బంగారం కోసం పాతబస్తీలో చిన్నారి కిడ్నాప్
Published Fri, Nov 8 2013 7:22 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
పాత బస్తీలో బంగారం కోసం రెండేళ్ల చిన్నారి అక్షయ్ కిడ్నాప్ గురైన ఘటన ఆలస్యం వెలుగులోకి రావడం ఆప్రాంతంలో సంచలనం రేపింది. వారం క్రితమే చిన్నారి కిడ్నాప్ గురైందని బంధువులు తెలిపారు. కిడ్నాపర్లు 3 కిలోల బంగారం కోసం కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని బంధువులు తెలిపారు.
కిడ్నాప్ వ్యవహారం విషయం బయటకు పొక్కితే చిన్నారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆలస్యంగా కిడ్నాప్ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్గ్ అయ్యారు. కిడ్నాప్ వ్యవహారాన్ని చేధించేందుకు పోలీసులు వివరాల సేకరణలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement