రేపు వైఎస్ జగన్ తూ.గో, విశాఖ జిల్లాల పర్యటన | Tomorrow YS Jagan Visakhapatnam district tour | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్ జగన్ తూ.గో, విశాఖ జిల్లాల పర్యటన

Published Tue, Mar 31 2015 5:46 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - Sakshi

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(బుధవారం) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు.  ఈ నెల 29న జరిగిన గోకులపాడు బాణాసంచా పేలుడు ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చెప్పారు.

విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడినవారిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా వైఎస్ జగన్ పర్యటించనున్నారు. గత కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించిన జ్యోతిల నెహ్రూ సోదరుడు సత్యనారాయణ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement