
-
ఆవు పాలు పితికిన హీరోయిన్... వీడియో వైరల్
సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూస్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా సినీ తారల విషయంతో ఇది చాలా ఎక్కువ. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఆ వీడియోలు చూసి అభిమానులు మురిసిపోతుంటారు. తాజాగా హీరోయిన్ నివేదా థామస్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: నేహాకక్కడ్: అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వుమెన్ సింగర్..) ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ ప్రశ్న. అందులో నివేదా బ్లాక్ కలర్ జాకెట్ ధరించి ఆవు పాలు పితికింది. డైరీ ఫామ్కి వెళ్లిన నివేదా.. స్వయంగా తానే ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితికి చక్కటి కాఫీ పెట్టుకుంది. దీన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ 'జాయ్' అని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొంతమంది వాటి దగ్గరకు వెళ్లడానికే భయపడతారు.. కానీ నువ్వు వెళ్లడమే కాకుండా పాలు పితికే సాహసం చేశావంటే నువ్వు చాలా గ్రేట్ అక్కా’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నివేదా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. -
ఆవు మాత్రమే అలా చేయగలదు: అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు
అలహాబాద్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ మరోమారు ఆవుపై వ్యాఖ్యలు చేశారు. అన్ని జంతువుల్లోనూ కేవలం ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ను వదులుతుందని సైంటిస్టులు నమ్ముతారన్నారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ద్వారా మందు లేని పలు జబ్బులు కూడా నమయవుతాయని చెప్పారు. ఆవును దొంగలించి చంపిన కేసును విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాంభల్ జిల్లాకు చెందిన జావెద్ గతంలోనూ పలు మార్లు ఆవులను దొంగలించి చంపాడని, బెయిల్ ఇస్తే మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడతాని వ్యాఖ్యానిస్తూ బెయిల్ నిరాకరించారు. హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతలు నివాసముంటారన్నారు. అందుకే గోవధకు హిందువులు వ్యతిరేకమన్నారు. -
భీమవరం ఉండి రోడ్డులో భారీ పేలుడు
పశ్చిమ గోదావరి: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్డులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి అక్కడ భారీ గుంత ఏర్పడింది. ఖాలీ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
వైరల్: పితకకుండానే పాలొచ్చేస్తున్నాయి.. ఆవు నుంచి ‘పాలధార’
వడమాలపేట: చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని ఎన్వీఆర్ కండ్రిగలో ఓ ఆవు పాలు పితకకుండానే ఇస్తోంది. చూడి కట్టకనే.. ఈత ఈనకుండానే .. పొదుగు లేకున్నా.. ఆవుకు పాలు కారడాన్ని వింతగా మారింది. ఈ వార్త వైరల్గా మారింది. గ్రామానికి చెందిన రైతు వెంకటరమణారెడ్డికి ఆవు ఉంది. ఆదివారం పితకుండానే పాలు కారుతుండడాన్ని రైతు గుర్తించాడు. దీంతో పితకగా ఆ ఆవు రెండు లీటర్ల పాలిచ్చింది. ఈ వార్త స్థానికంగా హాట్టాపిక్ అయ్యింది. ఇలా ఆవు పాలు ఇవ్వడంపై వడమాలపేట పశువైద్యశాల లైవ్స్టాక్ ఆఫీసర్ లోకనాథం వివరణ ఇచ్చారు. పశువుల్లో హర్మోన్ల సమస్యతో ఇలా జరుగుతుంటుందని తెలిపారు. -
గిన్నిస్ రికార్డుల్లోకి బుజ్జి ఆవు?
లేగ దూడ ఎంత ముద్దుగా ఉందో కదూ..! ఈ దూడ చూడటానికి చుట్టుపక్కల ఊర్లకు చెందిన వందల మంది వస్తున్నారట. ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంతమంది ఎందుకు వస్తారనే కదా మీ అనుమానం. ఈ లేగ దూడ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు ఉన్న ఆవుగా రికార్డుల్లోకి ఎక్కనుంది. ఇది ఎంత ఎత్తు ఉందో తెలుసా 21 అంగుళాలు (51 సెంటీమీటర్లు) మాత్రమే. పైగా 26 కిలోలు మాత్రమే ఉన్నట్లు దీని యజమానులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ చారిగ్రామ్లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ వయసు 23 వారాలు. భూటాన్ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.అయితే ఇప్పటివరకు అతి చిన్న ఆవుగా భారత్కు చెందిన మాణిక్యం (వేచూర్ జాతి) గిన్నిస్ రికార్డుల్లో ఉంది. మాణిక్యం 24 అంగుళాలు (31 సెంటీమీటర్లు) ఎత్తు ఉంటుంది. దీన్ని బట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు కనుక పరిశీలిస్తే కచ్చితంగా మాణిక్యం రికార్డును రాణి ఎత్తుకుపోతుందని దాని యజమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
మూగజీవాల మృత్యుఘోష ..
సాక్షి, అనంతపురం(గుత్తి): మండల పరిధిలోని ఊటకల్లు వద్ద కురుబ రాజు మామిడి తోటలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. మామిడి తోటలోని ఓ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లో 22 కేఫ్లు (పేలుడు పదార్థాలు) ఉంచారు. టమాట పండ్ల మాదిరి ఉండటంతో అటువైపు వెళ్లిన రైతు నారాయణరెడ్డికి చెందిన ఆవు తినడానికి ప్రయత్నించింది. దీంతో ఒక కేఫ్ పెద్ద శబ్దంతో పేలింది. ఆవు తల భాగం ఛిద్రమైంది. గ్రామస్తులు వెంటనే గుత్తి సీఐ రాముకు సమాచారం ఇచ్చారు. ఆయనతో పాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, ఎస్ఐ సుధాకర్ యాదవ్, పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పేలని 21 కేఫ్లను గుర్తించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ సాధారణంగా కేఫ్ను అడవి పందులను చంపడానికి వినియోగిస్తారని చెప్పారు. అయితే అడవ పందులను చంపడానికైతేఅక్కడక్కడా ఒకటి చొప్పున మాత్రమే ఉంచుతారు. ఒకేచోట 22 ఎందుకు ఉంచారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా రొళ్లపాడు, గుడిసెల గ్రామాలకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో ఊటకల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ తరహా పేలుడు పదార్థాలు ఉంచారోనని భయపడుతున్నారు. గ్రామంలో ఎవరినైనా టార్గెట్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కేఫ్ పేలితే సుమారు కిలో మీటరు దూరం వరకు శబ్ధం వినిపిస్తుందని పోలీసులు చెబుతున్నారు. మూగజీవాల మృత్యుఘోష అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని రామాంజులపల్లి బస్షెల్టర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు ఎద్దులు మృతి చెందాయి. మరో ఏడు ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదానికి గురైన మూగజీవాలు విలవిలలాడడం చూసి స్థానికులు చలించిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి చెన్నైకు ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ లారీ తెల్లవారుజామున రామాంజులపల్లి బస్షెల్టర్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్ర మత్తులో తూగాడు. దీంతో లారీ అదుపుతప్పి ఎదురుగా ఉన్న బస్షెల్టర్ను వేగంగా ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులోని 12 ఎద్దులలో ఐదు అక్కడికక్కడే మృతి చెందాయి. మిగిలిన ఏడు కొమ్ములు, కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాయి. అవి విలవిలలాడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. లారీలోనే మృతి చెందిన ఎద్దులను జేసీబీ సాయంతో తొలగించారు. లారీ వేగంగా ఢీ కొనడంతో బస్షెల్టర్ సైతం దెబ్బతింది. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి గుర్నాథరెడ్డి గోపాలమిత్రలను సంఘటనా స్థలానికి పంపి గాయపడిన పశువులకు చికిత్స చేయించారు. అనంతరం వాటిని చెన్నైకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
మాణిక్యం రికార్డును బ్రేక్ చేసిన 23 నెలల రాణి
ఢాకా : 23 నెలల రాణి అనే ఆవు ప్రస్తుతం సోషల్ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది. రాణిని చూడటానికి నిత్యం వేల సంఖ్యలో జనం క్యూ కడుతున్నారు. జనం అంతలా ఎగబడి చూడ్డానికి రాణిలో అంత ప్రత్యేక ఏంటని అనుకుంటున్నారా? ఆ ఆవు నిజంగానే ప్రత్యేకమైనదే.. 23 నెలల రాణి ఎత్తు 51 సెంటీమీటర్లు మాత్రమే. ఈ మరుగుజ్జు రూపమే దాన్ని సెలెబ్రిటీని చేసింది. బంగ్లాదేశ్, ఢాకా దగ్గరలోని చారిగ్రామ్కు చెందిన ఎమ్ఏ హాసన్ హవాల్దార్ ఈ ఆవును పెంచుకుంటున్నాడు. 51 సెం.మీ ఎత్తు ఉన్న ఈ ఆవు బరువు 26 కేజీలు. ప్రపంచంలో అత్యంత పొట్టి ఆవుగా గిన్నిస్ రికార్డుకెక్కిన కేరళకు చెందిన మాణిక్యం అనే ఆవు కంటే రాణి 10 సెంటీమీటర్లు పొట్టిది. దీనిపై హాసన్ మాట్లాడుతూ.. ‘‘ కరోనా లాక్డౌన్ను లెక్కచేయకుండా జనం రాణిని చూడటానికి వస్తున్నారు. చాలా మంది రాణితో సెల్ఫీలు తీసుకోవటానికి ఎగబడుతున్నారు. గత మూడు రోజుల్లో దాదాపు 1500 మంది రాణిని చూడటానికి వచ్చారు. నిజం చెప్పాలంటే వాళ్లను కంట్రోల్ చేయలేక మేము అలసిపోయాం. చాలా రోజుల క్రితమే గిన్నిస్ రికార్డు వాళ్లను సంప్రదించాం. మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు’’ అని అన్నాడు. -
ఆవు కడుపులోని ఆ ద్రవాలతో ప్లాస్టిక్ భూతానికి చెక్!
తినడానికి తిండి లేక నగర వీధుల్లోని ఆవులు ప్లాస్టిక్ సంచులను తినడం సాధారణంగా చూసే ఉంటారు. అయితే.. ఆస్ట్రియా శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టే ఓ మార్గాన్ని సూచించింది! ఎందుకంటే.. ప్లాస్టిక్ను సైతం ముక్కలుగా చేసేయగల శక్తి ఆవు కడుపులోని ద్రవాలకు ఉంటుందని వీరు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే కొన్ని ఎంజైమ్లు ప్లాస్టిక్ చెత్తను నాశనం చేయగలవన్నమాట. పాస్టిక్ చెత్త భూమి లోపలికి చేరి నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పడుతుందన్నది మనకు తెలిసిన విషయమే. కానీ ఇటీవల బ్యాక్టీరియా సాయంతో ఈ సమయాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే ఎంజైమ్లు కూడా అలాంటివే. ప్లాస్టిక్ సంచీల తయారీ సమయంలోనే ఇలాంటి ఎంజైమ్లు చేర్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆస్ట్రియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆవు కడుపులోని ద్రవాలను పరిశీలించగా.. అందులోని సూక్ష్మజీవులు కనీసం మూడు రకాల ప్లాస్టిక్లను ముక్కలు చేయగలవని కనుగొన్నారు. ఒక రకమైన సూక్ష్మజీవులతో పోలిస్తే ద్రవంలోని వివిధ రకాల బ్యాక్టీరియా కలసికట్టుగా మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే వేర్వేరు ఎంజైమ్లు ఇందుకు కారణమని శాస్త్రవేత్త డాక్టర్ డోరిస్ రిబిట్ వివరించారు. కబేళాల్లో నిత్యం ఈ ద్రవం అందుబాటులో ఉంటుంది కాబట్టి.. అక్కడికక్కడే ప్లాస్టిక్ చెత్తను నాశనం చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. -
గోవుకు ముస్లింల అంతిమ సంస్కారాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లాలో ఓ గోమాతకు ముస్లింలు అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లాలోని నాగిరెడ్డిపేట మండల కో–ఆప్షన్ సభ్యుడు షాహెద్పాషా ఆరేళ్ల క్రితం దేవుడి పేరుతో ఓ ఆవును వదిలి పెట్టారు. ఆ గోవు ఆదివారం మరణించింది. ఈ విషయం తెలిసిన షాహెద్పాషా కుటుంబ సభ్యులు ముస్లిం యువకులతో కలిసి గోమాతకు అంత్యక్రియలు నిర్వహించారు. -
పోలీస్ స్టేషన్లో ఆవు.. వెరైటీగా నిరసన..
