అరుదైన ఉత్తరం.. సోషల్‌ మీడియాలో వైరల్‌ | Visakhapatnam Girl Send Letter to Mother From Hikkim Post Office | Sakshi

అమ్మకు ఉత్తరం.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Oct 11 2019 8:56 AM | Updated on Oct 11 2019 8:57 AM

Visakhapatnam Girl Send Letter to Mother From Hikkim Post Office - Sakshi

హిక్కిం పోస్టాఫీస్‌ బాక్సులో ఉత్తరం పోస్టు చేస్తున్న అనూష

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరానికి చెందిన పుప్పాల అనూష  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రెక్కింగ్‌ కోసం జూలై నెలలో హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లిన ఆమె ఆ రాష్ట్రంలోని హిక్కిం అనే చిన్న గ్రామంలో ఉన్న ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పోస్టాఫీస్‌ను సందర్శించారు. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో మంచు శిఖరపు అంచుల్లో ఈ పోస్టాఫీస్‌ ఉంది. పోస్టాఫీస్‌ చరిత్రతో కూడిన ఫొటోలు, హిమాచల్‌ప్రదేశ్‌ అందాలతో ముద్రించిన పోస్టు కార్డులు ఇక్కడ రూ.70కి అమ్ముతుంటారు.

ఈ పోస్టుకార్డుపై అనూష విశాఖలోని మురళీనగర్‌లో నివాసం ఉంటున్న తన తల్లి సరస్వతికి...అమ్మ ప్రేమ గొప్పదనాన్ని వర్ణిస్తూ ఉత్తరం రాశారు.  జూలై నెల చివర్లో హిక్కిం పోస్టాఫీస్‌లో పోస్టు చేసిన ఆ ఉత్తరం ఆగస్టు 25న విశాఖ చేరుకుంది. అక్టోబర్‌ 10న ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఆ ఉత్తరంతో పాటు పోస్టాఫీస్‌ బాక్సులో తాను లెటర్‌ వేస్తున్న ఫొటోను అనూష ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అది సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement