రేపటి మహా ధర్నా కొనసాగుతుంది: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి | tommorrows dharna as usual: MLA Ravindranadhreddy | Sakshi

Dec 17 2017 8:03 PM | Updated on May 28 2018 1:08 PM

కమలాపురం: తన పాదయాత్ర ద్వారా సర్వరాయసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేయాలనే డిమాండ్ జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లిందని, అయితే రేపటి తన మహా ధర్నా యథావిధిగా కొనసాగుతుందని వైఎస్సార్‌ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మూడు రోజులుగా ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ బాబురావు నాయుడు స్పందిస్తూ ఈ నెల 25వ తేదీ నాటికి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే తన నాలుగో రోజు పాదయాత్ర ముగింపు నాడు చేపట్టే మహా ధర్నా యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం కలెక్టరును కలుస్తానని, ఆయన ఇచ్చే హామీనిబట్టి ముందుగా ప్రకటించిన దీక్ష విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో అధికారులు ఇలానే హామీలు ఇచ్చి వెనక్కు తగ్గారని, అందుకే కలెక్టర్తో నేరుగా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement