‘108’ సేవలు నిలిపేస్తాం | We will stop 108 services | Sakshi
Sakshi News home page

‘108’ సేవలు నిలిపేస్తాం

Published Thu, Apr 26 2018 2:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

We will stop 108 services - Sakshi

సాక్షి, అమరావతి/మంగళగిరి రూరల్‌: ఏదైనా ప్రమాదం సంభవిస్తే ‘108’కు ఫోన్‌ చేయగానే పరుగెత్తుకు రావాల్సిన అంబులెన్స్‌ సేవలు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిలిచిపోయాయి. ఈ అంబులెన్స్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి, ‘108’నిర్వహణా సంస్థ బీవీజీ యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలం కావడమే ఇందుకు కారణం. తమ డిమాండ్ల పరిష్కారానికి బీవీజీ సంస్థ అంగీకరించకపోవడంతో సిబ్బంది నాలుగు గంటలపాటు అంబులెన్స్‌లను నిలిపి వేసి నిరసన తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘108’సిబ్బందిని చర్చలకు ఆహ్వానించారు. గురువారం ఉదయం 11 గంటలకు చర్చలు జరగనున్నాయి. ముఖ్య కార్యదర్శితో జరిగే చర్చల్లో సిబ్బందికి న్యాయం జరగకపోతే ఇకపై రోజూ 8 గంటలపాటు అంబులెన్స్‌ సేవలను నిలిపివేస్తామని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతలు ప్రకటించారు.  గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘108’కార్యాలయంలో 13 జిల్లాల రాష్ట్ర కమిటీ సభ్యులు.. బీవీజీ సంస్థ ప్రతినిధులతో బుధవారం చర్చలు జరిపారు.

నిబంధనల ప్రకారం తాము రోజుకు 8 గంటలే పనిచేయాల్సి ఉండగా 12 గంటలకుపైగా పని చేయాల్సి వస్తోందని వాపోయారు. 12 గంటల పనివేళలను 8 గంటలకు కుదించాలని, వేతనాలను 50 శాతం జీతాలు పెంచాలని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు.  ఉద్యోగుల డిమాండ్లను బీవీజీ సంస్థ ఎండీ దేశ్‌పాండే తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement