Contract employees
-
కాంట్రాక్టు లెక్చరర్లపై కక్ష!
‘కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధికరించి వారి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తీసుకుంటా..’ – 2024 ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరు ప్రజాగళం సభలో బాబు హామీ! ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేలా పోరాడతా’.. – 2017 డిసెంబర్లో కాంట్రాక్టు లెక్చరర్లతో ముఖాముఖీలో పవన్ కళ్యాణ్ హామీ! సాక్షి, అమరావతి: తమ జీవితాలను మార్చే హామీని అమలు చేయాలని వేడుకుంటే.. ‘కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ మేనిఫెస్టోలో లేదు కాబట్టి అమలు చేయలేం’ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కుండ బద్ధలు కొడుతున్నారని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు వీలుగా గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని అయినా అమలు చేయాలని కోరితే.. ‘ఆ చట్టాన్ని తాము అమలు చేయాలన్న రూల్ లేదు’ అని లోకేశ్ తేల్చి చెబుతుండటంతో తీవ్ర మానసిక సంఘర్షణతో ఇటీవల నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు ప్రాణాలు విడిచారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక మృతుల కుటుంబాలు వీధిన పడ్డాయి. 2000లో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 7 వేల మందిని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించగా తెలంగాణలో 2021లో కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. ఒకే జీవో ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా చేరిన వారు తెలంగాణలో రెండేళ్లుగా రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా కాంట్రాక్ట్ సిబ్బందిగానే కొనసాగుతున్నారు. ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2023 అక్టోబర్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది.దీని ప్రకారం 2014 జూన్కు ముందు విధుల్లో చేరిన 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్ధీకరించాలని జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదితర శాఖల్లో పని చేస్తున్న 3 వేల మంది రెగ్యులరైజ్ కావడంతోపాటు గతేడాది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. మిగిలిన వారి క్రమబద్ధీకరణ మాత్రం ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. వీరిలో 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. అర్హులైన అందరి వివరాలు ఆర్థికశాఖ ‘నిధి పోర్టల్’లో ఉన్నా కూటమి ప్రభుత్వం తొక్కిపెడుతోంది.కాంట్రాక్టు జేఎల్స్కు తీవ్ర అన్యాయంగత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అధికారంలోకి వచ్చాక వారిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. కాంట్రాక్టు ఉద్యోగులపై గత ప్రభుత్వాలు వివిధ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘాలను నియమించినా వారి కల సాకారం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వారి సమస్యలపై చర్చించి 30/23 చట్టం తెచ్చింది. దీని ప్రకారం మిగతా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారు.ప్రాణాలు పోతున్నా పట్టదా..!తెలంగాణలో ఎలాంటి చిక్కులు లేకుండా విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లు రెండేళ్ల క్రితమే రెగ్యులర్ అయ్యారు. 30/23 ద్వారా ఏపీలోనూ రెగ్యులర్ కావాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం మాత్రం వారి పట్ల కక్షగట్టినట్టు ప్రవర్తిస్తోంది. ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న వారే ఉన్నారు. ఇంటర్ విద్యలో 3,618 మంది, డిగ్రీ కాలేజీల్లో 695 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. మరణించిన కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాలకు పరిహారం, మట్టి ఖర్చులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఉన్నా అమలు కావడం లేదని బాధిత కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయి. -
ఉద్యోగులకు ఉద్వాసన
సాక్షి, అమరావతి: యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులపై పగబట్టి భారీగా తొలగింపుల పర్వానికి తెరలేపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో ఇప్పటివరకు విడతల వారీగా 400 మందికిపైగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. గడచిన మూడు రోజుల్లోనే సుమారు 200 మందిని ఉన్నట్టుండి తొలగిస్తూ ఎండీ ప్రవీణ్కుమార్ ఆదేశాలిచ్చారు.ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, అన్నమయ్య జిల్లాలోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసే చిరుద్యోగులపై రాజకీయ ముద్రవేసి మరీ ప్రభుత్వం పక్కనపెట్టింది. 20వ తేదీన సుమారు 90 మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు అవసరం లేదని ఎండీ ఆదేశాలిచ్చారు. అంతకుముందు 18వ తేదీన సుమారు వంద మందికిపైగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిలో ఎక్కువమంది మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.ఆ తర్వాత విజయవాడలోని ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసేవారు ఉన్నారు. గత ప్రభుత్వంలో నియమించారనే కారణం చూపి వారందరినీ ఉన్న ఫళాన వెళ్లగొట్టారు. అంతకుముందు మరో 200 మందిలో సగం మందికి కాంట్రాక్టు ముగియడంతో పొడిగించకుండా బయటకు పంపారు. కాంట్రాక్టు ఇంకా మిగిలి ఉన్న వారిని సైతం ఏదో ఒక సాకు చూపి తొలగించారు. తొలగింపునకు గురైన వారిలో ఎక్కువ మంది అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు ఉన్నారు. విజయవాడ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో డీఈఓలు, డీపీఓలు, ఇతర క్యాడర్ ఉద్యోగులున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన వారే కాకుండా పదేళ్ల నుంచి పనిచేస్తున్న వారిని కూడా అన్యాయంగా తొలగించినట్టు తెలుస్తోంది.నిబంధనలకు విరుద్ధంఅవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏ కారణం లేకుండా తొలగించకూడదనే నిబంధనలు ఉన్నా ఉన్నతాధికారులు లెక్క చేయలేదు. వారందరినీ నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చి, ఇంటర్వ్యూ నిర్వహించి నియమించారు. కార్యాలయంలోనూ, సంబంధిత ప్రాజెక్టుల్లోనూ అవసరాన్ని బట్టి ఈ నియామకాలు జరిపినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. కానీ సహేతుకమైన కారణం లేకుండానే రాజకీయ కోణంలో అందరినీ ఒకేసారి పక్కనపెట్టేయడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం తీసేస్తే తమ కుటుంబాలు ఏం కావాలని వాపోతున్నారు. -
తొలగింపు కుదరదు.. ఇకపై వద్దు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని, ఇకపై రెగ్యులరైజ్ చేయడం చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం 1994లోని సెక్షన్ 10ఏ చెల్లదని.. చట్టవిరుద్ధమైన ఈ సెక్షన్ను రద్దు చేస్తున్నామని తేల్చిచెప్పింది. ఏళ్లుగా పని చేస్తున్న, ఇప్పటికే క్రమబద్ధీకరించిన కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చట్ట ప్రకారం జరగాలని, క్రమబద్ధీకరణ కుదరదని చెప్పింది. నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పాక్షికంగా అనుమతించినట్లు పేర్కొంది. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా వీరిని క్రమబద్ధీకరించారని, సెక్షన్ 10ఏను చేరుస్తూ తెచ్చిన జీవో 16 చట్టవిరుద్ధమంటూ పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన.. సెట్కు క్వాలిఫై అయిన పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు 5,544 మంది ఉద్యోగులకు ఊరట లభించింది. పిటిషనర్ల వాదన.. ‘జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను 1993, డిసెంబర్ 30న జీవో 302తో ప్రవేశపెట్టిన సర్వీస్ రూల్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 3.. జూనియర్ లెక్చరర్ల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి లేదా పదోన్నతితో భర్తీ చేయాలని చెబుతోంది. డిగ్రీ లెక్చరర్లకూ ఇలాంటి నిబంధనే వర్తిస్తుంది. మేమంతా జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు నిబంధనల మేరకు అర్హులం. జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేలా ఆంధ్రప్రదేశ్ కాలేజ్ సర్వీస్ కమిషన్ చట్టం 1985ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ చట్టం 2001లో రద్దయింది. ఆ తర్వాత నుంచి పారదర్శక విధానం లేకుండా కాంట్రాక్టు విధానంలో ఎంపిక కమిటీ పోస్టులను భర్తీ చేయడం ప్రారంభించింది. 2002 తర్వాత నుంచి నేరుగా ఈ పోస్టులను భర్తీ చేయలేదు. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ కోసం 2016, ఫిబ్రవరి 26న ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సెక్షన్ 10ఏను చేరుస్తూ ప్రభుత్వం జీవో16ను తెచ్చింది. దీంతో అర్హతలు లేని వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు’ అని పిటిషనర్లు వాదించారు. విద్యాశాఖ వాదన.. ‘పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 మేరకు.. నిర్ణీత వ్యవధిలో ఇప్పటికే ఉన్న చట్టాన్ని సవరణ చేసే, రద్దు చేసే వీలు సర్కార్కు ఉంది. 2014, జూన్ 2కు ముందున్న వారినే క్రమబద్దీకరణ, రిజర్వేషన్లు కూడా వర్తింపు.. ఇలా సెక్షన్ 10ఏలో ఆరు నిబంధనలు చేర్చి ఆ మేరకే క్రమబద్దీకరించాం. భవిష్యత్తులో మరిన్ని పోస్టులను భర్తీ చేయనున్నందున నిరుద్యోగ యువత అవకాశాలను జీవో 16 నిర్వీర్యం చేస్తుందన్న పిటిషనర్ల ఆందోళన సరికాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా క్రమబద్దీకరణ జరిగిందనడం అర్థరహితం. జీవో 16 మేరకున్న పోస్టులను 2023, ఏప్రిల్ 30న జీవో 38 ద్వారా క్రమబద్దీకరించాం’ అని విద్యాశాఖ పేర్కొంది. 5,544 మందిని క్రమబద్దీకరిస్తే కొందరినే ప్రతివాదులుగా పేర్కొనడంపై అనధికారిక ప్రతివాదుల (క్రమబద్దీకరించిన వారు) తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను కొట్టివేయాలన్నారు. ధర్మాసనం ఏమందంటే.. ‘విద్యాసేవా నిబంధనలు చట్టబద్ధంగా ఉన్నందున వాటిని రద్దు చేయడం, సవరించడం ఒక్కపూటలో సాధ్యం కాదు. చట్టబద్ధమైన నియమాల అమలులో సెక్షన్ 10ఏ ప్రభావం ఉండకూడదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం ఇప్పటికే ఉన్న ఏదైనా చట్టాన్ని సవరించడానికి, రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అయితే సెక్షన్ 10ఏను చొప్పించడం పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101కు విరుద్ధం. అందువల్ల 10ఏను కొట్టివేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉమాదేవి కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై ఇరుపక్షాలు ఆధారపడ్డాయి. తీర్పును జాగ్రత్తగా చదివితే కాంట్రాక్టు ఉద్యోగులతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను 2009లో నియమించి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేశారు. ఇలా 15 ఏళ్లకు పైగా ఉద్యోగాల్లో ఉన్నారు. అటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ఆదేశించాలా లేక ప్రస్తుత పిటిషనర్లకు పోస్టులను ప్రకటించాలని సర్కార్ను ఆదేశించాలా అనేది మా ముందున్న ప్రశ్న. అయితే అన్ని పిటిషన్లలో క్రమబద్ధీకరించిన వారిని తొలగించాలని కోరలేదు. పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్ల కింద నియమితులైన వారి అంశంలో జోక్యం కూడదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. అందుకే క్రమబద్దీకరణ అంశంలో జోక్యం చేసుకోవడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయనే కారణంతో గత నిర్ణయాలను రద్దు చేయడం లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. -
మద్యం డిపోల్లో ఉద్యోగులపై వేటు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల ఉసురుతీస్తోంది. ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని 15వేల మంది సూపర్వైజర్లు, సేల్స్మెన్ను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీలు ద్వారా పారదర్శకంగా నియమితమైన తమను తొలగించవద్దన్న వారి విజ్ఞప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న వారి వినతిని తిరస్కరించింది. తాజాగా రాష్ట్రంలోని మద్యం డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, స్కానర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో డిపోలో పది నుంచి 15మంది చొప్పున మొత్తం 400మందికిపైగా ఆపరేటర్లు, స్కానర్లు పదేళ్లుగా విధుల్లో కొనసాగుతున్నారు. వారిలో 50శాతం మందిని నవంబరు 1 నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ శాఖ 200మందిపై వేటు వేసింది. ఇక రెండో విడతలో మిగిలిన 200మందిని కూడా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలురాష్ట్రంలోని పలు మద్యం డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. బీరు తయారీ కంపెనీలు, మొలాసిస్ యూనిట్లలోనూ తనిఖీలు నిర్వహించారు. గతేడాది కాలంలో ఆ కంపెనీల ఉత్పత్తులు, సరఫరా రికార్డులను పరిశీలించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జత్వానీ కేసు విచారణ చేపట్టిన సీఐడీహనీట్రాప్ కేసుల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. ఆ కేసును ఇప్పటివరకు విజయవాడ పోలీసులు దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
సాక్షి,విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 4 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసివేసేందుకు విశాఖ స్టీల్ యాజమాన్యం సిద్ధమైంది. తొలగించే కాంట్రాక్టు ఉద్యోగుల్లో సగం మంది నిర్వాసితులే ఉన్నారు. రేపటి నుంచి ఆన్ లైన్ పంచ్ స్టీల్ యాజమాన్యం నిలిపివేయనుంది.ఉద్యోగుల తొలగింపుపై సమాచారం అందుకున్న కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలిసే ఉద్యోగుల తొలగింపు జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేది లేదు. ఉద్యోగులు తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్న మాటను చంద్రబాబు, పవన్ నిల బెట్టుకోవాలి. నాయకులు చెప్పే మాటలకు స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదు’’ అని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎసరు పెడుతున్న కూటమి ప్రభుత్వం
-
కాంట్రాక్టుపై రామోజీ విషం
ఐదేళ్ల చంద్రబాబు పాలన అంతా వంచన మయం.. కుట్రపూరితం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పైనా మాట తప్పిన అబద్ధాల కోరు చంద్రబాబు. ఈ నిజం రాయడానికి రామోజీకి మనసొప్పదు. మంచి చేయాలనే మనసుంటే మార్గముంటుందని జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో నిరూపించుకుంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాతే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే పుణ్యం కట్టుకుంది. సుప్రీంకోర్టు తీర్పు సాకును వెతుక్కుని కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు వంచిస్తే... పదివేల మంది నెత్తిన క్రమబద్ధీకరణ పాలు పోస్తున్న నేత సీఎం జగన్. తన శిషు్యడు బాబు చేసిన మోసం రాష్ట్రం మొత్తం తెలిసినా, రామోజీ ఒక్కరే తెలియనట్లు నటిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి జరిగిపోతే ఆ ఖ్యాతి జగన్ ప్రభుత్వానికి దక్కడం రామోజీకి సుతరామూ ఇష్టం లేదు. ఈ దుగ్ధతోనే తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై అక్షర విషాన్ని విరజిమ్ముతూనే ఉన్నారు.. ఈ అక్షర మాయావి ఎంతగా బాబును మోయాలనుకున్నా బాబు చేసిన పాపాలు జనానికి ఐదేళ్ల కిందటే తేటతెల్లమయ్యాయి... టీడీపీని శంకరగిరి మాన్యాలు పట్టించాయి.. ఇదంతా తెలిసినా తన తప్పుడు రాతలతో రోజురోజుకూ రామోజీ దిగజారిపోతూనే ఉన్నారు.. సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించకుండా మోసం చేసింది మీ చంద్రబాబు నాయుడేనని తెలుసుకోవాలి రామోజీ..గత చరిత్రను వదిలేసి ఇప్పుడు ఈనాడు కళ్లు మూసుకుని ఇష్టానుసారం రాతలు రాస్తే చెల్లదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరిట కాలక్షేపానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమావేశాలతో కాలయాపన చేసి చివరికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డొస్తోందని, అందువల్ల సాధ్యం కాదంటూ కాంట్రాక్టు ఉద్యోగులను నిలువునా వంచించింది చంద్రబాబు నాయుడే. ఇవేమీ ఈనాడు రామోజీకి అప్పట్లో కనిపించలేదు. దీనికి భిన్నంగా వైఎస్.జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంటే ఈనాడు రామోజీ తప్పుపట్టడాన్ని ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈనాడు చెత్తరాతలంటూ వారు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో అర్హులను తగ్గిస్తున్నారంటూ మరో అవాస్తవ ప్రచారానికి రామోజీ దిగజారారు. ప్రభుత్వంలో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు వంటివి పాటిసూ్తనే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటించకపోవడానికి ఇదేమీ రామోజీ సొంత జాగీరు కాదు. ఈ మాత్రం కనీస అవగాహన లేకుండా ఈనాడు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. వాస్తవానికి ఐదేళ్లు నిద్రపోయి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ సాధ్యం కాదని చెప్పింది మీ చంద్రబాబు నాయుడే రామోజీ. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలనే నిబంధన ఇప్పుడు వైఎస్.జగన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందేమీ కాదు. టీడీపీ ఆవిర్భవించక ముందు నుంచే కాకుండా, బాబు ప్రభుత్వంలోనూ ఉంది. అయినా చంద్రబాబుకు చేతకాని పనిని జగన్ ప్రభుత్వం చేసి చూపించి, కాంట్రాక్టు ఉద్యోగుల నెత్తిన పాలు పోసింది. అందుకే బాబును నమ్మం గాక నమ్మం ... అని 2019లో టీడీపీని చిత్తుగా ఓడించి, ఉద్యోగులు ఇంటి బాట పట్టించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక శాఖ చర్యలను చేపట్టింది. ఎన్నికల కోడ్ కన్నా ముందే క్రమబద్ధీకరణ ప్రారంభమైంది. తదనుగుణంగా మార్గదర్శకాలను 13–12–2023న సర్క్యులర్ మెమో ద్వారా విడుదల చేసింది. క్రమబద్ధీకరణ కోసం రూపొందించిన సాఫ్ట్ వేర్లో ఉద్యోగులు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలి్సందిగా స్పష్టం చేసింది. అర్హులైన సుమారు పది వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు జగన్ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 3000 మందిని క్రమబద్ధీకరించారు. మిగతా వారికి అవకాశవిుచ్చే క్రమంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మాట ఇస్తే మడమ తిప్పరనే నమ్మకం ఉన్నందునే మళ్లీ జగన్ను సీఎంను చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. బాబు సర్కారుకు – జగన్ సర్కారుకు తేడా.. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక, మానవ వనరులు, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులతో 09–09–2014న జీవో 3080 ద్వారా ఒక బృందాన్ని బాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ ఐదేళ్ల పాలనలో మంత్రుల బృందం సమావేశాలతో సాగదీయడమే కాకుండా చివరగా సుప్రీం కోర్టు తీర్పును బూచిగా చూపించి, క్రమబద్ధీకరణ సాధ్యం కాదంటూ చేతులెత్తేసి, ఇచ్చిన మాటను తప్పింది. ఇప్పుడు జగన్ సర్కారు 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను అధిగమించి కాంట్రాక్టు ఉద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం’ అని జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మేరకు అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ, వర్కింగ్ కమిటీలు పలు సార్లు న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలపై చర్చించాయి. క్రమబద్ధీకరణపై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని ఈ కమిటీలు సూచించాయి. క్రమబద్ధీకరణకు ఎటువంటి చిక్కులు ఎదురుకాకుండా ఉండే విధంగా న్యాయపరంగా అన్ని అంశాలను జగన్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూనే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే గత చంద్రబాబు సర్కారుకు – ఇప్పటి వైఎస్ జగన్ సర్కారుకు తేడా. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
-
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరోసారి ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రియల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులగా పనిచేస్తూ అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురిని క్రమబద్దీకరణ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ క్రమబద్దీకరణ పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బాబు, పవన్ పేరు చెబితే గుర్తుకొచ్చేవి ఇవే..: సీఎం జగన్ -
కాంట్రాక్ట్..ఇక పర్మినెంట్
-
‘కాంట్రాక్టు’.. ఇక ‘పర్మినెంట్’
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సర్క్యులర్ మెమో ద్వారా బుధవారం విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్లో అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఏకంగా చట్టంలో సవరణలు తీసుకువచ్చారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు మార్గం సుగమమైంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 10 వేల మందికి మేలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రెగ్యులరైజేషన్ ఇలా.. 2014 జూన్ 2కి ముందు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులై అర్హులైన వారందరూ రెగ్యులరైజేషన్కు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా శాఖాధిపతులు, శాఖల్లో మంజూరు చేసిన పోస్టులో రిజర్వేషన్, రోస్టర్ విధానంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులైన అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేయనున్నారు. అర్హులైన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి ఒక్కో విధానంలో కాకుండా ఆర్థిక శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. దీంతో వీలైనంత త్వరగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. ♦ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ దరఖాస్తులను ఆయా శాఖాధిపతులు తొలుత వెరిఫికేషన్ చేసి సర్టిఫై చేయాలి. ♦ ఆ తర్వాత సచివాలయ శాఖలు ఆయా దరఖాస్తులను ధ్రువీకరించి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ♦ పిదప ట్రెజరీస్ డైరెక్టర్ దరఖాస్తులను ఆడిట్ చేసి సిఫార్సు చేయాలి. ♦ చివరగా ఆర్థిక శాఖ (హెచ్ఆర్) విభాగం అర్హులైన ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు ఆమోదం తెలుపుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులు పుట్టిన తేదీ, విద్యా అర్హతలు, కమ్యూనిటీ, మంజూరైన పోస్టులో నియమించారా, లేదా అనే విషయాలను ఆయా శాఖాధిపతులు ్ర«ధువీకరణ చేయాల్సి ఉంటుంది. సీఎం జగన్కు ఉద్యోగులుబాసటగా నిలవాలి.. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగులందరూ బాసటగా నిలవాలి. దశాబ్దాల కాంట్రాక్టు ఉద్యోగుల కలను నెరవేర్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. కొన్ని పత్రికలు, చానళ్లు ప్రభుత్వంపై నిత్యం విష ప్రచారం చేస్తున్నాయి. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని అక్కసుతో దించేసే కుట్రను ఉద్యోగులు అడ్డుకోవాలి. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి 100 మందిని లక్ష్యంగా పెట్టుకుని వాస్తవాలు వివరించాలి. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులు, బడుల రూపురేఖలు మార్చి, ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్న సీఎం జగన్ను మరోసారి గెలిపించుకోవాలి. – ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ జనరల్ అరవ పాల్ 20 ఏళ్ల కల సాకారం కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధికరణకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడం పట్ల ఆనందంగా ఉంది. 20 ఏళ్ల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్మీడియెట్ విభాగంలో 3 వేల మందికి, పాలిటెక్నిక్, డిగ్రీ స్థాయిల్లో మరో 1,000 మందికి మేలు జరుగుతుంది. – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ, కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వేలాది కుటుంబాల్లో సీఎం వెలుగులు నింపారు.. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. మేనిఫెస్టోలో చేర్చి మరీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మేలు చేశారు. తాజా నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం. – వై.రామచంద్రారెడ్డి, చంద్రమోహన్రెడ్డి, ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం.. కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధికరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసులను క్రమబద్ధీకరించిన సీఎంకు మా కృతజ్ఞతలు. – కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ రాష్ట్ర చైర్మన్ కుమ్మరకుంట సురేష్, కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ -
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం నల్ల గొండ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం వస్తే ఇక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అవుతారని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించడంలో విఫలం కావడం వల్ల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొ న్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ నాణ్యతలేక కూలిపోతున్నాయని, వాటి మీద విచారణ జరిపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంద ని కోమటిరెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలు అయినందునే విచారణ చేపట్టడంలేదని ఆరోపించారు. రూ.9 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, దానిలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
TCS Recruitment Scam: కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై టీసీఎస్ కీలక నిర్ణయం!
దేశంలో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టీసీఎస్ (TCS)లో ఉద్యోగాలకు లంచాల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వేతనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సిబ్బంది సంస్థలకు చేసే చెల్లింపుల్లో మార్పులు చేసింది. ఇలా చేయడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. వచ్చే జనవరి నుంచే.. బిజినెస్ వార్తా సంస్థ ‘మింట్’ నివేదిక ప్రకారం.. టీసీఎస్ సవరించిన చెల్లింపు విధానం వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న వెండర్ (సిబ్బంది సంస్థ) ఒప్పందాలు ఈ ఏడాది డిసెంబర్ వరకూ అమలులో ఉంటాయి. కొత్త ఒప్పందాలు 2024 జనవరి నుంచి వర్తిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, వెండర్ ఖర్చులు, బీమా వంటివన్నీ కంపెనీ చెల్లింపుల్లోనే కలిసి ఉంటాయి. పారదర్శకతను పెంపొందించే ఉద్దేశంతో ఈ ధరల సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. మంచి అర్హత కలిగిన అభ్యర్థులకు కంపెనీని చేరువ చేయడం ద్వారా అటు సిబ్బంది సంస్థలు, ఇటు టీసీఎస్.. రెండింటికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రేట్ కార్డులలో చేస్తున్న మార్పు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగుల విషయంలో ఎటువంటి మార్పు లేదు. టీసీఎస్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండటం గమనార్హం. లంచాల స్కామ్ ఎఫెక్ట్ టీసీఎస్ నియామక ప్రక్రియలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ధరల విధానాలలో ఈ సర్దుబాటు చేసింది. కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు గానూ నియామక సంస్థల నుంచి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెలుగులోకి రావడంతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో టీసీఎస్ విచారణ చేపట్టింది. ఫలితంగా కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ మాజీ హెడ్ ఈఎస్ చక్రవర్తితోపాటు ఇందులో ప్రమేయం ఉన్న మరో ఎనిమిది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అలాగే ఆరు సిబ్బంది సంస్థలను బ్లాక్ లిస్ట్ చేసింది. -
రాష్ట్ర ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మరో రెండు హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64 శాతం డీఏను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన కరువు భత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డీఏను నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై1 నుంచి ఈ ఏడాది అక్టోబర్31 వరకు ఉన్న బకాయిలను మూడు దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేయనున్నట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిల్లో 10 శాతం ప్రాన్ అకౌంట్లో జమ చేసి మిగిలిన 90 శాతం మూడు దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు, రివైజ్డ్ పేస్కేల్ 2022 కింద రెగ్యులర్గా జీతాలు అందుకుంటున్న వారు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, భోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ 2–6–2014కు ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ శాఖల్లోని నియామకాలకే ఇది వర్తిస్తుందని వివిధ పథకాలు, ప్రాజెక్టులు కింద పనిచేసే వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తూ డీఏతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా.. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రత్నాకర్బాబు, ప్రధాన కార్యదర్శి వీఎన్వీఆర్ కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల బానిసత్వానికి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
2014 జూన్ 2 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నాం
-
బిల్లు ఆమోదం.. కాంట్రాక్టు ఉద్యోగుల సంబరాలు..
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త అసెంబ్లీలో బిల్ పాస్..
-
వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2018కి ముందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన శాంక్షన్ పోస్టుల్లో నియమితులైన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, పారా మెడికల్ సిబ్బందికి వంద శాతం గ్రాస్ వేతనం (పే+హెచ్ఆర్ఏ+డీఏ) పునరుద్ధరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనాన్ని రద్దు చేసి.. కన్సాలిడేట్ పేకి కుదించారు. ఈ నేపథ్యంలో వారంతా 2019కు ముందు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 తర్వాత నియమించబడి అర్హత ఉన్న ఉద్యోగులకు ఈ వేతనాలు వర్తింపజేసేలా ప్రతిపాదనలు పంపించాల్సిందిగా విభాగాధిపతులను ఆదేశించారు. సీఎం జగన్కు రుణపడి ఉంటాం పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనం రద్దు చేసి మాకు అన్యాయం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 3,914 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కేడర్ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనాలు పెరుగుతాయి. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం. – రత్నాకర్, ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ -
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
AP: కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో శుభవార్త
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. క్రమబద్దీకరణకు ఐదేళ్ల నిబంధన తొలగించనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సీఎం జగన్ అంగీకరించారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయనుంది. కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన.. సీఎం నిర్ణయంతో అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది కలగనుందని ఏపీజీఈఏ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. కాగా, విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విద్యుత్ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: చంద్రబాబు కొత్త రాగం.. అదో దిక్కుమాలిన విజన్: పేర్ని నాని ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్న్యూస్
-
కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గూగుల్.. వాళ్లు చేసిన పాపం ఏంటంటే..
ప్రముఖ టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్.. గూగుల్ హెల్ప్ వర్కర్ల కాంట్రాక్ట్ను అర్ధాంతరంగా ముగించి నిర్ధాక్షణ్యంగా వారిని విధుల నుంచి తొలగించింది. ఇంతకీ వాళ్లు చేసిన పాపం ఏంటంటే యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించడమే. ఈ మేరకు ఆరోపిస్తూ యూఎస్ లేబర్ బోర్డ్కి బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించిన ఉద్యోగులపై కక్ష తీర్చుకునేందుకు గూగూల్ మాతృసంస్థ ఆల్ఫాబిట్ తీసుకున్న నిర్ణయం ఫెడెరల్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. బాధిత ఉద్యోగుల్లో 70 శాతం మందికిపైగా తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని జులైలో చెప్పినట్లు నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ ఫైలింగ్ను ఉటంకిస్తూ ‘బ్లూమ్బెర్గ్’ నివేదించింది. ఆస్టిన్, టెక్సాస్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాతోపాటు యూఎస్లోని ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల తొలగింపు గురించి "టౌన్ హాల్" ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆల్ఫాబెట్ తెలియజేసింది. అలాగే ఉద్యోగులకూ ఈమెయిల్స్ పంపించింది. Lay off: ‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్’ బాధిత ఉద్యోగుల్లో 118 మంది రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ రూపొందించే లాంచ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. వీరింతా గూగూల్ సెర్చ్ రిజల్ట్స్, ఏఐ చాట్బాట్ నాణ్యతను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేశారు. యాక్సెంచర్ ద్వారా వీరిని నియమించుకున్నప్పటికీ, చట్టబద్ధంగా గూగుల్ సంస్థే తమకు తమ యజమాని అని ఉద్యోగులు పేర్కొంటున్నారు. యాక్సెంచర్తోపాటు గూగుల్ను తమకు ఉమ్మడి యజమానిగా గుర్తించాలని లేబర్ బోర్డ్ను కోరుతున్నారు. 2018లో ఆల్ఫాబెట్ కాంట్రాక్టు వర్కర్లలో చాలా మంది దాని గ్లోబల్ వర్క్ఫోర్స్లో భాగమయ్యారని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. అదేవిధంగా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఆల్ఫాబెట్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ చేయడానికి 2023 ఏప్రిల్లో ఆమోదం లభించింది. ఆ కార్మికుల ఉమ్మడి యజమాని ఆల్ఫాబెట్ అని నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ జులై నెలలో ఇచ్చిన తీర్పును సభ్యులందరూ సమర్థించారు. -
జీతాల్లేవ్... రెన్యువల్ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలు మాత్రం అందడం లేదు. అందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 3,650 మంది పనిచేస్తున్నారు. డాక్టరు స్థాయి మొదలు స్టాఫ్ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఎల్రక్టీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర కేడర్ల లో కాంట్రాక్టు ప్రాతిపదికన, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో విధు లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసును ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తారు. ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు సర్విసు కాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి రెన్యువల్ చేస్తేనే నిధులు విడుదల చేస్తారు. పెండింగ్.. పెండింగ్... ఈ ఏడాది ఏప్రిల్లో వైద్య విధాన పరిషత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్విసు రెన్యువల్ ప్రతిపాదనలను ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణంగా ఈ ప్రక్రియ వారం నుంచి పది రోజుల్లోగా పూర్తి కావాలి. కానీ ఏప్రిల్ నెలలో సమర్పించిన ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం రాలేదు. ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ఫైలు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,650 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్విసు రెన్యువల్ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏటా ఇదే తంతు... వైద్య విధాన పరిషత్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో ప్రతి సంవత్సరం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో వేతనాలు అందడంలో ఆలస్యం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం సర్విసు పునరుద్ధరణే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని ఉద్యోగులు మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాలు సమర్పించారు. -
ఉరవకొండలో సంబరాలు జరుపుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
థ్యాంక్యూ సీఎం సార్
తణుకు అర్బన్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరణకు అనుకూలంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగులు సంబరాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన శనివారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ‘థ్యాంక్యూ సీఎం సార్..’ అంటూ కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని, ఉద్యోగుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తణుకు శాఖ అధ్యక్షుడు నరసరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ గుండెల్లో కొలువుదీరారని అన్నారు. సీఎంకు రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు కేశిరెడ్డి వెంకట సత్యనారాయణ (పండు), ఆర్వీఎస్ఎన్ మూర్తి, వైవీఎస్బీ రాయుడు, కె.కరుణాకరరావు, పీవీ నాగరాజు, పట్టపు రామకృష్ణ, పంజా రవి, సుభాషిణి, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కిషోర్, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఉద్యోగులు పాల్గొన్నారు. -
వేల కళ్లలో వెలుగులు
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయంతో వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తమవుతోంది. ♦ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ♦ విజయనగరం జిల్లా కేంద్రంలో సీఎం జగన్ చిత్రపటానికి కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరులో సీఎం జగన్, మంత్రి దాడిశెట్టి రాజా ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ♦ సీఎం జగన్ మాట తప్పని, మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేసుకున్నారని విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవైవీపీ కార్యాలయం వద్ద ఉద్యోగులతో కలిసి ఆయన సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ♦ తమ జీతాలను ఏకంగా 23 శాతం పెంచిన ముఖ్యమంత్రి జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు శుక్రవారం గుంటూరులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని కలసి ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అశోక్కుమార్, అధ్యక్షుడు ఎ.విజయ్భాస్కర్ తదితరులున్నారు. ♦ ఏపీ ఎన్జీవోలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి నివాసంలో గవర్నమెంట్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ♦ కడపలో కాంట్రాక్టు లెక్చరర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ సురే‹Ùబాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మ శివప్రసాద్రెడ్డి, ఏపీఎన్జీవోస్ నేతలు పాల్గొన్నారు. ♦ క్రమబదీ్ధకరణ ద్వారా సీఎం జగన్ 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్విసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) అధ్యక్షుడు అరవా పాల్, జనరల్ సెక్రటరీ ఆర్.గోపాల్రెడ్డి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 14 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించారన్నారు. ♦ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరించి ముఖ్యమంత్రి జగన్ మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. విజయవాడ వైఎస్సార్ పార్క్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అడగకుండానే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసినందుకు.. సీపీఎస్ ఉద్యోగులకు ఊరటనిస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చి నందుకు.. పది వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు.. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎంతో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా సీఎం పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఉద్యోగుల కోసం పరితపిస్తున్న సీఎం జగన్ ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నారు. అడగకుండానే 12వ పీఆర్సీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా.. చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిర్ణయంతో వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించారు. ఏపీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసి... ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ ద్వారా 50 శాతం ఫిట్మెంట్తో పెరిగే ధరలకు అనుగుణంగా డీఏలు ఇచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పడం ద్వారా భవిష్యత్కు భరోసా ఇచ్చారు. మా కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు. జగన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ఎత్తున పాలాభిషేకాలు చేస్తున్నారు. – బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం మానవతామూర్తి సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ 2008లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఇచ్చి న మాట మేరకు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి. గతంలో పీఆర్సీ కోసం రోడ్డెక్కితే టీడీపీ సర్కార్ గుర్రాలతో ఉద్యోగులను తొక్కించింది. ఇప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం వైఎస్ జగన్ పీఆర్సీని ప్రకటించి.. ఉద్యోగుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. – శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్జీవో సంఘం ఎప్పటికీ రుణపడి ఉంటాం.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు. ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రత్నాకర్ బాబు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత జీపీఎస్తో మేలు జరుగుతుందని భావిస్తున్నాం జీపీఎస్లో పది శాతం ఉద్యోగి షేర్, ప్రభుత్వ షేర్ కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారెంటీ పింఛన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. జీపీఎస్తో ఉద్యోగులకు 60 శాతం ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాం. – మురళీ మోహన్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత 15 ఏళ్ల సమస్యకు సీఎం పరిష్కారం ఆస్పత్రుల్లో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. రెగ్యులర్ ఉద్యోగులమైనా మాకు జీతాలు రావటం లేదు. కానీ సీఎం జగన్ దృష్టికి రాగానే ఒకే ఒక్క సంతకంతో సమస్య తీర్చారు. వైద్య విధాన పరిషత్ ద్వారా అత్యంత మెరుగైన సేవలు అందిస్తాం. – సురేష్ కుమార్, ఏపీవీపీ సంఘం నేత నా 23 ఏళ్ల సర్విసులో ఇది అద్భుతం నా 23 ఏళ్ల సర్విసులో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పరికరాలు ఏర్పాటు చేయడం అద్భుతం. కాంట్రాక్టు ఉద్యోగులమైన మమ్మల్ని రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు. – వీఏవీఆర్ కిశోర్, ఏపీ కాంట్రాక్టు ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఇటువంటి సాహసం సీఎం వైఎస్ జగన్ మాత్రమే చేయగలరు
-
ఉప్పొంగిన ఉద్యోగి!
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల విశ్రాంత జీవనానికి పూర్తి భరోసా కల్పిస్తూ జీపీఎస్ తేవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధి కరణ, వైద్య విధాన పరిషత్ను ప్రభుత్వంలో విలీనం చేయడం తదితర నిర్ణయాలను కేబినెట్ ఆమోదించటాన్ని స్వాగతిస్తున్నారు. 20 ఏళ్ల కల నెరవేరిందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సంబరాలు చేసుకున్నారు. వేతనాలు, సెలవుల రెగ్యులరైజేషన్, ఇతర అంశాల్లో జాప్యానికి ఇక తెరపడనుందని పేర్కొంటున్నారు. గొల్లపూడిలోని ఏపీవీవీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ డాక్టర్ పి.సరళమ్మ, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, వైద్య విధాన పరిషత్ డాక్టర్ల జేఏసీ చైర్మన్ డాక్టర్ రోహిత్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్రెడ్డిని కలిసి యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్కి ధన్యవాదాలు తెలియచేస్తూ రాçష్ట్రవ్యాప్తంగా వారం పాటు సంబరాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. ♦ దివంగత వైఎస్సార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్చిత్రపటాలకు విశాఖ కలెక్టరేట్ ఎదుట ఎన్జీవోలు, కాంట్రాక్టు ఉద్యోగులు క్షీరాభిషేకం నిర్వహించారు. సీఎం సార్ ధన్యవాదాలంటూ కృతజ్ఞతను చాటుకున్నారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో ఉరేగింపు నిర్వహించారు. పీఆర్సీ, బకాయిల చెల్లింపు తదితర నిర్ణయాలపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ ఉద్యోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఎస్.చలం పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్లోని ఎన్జీవో హోమ్లో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా భట్లవెల్లిలో సీఎం జగన్ చిత్రపటానికి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఇందులో మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు. ♦ తెనాలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలివ్వాలని నిర్ణయించటం సంతోషకరమన్నారు. ♦ చిత్తూరులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట, తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సూళ్లూరుపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు సీఎం చిత్రపటానికి క్షీభిషేకం నిర్వహించారు. ♦ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నెల్లూరు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 115 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులరైజ్ కానున్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డితో కలసి నగరంలోని కేఏసీ జూనియర్ కళాశాల ఎదుట సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ♦ ముఖ్యమంత్రి జగన్ చేసిన మేలును జన్మలో మరువలేమని రాష్ట్ర కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రతినిధులు ఎస్.దొరబాబు, వేణుగోపాలరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు చాటుకున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమను పట్టించుకోకపోగా జీతాలు పెంచిన పాపాన పోలేదని చెప్పారు. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధి కరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి విజయవాడ సత్యనారాయణపురంలోని కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ట్రేడ్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్, తిరుపతి జోనల్ ఇన్చార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ♦ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధి కరణ నిర్ణయంపై ఏపీ పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఏలూరులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకుంది. సుమారు 3,500 మంది రెగ్యులర్ కానున్నట్లు యూనియన్ జిల్లా అధ్యక్షుడు నల్లా అప్పారావు తెలిపారు. ♦ ఉత్తరాంధ్రలో జియ్యమ్మవలస, కురుపాం, బొబ్బిలిలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేయాలంటూ కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి పుష్పగుచ్ఛం అందజేశారు. -
ఉద్యోగుల పట్ల సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకున్నారు
-
సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు: కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
AP: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి అయిదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కాగా, మంత్రి బొత్స సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని అన్నారు. అలాగే, తర్వలోనే కొత్త పీఆర్సీ కమిటీ నియామకం ఉంటుందని వెల్లడించారు. కొత్త పెన్షన్ విధానంపై కేబినెట్లో చర్చించి మెరుగైన విధానం తీసుకొస్తాం. ఉద్యోగులకు ఖచ్చితంగా పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు నాలుగేళ్లలో 16 వాయిదాల్లో మొత్తం పీఆర్సీ బకాయిలు చెల్లించడానికి అంగీకరించినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన.. -
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అదనంగా ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సౌకర్యాన్ని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా కల్పించాలన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తికి సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారు. దీంతో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఆరి్థకశాఖ జీవో నంబర్ 39 జారీచేసింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరుచేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే! -
వారిని అస్సలు పట్టించుకోని అమెజాన్ ఫ్లెక్స్, ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ
న్యూఢిల్లీ: కాంట్రాక్టు ఉద్యోగులకు (గిగ్ వర్కర్లు/తాత్కాలిక పనివారు) న్యాయమైన, పారదర్శక పని పరిస్థితులు కల్పించడంలో ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ, అమెజాన్ ఫ్లెక్స్ సున్నా స్థానంలో నిలిచాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఫెయిర్వర్క్ ఇండియా ఈ రేటింగ్లు ఇచ్చింది. అంతర్జాతీయంగా డిజిటల్ టెక్నాలజీ కంపెనీల్లో పని పరిస్థితులపై ఫెయిర్వర్క్ రేటింగ్లు ఇస్తుంటుంది. ఈ సంస్థ ‘ఫెయిర్వర్క్ ఇండియా రేటింగ్స్ 2022’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. న్యాయమైన వేతన చెల్లింపులు, పని పరిస్థితులు, న్యాయమైన ఒప్పందాలు, పారదర్శక నిర్వహణ, న్యాయమైన ప్రాతినిధ్యం అంశాల ఆధారంగా రేటింగ్లు కేటాయిస్తుంది. 10 పాయింట్లకు గాను అమెజాన్ ఫ్లెక్స్, డంజో, ఓలా, ఫార్మ్ఈజీ, ఊబర్ కు సున్నా పాయింట్లు వచ్చినట్టు ఈ నివేదిక వెల్లడించింది. నివేదికలో భాగంగా 12 ప్లాట్ఫామ్లకు ఫెయిర్వర్క్ రేటింగ్లు ఇవ్వగా, ఈ ఏడాది ఒక్క ప్లాట్ఫామ్ కూడా 10కి 10 పాయింట్లు సంపాదించలేకపోయింది. అర్బన్ కంపెనీ అత్యధికంగా 10 పాయింట్లకు గాను 7 పాయింట్లు సొంతం చేసుకుంది. బిగ్ బాస్కెట్ కు 6, ఫ్లిప్కార్ట్కు 5, స్విగ్గీకి 5, జొమాటోకు 4, జెప్టోకు 2, పోర్టర్కు ఒక పాయింట్ లభించింది. ‘‘చట్టం దృష్టిలో గిగ్ వర్కర్లు అంటే స్వతంత్ర కాంట్రాక్టర్లు. అంటే కార్మిక హక్కులను వారు పొందలేరు. అసంఘటిత రంగం ఉద్యోగులు, నిరుద్యోగుల మాదిరే వీరు కూడా. గంటల వారీ కనీస వేతనం అందించడం వారి పని పరిస్థితులు మెరుగుపడే విషయంలో మొదటి మెట్టు’’అని ఫెయిర్వర్క్ అని కంపెనీల పని పరిస్థితులను అధ్యయనం చేసిన ప్రొఫెసర్ బాలాజీ పార్థసారథి తెలిపారు. -
Fact Check: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఈనాడు అబద్ధపు రాతలు
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా ఈనాడు అడ్డగోలుగా అబద్ధాలను వండివార్చడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మడత పేచీ.. శీర్షికతో ఈనాడులో సోమవారం అబద్ధపు కథనం ప్రచురితమైంది. క్రమబద్దీకరించే కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నింస్తోందని, ఇందుకోసం పలు నిబంధనలు పెట్టిందని అబద్ధాలను అచ్చోసింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అధ్యయనం చేసి ఇదే అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత దానిపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా నడుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి జీవో విడుదల కాలేదు. క్రమబదీ్ధకరణకు ఎలాంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను సేకరించేందుకు ఒక ఫార్మాట్ ఇచ్చారు. దానిప్రకారం వివరాలు సేకరించే పని జరుగుతోంది. కానీ ఈనాడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం అభూత కల్పనలతో కథనం రాసింది. నిజానికి కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు ఏమీ చేయలేదు. అప్పుడు వారు చేయలేనిదాన్ని, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తుంటే అడ్డగోలుగా వక్రీకరణలకు దిగుతోంది. దోచుకో పంచుకో తినుకో పద్ధతిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం, ఎల్లోమీడియా సిండికేట్గా మారి దొంగల ముఠాలా రాష్ట్రాన్ని దోచుకుతిన్నాయి. ఆ ముఠాకు నాయకత్వం వహించిన చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపారు. దీంతో ఇప్పుడు దోచుకోవడానికీ, పంచుకోవడానికి వారికి ఏమీ లేదు. ఎప్పుడెప్పుడు తమ వాడిని ఆ సీటులో కూర్చోబెడదామా? మళ్లీ దోపిడీ మొదలుపెడదామా అని ఈ సిండికేట్ ఆత్రుతపడుతోంది. అందుకోసమే ప్రజలను ఏమార్చేందుకు అబద్ధాల కథనాలను అదేపనిగా ప్రచురిస్తోంది. -
కొలువుల క్రమబద్ధీకరణ తొలి ప్రతిపాదన పూర్తి.. సీఎం కార్యాలయం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యో గుల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తు న్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమ బద్ధీకరించి శాశ్వత ప్రాతి పదికన నియమిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన నేపథ్యంలో శాఖలవారీగా ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం వివిధ శాఖలను ఇటీవల ఆదేశించింది. దీంతో క్రమబద్ధీకరణ నిబంధనలకు అను గుణంగా వర్క్ హిస్టరీ ఉన్న ఉద్యోగులను గుర్తించిన శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 143 మంది కాంట్రాక్టు సూపర్వైజర్ల జాబితాతో తొలి ప్రతిపాదన సమర్పించగా సీఎం కార్యాలయం దాన్ని ఆమోదించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఉద్యోగులకు శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్లు, కొత్త స్థానాలకు బదిలీ చేస్తూ నియామక ఉత్త ర్వులు జారీ చేసింది. విధుల్లో చేరిన ఆయా ఉద్యోగులకు కేడర్ ఆధారిత పే స్కేల్కు అనుగుణంగా వచ్చే నెల (అక్టోబర్)లో తొలి వేతనం అందనుంది. వడివడిగా కదులుతూ: ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి విద్య, అనుబంధ శాఖల్లోనే దాదాపు 32 శాతం మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గురుకుల సొసైటీలు, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల్లోనే అత్యధిక పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ సర్వీసు నిబంధనల విష యంలో స్పష్టత కోసం ఆయా ఫైళ్లకు మోక్షం కలగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక శాఖతోపాటు సాధారణ పరిపాలన విభాగం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే మరో 30 శాతం మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొలిక్కి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరు లోగా మరికొన్ని ఫైళ్లకు ఆమోదం లభిస్తుందని విశ్వసనీయ సమాచారం. -
పారదర్శకతకు పాతరేస్తారా..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో మధ్యవర్తుల వసూళ్ల పర్వంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని మానవీయ కోణంలో పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ అంశాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రమబద్ధీకరణను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొందరు మధ్యవర్తులు వసూళ్లకు తెగబడుతున్న తీరుపై గతనెల 24న ‘కొలువుల క్రమబద్ధీకరణలో కలెక్షన్ కింగ్లు’శీర్షికతో ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇది గురుకుల సొసైటీ వర్గాల్లోనే కాకుండా, సచివాలయంలోని కొన్ని విభాగాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల సొసైటీ కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మధ్యవర్తుల ప్రమేయం, వసూళ్ల తంతు ఏమిటంటూ మండిపడ్డారు. తక్షణమే ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తీగ లాగి.. హెచ్చరికలు చేసి.. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో దాదాపు ఆరువందల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా.. అందులో 550 మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులుగా సొసైటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణను కొందరు సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగి రకరకాల అపోహలు సృష్టించారు. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారి కొలువే క్రమబద్ధీకరిస్తారని చెప్పడంతో మెజార్టీ ఉద్యోగులు మధ్యవర్తులు అడిగినంత మేర ఇచ్చినట్లు తెలిసింది. ఇలా దాదాపు రూ.8 కోట్లకు పైగా వసూలు చేశారని సమాచారం. దీనిపై టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి రోనాల్డ్రాస్ రంగంలోకి దిగి తీగ లాగినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంట్రాక్టు ఉద్యోగులతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి విచారణ జరిపారు. అలాగే ప్రతి జిల్లా నుంచి ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు ఆన్డ్యూటీ సౌకర్యం కల్పిస్తూ, వారం క్రితం సొసైటీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మధ్యవర్తులు వసూళ్లు చేసిన తీరును, ఎవరెవరు ఎలా డబ్బులు ఇచ్చారని ఆరా తీసినట్లు వెల్లడైంది. ఈ సమావేశంలో కేవలం కాంట్రాక్టు ఉద్యోగులు, కార్యదర్శి మాత్రమే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వసూళ్ల తీరును తెలుసుకున్న తర్వాత ఆయన పలు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కళంకం రాకుండా, వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అప్పటిదాకా సొసైటీ ఉద్యోగుల ఫైలు కదలదని హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
కొలువుల క్రమబద్ధీకరణలో ‘కలెక్షన్ కింగ్’లు!
పుష్పలత (పేరు మార్చాం) ఓ గురుకుల సొసైటీ పరిధిలో సీఆర్టీగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అన్ని రకాల అర్హత కలిగిఉన్నారు. కానీ సొసైటీ అధికారుల నుంచి క్రమబద్ధీకరణపై ఎలాంటి సమాచారం అందడం లేదు. అయితే తన పేరు జాబితాలో లేదని, ఉద్యోగం క్రమబద్ధీకరించాలంటే రూ.లక్ష ఇస్తే మేనేజ్ చేయొచ్చంటూ ఓ వ్యక్తి పుష్పలతను సంప్రదించాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని, అడిగినంత ఇస్తే పనైపోతుందని చెప్పాడు. దీంతో ఆయా ఉద్యోగులు సదరు వ్యక్తి అడిగినంత చెల్లించుకున్నారు. వివిధ శాఖల్లో చాలామంది కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి ఈ తరహాలో దండుకుంటున్నట్లు క్రమంగా బయటపడుతోంది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో కొందరు కేటుగాళ్లు చొరబడ్డారు. ఉద్యోగాన్ని క్రమబద్దీకరించేందుకు ఉన్నతాధికారులకు ముడుపులు ఇవ్వాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి సగటున రూ.50వేల నుంచి రూ.1.5 లక్షల వరకు దండుకుంటున్నారు. ఈ విషయంలో నిజానిజాలను నిర్ధారించుకోకుండా తోటి కాంట్రాక్టు ఉద్యోగులు సైతం కేటుగాళ్లు అడిగినంత ముట్టజెప్తున్నారు. వివిధ శాఖల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో 18 ఏళ్లుగా కాంట్రాక్టులో పనిచేస్తున్న 144 సూపర్వైజర్ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు సీఎం ఆమోదం తెలిపిన విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ అంశం కాంట్రాక్టు ఉద్యోగుల్లో దృఢ విశ్వాసాన్ని నింపింది. తాజాగా ఇతర విభాగాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ ఫైళ్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. క్రమబద్ధీకరణను త్వరితంగా పూర్తి చేయిస్తామని, కొందరి పేర్లు జాబితాలో లేవంటూ బుకాయించి అలాంటి వారికి సైతం క్రమబద్ధీకరణ అయ్యేలా చేస్తామని నమ్మిస్తున్నారు. పై అధికారుల చెయ్యి తడిపితేనే త్వరితంగా పని పూర్తవుతుందని, ప్రభుత్వం వద్దకు ఫైలు వేగంగా చేరుతుందని ఆశలు పుట్టించి వసూళ్లకు తెగబడుతున్నారు. సంక్షేమ, గురుకులాల్లో... ►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుంచి క్రమబద్ధీకరణ ఫైలు సీఎం కార్యాలయానికి చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న కొందరు కేటుగాళ్లు ఆయా ఉద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ►తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో దాదాపు 250 మంది కాంట్రాక్టు టీచర్లు పనిచేస్తున్నారు. వీరి క్రమబద్ధీకరణ అంశాన్ని సొసైటీ సైతం అత్యంత గోప్యంగా ఉంచింది. క్రమబద్ధీకరణ ఫైలు ప్రభుత్వానికి పంపిందో లేదో అనే సందిగ్ధంలో ఆయా ఉద్యోగులు ఉండగా... రంగంలోకి దిగిన కేటుగాళ్లు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్ష చొప్పున డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు టీచర్లు అడిగినంత ఇచ్చుకున్నట్లు సమాచారం. ►ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో అత్యధికులు విద్యాశాఖ, గురుకుల సొసైటీల పరిధిలోనే ఉన్నారు. దీన్ని అదనుగా చేసుకున్న కేటుగాళ్లు విద్యాశాఖ, గురుకుల సొసైటీల పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగులపై కన్నేశారు. వారికి మాయమాటలు చెప్పి అందినకాడికి దండుకునేందుకు తెగబడ్డారు. ►తెలంగాణ సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ఐదొందలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ కానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సొసైటీ ప్రభుత్వానికి నివేదించింది. కొందరు మధ్యవర్తులు ఈ ఉద్యోగులను సంప్రదించి క్రమబద్ధీకరణ కోసం పెద్దమొత్తంలో డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని వారికి సూచించగా... ఇప్పటికే పలువురు ఆ మొత్తాన్ని ముట్టజెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మధ్యవర్తులను నమ్మొద్దని ఉద్యోగ సంఘ నేతలు గట్టిగా సూచిస్తున్నారు. -
ఖాళీ పోస్టు ఉంటేనే... క్రమబద్ధీకరణ!
♦క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఆర్థిక శాఖ 15 అంశాలతో కూడిన ప్రొఫార్మాను ప్రభుత్వ శాఖలకు పంపింది. వీటిని ఆయా ప్రభుత్వ శాఖలు.. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చి వివరాలు, ఆధారాలను సేకరించాయి. ♦ప్రొఫార్మాలోని ఏడవ పాయింట్ ప్రకారం.. సదరు కాంట్రాక్టు ఉద్యోగి పనిచేస్తున్న పోస్టును ప్రభుత్వం ఏ జీఓ ఆధారంగా మంజూరు చేసిందనే దానికి ఆధారాలను, సంబంధిత వివరాలను సమర్పించాల్సి ఉంది. అయితే మెజారిటీ కాంట్రాక్టు ఉద్యోగులు ఈ పాయింట్కు సమాధానం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఆర్థిక శాఖ మెలిక పెట్టింది. ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి పనిచేస్తున్న చోట ప్రభుత్వం అప్పటికే పోస్టు మంజూరు చేసి, అది ఖాళీ (వేకెంట్)గా ఉన్నప్పుడే క్రమబద్ధీకరణను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న 11 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి 11 వేల మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారాన్ని సేకరించి ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 11 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొనగా.. వారిలో ప్రస్తుతం ఎంతమంది సర్వీసులో ఉన్నారు?, ఎక్కడెక్కడ ఏయే హోదాలో పనిచేస్తున్నారు? తదితర పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రత్యేక ఫార్మాట్ను తయారు చేసి ప్రభుత్వ శాఖలకు పంపింది. లెక్కలు తేల్చిన శాఖలు ప్రొఫార్మా ప్రకారం క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించిన ప్రభుత్వ శాఖలు.. లభించిన సమాచారం మేరకు ప్రస్తుతం ఆయా శాఖల్లో జిల్లాల వారీగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీలు, రోస్టర్ ఆధారంగా అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, రోస్టర్ మినహాయింపులతో అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, మొత్తంగా క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలను ప్రాథమికంగా తేల్చాయి. వాటిని మరోమారు పరిశీలిస్తున్న శాఖలు అతి త్వరలో ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపేందుకు సిద్ధమవుతున్నాయి. భారీగా తగ్గుతున్న అర్హులు! ప్రభుత్వం గుర్తించిన 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతో పోలిస్తే.. ప్రభుత్వ శాఖలు గుర్తించిన క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న వారి సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీ)ను 2003లో నియమించారు. ఈ పద్ధతిలో నియామకాలు చేపట్టగా.. తెలంగాణ ఏర్పాటు నాటికి 1,237 మంది ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్న ఖాళీలు 901 ఉండగా.. రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వారీగా అర్హత ఉన్న సీఆర్టీలు 159 మంది మాత్రమే కాగా, రోస్టర్ మినహాయింపుతో (కొన్నిరకాల సవరణలతో అవకాశం ఉన్నవారు) మరో 42 మందికి అర్హత ఉన్నట్లు గుర్తించింది. మొత్తంగా 201 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నట్లు అంచనా వేసింది. అంటే 1,237 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో అర్హత సాధిస్తున్నవారు 201 మంది (16 శాతం) మాత్రమేనన్నమాట. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే తరహాలో అర్హతలున్న కాంట్రాక్టు ఉద్యోగుల సం ఖ్యకు భారీగా కోత పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ పెట్టిన మెలిక ఏళ్లుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మెజారిటీ కాంట్రాక్టు ఉద్యోగులకు నిరాశే మిగల్చనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ క్రమబద్ధీకరించాలి దాదాపు 18 ఏళ్లుగా సీఆర్టీలుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ టీచర్ల నియామకానికి సమానంగా అన్ని రకాల అర్హతలను పరిశీలించి మమ్మల్ని నియమించారు. క్రమబద్ధీకరణపై ఆశతోనే అతి తక్కువ వేతనం ఇచ్చినా ఇన్నేళ్లుగా సర్దుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో ఎంతో సంతోషించాం. కానీ నామమాత్రంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తే మా సీఆర్టీల్లో దాదాపు 85 శాతం మంది అవకాశాన్ని కోల్పోతాం. వివిధ రకాల మెలికలు పెట్టి కోత పెడితే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ వయసులో మాకెవరూ ఉద్యోగాలు ఇవ్వరు. కాబట్టి ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ క్రమబద్ధీకరించాల్సిందే. – మాలోతు సోమేశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు, సీఆర్టీ అసోసియేషన్ -
క్రమబద్ధీకరణకు అర్హులెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ముందడుగు పడింది. క్రమబద్ధీకరణకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలను శాఖల వారీగా వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు లేఖలు రాసింది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరించేం దుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుంది. వాస్తవా నికి 2016 ఫిబ్రవరి 26న కూడా ఇదే తరహాలో ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం అన్ని శాఖల అధిపతులను కోరింది. కానీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ కొం దరు హైకోర్టును ఆశ్రయించడంతో 2017 ఏప్రిల్ 26న కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కార ణంగా ఈ ప్రక్రియకు అంతరాయం కలిగింది. అయితే 2021 డిసెంబర్ 7న హైకోర్టు రిట్ పిటిషన్ను కొట్టేస్తూ కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, ఇకపై కాం ట్రాక్టు పద్ధతిలో నియామకాలు ఉండబోవని ప్రక టించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త అందింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. 2016లో జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖను కోరింది. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 పోస్టులను భర్తీ చేస్తామని, ఇందులో 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని.. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మార్చి 9న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: (ఆ వీడియో కాల్ ఎత్తారో..బతుకు బస్టాండే) -
తెలంగాణలో ‘కాంట్రాక్టు’ కసరత్తు షురూ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కలు తేల్చే కసరత్తు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ నెల పదో తేదీన అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం ప్రకటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితిపై నిర్దేశిత పద్ధతిలో నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక ఫార్మాట్ను రూపొందించి ఉన్నతాధికారులకు పంపింది. 14 అంశాలతో నమూనా.. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మొత్తం 14 రకాల వివరాలు సమర్పించాల్సి ఉంది. దీంతో పాటు విభాగాధిపతులు సమర్పించేందుకు 9 రకాల అంశాలతో మరో ఫార్మాట్ను తయారు చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన నమూనాలో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, అపాయింట్మెంట్ తేదీ, అపాయింట్మెంట్ తీరు (పార్ట్ టైమ్/ఫుల్ టైమ్), ప్రస్తుత నెలవారీ వేతనం, క్రమబద్ధీకరిస్తే ఇవ్వాల్సిన హోదా, శాఖలో ఖాళీల వివరాలు, ఉద్యోగ కేడర్, క్రమబద్ధీకరించే హోదాకు కావాల్సిన విద్యార్హతలు, ఉద్యోగి నియామకం నాటి అర్హతలు, ప్రస్తుత అర్హతలు, ఉద్యోగి సామాజిక వర్గం, స్థానికత, క్రమబద్ధీకరించే పోస్టు రోస్టర్ పాయింట్స్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఉద్యోగి పనితీరు, రిమార్క్స్ సమర్పించాలి. వీటన్నిటినీ హెచ్ఓడీ (విభాగాధిపతి) ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగుల నుంచి వివరాలు స్వీకరించిన తర్వాత సదరు విభాగాధిపతి నిర్ణీత ఫార్మాట్లో 9 రకాల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, నియామకం అయ్యే నాటికి విద్యార్హతలు, మొదటి అపాయింట్మెంట్ ఇచ్చిన శాఖ, నియమించిన పోస్టు, ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి ఉన్న సర్వీసు, రిమార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగి వ్యక్తిగతంగా ఇచ్చే వివరాల ఆధారంగా హెచ్ఓడీ ఆర్థిక శాఖకు వివరాలు సమర్పిస్తారు. క్ష్రేత్రస్థాయిలో ఉన్న వారెందరు? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు పెద్దగా జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నియామకాలే ఎక్కువ. వీటిలో అత్యధికంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారే ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దగ్గరున్న వివరాల ప్రకారం 11,103 మంది ఉన్నట్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారెందరనే కోణంలో వివరాలను ఆర్థిక శాఖ రాబడుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఉద్యోగ నియామకాల్లో పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు రాజీనామా చేసి కొత్తగా కొలువులు పొందారు. అంతేకాకుండా వివిధ కారణాలతో ఉద్యోగాలు మానేసినవారున్నారు. అనారోగ్య సమస్యలతో మరణించడం, ఇతరత్రా కారణాలతో ఉద్యోగాలను వదిలేసిన వారు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలతో, ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య సరిపోతుందా లేదా అనే అంశం తేలాల్సి ఉంది. దీంతో హెచ్ఓడీల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఈ లెక్కలు తేల్చేందుకు ఆర్థికశాఖ సిద్ధమైంది. -
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం 2019 నుంచి రాష్ట్రప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకున్నట్టు కార్యదర్శుల కమిటీ తన నివేదికలో తెలిపింది. 27 శాతం ఐఆర్ అమలు, అంగన్వాడీ, ఆశ, ఇతర ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడినట్టు పేర్కొంది. ► ప్రభుత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్రప్రభుత్వం 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేస్తోంది. ► 2019 జూలై 1 నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఐఆర్ కింద ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.15,839.99 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.11,270.21 కోట్లు, ఉద్యోగుల కోసం, రూ.4,568.78 కోట్లు పెన్షనర్ల కోసం వెచ్చించింది. ► అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోమ్గార్డులు సహా 3,01,021 మంది ఉద్యోగులకు జీతాలు, రోజువారీ వేతనాలు పెంపొందించింది. వీరి వేతనాలు, జీతాల కోసం సంవత్సరానికి చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ► కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీరికి మినిమం టైమ్ స్కేల్ను అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూన్ 18న టైమ్ స్కేల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మొదటి రెండు ప్రసవాలకు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులను వర్తింపచేసింది. ► కాంట్రాక్టు ఉద్యోగి యాక్సిడెంటల్గా మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను వర్తింప జేసింది. ► అదనంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కల్పించిన వసతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.360 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా
సాక్షి, అమరావతి: లక్ష్మి అనే మహిళ ఓ ప్రభుత్వ శాఖలో ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. తొలి మూడేళ్లలో నిత్యం భయం భయంగా పని చేయాల్సి వచ్చేది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ సెలవులు ఇచ్చే వారు కాదు. టైమ్ స్కేల్ ఇవ్వాలని అడుగుతున్న వారిలో నీ పేరూ ఉందని, ఇలాగైతే ఉద్యోగం పోగొట్టుకుంటావని హెచ్చరించారు. సరిపోని జీతంతో, సమస్యల నడుమ ఉద్యోగ జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇక ఈ జీవితం ఇంతేనా అని ఓ దశలో నిరాశతో కుంగిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందని పలువురు అంటుంటే.. ఆ రోజు త్వరగా రావాలని తనూ కలలు కనింది. ఇప్పుడు ఆ కల నిజం అయిందని ఆనందంతో చెబుతోంది. జగన్ ప్రభుత్వ చర్యల వల్ల తనకు ఏకంగా రూ.13 వేల వరకు జీతం పెరిగిందని సంబరపడుతోంది. ఇలా లక్ష్మి ఒక్కరే కాదు.. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వేతనాలు పెంచాలని, మినిమమ్ టైమ్ స్కేలు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఆందోళన బాట పట్టిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 20 రోజుల ముందు 2019 జనవరి 28న జీఓ 12, ఫిబ్రవరి 18న జీఓ 24 ఇచ్చారు కానీ అమలు చేయకుండా మోసం చేశారు. కేవలం ఓట్లు దండుకోవాలనేదే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడ. అప్పట్లో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగుల వెతలను కళ్లారా చూసి.. ఈ పరిస్థితి మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు అన్ని విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఎంటీఎస్ (మినిమం టైమ్ స్కేలు) వర్తించేలా జీఓ 40ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగినులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా మెటర్నిటీ లీవు, ఇతర సదుపాయాలు కల్పించారు. కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షలు పరిహారం అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు. రూ.249.35 కోట్ల మేర వేతనాల పెంపు ► తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల కోసం ఏటా రూ.330.54 కోట్లు వెచ్చించేది. ఈ లెక్కన ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగికి సగటు వేతనం రూ.15 వేలు మాత్రమే. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వేతనాల పెంపుతో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల కోసం ఏడాదికి వెచ్చించే మొత్తం రూ.579.89 కోట్లకు చేరింది. అంటే గత ప్రభుత్వ హయాంలో వెచ్చించిన మొత్తం కన్నా దాదాపు రూ.249.35 కోట్లు అదనం. ► ఫలితంగా 18,060 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి కలిగింది. సగటున ఒకొక్కరికి నెలకు సరాసరిన అందే వేతనం దాదాపు రూ.26,758. ఈ ప్రభుత్వ చర్యల వల్ల 18 శాతం నుంచి 82 శాతం వరకు వేతనాలు పెరిగాయి. విద్యా శాఖ ఉద్యోగులకు భారీగా లబ్ధి ► ఎంటీఎస్ అమలు అవుతున్న శాఖల్లో విద్యాశాఖకు సంబంధించిన వివిధ విభాగాల కాంట్రాక్టు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఉన్నత విద్యా శాఖ కాలేజీ ఎడ్యుకేషన్లోని జూనియర్ లెక్చరర్లు, లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫ్రొఫెసర్/ ఇతర ఫ్యాకల్టీకి సంబంధించి 691 మందికి మినిమమ్ టైమ్ స్కేలు అమలవుతోంది. ► ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్లు, ల్యాబ్ అసిస్టెంటు, లెక్చరర్లు ఇతర ఫ్యాకల్టీలో 3,728 మందికి వేతనాల పెంపు ద్వారా లబ్ధి చేకూరింది. సాంకేతిక విద్యా శాఖలోని ఎలక్ట్రీషియన్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, లెక్చరర్లు, ఫార్మాసిస్టులు, వర్కుషాప్ అటెండెంట్లు తదితరులు 432 మందికి మేలు చేకూరుతోంది. ► సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలు, ఏపీ గురుకుల విద్యా సంస్థలు, కస్తూరిబా బాలికా విద్యాలయాలు, బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, ఏపీ వైద్య విధాన పరిషత్, స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విభాగాల్లోని 6,026 మందికి వేతనాల పెంపును అమలు చేస్తున్నారు. ► యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ అమల్లో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధ్యాపకులకు యూజీసీ రివైజ్డ్ పేస్కేళ్లు వర్తించనుండగా జీఓల్లో 2015 స్టేట్ రివైజ్డ్ పే స్కేళ్లను అమలు చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓల్లో కొన్ని అంశాలు గందరగోళంగా ఉండడం, కోర్టు కేసులు వీరికి ఎంటీఎస్ అమలుకు ఆటంకంగా మారాయి. మొత్తంగా ఏదోఒక రీతిలో వేతనాలను పెంచింది. యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు 4,077 మంది ఉండగా ఇప్పటికే జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం, ఆదికవి నన్నయ్య, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీల్లో వేతనాలను రూ.40 వేల వరకు పెంచి అందిస్తున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి తొలగిన కష్టాలు ► గత ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో అనేక అక్రమాలు, భారీగా అవినీతి చోటుచేసుకుంది. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎంపికను అప్పటి సీఎం చంద్రబాబు తనకు సన్నిహితులైన వారి ఏజెన్సీలకు కట్టబెట్టారు. ► ఈ అవుట్సోర్సింగ్ పోస్టులను ఆ సంస్థలు లక్షలు వసూలు చేసి అమ్ముకున్నాయి. వారికి వేతనాలు కూడా సరిగా ఇవ్వలేదు. కమిషన్ల కింద భారీగా కోత పెట్టి అరకొరగా తమకు నచ్చినప్పు చెల్లించే వారు. ఈ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అసలు ఉండేది కాదు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు అమలు చేయలేదు. ► వీరి ఆవేదనను కళ్లారా చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఏజెన్సీలను రద్దు చేసి ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఏపీసీఓఎస్ – ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్) ఏర్పాటు చేసి లక్షకు పైగా ఉద్యోగులను దాని పరిధిలోకి చేర్చారు. ► తద్వారా వారికి ప్రతి నెల మొదటి తేదీన నయాపైసా కోత లేకుండా నేరుగా వారి అకౌంట్లలో వేతనం పడేలా చేశారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు కార్పొరేషన్ నియామకాలు కావడంతో వారికి ఉద్యోగ భద్రత కూడా ఏర్పడింది. -
పాక్ ఏజెంట్లకు రహస్య సమాచారం.. నలుగురు డీఆర్డీఓ ఉద్యోగుల అరెస్టు
సాక్షి, బాలాసోర్(భువనేశ్వర్): పాకిస్తాన్ ఏజెంట్లకు రహస్య సమాచారం అందిస్తున్న నలుగురు డీఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. బాలాసోర్జిల్లా డీఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ రేంజ్లో పనిచేస్తున్న వీరిని తొలుత ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్రన్ రేంజ్ ఐజీ హిమాంన్షు కుమర్ చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందన్నారు. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని, వీరికి పలు ఐఎస్డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందిందన్నారు. వెంటనే నలుగురు డీఎస్పీలతో ఏర్పాటైన పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించామని చెప్పారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు. అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. వీరిపై చాందీపూర్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై డీఆర్డీఓ స్పందించేందుకు నిరాకరించింది. 2014లో కూడా బాలాసోర్ నుంచి రహస్య సమాచారం విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చదవండి: క్రిమినల్ కేసుల వివరాల్లేవ్.. మమత నామినేషన్ తిరస్కరించండి -
సీఎం జగన్కు థాంక్స్ చెప్పిన ‘108’ కాంట్రాక్ట్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: అంబులెన్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపడంపై 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. శుక్రవారం అరబిందో యాజమాన్యంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయని, ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందని యూనియన్ ప్రెసిడెంట్ బి.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్ జిల్లాల బదిలీలు, జీతాల శ్లాబుల్లో మార్పులు, జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సానుకూలత వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే.. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
-
కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ పే స్కేల్ వర్తింపజేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీలు.. మోడల్ స్కూళ్లలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం పేస్కేల్ వర్తింపజేయాలని నిర్ణయించింది. వీరిలో కన్సల్టెంట్లు, సలహాదారులు, ఓఎస్డీలకు పే స్కేల్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలానే కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి 5లక్షల రూపాయల సాయం.. సహజంగా మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.2లక్షల సాయం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఖజానాపై రూ.365 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు అంచనా వేసింది. చదవండి: కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలం పొడిగింపు -
ఫ్రంట్లైన్ వారియర్స్పై ‘ఫంగస్’ దాడి
మైసూరు: రాచనగరిలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ బెడద వేధిస్తోంది. మైసూరు పాలికె కాంట్రాక్టు ఉద్యోగులు వినోద్ (28), రవి (38) బ్లాక్ ఫంగస్తో చనిపోయారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను తరలించే రవికి గత 16 రోజుల క్రితం కోవిడ్ సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనికి ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కూడా కనిపించగా బుధవారం మరణించాడు. ఫాగింగ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న వినోద్కు మూడు రోజుల క్రితమే కరోనాతో పాటు ఫంగస్ సోకడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బుధవారం మరణించాడు. దీంతో పాలికె ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. చదవండి: డేంజర్ జోన్లో 6 జిల్లాలు చదవండి: టీకా రక్ష.. అందని ద్రాక్ష? -
కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని 8 శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వీరి పదవీకాలం పొడిగింపునకు అనుమతినిస్తూ ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి.. వేతన పెంపు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపును ఎలా వర్తింపజేయాలన్న విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంలో మరింత స్పష్టత తీసుకున్నాకే ముందుకు సాగాలని భావిస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలోనూ ఆదే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,128 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, 66,239 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ శాఖల్లో పని చేస్తున్నారు. కనిష్టంగా రూ.12 వేల నుంచి మొదలుకొని గరిష్టంగా రూ.40,270 వరకు వీరికి వేతనాలు ఉన్నాయి. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్సీ కొత్తగా కనీస వేతనాలను నిర్ధారించింది. అయితే పీఆర్సీ సిఫారసు చేసిన వేతనాలను వర్తింపజేయాలా? ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపును అమలు చేయలా? అన్న విషయంలో ఆర్థికశాఖ ఆలోచనలో పడింది. ఫిట్మెంట్పై సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తూ... ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సహా అన్నిరకాల ఉద్యోగులకు వేతన పెంపును వర్తింపజేస్తామని చెప్పారు. అంతకుమించి వివరాల్లోకి వెళ్లలేదు. దాంతో వీరికి పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత కరువైంది. తక్కువ వేతనాలు ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మాత్రం తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపు కాకుండా, పీఆర్సీ సిఫారసు చేసిన కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు పెద్దగా ప్రయోజనం చేకూరదని వాపోతున్నారు. మూడు కేటగిరీలుగా ఔట్సోర్సింగ్ ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూపు–4 కేటగిరీలో పని చేస్తున్న ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కావుటి, కుక్, సైకిల్ ఆర్డర్లీ, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, దఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ష్రాఫ్/క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం నెలకు రూ. 12 వేలు మాత్రమే పొందుతున్నారు. వీరికి కనీస వేతనం రూ. 19 వేలు చేయాలని పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసింది. మరోవైపు రూ. 13 వేల నుంచి రూ.15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా బేసిక్ పే రూ. 19 వేలు చేయాలని సిఫారసు చేసింది. అయితే నెలకు రూ.12 వేలు మాత్రమే పొందుతున్న కిందిస్థాయి ఔట్సోర్సింగ్ సిబ్బంది తమకు పీఆర్సీ సిఫారసు చేసిన రూ. 19 వేల కనీస వేతనం కంటే ఎక్కువ ఇవ్వాలని, లేదంటే దానినైనా కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వేతనాలపై 30 శాతం పెంపుతో వేతన స్థిరీకరణ చేస్తే ఒనగూరే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుందని, దాని వల్ల తమకు న్యాయం జరగదని అంటున్నారు. గ్రూపు–3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిలిం/ఆడియోవిజువల్/డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, లైబ్రేరియన్, మేనేజర్ కేటగిరీల్లో నెలకు రూ. 15 వేలు మాత్రమే వేతనం ఉంది. వారికి కనీస వేతనం రూ.22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. మరోవైపు ఇదే కేటగిరీలో రూ. 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కూడా కనీస వేతనం రూ. 22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. వారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. గ్రూపు–3ఏ కేటగిరీలోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ప్రస్తుతం ఆయా శాఖలు రూ. 17,500 ఇస్తున్నాయి. వారికి రూ. 31,040 కనీసం వేతనం ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది. తమకు ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30 శాతం పెంపు కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్నే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ ప్రస్తుతం నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40,270 పొందుతున్న ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ పీఆర్సీ కొత్త వేతనాలను సిఫారసు చేసింది. తక్కువ వేతనాలున్న ఉద్యోగులు ఇపుడు తమకు వస్తున్న వేతనాలపై కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్ని చెల్లించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 వుంది జూనియర్ లెక్చరర్లు ఉన్నారు. వారికి ఇపుడు రూ. 37,100 వేతనం వస్తోంది. పీఆర్సీ వీరికి రూ. 54,220 కనీస వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. 435 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు రూ.40,270 వేతనంగా ఇస్తున్నారు. వీరికి రూ. 58,850 కనీస వేతనంగా చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. అయితే వీరికి వేతనాల పెంపును ఎలా చేయాలనే విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరిపాకే ముందుకు సాగాలని భావిస్తోంది. -
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్: పీఆర్సీ కీలక సిఫారసులు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకునే విషయంలో సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ కమిషన్ ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. తోచిన వారిని విధుల్లోకి తీసుకునే విధానానికి స్వస్తి పలకాలని సూచించింది. వయసు, విద్యార్హతల ఆధారంగా ఉపాధి కల్పన కార్యాలయాల్లో నిర్వహించే జాబితా తరహాలో నిర్వహించి, వారిని కామన్ టెస్ట్ కోసం ఏజెన్సీలు ప్రతిపాదించాలని పేర్కొంది. ప్రభుత్వం ఏయే విభాగాల్లో ఏయే కేటగిరీల్లో ఎన్ని పోస్టులు వీరితో భర్తీ చేయాల్సి ఉంటుందో ఖాళీలు తెలుపుతూ నోటిఫై చేయాలని సూచించింది. ఆయా విభాగాల వారీగా అభ్యర్థులను తీసుకునే ముందు ప్రభుత్వం పరీక్ష నిర్వహించాలని, రాష్ట్ర స్థాయిలో జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి ఖాళీల భర్తీ వేగంగా జరిగేలా చూడాలని తెలిపింది. పరీక్షల ఆధారంగా.. 1: 3 పద్ధతిలో అభ్యర్థుల వివరాలతో కూడిన తుది జాబితాలను ఆయా విభాగాలకు పంపి ఎంపికైన వారితో న్యాయబద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంది. చదవండి: (ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు) రెమ్యునరేషన్ సిఫారసులు ఇలా.. ►గ్రూప్–4 స్థాయిలోకి వచ్చే ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కామాటి, కుక్, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, డఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లకు 2014 పీఆర్సీలో రెగ్యులర్ ఉద్యోగులకు రూ.13,000 నుంచి రూ.46,060 స్కేల్ పరిధిలో ఉంటే, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.12 వేలు ఉండగా, దాన్ని రూ.19 వేలకు పెంచాలి. ►గ్రూప్–3 పరిధిలోకి వచ్చే డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూ.స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిల్మ్/ఆడియో విజువల్/డేటా ఎం ట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, లైబ్రేరియన్, మేనేజర్లకు పీఆర్సీ–2014 ప్రకారం రూ. 15,460–రూ.58330 పేస్కేల్ ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు తత్సమాన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.15,000లు ఉండగా, దాన్ని రూ.22,900లకు పెంచాలి. ►గ్రూపు–3(ఏ) కేటగిరీ పరిధిలోకి వచ్చే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ఆర్పీఎస్–2014 ప్రకారం రూ.21,230–రూ.77,030 పేస్కేల్ పరిధిలో ని కేటగిరీలకు ప్రస్తుతం నెలకు రూ.17,500 చెల్లిస్తుండగా, దాన్ని రూ.31,040లకు పెంచాలి. వీరికి భవిష్యత్తులో పే స్కేల్ రివిజన్ జరిగే వరకు సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రానందున ఇది హోం గార్డులకు కూడా వర్తిస్తుంది. ఎర్న్డ్ లీవ్స్ తప్ప రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ఇతర వసతులు వర్తిస్తాయి. 6 నెలల ప్రసూతి సెలవు వర్తిసుంది. ఈపీఎఫ్, ఈఎస్ఐలు కూడా వర్తింపజేయాలి. -
‘పొరుగు’ను పట్టించుకోండి సారూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కార్మిక చట్టాల ప్రకారం అందాల్సిన లబ్ధికి వారు నోచుకోవడం లేదు. కొందరికైతే ప్రతి నెలా ఐదో తేదీలోపు అందాల్సిన జీతం డబ్బులు నెలలు గడుస్తున్నా అందడంలేదు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం, వీటిని అదుపు చేయడంలో యంత్రాంగం విఫలమవుతుండటంతో చివరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిర్దేశించిన పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి చేసే అన్ని రకాల పనులను వీరు నిర్వహిస్తారు. పేరుకు బాగానే ఉన్నా.. వేతనాలు, ఇతర సౌకర్యాల విషయంలో అధమమే. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వీరంతా నియమితులు కావడం.. వేతన చెల్లింపులు నేరుగా ఉద్యోగి ఖాతాకు కాకుండా ఏజెన్సీకి ప్రభుత్వం విడుదల చేయడంతో ప్రభుత్వానికి, ఉద్యోగికి మధ్య అంతరం ఎక్కువగా ఉంటోంది. సమస్యలు వస్తే వాటి పరిష్కారంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవడం కూడా ఒక కారణమే.. ఏజెన్సీలతో ఇబ్బందులే.. తాత్కాలిక ఉద్యోగ నియామకాల విషయంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉద్యోగంలో చేరే సమయంలో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు సైతం వస్తుండగా.. నెలవారీగా ఇచ్చే వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేయడం, వేతనాల్లో కోతలు విధించడం, ఉద్యోగులకు చేకూరాల్సిన ప్రధాన లబ్ధి ఈఎస్ఐ, పీఎఫ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం ఉండటంలేదు. మరోవైపు ఏజెన్సీలపై జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఫిర్యాదులిచ్చినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదివరకు ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులను టామ్కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ) ద్వారా చేపట్టామని, కానీ కాంట్రాక్టు ఉద్యోగుల నిర్వహణ ఇబ్బందులతో ఆ ప్రక్రియను ప్రభుత్వం జిల్లాలకు అప్పగించింది. అయితే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై కార్మిక, ఉపాధి కల్పన శాఖకు అజమాయిషీ లేదని ఆ శాఖ సంచాలకుడు కేవై నాయక్ చెబుతున్నారు. యాదాద్రిలో టీమ్.. కరీంనగర్లో వారధి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిర్వహణ ప్రక్రియ యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో భిన్నంగా ఉంది. ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేకంగా టీమ్ (తెలంగాణ ఎంప్లాయీస్ అసిస్టెన్స్ మిషన్) పనిచేస్తుండగా.. కరీంనగర్ జిల్లాలో వారధి అనే సొసైటీ ఉంది. వీటికి ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఉంటారు. ఆయా జిల్లాల పరిధిలో ఏ శాఖకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు అవసరమైనా.. ఈ సంస్థలు ఎంపిక చేస్తాయి. ఈ ఉద్యోగాల్లో కూడా మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేస్తున్నామని టీమ్ సంస్థ సభ్య కార్యదర్శి శ్రీనివాసుల వెంకట రంగయ్య చెబుతున్నారు. అలాగే వేతన చెల్లింపులు, పీఎఫ్, ఈఎస్ఐ ప్రక్రియంతా నిర్దేశించిన గడువు నాటికి కచ్చితంగా చెల్లించడమే తమ బాధ్యత అని వారధి సభ్య కార్యదర్శి గాదె ఆంజనేయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పద్ధతే పాటిస్తే బాగుంటుందని పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్గా ఉంటూ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఇప్పటికే ఉన్నా.. చాలాచోట్ల ఆ కమిటీలు యాక్టివ్గా లేవని సమాచారం. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ సర్వీసుల విషయంలో మరింత ముందుంది. నియామకాల్లో మధ్యవర్తిత్వం లేకుండా పూర్తి పారదర్శకత, వేతన చెల్లింపుల్లో కచ్చితత్వం, ఉద్యోగులకు కలగాల్సిన లబ్ధిని పక్కాగా అందించాలనే లక్ష్యంతో ఆప్కోస్ (ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీసెస్) పేరిట ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఈ కార్పొరేషన్ ద్వారా నియమిస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. -
సీపీఎస్ ఉద్యోగులపై సమగ్ర నివేదిక
సాక్షి, అమరావతి : కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఈ జాబితాలో చేర్చాలని చెప్పారు. కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్), కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉందన్నారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం జీవోలు జారీ చేసి, ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసి, టర్మ్ అయిపోయాక అమలవుతుందని చెప్పిన ఘనత గత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ జీవోలను అమలు చేశామని వివరించారు. మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కూడా మన ప్రభుత్వమే అమలు చేసిందని స్పష్టం చేశారు. – కాంట్రిబ్యూటరీ పింఛను పథకానికి (సీపీఎస్) సంబంధించిన సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎస్పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించారని అధికారులు తెలిపారు. – రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్లో ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 మంది ఉండగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 3,295 మంది ఉన్నారని, మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని చెప్పారు. వీరికి సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తే రూ.23 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు. – ఈ సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసులు) కార్యదర్శి శశిభూషణ్కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ విజయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగాలకు డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో కంపెనీలు, ఉద్యోగార్థులు .. క్రమంగా కాంట్రాక్టు ఉద్యోగాల వైపు మొగ్గు చూపడం పెరుగుతోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇది ఇటు ఉద్యోగులకు, అటు కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటోందని నిపుణులు పేర్కొన్నారు. తక్కువ నైపుణ్యాలు అవసరమైన సేవల నుంచి అత్యంత నైపుణ్యాలు అవసరముండే సర్వీసుల దాకా ఇది విస్తరిస్తోందని వివరించారు. ‘కాంట్రాక్టు (తాత్కాలిక) ఉద్యోగాల విధానం చాలాకాలంగా ఉన్నప్పటికీ భారత్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఇది ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇటు ఆర్థిక, అటు కరోనా వైరస్ పరిస్థితులు ఇందుకు కారణం‘ అని టీమ్లీజ్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ బెనర్జీ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇలాంటి వర్కర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు వివరించారు. డెలివరీ ఏజెంట్లు, వేర్హౌస్ హెల్పర్లు, అసెంబ్లీ లైన్ ఆపరేటర్లు మొదలైన ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇక వైట్–కాలర్ ఉద్యోగాలకు సంబంధించి డిజైనర్లు, కంటెంట్ రైటర్లు, డిజిటల్ మార్కెటర్లకు డిమాండ్ ఉన్నట్లు బెనర్జీ వివరించారు. -
ఫలించిన పోరాటం
లక్డీకాపూల్ : నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేతనాలు పెరిగాయి. దీంతో దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఒక్కో కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ. 4 నుంచి 6వేల వరకు జీతం పెరిగింది. దీని వల్ల యాజమాన్యానికి రూ. కోటికి పైగా ఆదనపు భారం పడుతోంది. పెంచిన వేతనాలను ఏప్రిల్ నెల నుంచి అమలు పరుస్తున్నట్లు నిమ్స్ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జులై నెలకు సంబంధించి జీతాలను చెల్లించనున్నారు. వేతన పెంపును వెంటనే అమలు చేయాలని గత నెల5 నుంచి అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘటిత పోరాటం చేపట్టారు. వేతనాలు పెంచేంత వరకు వెనక్కి తగ్గేది లేదని యాజమాన్యానికి ముందుగానే ఆల్టిమేటం ఇచ్చారు. సమ్మె నోటీసు ఇచ్చిన 9వ రోజు నుంచి ఆందోళనకు దిగారు. ఇందుకు నిమ్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, నిమ్స్ కాంట్రాక్ట్ నర్సుల యూనియన్, తెలంగాణ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, నిమ్స్ కాంట్రాక్ట్ టెక్నీషియన్ ఎంప్లాయీస్ యూనియన్లతో ఏర్పడిన జేఏసీ జూన్ 28న నిమ్స్ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. వేతనాలు పెంచేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపినన్పటికీ ఏడాదిగా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 విజృంభిస్తున్న తరుణంలో గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు రూ.28వేలు చొప్పున వేతనం చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ పెంచిన వేతనాలను చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన వేతనాలు ఇలా.. నిమ్స్లో పని చేస్తున్న 400 మంది కాంట్రాక్ట్ నర్సులకు ఇక నుంచి రూ.25వేలు చొప్పున వేతనాలు అందుకోనున్నారు. ఇప్పటి వరకు వారికి రూ. 17వేలు చెల్లిస్తున్నారు. 300 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కూడా రూ.25 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఇప్పటి వరకు వీరు రూ. 18వేలు చొప్పున వేతనాలు పొందుతున్నారు. 150 మంది ఒజేటీ( ఆన్ జాబ్టైనీస్) బేసిడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు రూ. 25వేలు చొప్పున చెల్లిస్తారు. సెమిస్కిల్డ్ ఔట్సోర్స్ ఉద్యోగులు 350 మందికి రూ. 24,600 చొప్పున వేతనం అందుకోనున్నారు. వాస్తవానికి వీరికి రోజువారీ వేతనం రూ. 840.62 చెల్లిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో ఈ మొత్తం రూ. 1102.79లకు పెరిగింది. అన్స్కిల్డ్ కార్మికుల వేతనాలను రూ. 12 వేల నుంచి రూ. 14,717 పెంచారు. అవుట్సోర్స్ కాంట్రాక్ట్ విధానంలో పని చేసే వీరికి జీవో నెం.14, 108లు ప్రకారం రోజువారీ వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ప్రకారం జీవో నెం.14 కింద కార్మికులకు రోజుకు రూ. 551.71 నుంచి రూ. 681.55కి, జీవో నెం.108 కింద రూ. 558.46ల నుంచి రూ. 681.55కి పెరిగింది. వీళ్లకు 26 రోజుల చొప్పున వేతనాల చెల్లించనున్నారు. వేతనాలు పెరగడంతో నిమ్స్ కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు
ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగులకూ సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను త్వరగా అందించాలి. సాక్షి, అమరావతి: రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రీన్ చానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదని ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్పై హడావిడిగా జీవో జారీ చేసిందని, అయినా అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని సమావేశంలో చర్చకు వచ్చింది. ► ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూలై నుంచి మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్నారు. ఫలితంగా 2017 మార్చి 31న ఉన్న జీతాలు.. 2019 జూలై నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి. ► జూనియర్ లెక్చరర్కు రూ.19,050 ఉన్న జీతం 2019 జూలై నాటికి 95 శాతం పెరిగి రూ.37,100 అయ్యింది. ► మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) జీతం రూ.14,860 నుంచి 88 శాతం పెరిగి రూ.22,290 అయ్యింది. ► సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ.21,230 అయ్యింది. ► స్కూల్ అసిస్టెంట్ జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ.21,230 అయ్యింది. ► దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1,000 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం భరిస్తోందని అధికారులు వెల్లడించారు. ► సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున్ తదితరులు హాజరయ్యారు. -
కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలి
-
కాంట్రాక్ట్ ఉద్యోగులపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగుల్లాగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. సీఎస్ నీలం సాహ్ని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. (చదవండి: ఏమి ఊహాజనిత రాతలు కిట్టన్నా.. ?) గత ప్రభుత్వం చేసింది సున్నా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతులపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్పై హడావుడిగా టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలు బాధ్యతను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుందని సమావేశంలో చర్చకు వచ్చింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1000 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం మోస్తోందని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019, జూలై నుంచి మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీని ఫలితంగా మార్చి 31, 2017 న ఉన్న జీతాలు.. జులై, 2019 నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి. జూనియర్ లెక్చరర్కు రూ.19,050 ఉన్న జీతం 2019 జులై నాటికి 95 శాతం పెరిగి రూ.37,100 అయింది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) జీతం రూ.14,860 నుంచి 88 శాతం పెరిగి రూ.22,290 అయ్యింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ.21,230 అయ్యింది. స్కూల్ అసిస్టెంట్ జీతం రూ. 10,900 నుంచి 95 శాతం పెరిగి జులై , 2019 నాటి నుంచి రూ. 21,230 అయిందని అధికారులు సీఎంకు వివరించారు. (అందరినోట లాక్డౌన్ మాట..) -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ‘హైకోర్టు కోవిడ్–19 నిధి’
సాక్షి, హైదరాబాద్: కరోనా విపత్తును దృష్టిలో పెట్టుకుని హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. వారి వైద్య ఖర్చుల నిమిత్తం ‘హైకోర్టు కోవిడ్–19 నిధి’ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైద్య ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లించకపోవడంతో హైకోర్టు ఈ నిధి ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలో సమావేశమైన న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్కోర్టు ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ నిధికి హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కోర్టుల న్యాయాధికారులు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని ఫుల్కోర్టు కోరింది. కరోనా తీవ్రత నేపథ్యంలో పిటిషన్లను ఆన్లైన్ ద్వారానే దాఖలు చేయాలని న్యాయవాదులను హైకోర్టు కోరింది. లాక్డౌన్ తొలగించిన తరువాత భౌతికంగా పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతినిచ్చినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో తిరిగి ఆన్లైన్ ద్వారానే పిటిషన్లు దాఖలు చేయాలని రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో న్యాయవాదులు, కక్షిదారులకు సూచించారు. జూలై 20 వరకు కోర్టులకు లాక్డౌన్ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో హైకోర్టు, కింది కోర్టుల రోజువారీ కార్యక్రమాల రద్దును జూలై 20 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఫుల్ కోర్టు శనివారం సమావేశమై జూలై 20 వరకు అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని నిర్ణయించింది. హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రిబ్యునల్స్, లీగల్ సర్వీస్ అథారిటీ, ఆర్బిట్రేషన్ సెంటర్స్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తదితర అన్ని న్యాయ సంస్థల్లో వచ్చే నెల 20 వరకు లాక్డౌన్ నిబంధనల అమలును పొడిగించాలని సమావేశం తీర్మానించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. -
కరోనా: భారీగా ఉద్యోగాల కోత
కోవిడ్-19 మహమ్మారి పంజా విసరడంతో చాలామంది వైరస్ ధాటికి తట్టుకోలేక ప్రాణాలుకోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చివురుటాకులా వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వేలమందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి, నిర్వహణ, వ్యయభారాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. ఈక్రమంలో వివిధ కంపెనీలలో పనిచేస్తోన్న కాంట్రాక్ట్(తాత్కాలిక) ఉద్యోగుల తొలగింపుకు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఇన్సురెన్స్, రిటైల్, ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీలలో పనిచేస్తోన్న తాత్కాలిక ఉద్యోగులపై అధికంగా కోత విధిస్తున్నారు. తద్వారా కంపెనీల నిర్వహణ వ్యయాలను కొంతమేర తగ్గించుకోవచ్చని యజమాన్యాలు భావిస్తున్నాయి. ఆయా కంపెనీలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చే క్లైంట్లు సైతం తమ ఆర్డర్లను తగ్గించేశారు. కొంత మంది ఆర్డర్లు ఇచ్చిన్పటికీ సర్వీసులపై డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో వ్యాపారాలను సజీవంగా నిలుపుకునేందుకు డిస్కౌంట్లు ఇవ్వక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక ఆయా కంపెనీల హెచ్ఆర్ టీమ్లు ఉద్యోగులకు తొలగింపు పత్రాలను పంపుతున్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే ఉద్యోగుల సంఖ్య తగ్గించాలా?లేదా వేతనాల్లో కోత విధించాలా అని ఆలోచిస్తున్నాయి. బీ2బీ ఈ-కామర్స్ స్టార్టప్ కంపెనీ ఉడాన్ ఏప్రిల్ నెలలో 10-15 శాతం తాత్కాలిక ఉద్యోగులపై కోత విధించింది.దీని ప్రభావం 3000 మందిపై పడింది. ఇదే నెలలో ఆన్లైన్లో గోల్డ్లోన్లు నిర్వహించే రూపిక్ కంపెనీ సైతం ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపు 600 మంది బ్లూ, గ్రే కాలర్ ఉద్యోగులను పరోక్షంగా ప్రభావితం చేసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాంలు అయిన జొమాటో, స్విగ్గీలు కూడా వేతనాల్లో సవరింపులు చేసి తిరిగి ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని తెలిపాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా యాప్ షేర్చాట్ బుధవారం 101 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంఖ్య కంపెనీ సిబ్బందిలో నాలుగో వంతుగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అడ్వర్టైజింగ్ మార్కెట్ దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
జీతాలడిగితే.. ఉద్యోగాలు లేకుండా చేస్తా..
సాక్షి, విజయనగరం : జీతాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఏఈ రాజ్కుమార్, కాంట్రాక్టర్ భరత్ బెదిరింపులకు దిగుతున్నారని నరవ యూజీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘జీతాలిప్పించండి మహాప్రభో’ శీర్షికతో ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి జీతాలివ్వాల్సిందిపోయి ఉద్యోగాలు తీసేస్తామంటూ కాంట్రాక్టర్ భరత్, ఆయనకు వంతపాడుతూ ఏఈ రాజ్కుమార్ బెదిరింపులకు దిగుతున్నారు. ఉద్యోగుల పక్షాన ఉండవలసిన ఏఈ.. కాంట్రాక్టర్కు వత్తాసు పలుకుతుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కాంట్రాక్ట్ సమయం ముగిసినా ఇంకా ఇక్కడి ప్లాంట్లో చెలామణి చేస్తున్నాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు ఇవ్వకపోయినా నిబద్ధతో విధులు నిర్వహిస్తున్నామన్న జాలి కూడా చూపడం లేదని వాపోతున్నారు. తమ సమస్యలను జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. దీనిపై ఏఈ రాజ్కుమార్ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
ఐదేళ్ల తర్వాత విముక్తి లభించింది
సాక్షి, అమరావతి: ‘ఐదేళ్లపాటు నరకం అనుభవించాం.. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి లేదు, గొంతెత్తి మాట్లాడితే సస్పెన్షన్లు, ఆందోళన చేద్దామని రోడ్డు మీదకొస్తే పోలీసులు తీసే వీడియోల ఆధారంగా వేతనాలు కత్తిరించడం, లేదంటే బదిలీలు చేయడం.. ఇలా అరవై నెలలు నరకం అనుభవించాం’.. ఈ మాటలన్నది స్వయానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఏ ఉద్యోగిని పలకరించినా తమకు విముక్తి లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో ప్రభుత్వాల్లో పనిచేశామని, అయితే టీడీపీ పాలనలో తమ జీవితంలో అత్యంత చీకటి రోజులను చూశామని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో కుంగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తామంతా కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నామని, తాము అనుకున్నట్టే జరగడం ఆనందాన్ని ఇచ్చిందని చెబుతున్నారు. ఇష్టం లేకపోయినా బలవంతంగా.. ప్రభుత్వ కార్యక్రమాలకు కాకుండా రాజకీయ కార్యక్రమాలకు కూడా ఉద్యోగులను వాడుకుని ఉద్యోగ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మరికొంతమంది ఉద్యోగులు చెప్పారు. ‘నవ నిర్మాణ దీక్ష అంటారు.. ఉద్యోగులను విధులు మానేసి రమ్మంటారు.. ధర్మపోరాట దీక్ష అంటారు.. ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడుకుంటారు.. జ్ఞానభేరి అంటారు.. అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు.. ఎవరైనా ఇష్టం లేదని చెప్పారంటే వారిని అంతుచూస్తామని బెదిరిస్తారు’.. ఇలా టీడీపీ పాలనలో నరకం చూశామని వాపోయారు. సీఎం హోదాలో చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమాలకయితే విద్యార్థులను కూడా తీసుకొచ్చి, బలవంతంగా కూర్చోబెట్టి ఎవరూ బయటకు పోకుండా తలుపులు వేసేసిన ఘటనలూ ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్, రెవెన్యూ, కాంట్రాక్టు సిబ్బందిని, ఏఎన్ఎంలను ఇలా ఏ ఒక్క ఉద్యోగ వర్గాన్ని వదలకుండా దారుణంగా హింసించారని పలువురు ఉద్యోగులు చెప్పారు. చివరకు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అడ్డుచెబితే వారు అధికారులపై చేయి చేసుకున్న సందర్భాలూ ఉన్నాయని అన్నారు. జగన్ ప్రకటనను స్వాగతిస్తే సస్పెండ్ చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఒక ఉద్యోగిగా పేపర్ ప్రకటన ఇచ్చాను. దీన్ని చూసిన ప్రభుత్వం నన్ను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 4న ఉత్తర్వులిచ్చింది. –ఆస్కారరావు, ఉద్యోగి, ప్రజారోగ్యశాఖ ఉద్యోగులను దొంగలను చూసినట్టు చూశారు చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా అవమానించారు. ఉద్యోగుల చుట్టూ కెమెరాలు పెట్టి ఎప్పుడు ఏం చేస్తున్నారో నిఘా పెట్టి దొంగల్లాగా చూశారు. 50 ఏళ్లకు బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారన్న వార్తలు పత్రికల్లో వస్తే నన్ను అకారణంగా 15 నెలలు సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. –కె.వెంకట్రామిరెడ్డి, కన్వీనర్, ప్రభుత్వ ఉద్యోగ, టీచర్ల, పెన్షనర్ల సమాఖ్య సీపీఎస్ రద్దు చేయాలంటే సస్పెండ్ చేశారు సీపీఎస్ రద్దు చేయాలని అడిగితే ఈ ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేసింది. లక్షల మంది ఉద్యోగుల తరఫున సీపీఎస్ రద్దు కోసం పోరాడటం నేను చేసిన తప్పా? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ను రద్దు చేస్తానని చెప్పడాన్ని స్వాగతించా. ఆ మరుసటి రోజే నాకు సస్పెన్షన్ ఆర్డర్ చేతికొచ్చింది.బాబు పాలనలో ఇదీ ఉద్యోగుల పరిస్థితి. –పి.రామాంజనేయులు యాదవ్, అధ్యక్షుడు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం -
కొత్త గురుకులాల్లో కాంట్రాక్టు ఉద్యోగులే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న బీసీ గురుకుల విద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులే కొలువుదీరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 బీసీ గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేయగా వాటిని 2019–20 విద్యాసంవత్సరంలో అందుబాటులోకి తెచ్చేందుకు మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కసరత్తు చేపట్టింది. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో భవనాలను మంజూరు చేయకపోవడంతో అద్దె ప్రాతిపదికన అనువైన భవనాలను వెతికింది. జూన్ 1 కల్లా వాటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించి ఏర్పాట్లు సైతం పూర్తి చేసింది. వాటిల్లో పూర్తిస్థాయి ఉద్యోగ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ భర్తీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. పోస్టుల విభజనపై స్పష్టత లేకపోవడంతో వాటి భర్తీకి సంబంధించి గురుకుల నియామకాల బోర్డు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దీంతో ఈ పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో సరిపెట్టేందుకు బీసీ గురుకుల సొసైటీ చర్యలు తీసుకుంటోంది. 119 గురుకులాల్లో ఈ ఏడాది 5, 6 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. విద్యార్థుల సంఖ్య, తరగతుల సంఖ్యకు తగినట్లుగా బోధకులను సొసైటీ నియమించుకోనుంది. ఈ నేపథ్యంలో 119 గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది కేటగిరీల్లో దాదాపు 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి త్వరలో బీసీ గురుకుల సొసైటీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నియామకాలు చేపట్టనుంది. -
ఉద్యోగులకు భరోసా..!
సాక్షి, ఒంగోలు సిటీ: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి ఉద్యోగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఉద్యోగుల హక్కులు నానాటికీ హరించుకుపోతున్నాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ప్రశ్నించలేని దుస్థితి. గడిచిన ఐదేళ్లలో ఒక్క డిమాండ్ను పరిష్కరించుకోలేకపోయారు. వేతన సవరణ సాధించుకోలేకపోయారు. మధ్యంతర భృతి మధ్యలోనే ఆగింది. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం అగమ్యగోచరంగా ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని గొంతెత్తి ఘోషించినా ప్రయాసే మిగిలింది. ఇక పొరుగు సేవల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. గొడ్డు చాకిరీ చేస్తూ.. గొర్రె తోక సంపాదనతో అల్లాడుతున్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్నభోజన పథకం కార్మికులకు ఉపాధి భద్రత లేకుండా పోయింది. ఇలా ఒకరేంటి అందరు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించుకునే శక్తిని కోల్పోయారు. ఉద్యోగ సంఘాలు వీరి సమస్యలపై ఉద్యమాలు చేయడం లేదు. ఉద్యోగులు నోరుమెదిపి వారి హక్కులనో.. డిమాండ్లనో ప్రస్తావిస్తే జీతాలే సరిగ్గా ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో ఉందని పదే పదే చంద్రబాబు నూరిపోసిన మాటలతో ఉద్యోగులు అభద్రతాభావంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తానని వారి ఆశలకు జీవం పోశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం 2004 నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానం ఉద్యోగులకు పెన్షన్ భద్రతను దూరం చేసింది. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గినందునే ఈ సీపీఎస్ అమలులోకి వచ్చింది. జిల్లాలో 20 వేల మంది ఉద్యోగులు 2004 తర్వాత వివిధ సందర్భాల్లో నియమితులయ్యారు. వీరికి నెలవారీ జీతాల బిల్లులో పది శాతం మొత్తాన్ని కోత విధించి ప్రభుత్వం షేర్ల వ్యాపారంలో పెట్టుబడిగా ఉంచుతోంది. దీనికి ఏపాటి భద్రత ఉందన్నది ఉద్యోగుల వాదన. దీనిపై ఉద్యోగులు అనేక పోరాటాలు చేసినా ఫలితం లేదు. సీపీఎస్పై పోరాడిన వారిపైనా వేటు వేసింది బాబు సర్కార్. అధికారంలోకి రాగానే సీపీఎస్ను రద్దు చేస్తామని జగన్ ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానమైన 96 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు కలిపి 56 వేల మందికి పైగా ఉన్నారు. పెన్షనర్లు సుమారుగా 20 వేల మంది ఉన్నారు. టీడీపీ పాలనలో ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేరు. అధికారులు తమ ఇంటి ముఖం చూడడానికి ఏ అర్ధరాత్రో అపరాత్రో కావాల్సిందే. నిత్యం రిపోర్టులు.. అర్థంపర్దం లేని నివేదికలతో కాలయాపన. ప్రభుత్వానికి క్షేత్ర స్థాయి నుంచి ఏం కావాలో తెలియదు. గంటకో ఫార్మాట్.. వెంటనే వివరాలివ్వాలని వేధింపులు. దీంతో ఉద్యోగులు, అధికారులు విసిగిపోయారు. ఇక చాలు ఈ వేధింపులు అన్న ఆలోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలు ఒక భరోసా నింపాయి. కాంట్రాక్టు కార్మికులకు వరం జిల్లాలో అత్యధికంగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. విద్యుత్, డీఆర్డీఏ, డ్వామా తదితర శాఖల్లో ఐదు వేల మంది అరకొర వేతనంతో పని చేస్తున్నారు. వీరిక ఉద్యోగ భద్రత లేదు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా పని ఉన్నా ఆ స్థాయిలో సౌకర్యాలు లేవు. రాయితీలు లేవు. కాంట్రాక్టు ఉద్యోగులు ఎప్పటి నుంచో క్రమబద్ధీకరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని జగన్ ఇచ్చిన హామీతో వారిలో ఒక నమ్మకం మొలకెత్తింది. ఐఆర్ 27 శాతం.. ఉద్యోగుల్లో ఆనందం ఉద్యోగుల మధ్యంతర భృతి 27 శాతం ఇవ్వడానికి జగన్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. ఎందుకంటే చంద్రబాబు గీత గీసి బేరమాడి 20 శాతం ఐఆర్ ఇస్తానన్నారు. ఉద్యోగులు తమకు హక్కుగా రావాల్సిన మధ్యంతర భృతి విషయంలోనూ భిక్ష వేస్తున్నట్లుగా ఉందన్న అసంతృప్తి ఉంది. జగన్ 27 శాతం ఐఆర్తో అటెండర్ నుంచి అధికారుల వరకు సుమారు వారు తీసుకొనే మూలవేతనంపై 38–42 శాతం వరకు వేతనం పెరుగుతుంది. జిల్లాలోని ఉద్యోగులపై ఐఆర్ పెంపుదల నేపధ్యంలో సుమారు రూ.180 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉన్నా ఈ పెంపుదల అమలు చేయడానికి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత వరకు 11వ వేతన సవరణ కమిటీని వేయలేదు. పూర్వ బకాయిలను గత ఏడాది డిసెంబర్లో ఇవ్వడం గమనార్హం. వేతనాల్లో కోతతోపాటు వారికి చెల్లించాల్సిన డీఏ, టీఏ తదితరాలకు బడ్జెట్ లేదంటూ, బడ్జెట్ మురిగిపోయిందంటూ చెల్లింపులను వాయిదా వేయడం గమనార్హం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగుల పీఆర్సీని కచ్చితంగా సమయానికి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ ధీమా కల్పించారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ జిల్లాలోని వివిధ శాఖల్లో 18 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయనందున ఒక ఉద్యోగిపై నలుగురి భారం పడుతోంది. కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చి కొంత పని తగ్గించినా మాన్యువల్గా చేయాల్సిన పని భారం వీరికి తప్పడం లేదు. వివిధ శాఖల్లో మంజూరైన పోస్టుల కన్నా 37 శాతం ఖాళీలు ఉన్నాయి. వీటిని ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు. ఒక్క రెవెన్యూలోనే 450 ఖాళీలు ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో క్షేత్ర స్థాయి ఉద్యోగులు బాగా తగ్గిపోయారు. అయినా కొత్త పోస్టులు ఇవ్వకుండా, కొత్త డీఎస్సీలు వేసి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా నెట్టుకొస్తున్నారు. అంగన్వాడీలు.. ఆశా వర్కర్లకు.. జిల్లాలో సుమారు తొమ్మిది వేల మంది అంగన్వాడీలు, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపునకు జగన్ హామీ ఇచ్చారు. అతి తక్కువ వేతనాలతో వీరు క్షేత్ర స్థాయిలో చాకిరీ చేస్తున్నారు. వీరి పనిపై విధి విధానం లేదు. పై అధికారులు ఏ హుకుం జారీ చేసినా వీరు విధుల్లో ఉండాల్సిందే. వీరు కొన్ని సందర్భాల్లో శాఖేతర పనులు చేస్తున్నారు. వెట్టిచాకిరీ చేస్తున్నా వీరికి తగిన వేతనాలు ఉండడం లేదు. వీరిపై అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వీరికి ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు వంటి లబ్ధి చేకూర్చడానికి జగన్ హామీ ఇచ్చారు. నాలుగో తరగతి ఉద్యోగులకు అభయం నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ ఉంది. వీరి గోడును చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదు. ఫలితంగా జిల్లాలోని 780 మంది నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయి. ఇటీవల 56 మంది ఉద్యోగ విరమణ చేశారు. జగన్ నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలను తీరుస్తానని భరోసా ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్సులు కూడా పరిమితం చేస్తానని, పోలీసు ఉద్యోగులకు వారంతపు సెలవు ఇస్తానని, ప్రభుత్వ డ్రైవర్ల వ్యవస్థ పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని జగన్ ఇచ్చిన హామీపై ఆయా రంగాల్లోని 7 వేల మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం జిల్లాలో పొరుగు సేవల్లో సుమారు 12 వేల మంది వరకు పని చేస్తున్నారు. మీ సేవ, ఈ సేవ, విద్యుత్ తదితర శాఖల్లో పని చేస్తున్న వీరికి వేతనం ఏజెన్సీల ద్వారా చెల్లిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది సంస్థలు పొరుగు సేవకులను ఆయా శాఖలకు సరఫరా చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వారికి ఏడాది వేతనం ఒక్కసారే ఇస్తున్నారు. నెలనెలా వీరికి వేతనాలు ఉండవు. ప్రభుత్వం వద్ద కాస్త నిధులు సమకూరినప్పుడు మాత్రమే వీరికి చెల్లింపులు చేస్తున్నారు. పొరుగు సేవల్లో పని చేసే వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు వీరికి పనివేళలు అమలులో లేవు. ఇచ్చే కాంట్రిబ్యూషన్లో పది శాతం ఆయా సంస్థలు చార్జీల కింద తీసుకుంటాయి. భారంగానే వీరు పొరుగు సేవల్లో పని చేస్తున్నారు. జగన్ సీఎం అయిన వెంటనే పొరుగు సేవలకు ఒక బధ్రత ఇవ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామంటున్నారు. హోంగార్డుల వేతనాలను పెంచుతామంటున్నారు. పెన్షనర్లకు ప్రత్యేక కేంద్రం ప్రతి జిల్లాలో పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జగన్ హామీ ఇచ్చారు. జిల్లాలో సుమారు 20 వేల మంది సర్వీసు, కుటుంబ పెన్షనర్లు ఉన్నారు. ఒంగోలు కేంద్రంగానే 9 వేల మంది ఉన్నారు. వీరికి రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటికి జవాబు చెప్పడానికి ప్రత్యేకంగా విభాగం లేదు. ఉద్యోగుల వద్దకు వెళ్లినా వారి నుంచి సరైన జవాబు రావడం లేదు. ఏటా సమర్పించే లైఫ్ సర్టిఫికెట్లు, ఐటీ రిటర్నులు, ఇతర రాయితీలు, మినహాయింపులు వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా సంప్రదింపులు జరిపే విధంగా ఏర్పాటు చేయడం ద్వారా పెన్షనర్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒక సమస్యపై పదే పదే తిరిగే సమస్య తీరుతుంది. ఉద్యోగులను జైళ్లలో పెట్టించిన ఘనత చంద్రబాబుదే.. సీపీఎస్ను రద్దు చేసి పాత పద్ధతి అమలు చేయాలని కోరుతూ రాస్తారోకోలు, ఆందోళనలు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై కేసులు పెట్టి, జైళ్లలో వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. గత రెండేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడంతో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా పీఆర్సీ ఇవ్వొచ్చని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. పీఆర్సీ పెంచకపోగా, 40 శాతం ఐఆర్ అడిగితే 20 శాతం ఇచ్చారు. గతంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఎటువంటి పారితోషికం అందలేదు. వారి కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ఉద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. – కాసులనాటి అమరేశ్వరప్రసాద్, రిటైర్డ్ హెడ్మాస్టర్(యర్రగొండపాలెం) ఐఆర్, పీఆర్సీ, డీఏపై హర్షం ఐఆర్, పీఆర్సీ, డీఏలు సకాలంలో ఇస్తానని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఉద్యోగులకు చెందిన సమస్యలన్ని పరిష్కరిస్తానని చెప్పారు. అదే విదంగా దీర్ఘకాలంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని అర్హతను బట్టి రెగ్యులర్ చేస్తామని ప్రకటించారు. చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత లభిస్తుంది. వేతన జీవులకు సరైన న్యాయం చేస్తానని ప్రకటించడం హర్షణీయం. – ఉడుముల శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఉద్యోగుల బాధలు గుర్తించడం హర్షనీయం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగుల బాధలు గుర్తించి మధ్యంతర భృతి 27 శాతం పెంచుతానని ప్రకటించడం చాలా ఆనందకర విషయం. పెరుగుతున్న ధరలతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఐఆర్ పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు మేలు చేస్తుంది. – శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, దర్శి యూనియన్లు పెద్దల సంక్షేమానికా.. రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉద్యోగులు నాలుగేళ్లుగా సీపీఎస్ విధానం రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మొర ఆలకించిన ఒక మహానుభావుడు నేను విన్నాను–నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం రెండు లక్షల మంది జీవితాల్లో వెలుగొస్తుందని కృతజ్ఞతలు తెలిపిన సీపీఎస్ ఉద్యమకర్త రామాంజనేయులు యాదవ్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం చాలా దారుణం. రామాంజనేయులుకు సంఘీబావం ప్రకటించకుండా సీపీఎస్ ఉద్యమం చేయడమే తప్పుగా చెత్త మెసేజ్లు వ్యాప్తి చేయడం సరికాదు. కొందరు పెద్దల సంక్షేమమే విధిగా యూనియస్లు పనిచేస్తుండటం దురదృష్టకరం. – బాజీ పఠాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ సీపీఎస్ఇఏ -
జీతం ఎగవేసిన సర్కార్ అల్లాడుతున్న చిరుద్యోగులు
సాక్షి, అమరావతి: వేలాది మంది చిరు ఉద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలు, గురుకులాలు, సర్వశిక్ష అభియాన్, మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు నాలుగు నెలల నుంచి వేతనాలను చెల్లించకుండా నిలుపుదల చేయించారు. ఎన్నికల ముందు తన రాజకీయ, స్వార్ధ ఆర్థిక ప్రయోజనాల కోసం వందల కోట్ల నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి మళ్లించేశారు. నాలుగు నెలల నుంచి వేతనాలు అందకపో వడంతో ఆ కుటుంబాల జీవనం దుర్భరంగా తయారయ్యింది. మేము ఏమి తినాలి..ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లా పాపలతో పస్తులుండలేక వేతనాల కోసం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. చివరకు ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకూ వేతనాలు ఇవ్వకుండా నిలుపుదల చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాలుగు నెలలుగా వేతనాల్లేవు.. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యాసంస్థలు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సర్వశిక్ష అభియాన్, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా నాలుగు నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం వేతనాలు నిలిపేసింది. చివరకు పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకానికి కూడా నిధులు ఇవ్వకుండా బిల్లులను పెండింగ్లో పెట్టింది. ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) బిల్లులను కూడా చెల్లించకుండా పెండింగ్లో పెట్టారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అధికారులకు ఇప్పుడు అద్దె వాహనాలే ఉన్నాయి. స్వయం ఉపాధి కింద యువత బ్యాంకుల ద్వారా కార్లను కొనుక్కుని ప్రభుత్వ శాఖల్లో అద్దెకు తిప్పుతున్నారు. వీరికి కూడా నాలుగు నెలల నుంచి నెలనెలా చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేశారు. పోలీసులకు టీఏ, డీఏలు బంద్ రాష్ట్రంలో వేల సంఖ్యలో పనిచేస్తున్న పోలీసులకు గత ఎనిమిది నెలల నుంచి డీఏ, టీఏలను నిలుపుదల చేశారు. ఇటీవల ఆ ఎనిమిది నెలల టీఏ, డీఏలను విడుదల చేసినట్లే చేసి తిరిగి ఐదు నెలల డీఏ, టీఏ సొమ్ము రూ.70 కోట్లు ఖజానాకు తీసేసుకున్నారు. కేంద్ర నిధులు రూ.5 వేల కోట్లు మళ్లింపు కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.5,000 కోట్ల నిధులను ఆయా పథకాలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించేసింది. ఉప ప్రణాళిక పనులకు, అవసరాలకు నిధులను విడుదల చేయకుండా ఇతర అవసరాలకు ఆ నిధులను వినియోగిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఫిబ్రవరి జీతం బంద్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే.. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 1.25 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగుల ఫిబ్రవరి వేతనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. సకాలంలో వేతన బిల్లులను సమర్పించలేదనే సాంకేతిక కారణం చూపుతున్నారు. దీనిపై ఉద్యోగులు సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ (సీఎఫ్ఎంఎస్)ను ప్రశ్నిస్తే.. ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారంటూ అధికారులు చెబుతున్నారని ఒక ఉద్యోగి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సీఈవోతో సహా అక్కడ పనిచేసే ఉద్యోగులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల పరిషత్ల ఉద్యోగులకు వేతనాలు అందకపోవడం గమనార్హం. మార్చి గడిచినా రెగ్యులర్ ఉద్యోగులకు కూడా ఇంకా ఫిబ్రవరి వేతనాలు చెల్లించలేదంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి తీరు ఎలా ఉందో అర్దం అవుతోందని ఆ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. రూ.30 వేల కోట్ల బిల్లులు పెండింగ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంపిక చేసిన రాజకీయ పరమైన, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులను మాత్రమే చెల్లిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, వారి నేతలకు చెందిన బిల్లుల చెల్లింపునకు మాత్రమే ఆర్థిక శాఖకు సీఎం అనుమతి ఇస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. సాధారణంగా చెల్లించాల్సిన అన్ని రకాలు కలిపి కొన్ని లక్షల బిల్లులకు చెందిన రూ.30 వేల కోట్ల బిల్లులను చెల్లించవద్దంటూ ముఖ్యమంత్రి నిలుపుదల చేయించినట్లు సమాచారం. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్కు విలువ లేకుండా సీఎం చెప్పినట్లుగా ఆర్థిక శాఖ అధికారులు నడుచుకోవడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజూ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడుతూ తనకు కావాల్సిన వారికి, తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు మాత్రమే నిధులు విడుదల చేయించడం గమనార్హం. కోడ్ ఉన్నందున అధికారులతో ఎటువంటి సమీక్షలు నిర్వహించరాదని తెలిసినా.. ముఖ్యమంత్రి శుక్రవారం ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను తన ఇంటికి పిలిపించుకుని సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమయ్యింది సీఎంవో, ఆర్థిక శాఖలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. కాన్పు కోసం మంగళసూత్రం తాకట్టు దేవదాయ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. దీంతో ఒక ఉద్యోగి తన భార్య కాన్పునకు డబ్బులేకపోవడంతో ఆమె మంగళ సూత్రం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లల పాలు, ఫీజులకు డబ్బుల్లేవు రెగ్యులర్ పోలీసులతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వారికి ఇచ్చే వేతనాలే చాలా తక్కువ. అలాంటి వారికి మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఇంటి అద్దె, పాలు, పిల్లల ఫీజులు వంటి నెలనెలా చేయాల్సిన చెల్లింపులకు డబ్బులేక నానా అవస్థలు పడుతున్నారు.పిల్లల పెళ్లిళ్లు ఇతర సొంత అవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. కంట్రిట్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) కింద ఉద్యోగుల వాటాను వారి వేతనాల నుంచి మినహాయించుకున్న ప్రభుత్వం.. ఆ సొమ్మును సంబంధిత నిధికి జమ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించేసింది. 2017–18కు సంబంధించిన రూ.200.23 కోట్లను సీపీఎస్ నిధికి ప్రభుత్వం జమ చేయలేదని ‘కాగ్’ పేర్కొంది. -
‘ఓటు’ దెబ్బతో దిమ్మతిరగాలి
సాక్షి, అమరావతి: ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో రాజకీయ నాయకులతోపాటే ఉద్యోగ వర్గాలూ తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెంచాయి. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేముందు అనేక హామీలిచ్చిందని, మనం కూడా ఆ హామీలు నెరవేరతాయన్న ఆశతో ఓట్లేశాం...ఇప్పుడేమో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నాయి. ఉద్యోగం చేస్తున్నామేగానీ కనీస భద్రత లేకుండా పోయింది. మన పరిస్థితి ఈ నాలుగేళ్లలో మరీ దారుణంగా ఉంది. వేతనాలు పైసా పెంచకపోగా, ఉన్న ఉద్యోగానికీ ఇబ్బందులు తప్పలేదు, ఈ పరిస్థితుల్లో కలిసికట్టుగా ఓటు వేస్తేగానీ మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు.. అన్న ఆలోచనకు ఆయా ఉద్యోగులు వచ్చారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలు కీలకం కాబోతున్నాయని, ఏమాత్రం పొరపాటు చేసినా మళ్లీ మనకు అన్యాయం జరిగే అవకాశముందన్న భావనకు వారు వచ్చారు. ఇలాంటి అవకాశం మళ్లీ ఐదేళ్లకుగానీ మనకు రాదని, ఇప్పుడే జాగ్రత్త పడాలని చర్చించుకుంటున్నారు. హామీ ఇచ్చి మోసం చేసినందుకు కసి తీర్చుకోవాలన్న అభిప్రాయంతో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు యమునాతీరు కాకుండా ఈ ఏడాది కలసికట్టుగా ఓటు వేద్దామని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లక్ష మంది వరకూ ఉన్నట్టు అంచనా. వీరిలో ఎక్కువగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీళ్లలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక సంఘాలున్నాయి. ప్రతి జిల్లాలోనూ కార్యవర్గాలు ఉన్నాయి. దీని ఆధారంగా ఉద్యోగులు జిల్లాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉద్యోగులెవరైనా తెలియని వారుంటే చేర్చుకోవడం, వారికి అవగాహన కల్పించడం, జరిగిన మోసాన్ని వివరించడం వంటివి ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉద్యోగులతోపాటు బంధువులు, తెలిసిన వారికి కూడా ప్రచారం నిర్వహించి జరుగుతున్న పరిణామాలను వివరిస్తున్నామని పశ్చిమగోదావరికి చెందిన ఒక కాంట్రాక్టు ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు గానీ, మెసేజ్లుగానీ పెట్టకుండా ప్రధానంగా మనకు జరిగిన నష్టాన్ని తెలియజెప్పాలని, అధికారపార్టీ హామీ ఏమిచ్చింది, ఏం చేసింది అనే విషయాన్ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలని ఆయా కార్యవర్గాల్లో నిర్ణయించారు. విధిగా అందరూ ఓటింగ్కు రావాలని వాట్సాప్ ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి.. - 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దశలవారీగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామన్నారు. కానీ చెయ్యలేదు - నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేసి నాలుగున్నరేళ్లపాటు సమావేశాలు నిర్వహించి చివరకు క్రమబద్ధీకరణ కష్టమని చెప్పేశారు - 2010కి ముందు రెగ్యులర్ ఉద్యోగులకు లాగే వేతన సవరణ ఉండేది.. ఇప్పుడు దీన్ని తీసేశారు - కాంట్రాక్టు ఉద్యోగులను కూడా కన్సాలిడేటెడ్ ఉద్యోగులుగా మార్చేశారు - జీవో నంబర్ 27 ద్వారా ఉన్న డీఏ, హెచ్ఆర్ఏ, పీఆర్సీ వంటివన్నీ తొలగించారు - గడిచిన నాలుగున్నరేళ్లలో ఉద్యోగ భద్రత పూర్తిగా లేకుండా పోయింది -
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో!
