అనంతపురం: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని బుధవారం అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పలు దొంగతనాలకు పాల్పడిన సయ్యద్ మహబూబ్ భాషా(22) అనే దొంగని పోలీసులు అదుపులోకి తీసుకుని... అతని వద్ద నుంచి రూ.మూడున్నర లక్షల విలువైన 12 తులాల బంగారం, 4 పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్ట్
Published Wed, Dec 2 2015 4:54 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement