రాజమండ్రి: రాజమండ్రి నగరంలో దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానిక సుబ్రహ్మణ్యనగర్లోని రెండు ఇళ్లలో చోరీ చేసి.. సుమారు 12 తులాల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలను దొంగిలించారు. సుబ్రహ్మణ్యనగర్లో నివాసం ఉంటున్న స్వామి ఈ నెల 11న వైజాగ్ వెళ్లి ఆదివారం ఇంటికి తిరిగి వచ్చారు.
ఇంటి తలుపులు తీసి ఉండే సరికి దొంగతనం జరిగిందని భావించారు. కాగా, స్వామి పక్క ఇంటి తాళం పగిలి ఉండటంతో ఆ ఇంట్లోను చోరీ జరిగిందని భావించిన స్వామి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.