చండీఘడ్: సాధారణంగా రైతులు తమ పంటకు మద్దతు ధర కోసమో లేదా వారికి పంట విషయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటారు. ఇలా ఏదో విషయమై ధర్నా చేసిన ఇద్దరు హర్యానా రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, వారికి మద్దతు తెలుపుతూ ఇతర రైతులు పోలీస్ స్టేషన్ ముందు వెరైటీగా నిరసన తెలిపిన ఘటన వార్తల్లో నిలిచింది. వివరాలు.. హర్యానాలోని ఫతేహబాద్ జిల్లాకు చెందిన వికాస్ సిసర్, రవి ఆజాద్ అనే ఇద్దరు రైతులు స్థానిక జెజెపీ ఎమ్మేల్యే దేవేంద్ర సింగ్ బాబ్లీ ఇంటిని ముట్టడించారు. కారణం ఇతడు అధికార బిజేపీతో పొత్తు పెట్టుకోవడం వారికి అస్సలు నచ్చలేదు. వారి మాత్రమే కాదు, స్థానిక రైతు సంఘాల నాయకులు కూడా ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టిన వికాస్, రవి ఆజాద్లను పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో రైతు సంఘాల నాయకులు అలర్ట్ అయ్యారు. ఫతేహబాద్ తోహనాలో ఉన్న పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. అంతటితో ఆగకుండా, ఒక ఆవును తీసుకొచ్చి స్టేషన్ ఆవరణలో ఉన్న ఒక స్థంభానికి కట్టారు. ఆవు బాధ్యత పోలీసులదే.. దానికి నీరు, దాణా పెట్టడం వారి కర్తవ్యమే అని తెలిపారు. మాతో పాటే ఆవుకూడా నిరసన తెలుపుతుందన్నారు. ఈ ధర్నాలో ప్రముఖ రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ కూడా పాల్గొన్నారు. 'తమ సహచరులను విడిచిపెట్టాలని రైతు నాయకులకు, జిల్లా యంత్రాంగానికి మధ్య చర్చలు జరిగాయి. మొదట్లో దీనికి జిల్లా యంత్రాంగం అంగీకరించలేదు. దీంతో రైతులు నిరసన కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో వెనక్కు తగ్గిన పోలీసులు అర్దరాత్రి ఇద్దరు రైతులను బెయిల్ పై విడుదల చేశారని' తెలిపాడు. దీంతో రైతులు స్టేషన్ ముట్టడిని విరమించారు. చదవండి: గప్చుప్లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే -
గప్చుప్లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే
ముంబై: గోల్ గప్పా.. గప్చుప్.. పానీపూరి ఇలా ఏ పేరుతో పిలిచినా దీనిని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. నోట్లో పెట్టుకోగానే నాలుకకు మంచి రుచిని అందించే గప్చుప్ను తినేందుకు జనాలు పెద్ద ఎత్తున్న ఎగబడతారు. ఇక ముంబై వీధుల్లో గప్చుప్ హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గప్చుప్లు మనుషులకే కాదు మాకు ఇష్టమే అన్న చందంగా ఒక ఆవు.. దాని లేగ దూడ లొట్టేలేసుకుంటూ ఆరంగించాయి. సాధారణంగా ఆవులు ఇంటిముందుకు వస్తే చాలామంది ఆహారాన్ని కిందపడేసి వెళ్లిపోతారు. అలా పడేసిన ఆహారాన్ని తినేసి వెళ్లిపోతాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన దగ్గరకు వచ్చిన ఆవు, లేగ దూడను దగ్గర్లోని చాట్ బండి వద్దకు తీసుకెళ్లి గప్చుప్ తినిపించాడు. అయితే కింద పెట్టకుండా స్వయంగా తానే తన చేతులతో వాటికి తినిపించాడు. ఇంకేముంది.. అంత ప్రేమగా తినిపిస్తుంటే అవి కూడా సంతోషంగా ఆరగించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 58వేల మంది వీక్షించారు. చదవండి: వైరల్: రైతు దుశ్చర్య.. పాపం ఎలుకల దండుని.. View this post on Instagram A post shared by sree130920 (@sree130920) -
హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..!
సాక్షి, మంచిర్యాల: నేనొస్తే గేటు తీయరా..? అనుకున్నదేమో ఓ కొడే. మంచిర్యాల పట్టణం నుంచి హమాలీవాడకు వెళ్లే రైల్వే గేటు వద్ద గురువారం బీభత్సం సృష్టించింది. రైల్వే గేటు విరగ్గొట్టి ట్రాక్ దాటి అవతలి వైపు హమాలీవాడ వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. ఉదయం మార్కెట్లో మేతకు వచ్చిన ఆ కోడె 10 గంటలకు వెళ్తుండగా గేటు వద్దకు వచ్చి ఆగిపోయింది. రైలు వెళ్లిపోయినా గేటు తీయకుండా ఉంచుతారా అనుకుందేమో మూడు నాలుగు సార్లు గేటు విరగ్గొట్టేందుకు విశ్వప్రయత్నం చేసింది. రైల్వే సిబ్బంది కర్రతో కొట్టి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా ఆగలేదు. అక్కడున్న వాహనదారులు కొడెను చూసి బెదిరిపోయారు. కోడె దాడి రైల్వేగేటు వంగి పోయింది. ఆ గేటును సరి చేసేందుకు రెండు గంటల సమయం పట్టింది. మరమ్మతులతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: గేటు కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కోడె గేటును సరి చేస్తున్న సిబ్బంది -
అయ్యో! పులి ఎంతపని చేసింది..
పెంచికల్పేట్/దహెగాం (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కమ్మర్గాం గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన పశువులపై మంగళవారం పులి దాడి చేసింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన తలండి పోశయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. పేదం సురేష్కు చెందిన గేదెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దహెగాం మండలం దిగిడ గ్రామంలోనూ పశువులపై పులి దాడి చేసింది. రైతు కుర్సింగ వెంకటేష్కు చెందిన ఆవు మేతకు వెళ్లి వస్తుండగా సాయంత్రం సమయంలో దాడి చేసి హతమార్చింది. -
ఆవును కత్తితో పొడిచి చంపిన పండ్ల వ్యాపారి
ముంబై : పండు తిన్నదన్న కారణంతో ఓ వ్యక్తి ఆవును చంపిన దారణ ఘటన మహారాష్ట్రలోని రాయ్గడ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తౌఫిక్ బషీర్ ముజావర్ అనే వ్యక్తి రాయ్గడ్లోని మురుద్ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అయితే తన దుకాణం నుంచి ఆవు బొప్పాయి పండును దొంగలించి తిన్నదన్న కోపంతో ఆవుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆవు పొత్తి కడుపులో కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. దీన్ని గమనించిన ఓ బాటసారి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆవును వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆవు చనిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై జంతు నిరోధక చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై హిందుత్వ సంఘాలు, పలువురు బీజేపీ నాయకులు మండిపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చదవండి : ( రేండేళ్లుగా ప్రియురాలపై అత్యాచారం: ప్రియుడి అరెస్టు) (ప్రియుడి దొంగతనం.. ప్రేమికుల అరెస్టు) -
నెట్టింట్లో హల్చల్ చేస్తోన్న అరుదైన జాతి దూడ
సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చాక చిన్న చిన్న విషయాలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఇదేదో రాజకీయాలు, సినిమాలకు సంబంధించినది అని అనుకుంటే పొరపాటే. ఓ చక్కటి అందమైన చిన్న లేగదూడకు చెందినది. ఇది సాధారణ లేగ దూడ కాదు. ఇదో ప్రత్యేకమైన జాతికి చెందినది. చిత్తూరు జిల్లాలోని పంగనూరులో ఈ జాతి ఆవులు ఉంటాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా చేస్తున్న రాజీవ్ కృష్ణ ట్విటర్లో పోస్టే చేశారు. ఇతను వైఎస్సార్సీపీ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇక ఆవు గురించి చెబుతూ.. ఈ ఆవులు మహా అయితే 3, 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగవని, బరువు కూడా 150 నుంచి 200 కేజీలే ఉంటాయని తెలిపారు. కానీ పాలు మాత్రం రోజూ 4 నుంచి 5 లీటర్ల దాకా ఇస్తాయనీ, ఆ పాలు చాలా చిక్కగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా వీడియో విషయానికొస్తే.. ఈ లేగ దూడను ముచ్చటగా అలంకరించారు దాని యజమాని. అందమైన గంటలు కట్టడంతో.. అది కదులుతుంటే గంటలు మ్రోగుతూ ఇళ్లంతా సందడి చేస్తోంది. ఈ ప్రత్యేకమైన జాతి ఆవు వీడియోను చూస్తుంటే ప్రతి ఒక్కరికి క్యూట్ ఫీల్ కలిగిస్తోంది. అందుకే 50 సెకండ్ల వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు నెటిజన్లు. జనరల్గా పిల్లులు, కుక్కల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్ల వీడియోలను కూడా మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఇది మాత్రం ప్రత్యేకమైన వీడియోనని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్ Awwwww, I want one of these. pic.twitter.com/AGVtiB9Lw5 — Shefali Vaidya. (@ShefVaidya) February 14, 2021 -
సేంద్రీయ స్వదేశీ నాటు ఆవు పెంపకం క్షేత్రాలు
సాక్షి, అమరావతి: సేంద్రీయ ఏ2 పాల ఉత్పత్తి లక్ష్యంగా స్వదేశీ ఆవుల పెంపకం క్షేత్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఇందుకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం రాత్రి జీవో జారీ చేశారు. గతంలో నేషనల్ ఎడాప్షన్ ఫండ్ ఫర్ క్లైమేమెట్ చేంజ్ (ఎన్ఏఎఫ్సీసీ) ప్రాజెక్టు కింద నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో రూ.5.40 కోట్ల అంచనాతో 18 యూనిట్లు, మిగిలిన పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రూ.12 కోట్ల అంచనాతో 40 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాగా, తాజా గైడ్లైన్స్లో ఆర్కేవీవై, ఎన్ఏఎఫ్సీసీ ఆర్థిక చేయూతతో అన్ని జిల్లాల్లోనూ ఒకే రీతిలో 58 యూనిట్లు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలను జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. 25 దేశీయ ఆవులు అందజేత ఈ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. వీరికి ఒక్కొక్కటి రూ.75 వేల అంచనాతో రూ.17.50 లక్షల అంచనాతో 25 దేశీయ ఆవులు (గిర్, సాహివాల్, ఒంగోలు, పుంగనూరు తదితర జాతులు) అందజేస్తారు. ఇలా 58 యూనిట్ల కోసం రూ.10.15 కోట్లు ఇవ్వనున్నారు. ఈ గోవుల కోసం నిర్మించే షెడ్లు, ఫెన్సింగ్ కోసం ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల చొప్పున రూ.5.80 కోట్లు, పాలు, పాల ఉత్పత్తిల తయారీ కోసం ఉపయోగించే పరికరాల కోసం ఒక్కో యూనిట్కు రూ.1,12,750 చొప్పున రూ.65.54 లక్షలు, నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో యూనిట్కు రూ.1,37,250 చొప్పున రూ.79.46 లక్షలు చెల్లించనున్నారు. ఈ విధంగా ఒక్కోయూనిట్ రూ.30 లక్షలుగా నిర్ణయించగా, దీంట్లో రూ.3 లక్షలు లబ్ధిదారులు భరించాల్సి ఉంది. రూ.18 లక్షలను ఆర్కేవీవై, ఎన్ఏఎఫ్సీసీ నిధుల నుంచి సమకూర్చనుండగా, రూ.9 లక్షలను వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేయనున్నారు. కన్సల్టెంట్గా సురభి గోశాల నిర్వాహకుడు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరకలపూడికి చెందిన సురభి గోశాల నిర్వాహకుడు వి.రవికుమార్ను కన్సల్టెంట్గా నియమించారు. లబ్ధిదారులకు శిక్షణనిచ్చే బాధ్యతను విశాఖపట్నం స్మైల్ అడిషనల్ డైరెక్టర్గు అప్పగించారు. ఈ ఆవులకు అవసరమైన ఇన్పుట్స్ను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. ఈ క్షేత్రాల నుంచి వచ్చే ఏ2 పాలు, పాల ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్టి బ్రాండ్ నేమ్తో మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే అమూల్, ఫిషరీస్ అవుట్లెట్స్తో పాటు జనతా బజార్లు, ఈ–మార్కెటింగ్ ద్వారా విక్రయాలను ప్రోత్సహించనున్నారు. మార్కెటింగ్ విక్రయాల కోసం జైవిక్ భారత్, ఇండియా ఆర్గానిక్ అనే యూనిఫైడ్ లోగోలను గుర్తించారు. ఇందుకోసం హైదరాబాద్కు చెందిన ఎన్ఐఎన్ సంస్థతో పశుసంవర్థక శాఖ ఎంవోయూ చేసుకోనుంది. -
