
భద్రత కల్పించలేం : తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో వివాదం నెలకొంది. ఏపీ ఎంసెట్కు ఆ ప్రభుత్వం హైదరాబాద్లో సెంటర్లు కేటాయించింది. అయితే ఆ ఎంసెట్తో తమకు సంబంధంలేదని, భద్రత కల్పించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎంసెట్ నిర్వహణకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం, డీజీపీలకు ఏపీ ఉన్నత విద్యామండలి లేఖలు రాసింది. ఈ వివాదంపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేయనున్నారు.