చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కాటప్పగారిపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున పాలట్యాంకర్, కారు ఢీకొన్నాయి.
బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కాటప్పగారిపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున పాలట్యాంకర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తితోపాటు ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలించారు. వీరంతా ఎస్ఆర్ పురం మండలానికి చెందిన వారు కాగా బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.