ఎల‘మంద’కు కాసుల పంట
సాక్షి, కోరుట్ల: రసాయనిక ఎరువుల వినియోగంతో భూమి సారం కోల్పోతూ వస్తోంది. పంట దిగుబడిపైనా ప్రభావం చూపుతోంది. వ్యవసాయ భూముల్లో ఆవుల మందతో భూమికి సారం.. ఎలమందకు రాబడి.. రైతుకు ప్రయోజనం కలుగుతోంది. దీంతో భూసారం పెంపుపై రైతాంగం ఆవుల మందలపై దృష్టి సారిస్తోంది. ఈ మంద వారం పాటు సాగు భూముల్లో నిద్ర తీసిందంటే చాలు సదరు ఎలమందకు రూ.50 వేలకు మించి చేతికొస్తుంది. ఆవుల మంద విసర్జకాలకు ఉన్న డిమాండే ఇందుకు కారణమని చెబుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రుద్రంగి మండలం మానాల, చందుర్తి, కోనరావుపేట మండలాల పరిసరాల్లోని తండాల్లో పశుపోషణ పెద్ద ఎత్తున సాగుతోంది. అటవీ ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు పెద్ద ఎత్తున ఉండటంతో ఆవుల మందలను ఎక్కువగా పోషిస్తున్నారు. నెలల తరబడి సంచార పశుపోషణ చేస్తూ ఆదాయం కోసం మందలను సాగు భూముల్లో నిద్రకు ఉంచుతారు. పశ్చిమ డివిజన్ సరిహద్దుల్లోని తండాల్లో ఇలా ఆవుల మందలను పోషించేవారు దాదాపు 150 మంది దాకా ఉంటారు. వంద వరకు మందలు ఉండగా.. ఒక్కో మందలో వందకు పైగా ఆవులు ఉన్నాయి. వారానికి రూ.50 వేలు పంటల సాగుకు సిద్ధమయ్యే ముందు రైతులు భూసారం పెంపు కోసం ఆవుల మందల నిద్రపై ఆసక్తి చూపుతున్నారు. సహజసిద్ధంగా ఆవుల మల, మూత్ర విసర్జకాలతో సాగుభూములు సార వంతంగా మారుతాయి. రసాయన ఎరువులు వాడ కుండానే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మం దలో ఉన్న ఆవుల సంఖ్యను బట్టి రైతులు మందల యజమానులకు డబ్బులు చెల్లిస్తున్నారు. వందకు పైబడి ఉన్న ఆవుల మంద వారం పాటు సాగు భూమిలోనే కట్టేస్తే రోజుకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు చెల్లిస్తున్నారు. కనీసం వారంపాటు మంద సాగుభూమిలో ఉంటే పశు మల, మూత్ర విసర్జకాలతో భూసారం చక్కగా పెరుగుతుంది. ఇవీ లాభాలు ► సాగు భూమిలో కర్బన శాతం పెరుగుతుంది ► సూక్ష్మ, స్థూల పోషకాలు సమతూకం అవుతాయి ► భూమి సహజ లక్షణాలు కోల్పోకుండా ఉంటుంది ► నత్రజని, భాస్వరం, పొటాషియం సహజసిద్ధంగా అంది నేల సారవంతం అవుతుంది -
58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలు
సాక్షి, అమరావతి: దేశీయ ఆవుల పెంపకం, ఏ–2 పాల ఉత్పత్తి, మార్కెటింగ్ను ప్రోత్సహించే లక్ష్యంతో 58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పశుసంవర్ధక, డెయిరీల అభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సోమవారం రాత్రి విడుదల చేశారు. ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం రాష్ట్రంలో 30.50 లక్షల మంది పాడిరైతులున్నారు. వారివద్ద 13,56,523 ఆవులు, 21,46,695 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. జెర్సీ, హెచ్ఎఫ్ జాతి పశువుల పాలను ఏ–1 మిల్క్ గా పిలుస్తారు. గిర్ (గుజరాత్), షాహివాలా (హరియాణా, పంజాబ్), ఒంగోలు జాతి పశువుల పాలను ఏ–2 మిల్క్గా పిలుస్తారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడే ఏ–2 పాల ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచడం, స్వదేశీ జాతులను సంరక్షించడం, తద్వారా సేంద్రియ సాగును ప్రోత్సహించడం లక్ష్యాలుగా ప్రభుత్వం ఈ క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎన్ఏఎఫ్సీసీ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లా నార్త్ ఆములూరు, బిరదవోలు, విజయనగరం జిల్లా పెరిమి, వీరసాగరం, అనంతపురం జిల్లా గొట్లూరు, వెంకటరాజుకాలువ ప్రాంతాల్లో రూ.5.40 కోట్లతో 18 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి లబి్ధదారులు రూ.7.50 లక్షలు భరించాలి. మిగిలిన రూ.22.50 లక్షల్ని ఎన్ఏఎఫ్సీసీ నుంచి సమకూరుస్తారు. లబ్ధిదారుల ఎంపిక ఇలా.. ఈ క్షేత్రాలు ఏర్పాటు చేయదలిచిన రైతులు, ఔత్సాహికులకు షెడ్ నిర్మాణానికి సొంతంగా లేదా కౌలుకు తీసుకున్న 2.5 ఎకరాల భూమి ఉండాలి. జాయింట్ లయబులిటీ గ్రూపు (జేఎల్జీ)లకు ప్రాధాన్యతనిస్తారు. జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ ద్వారా గ్రామసభల్లో అర్హులను ఎంపిక చేస్తారు. జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే) చైర్మన్గా ఉండే ఈ కమిటీకి పశుసంవర్ధక శాఖ జేడీ మెంబర్ కన్వీనర్గా, నాబార్డు ఎజీఎం, లీడ్ బ్యాంక్ మేనేజర్, వ్యవసాయశాఖ జేడీ సభ్యులుగా ఉంటారు. -
'కౌ'గిలింత
ఆవు మనకు గోమాత.కాని ఆవు యాంగ్జయిటీని తగ్గించే డాక్టర్ కూడా అని హాలెండ్వాసులే ముందు కనిపెట్టి దశాబ్దం నుంచి‘కౌ హగింగ్’ను సాధన చేస్తున్నారు. ఆవును కావలించుకుని కొంతసేపు గడిపితే యాంగ్జయిటీ పోతుందనివారు చెబుతున్న అనుభవం ఇప్పుడు మన దేశానికి కూడా వ్యాపించింది. కోవిడ్ సమయంలో ఆందోళనలు పోగొట్టుకోవడానికికౌ హగింగ్ను ప్రయత్నిస్తున్నారు. ‘కో నఫ్లెన్’ అంటారట డచ్లో ‘ఆవు కావలింత’ని. మన దేశంలో ఆవును గోమాతగా తలిచే వారుంటే ఆ దేశంలో ఆవును ఒక డాక్టర్గా చూసే వారున్నారు. ఆవును కావలించుకుని కాసేపు గడిపితే, ఆవును నిమిరితే, ఆవుతో బాధలు చెప్పుకుంటే, ఆవు నిర్మలమైన కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే, ఆవుకు ప్రేమ ఇస్తే, ఆవు నుంచి ప్రేమ పొందితే మనసు, శరీరం స్వస్థత పొందుతాయని కౌ హగింగ్ని ఒక థెరపీగా వారు భావిస్తారు. పదేళ్ల నుంచి ఉన్న సాంత్వన వైద్య భావన ఇప్పుడు అమెరికాకు మిగిలిన దేశాలకు కూడా ఒక నమ్మకంలా విస్తరిస్తోంది. అమెరికాలో అయితే కౌ హగింగ్ కోసం గోశాలలు నిర్వహిస్తున్నారు. కొన్ని గోశాలల్లో ఒక గోవును పట్టుకుని కూచోవడానికి దాదాపు 75 డాలర్లు (5 వేల రూపాయలు) వసూలు చేస్తున్నారు. అయితే అక్కడి గోశాలలు చాలా శుభ్రంగా, వాసన లేకుండా మెయింటెయిన్ చేస్తున్నారు. గరిక మీద తిరిగే ఆవులను అక్కడ చూడవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి కనుక కౌగిలింత మంచి ఫలితాలిస్తుందని సైకియాట్రిస్ట్లు కూడా చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన సైకియాట్రిస్ట్ ‘పసిపిల్లలనో, గోవు, శునకం వంటి పెంపుడు జంతువులనో కావలించుకుంటే ఆక్సీటోసిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు విడుదలయ్యి వత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్ను అదుపు చేస్తాయి’ అంటున్నారు. భారతదేశంలో విశ్వాసాల వల్ల కాని విధానాల వల్లగాని ప్రతి జీవి నుంచి, జీవజాలం నుంచి స్వస్థత పొందడానికే చూస్తారు. పశువులున్న వారి ఇళ్లల్లో పశువులతో అనుబంధం వల్ల పొందే ఆనందం తెలుసు.. -
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్
సాక్షి, పటాన్చెరు: అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం అమీన్పూర్ గోశాలకు తరలించారు. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా.. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో అమీన్పూర్ పశువైద్యాధికారి విశ్వచైతన్య ఆ ఆవుకు శస్త్ర చికిత్స చేసి దాని పొట్టలో పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్, కాటన్ బట్టలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.