సాక్షి, అమరావతి: ఉద్యోగ క్రమబద్ధీకరణపై కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చెయ్యలేమని, ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంది. సుమారు 40 వేల మంది ఆశలకు మంగళం పాడింది. గురువారం కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎన్ఎండీ ఫరూక్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు సమస్యల కారణంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ఉపసంఘం తేల్చిచెప్పింది. 2014 నుంచి పలు దఫాలుగా, వివిధ రకాల హామీలిస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు వారికి రిక్తహస్తం చూపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల వేళ హామీ ఇవ్వడమే కాకుండా, మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఈ విధంగా కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేస్తుందని ఊహించలేదని ఉద్యోగులు వాపోతున్నారు. కొద్దిమందికే లబ్ధి విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు మాత్రమే వర్తించేలా మంత్రివర్గం కొన్ని నిర్ణయాలు తీసుంది. మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు, 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపునకు, ఇప్పటివరకూ 10 నెలల వేతనం మాత్రమే ఇస్తుండగా, ఇకపై 12 నెలలకు ఇవ్వడానికి అంగీకరించారు. ఇకపై డీఏ లేకుండా సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) వర్తింప చేస్తామన్నారు. దీనివల్ల 3,800 మందికి లబ్ధి జరుగుతుంది. ఈ నిర్ణయాల వల్ల ఉన్నత విద్యాశాఖపై రూ. 38 కోట్ల భారం పడుతుందని ఉపసంఘం సభ్యులు చెప్పారు. వివిధ శాఖలలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఒకే విధానం అనుసరించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించామని యనమల పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా ఇదే మాట చెబుతూ వచ్చి, ఇప్పుడు కూడా కొద్ది మందికే లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకోవడం దారుణమని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. తమను మోసం చేసిన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెపుతామని పేర్కొన్నారు. ఆరు సంస్థలకు భూ కేటాయింపులు రాజధాని అమరావతి పరిధిలో మరో ఆరు సంస్థలకు భూములు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రులు నారాయణ, గంటా, నక్కా ఆనందబాబుతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. సవిత విశ్వవిద్యాయానికి 40 ఎకరాలు చొప్పున రెండు విడతలగా మొత్తం 80 ఎకరాలు, అంతర్జాతీయ క్రికెట్ అకాడెమీకి 10.2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు రెండు ఎకరాలు, ఏపీపీఎస్సీకి 1.5 ఎకరాలు, ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్కు ఒక ఎకరం, యంగ్మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్కు 2.65 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఆందోళనలకు కాంట్రాక్ట్ ఉద్యోగులు సిద్ధం కాంట్రాక్టు ఉద్యోగులను సర్కారు దగా చేసిందని పబ్లిక్హెల్త్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు జి.ఆస్కారరావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. దీనిపై కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులందరూ అండగా నిలవాలని కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రత్యేక జీవోలు జారీచేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన విషయం ఈ సర్కారుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో జీవో నెం.119 ఇచ్చి వందలాది మంది కాంట్రాక్టు డాక్టర్లను, స్టాఫ్ నర్సులను గరిష్టంగా 45 మార్కులు వెయిటేజీ ఇచ్చి రెగ్యులరైజ్ చేశారన్నారు. జీవో నెం.1246 ద్వారా 2469 మంది ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. జీవో నెం.625 ద్వారా ఆరోగ్యశాఖలో ఉన్న 711 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని అన్నారు. ప్రస్తుత సర్కార్ నిర్ణయంపై ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఉద్యోగులందరూ దీనికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మంత్రుల నిర్ణయం శోకం మిగిల్చిందని వైద్యవిధానపరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ విమర్శించారు. చట్టాన్ని సవరించైనా క్రమబద్ధీకరణ చేసే అవకాశమున్నప్పుడు ఆ పని ఎందుకు చెయ్యట్లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. -
పండగ పూటా పస్తులే..
రాయవరం (మండపేట) : పండగ వస్తుందంటే ఎవరికైనా సరదా ఉంటుంది. అందులోనూ దసరా పండగ అంటే అందరికీ సరదాయే. కానీ రెండు నెలలుగా వేతనాలకు నోచుకోని సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం దసరా పండగ సరదా లేకుండా సాగిపోయింది. రానున్న దీపావళికైనా తమ బతుకుల్లో వెలుగు విరబూస్తాయా అనే ఆశతో వీరంతా ఉన్నారు. అసలే అరకొర వేతనంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వీరికి, రెండు నెలలుగా జీతాలు రాక పోవడంతో వడ్డీలకు అప్పులు తెచ్చి జీవనం సాగిస్తున్నారు. రూ.6 కోట్ల బకాయిలు... జిల్లాలోని సర్వశిక్షా అభియాన్ పరిధిలో 64 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 64 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 322 మంది సీఆర్పీలు, 64 మంది మెసెంజర్లు, 736 మంది పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లు, 128 మంది ఐఈఆర్టీలు, 15 మంది డీఎల్ఎంటీలు, 250 మంది వరకు కేజీబీవీ సిబ్బంది, 24 మంది సైట్ ఇంజినీర్లు, 64 మంది భవిత కేంద్రాల ఆయాలు పని చేస్తున్నారు. వీరికి నెలకు సుమారుగా రూ.3 కోట్ల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. జూలై నెల వరకు వేతనాలు మంజూరయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి వేతనాలు మంజూరు కాలేదు. దీంతో జిల్లాలో ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6 కోట్ల వరకు వేతన బకాయిలు చేరుకున్నాయి. పండుగ పూటా పస్తులతోనే... రెండు నెలలుగా వేతనాలు రాక పోవడంతో దసరా పండుగ ఉసూరుమంటూ గడిపామని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అరకొరగా ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదంటున్నారు. హెచ్ఆర్ పాలసీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమతో సక్రమంగా పని చేయించుకుంటున్న ప్రభుత్వం మాత్రం సమయానికి వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నాం... రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పండుగ సమయంలోనైనా ముందుగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. చాలా మంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వెంటనే వేతన బకాయిలు చెల్లించాలి. – ఎం.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘం,అల్లవరం మండలం బడ్జెట్ రాగానే చెల్లిస్తాం... కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బడ్జెట్ ఇంకా రాలేదు. బడ్జెట్ రాగానే అందరు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తాం. ఉద్యోగుల ఇబ్బందులను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. – మేకా శేషగిరి, పీవో, సర్వశిక్షా అభియాన్, కాకినాడ -
ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
-
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భారీ ర్యాలీ
సాక్షి, కృష్ణా : విజయవాడలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ధర్నాచౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓ వైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ర్యాలీకి భారీగా ఉద్యోగులు హాజరైయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్ను ఏర్పాటుచేశారు. -
టీటీడీ ఉద్యోగుల ఉద్యమానికి సైరన్
తిరుపతి అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)లో పనిచేస్తున్న 9 వేల మంది శాశ్వత, 13 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యమానికి సైరన్ మోగించారు. ఆగస్టు 16 నుంచి దశల వారీ ఉద్యమం, ఆ తర్వాత సమ్మెకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. సోమవారం రాత్రి తిరుపతిలోని పరిపాలనా భవనం ఆవరణలో సమావేశమైన అన్ని యూనియన్లు, జేసీఏ నేతల సమక్షంలో కార్యాచరణ ప్రకటించారు. జేసీఏ కన్వీనర్ గంపల వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై అధికారులు నియంతృత్వ ధోరణి వల్లే దశాబ్దాల తరబడి తమ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ధార్మిక సంస్థలో ఉద్యోగులకు కనీస హక్కులు కూడా కల్పించడంలేదన్నారు. సొంత ఇళ్లు, ఆరోగ్యానికి భరోసాగా మెరుగైన వైద్య సేవలు, స్వామివారి దర్శనాల్లో ప్రాధాన్యం లేకపోవడం దారుణమన్నారు. వీటన్నిటిపై సుమారు 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నా అధికారులెవరూ పరిష్కరించలేదన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమ పంథాను ఎంచుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని 2005లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించినట్లు తెలిపారు. ఈసారి దానికి మించి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. -
కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయండి
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తూ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని టీడీపీ ప్రభుత్వం తొలగించాలని భావిస్తోందని జగన్ వద్ద ప్రభుత్వ ఐటీఐ, డీఎల్టీసీ కాంట్రాక్టు సిబ్బంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్.జగన్ను కాకినాడలో కలిసి వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టు సిబ్బంది నాయకుడు టీవీవీఎస్ఎస్ ప్రసన్న మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నైపుణ్యాభివృద్ధిని కాంక్షిస్తూ ఐటీఐలను ఏర్పాటు చేశారన్నారు. గత 10 ఏళ్లుగా కాంట్రాక్టు ఏటీఓలుగా ప్రభుత్వ శిక్షణా సంస్థలో పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 2015లో 10వ పీఆర్సీ ప్రకారం కాంట్రాక్టు సిబ్బందికి జీతభత్యాలు 50 శాతం మాత్రమే పెంచుతూ జీఓ 95 జారీ చేసారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు సిబ్బంది మొత్తాన్ని రెగ్యులరైజ్ చేయాలన్న దృక్పథంతో ఉంటే ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు సిబ్బందిని ఎలా తొలగించాలన్నది ఆలోచిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని జగన్కు విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ జగన్ను కలిసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
సమ్మెకు దిగితే వేటు!
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాల క్రమబద్ధీకరణతో సహా మొత్తం 16 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ ట్రాన్స్కో తీవ్రంగా స్పందించింది. పారిశ్రామిక వివాదాల చట్టం–1947 విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల (ఆర్టిజన్లు)కు వర్తించదని, సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. తక్షణమే సమ్మె పిలుపును వెనక్కి తీసుకోవాలని కోరింది. కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగితే నోటీసులు, వేతనాలు ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించే అధికారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉందని హెచ్చరించింది. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జారీ చేసిన సమ్మె నోటీసుకు బదులిస్తూ ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాసరావు గురువారం యూనియన్ ప్రధాన కార్యదర్శికు లేఖ రాశారు. సమ్మెకు దిగడం, ఇతరులు సమ్మెకు దిగేలా రెచ్చగొడితే సంస్థ నిబంధనల ప్రకారం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అన్ని రకాల సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగులను విలీనం చేస్తూ గతంలో యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలుపుదల చేసిందని, ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరడం న్యాయస్థానాన్ని ధిక్కరించడమేనని తప్పుపట్టారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులు ఎస్మా పరిధిలోకి రారని, వారిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు లేదని కార్మిక నేతలు పేర్కొంటున్నారు. గ్రేడ్–4 ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు.. విద్యుత్ సంస్థల్లో నైపుణ్యం కలిగిన పనులు చేస్తున్న గ్రేడ్–4 ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సును మంజూరు చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను వారి విద్యార్హతల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో వరుసగా గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4 ఆర్టిజన్లుగా విద్యుత్ సంస్థలు విలీనం చేసుకున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులుగా నైపుణ్యంతో కూడిన పనులు చేసినా సరైన విద్యార్హతలు లేకపోవడంతో విలీన ప్రక్రియలో కొందరు విద్యుత్ ఉద్యోగులను ఆర్టిజన్ గ్రేడ్–4గా నియమించారు. దీంతో వారు కాంట్రాక్టు ఉద్యోగిగా పొందిన వేతనం కంటే విలీనం తర్వాత వారికి వచ్చే వేతనం తగ్గిపోయి తీవ్రంగా నష్టపోయారు. గత వేతనానికి సమానంగా ప్రస్తుత వేతనం పెంచేందుకు గ్రేడ్–4 ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సును మంజూరు చేశారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎన్పీడీసీఎల్లు సైతం వర్తింపజేయనున్నాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
కష్టాల కడలిలో కాంట్రాక్టు ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: సర్కారు ఖజానాకు ఆదాయం సమకూర్చే ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఆర్టీసీ తదితర శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో మొత్తంగా 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఈ ఉద్యోగుల కాంట్రాక్టు గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారం ముగింపు గడువుకు ముందుగానే కాంట్రాక్టును తిరిగి పునరుద్ధరించాలి. కానీ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టు గడువును పొడిగించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది కొలువు ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం నెలకొని ఉంది. కాంట్రాక్టును వెంటనే పునరుద్ధరించి, పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని ప్రతి ఉద్యోగికి కనీసం రూ.12,000 వేతనం చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో చోట ఒక్కో విధానం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమల్లోకి తెచ్చిన ఈ విధానం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ రాక పూర్వం 6,500 కనీస వేతనం ఇచ్చి, ఉద్యోగులతో ప్రభుత్వం అధికారికంగా వెట్టిచాకిరీ చేయించుకునేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు నెలకు కనిష్టంగా రూ.12,000, గరిష్టంగా రూ.17,500 చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కోచోట ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ, ఆర్టీసీ, ఫారెస్టు శాఖల్లో ఇప్పటికీ రూ.7,500 వేతనాలే చెల్లిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంగా కాంట్రాక్టు ఒప్పందం కింద టైగర్ ట్రాకర్లుగా పనిచేస్తున్న చెంచుల వేతనాలను అక్కడి ఫారెస్టు అధికారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో అచ్చంపేట సెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన ఓ అధికారి కొంతమంది టైగర్ ట్రాకర్లకు వేతనాలు ఇవ్వకుండా మొత్తం తానే తీసుకున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఫారెస్టు ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. -
జూలై 21 నుంచి కరెంటోళ్ల సమ్మె!
సాక్షి, హైదరాబాద్: అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం జూలై 21 నుంచి లేదా ఆ తర్వాత ఏ క్షణమైనా రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు (ఆర్టిజన్లు) నిరవధిక సమ్మెకు దిగుతారని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె నోటీసులు జారీ చేసింది. టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధా న కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించిన అనంతరం సంస్థ సీఎండీ రఘుమా రెడ్డికి యూనియన్ నేతలు సమ్మె నోటీసు అందించారు. 2015లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు 13 విద్యుత్ కార్మిక సంఘాల కలయికతో ఏర్పడిన ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ పేర్కొంది. సమస్యలను పరిష్కరించకుంటే తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెబాట పడతారన్నారు. 16 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఈ 4 సంస్థల యాజమాన్యాలకు అందజేశామని యూనియన్ ప్రధాన కార్యదర్శి సాయిలు తెలిపారు. ప్రధాన డిమాండ్లు.. - విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేస్తూ జారీచేసిన ఉత్తర్వుల అమలుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఈ కేసు విషయంలో ప్రభుత్వం తక్షణమే కౌంటర్ దాఖలు చేసి కార్మికులను విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలి. - కార్మికుల విలీన సమయంలో జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న వేతన శ్రేణిని అమలు చేయాలి. - 2018 పీఆర్సీతో పాటు 24గీ7 విద్యుత్ సరఫరా ఇంక్రిమెంట్ను ఆర్టిజన్లకు వర్తింపజేయాలి. - సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆర్టిజన్లకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. - రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కార్మికులకు మెడికల్ క్రెడిట్ కార్డు సదుపాయం కల్పించాలి. - చనిపోయిన ఆర్టిజన్ కార్మికుల వారసులకు కారు ణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించాలి. - ఆర్టిజన్ కార్మికులు చనిపోతే కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పించాలి. -
‘108’ సేవలు నిలిపేస్తాం
సాక్షి, అమరావతి/మంగళగిరి రూరల్: ఏదైనా ప్రమాదం సంభవిస్తే ‘108’కు ఫోన్ చేయగానే పరుగెత్తుకు రావాల్సిన అంబులెన్స్ సేవలు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిలిచిపోయాయి. ఈ అంబులెన్స్లలో పనిచేస్తున్న సిబ్బందికి, ‘108’నిర్వహణా సంస్థ బీవీజీ యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలం కావడమే ఇందుకు కారణం. తమ డిమాండ్ల పరిష్కారానికి బీవీజీ సంస్థ అంగీకరించకపోవడంతో సిబ్బంది నాలుగు గంటలపాటు అంబులెన్స్లను నిలిపి వేసి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘108’సిబ్బందిని చర్చలకు ఆహ్వానించారు. గురువారం ఉదయం 11 గంటలకు చర్చలు జరగనున్నాయి. ముఖ్య కార్యదర్శితో జరిగే చర్చల్లో సిబ్బందికి న్యాయం జరగకపోతే ఇకపై రోజూ 8 గంటలపాటు అంబులెన్స్ సేవలను నిలిపివేస్తామని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘108’కార్యాలయంలో 13 జిల్లాల రాష్ట్ర కమిటీ సభ్యులు.. బీవీజీ సంస్థ ప్రతినిధులతో బుధవారం చర్చలు జరిపారు. నిబంధనల ప్రకారం తాము రోజుకు 8 గంటలే పనిచేయాల్సి ఉండగా 12 గంటలకుపైగా పని చేయాల్సి వస్తోందని వాపోయారు. 12 గంటల పనివేళలను 8 గంటలకు కుదించాలని, వేతనాలను 50 శాతం జీతాలు పెంచాలని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లను బీవీజీ సంస్థ ఎండీ దేశ్పాండే తిరస్కరించారు. -
కడప ఆర్టీపీపీలో ఉద్రిక్తత
సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ఉద్రిక్తత నెలకొంది. సమాన పని- సమాన వేతనం ఇవ్వాలంటూ గత పదకొండు రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాకు దిగారు. అయితే వారి డిమాండ్ల్ను యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాకుండా హెచ్చరికలు జారీ చేశారు. శనివారంలోపు విధుల్లో చేరకపోతే కొత్త వారిని తీసుకుంటామని బోర్డు డైరెక్టర్ సుందర్ సింగ్ ఉద్యోగులను హెచ్చరించారు. -
చంద్రబాబు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి
-
పీఎఫ్ ఫట్
వీరఘట్టం: ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకు రూ. 6 వేలు ఆదాయం దాటిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల నుంచి భవిష్య నిధి(ఈపీఎఫ్) కోసం కనీసం 7 నుంచి 12 శాతం కట్ చేసి, ఉద్యోగ విరమణ అనంతరం వారికి ప్రభుత్వం ఇచ్చే 13.61 శాతం షేర్తో కలిపి భవిష్యనిధి అందజేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే ఈ నిబంధన అమలవుతోంది. అయితే సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఇక మీదట భవి ష్యనిధి వర్తించదని ఇటీవల సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని 1,100 మంది ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులు భవిష్యనిధికి దూరమవుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లా సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్న క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు(సీఆర్పీ), మండల ఇన్ఫర్మేషన్ సిస్టం కో–ఆర్డినేటర్లు(ఎంఐఎస్), డేటాఎంట్రీ ఆపరేటర్లు, సహిత ఉపాధ్యాయులు(ఐఈఆర్టీ), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు, కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి భవిష్యనిధి వర్తించదని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఝలక్ ఇచ్చింది. ఎప్పటికైనా తమ సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని వీరంతా ఎంతో ఆశపడ్డారు. జీతాలు పెంచాలని గతంలో అమరావతిలో ఆందోళన కూడా చేశారు. రూ. 14 వేలు వేతనం పెంచుతూ ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించే విధంగా జీవో చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017 ఆగస్టు నుంచి జీవో అమలు చేసింది. ఆరు నెలలు గడవకముందే ఈ జీవోను రద్దు చేస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పీఎఫ్కు దూరమైన ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదు. దీంతో వీరు చేసిన పోరాటాల ఫలితంగా గతేడాది ఆగస్టు 17 నుంచి ఉద్యోగుల జీతాల్లో ఈపీఎఫ్, ఈఎస్ఐ రికవరీ చేశారు. ఉద్యోగుల షేర్ ఈపీఎఫ్ 12 శాతం, ఈఎస్ఐ 1.75 శాతం కట్ చేస్తూ వచ్చారు. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చేసి వీరి భవిష్యనిధి ఉత్తర్వులను రద్దు చేసింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు కట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎస్ఎస్ఎ ఉద్యోగులు భవిష్యనిధికి దూరమైపోయారు. ఇదీ నిబంధన దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఉన్న స్కీంలోని ఉద్యోగులకు ఈసీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలనే నిబంధన ఉంది. ప్రస్తుత నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న కాంట్ట్రాక్ ఉద్యోగులకు ఆ సౌకర్యం అమలులో ఉంది. 2017 ఆగస్టు నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు అని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి వీరి జీతాల్లో రికవరీ కూడా చేశారు. ఆరు నెలల నుంచి ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఇప్పుడేమో అకస్మాత్తుగా ఈ జీవో రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జిల్లా వ్యాప్తంగా 1,100 మందికిపైగా ఈ ఉద్యో గులు ఉన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రా క్ట్ ఉద్యోగులు, కేజీబీవీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
29న కాంట్రాక్టు ఉద్యోగుల మహా సభ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల ను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని కోరుతూ ఈ నెల 29న హైదరాబాద్లో మహా సభను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన వారు రాష్ట్రంలో 2.20లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని అర్హతల ఆధారంగా క్రమబద్ధీకరించాలన్నారు. ఔట్సోర్సింగ్ వారి పరిస్థితి దారుణమన్నారు.. ప్రభుత్వం నెలవారీగా వేతనాలు ఇసున్నా ఔట్సోర్సింగ్ సంస్థలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జి.కృష్ణ, అంజి, ఎస్.రామలింగం, భూపేశ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ను కలిసిన విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు
సాక్షి, చిత్తూరు : ప్రజాసంక్పలయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కలిశారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించడమే కాకుండా, రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా వేతనాలు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రమాదవశాత్తూ, విధి నిర్వహణలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, విద్యుత్ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ విధానాలకు స్వస్తి పలికాలని వారు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. వీరి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్ వీటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా పాదయాత్రలో భాగంగా అడ్డగింటవారిపల్లి చేరుకున్న వైఎస్ జగన్కు గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం
సాక్షి, అనంతపురం: ట్రాన్స్కో, జెన్కోలో ఏపీ సీఎం చంద్రబాబు విపరీతమైన స్కాంలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కార్మికుల పొట్టకొడుతూ.. విచ్చలవిడిగా దోచుకుతింటున్నాడని విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కుక్కాలపల్లి క్రాస్ వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని వైఎస్ జగన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల అనుభవాన్ని బట్టి దశల వారిగా రెగ్యులరైజ్ చేస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఆయన మరణాంతరం ఎవరూ పట్టించుకోవడం లేదంటే రాజకీయ వ్యవస్థ ఏ విధంగా దిగజారిందో అర్థం చేసుకోవాలన్నారు. 2008లో వైఎస్ఆర్ హయాంలో 7114 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. మిగతావారిని రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఆయన మనకు దూరమయ్యారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనదే అయినప్పటికీ వారి సమస్యలను చంద్రబాబు సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల అనుభవం, విద్యార్హతను బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విద్యుత్ సబ్స్టేషన్లను ఔట్సోర్సింగ్కు ఇచ్చి దారుణమైన స్కాం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. సబ్స్టేషన్లను ఔట్సోర్సింగ్కు ఇచ్చే దాంట్లో సగం డబ్బుతో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవచ్చన్నారు. చంద్రబాబు చేసే ప్రతి పనిలో దోచుకోవడం తప్ప మరేమీ జరగడం లేదన్నారు. బొగ్గు కొనుగోలులో స్కాం జరుగుతోంది. తెలంగాణ, గుజరాత్ కంటే ఏపీలో ఎక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు. ఒక్కో మెగావాట్కు రూ.1.4 కోట్ల దోపిడీ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. మనం అధికారంలోకి రాగానే కార్మికులకు అనుకూలంగా సంస్కరణలను తీసుకొచ్చి ట్రాన్స్కో, జెన్కో పనితీరును మెరుగు పరుస్తామని వైఎస్ జగన్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు భరోసా కల్పించారు. -
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు ఖరారు
ప్రకటించిన సమన్వయ కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే నిర్ణయించిన వేతనాల పెంపుతో పాటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అదనంగా ప్రకటించిన వెయ్యి రూపాయల నజరానా కూడా ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 23 వేల మంది విద్యుత్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని ‘ఆర్టిజన్ ఉద్యోగులు’గా గుర్తించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు ఏజెన్సీలతో సంబంధం లేకుండా నేరుగా జీతాలు చెల్లించే విషయంలో సుముఖత వ్యక్తం చేసింది. మిగతా అంశాలకు సంబంధించి తుది తీర్పు రానుంది. ఈలోగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన జీతాలను ఖరారు చేశారు. ఈ మేరకు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు నేతృత్వంలోని విద్యుత్ సమన్వయ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఇకపై ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ రెగ్యులర్ ఉద్యోగులకు లభించే గౌరవం, కనీస వేతన చట్టం కంటే ఎక్కువ వేతనం చెల్లిస్తామని ప్రభాకర్రావు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలన్నీ హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. కొత్తగా రూపొందించిన వేతన విధానం ప్రకారం.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను 4 కేటగిరీలుగా విభజించారు. ► గ్రేడ్ 1: హైలీ స్కిల్డ్ (అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారు– ఇంజనీరింగ్, డిప్లొమా, విద్యార్హతలు కలిగిన వారు) ► గ్రేడ్ 2: స్కిల్డ్ (నైపుణ్యం కలిగిన వారు– డిగ్రీ విద్యార్హత కలిగిన వారు) ► గ్రేడ్ 3: సెమీ స్కిల్డ్ (మాధ్యమిక నైపుణ్యం కలిగిన వారు– ఇంటర్ విద్యార్హత) ► గ్రేడ్ 4: అన్స్కిల్డ్ (నైపుణ్యం లేని వారు– పదోతరగతి విద్యార్హత) గ్రేడ్ల పరంగా వేతనాలిలా.. అన్స్కిల్స్ ఉద్యోగులకు: రూ.2,215 నుంచి రూ. 2,500 వరకు వేతనాలు పెంచారు. పెంచిన జీతాన్ని జూలై 29 నుంచి చెల్లిస్తారు. పీఎఫ్, ఈ ఎస్ఐ వాటాధనం గతంలో మాదిరిగానే వేతనాల్లో భాగంగా ఉంటాయి. గ్రేడ్ 1 ఉద్యోగులకు జీతాలు రూ. 20,785 నుంచి రూ.23,000కు పెరిగాయి. గ్రేడ్ 2 ఉద్యోగుల జీతాలు రూ.16,663 నుంచి రూ.19,000కు పెరిగాయి. గ్రేడ్ 3 ఉద్యోగుల జీతాలు రూ.13,576 నుంచి రూ.16,000కు పెరిగాయి. గ్రేడ్ 4 ఉద్యోగుల జీతాలు రూ. 11,500 నుంచి రూ.14,000కు పెరిగాయి. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అందరికీ ప్రతి నెలా 1న బ్యాంకు అకౌంట్లో జీతాలు వేస్తారు. 4 సంస్థల్లో ఇప్పటి వరకున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు అన్నింటినీ రద్దు చేశారు. ఇదివరకులాగే విద్యుత్ సంస్థలు, ఆర్టిజన్ ఉద్యోగులు సం యుక్తంగా భవిష్య నిధికి డబ్బులు జమ చేస్తారు. ఈ మొత్తాన్ని వేతనాల్లోంచి తీసి ప్రావిడెంట్ ఫండ్ కు జమచేస్తారు. ఈఎస్ఐకి చెల్లించే డబ్బులు కూడా సంస్థలు, ఉద్యోగులు సంయుక్తంగా చెల్లిస్తారు. -
‘ఉప పోరు’లోనే గుణపాఠం
-
‘ఉప పోరు’లోనే గుణపాఠం
♦ ఉద్యోగుల డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ♦ పెండింగ్లోనే మూడు విడతల డీఏ ♦ 10 నెలల పీఆర్సీ అరియర్స్ విడుదల ఎప్పుడో? ♦ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలోనూ నిర్లక్ష్యమే.. ♦ సమాయత్తం అవుతున్న ఉద్యోగులు కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మూడు విడతల డీఏ పెండింగ్లో ఉన్నా పట్టించుకునే దిక్కులేదు. 2016 జూలై, 2017 జనవరి, 2017 జూలై వరకు డీఏ ఇవ్వాల్సి ఉంది. 10 నెలల పీఆర్సీ అరియర్స్ ఏళ్లుగడుస్తున్నా అతీగతీ లేదు. పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచినా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు అమలు చేయలేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి నంద్యాల ఉప ఎన్నికలో బుద్ధి చెప్పడానికి ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని 2014 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు స్పష్టమైన హామీ ఇచ్చి ప్రస్తుతం సాకులు చూపుతూ కాలయాపన చేస్తున్నారు. 2018 జూలై 1నాటికి 11వ పీఆర్సీ అమలులోకి రావాల్సి ఉంది. ఇంతవరకు 11వ వేతన సవరణకు కమిషన్నే ఏర్పాటు చేయలేదు. ఆ దిశగా కనీస చర్యలు లేవు. ఉద్యోగులకు క్యాస్లెస్ వైద్యానికి జారీ చేసిన హెల్త్ కార్డులను కార్పొరేట్ వైద్యశాలలు పట్టించుకోవడంలేదు. ఇలా ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రజాధనాన్ని విదేశీ పర్యటనలకు, ప్రచారానికి, జిల్లాల పర్యటనలకు అడ్డగోలుగా ఖర్చు చేస్తూ ఉద్యోగుల విషయానికి వచ్చే సరికి రాష్ట్రం లోటు బడ్జెట్తో నడుస్తుందని చెప్పడం సర్వసాధారణమైంది. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధిచిన డిమాండ్లపై నిర్లక్ష్య ధోరిణిలో ఉండటం పట్ల ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఏ ఉద్యోగిని కదిలించినా ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. నంద్యాల ఉపఎన్నిక చక్కటి వేదిక.. నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి భయం వెంటాడుతుండటంతో ఏదో విధంగా గెలుపొందేందుకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికారం అండతో సామ, ధాన దండోపాయాలకు పాల్పడుతోంది. తమ నిరసనను ప్రభుత్వానికి తెలియచేయడానికి నంద్యాల ఉప ఎన్నిక చక్కటి అవకాశమని ఉద్యోగులు బావిస్తున్నారు. అనేక డిమాండ్లను ప్రక్కనపెట్టడం ఒక ఎత్తు అయితే 50 ఏళ్లు దాటిన తర్వాత పనితీరునుబట్టి కొనసాగించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యంపై ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. డీఏ వెంటనే ఇవ్వాలి 2016 జూలై1, 2017 జనవరి, 2017 జూలై వరకు మొత్తం మూడు డీఏలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. డీఏలను విడుదల చేయడంలో జాప్యం చేయరాదు. డీఏలను ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడంతో ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మికుల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. అదే విధంగా 10 నెలల పీఆర్సీ అరియర్స్ను విడుదల చేయడంలో ప్రభుత్వం చొరువ తీసుకోవాలి. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో నాన్చివేత తగదు. వెంటనే చర్యలు తీసుకోవాలి. – లక్ష్మినారాయణ, జాయింట్ సెక్రటరీ, జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ 11వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలి 11వ వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం వెంటనే నియమించాలి. నిబందనల ప్రకారం 2018 జూలై1 నాటికి 11వ వేతన సవరణ అమలులోకి రావాల్సి ఉంది.కాని ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే 11వ వేతన సవరణకు కమిషన్ వేయాలి. 50 ఏళ్ల దాటిన తర్వాత పనితీరును బట్టి ఉద్యోగంలో కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే యత్నాల్లో ఉండటం దారుణం. ఇటువంటి ఆలోచనను వెంటనే ఉప సంహరించుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికే నష్టం. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. – పి.రామకృష్ణారెడ్డి, కోశాధికారి, జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ డిమాండ్లు పరిష్కరించాలి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి వెంటనే చొరవ తీసుకొవాలి. మూడు విడతల డీఏ, 10 నెలల పీఆర్సీ అరియర్స్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇందువల్ల ప్రభుత్వంపై ఉద్యోగులకు అసంతృప్తి పెరుగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను విధిగా క్రమబద్దీకరించాల్సిందే. ఇందులో రాజీ పడం. చట్టాలను మార్పు చేసుకొని రెగ్యులర్ చేయాలి. 11 వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. – జవహర్లాల్, జిల్లా కార్యదర్శి, ఎన్జీఓ అసోసియేషన్ -
కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంపు
అమరావతి: సర్వశిక్షా అభియాన్(ఎస్.ఎస్.ఏ) ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంచుతున్నట్టు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయా కేటగిరీల ప్రకారం ఉద్యోగుల వేతనాల పెంపు ఉంటుందని చెప్పారు. పెరిగిన వేతనాలను వెంటనే అమలులోకి తేవాలని ఉన్నతాధికారులకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంపై భారం వున్నా.. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జీతాలు పెంచామని మంత్రి గంటా స్పష్టం చేశారు. -
మునిసిపల్ కార్మికుల సమ్మె విరమణ!
అనంతపురం న్యూసిటీ : రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు మునిసిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం ముగిసింది. మూడ్రోజులుగా మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే. జీవో 279ను రద్దు చేయాలంటూ కార్మిక సంఘాల నేతృత్వంలో కార్మికులు ధర్నా చేపట్టారు. సీఐటీయూ నేతలు రాజారెడ్డి, గోపాల్, మునిసిపల్ కార్మిక సంఘం నేత నరసింహులు మాట్లాడుతూ.. జీఓ 279కి సంబంధించి టెండర్లను పిలవబోమంటూ ప్రభుత్వం ప్రకటించిందని, దీంతో సమ్మెను తాత్కాళికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కాగా, గురువారం ఉదయం నగరపాలక సంస్థ ఎదుట నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి మద్దతు తెలిపారు. మునిసిపల్ సొమ్మును కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు పీడీఎఫ్ తరపున తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ఉపేంద్ర, నల్లప్ప, ముర్తూజా, వెంకటనారాయణ, రాజేష్గౌడ్, కృష్ణుడు, నాగభూషణ, పెన్నోబులేసు, తిప్పయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు. కార్మికులతో మంత్రి సునీత చర్చలు అనంతపురం సిటీ : గురువారం నిర్వహించిన జెడ్పీ సమావేశానికి హాజరైన మంత్రి పరిటాల సునీత... జెడ్పీ కార్యాలయ ప్రధాన గేట్ వద్ద కార్మిక సంఘాల నేతలు నారాయణరెడ్డి, ఈటె నాగరాజుతో భేటీ అయి చర్చించారు. అంతకు ముందు మంత్రితో చర్చలు జరిపేందుకు వచ్చిన కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కార్యాలయ ప్రధాన గేట్ వద్దనే బైఠాయించి, మంత్రి అక్కడకే రావాలని నినాదాలు చేశారు. కార్మికుల డిమాండ్లను విన్న ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపేదిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
పారిశుద్ధ్యంపై ‘సమ్మె’ పిడుగు
– కాంట్రాక్ట్ కార్మికుల విధుల బహిష్కరణ – పట్టణాల్లో తొలగని చెత్త – కర్నూలులో ఇంటింటి చెత్త సేకరణకు బ్రేక్ కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మె మొదటిరోజే ప్రభావం చూపింది. తమ డిమాండ్లు పరిస్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు కర్నూలు కార్పొరేషన్తో (570)పాటు నంద్యాల (200), ఆదోని (200) ,ఎమ్మిగనూరు (150), డోన్ (150), గూడూరు, నందికొట్కూరు (60), ఆళ్లగడ్డ, ఆత్మకూరు నగరపంచాయతీలలో పనిచేస్తున్న దాదాపు 1800 మంది మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. విధులను బహిష్కరించడంతో కర్నూలు నగరంతో పట్టణాల్లో చెత్త సమస్య తలెత్తింది. నగరంలో, 14 వార్డులు 1.50 లక్షల జనాభా ఉన్న కల్లూరు ఏరియాలో మెజారిటీగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేసే కార్మికులు ఉన్నారు. వీరంతా సమ్మెలో పాల్గొనడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. కృష్ణానగర్, న్యూ కృష్ణానగర్, ఆదిత్యనగర్ కాలనీలలో ఇంటింటి చెత్తను సేకరించే కార్మికులు రాలేదు. దీంతో ఇంట్లో చెత్త బయటే పడేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాగే అనేక మున్సిపాల్టీలలోనే సమస్య ఇబ్బందిగా మారింది. 2014 సంవత్సరంలో ఏర్పడిన కొత్త మున్సిపాల్టీలు, నగరపంచాయతీల్లోను ఇదే పరిస్థితి. ఇక్కడ ఎక్కువగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే కార్మికులు ఉన్నారు. దీని వల్ల ఆయా మున్సిపాల్టీలో చెత్త సమస్య ప్రారంభమైంది. ప్రభుత్వం మరింత జాప్యం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని ఇప్పటికే యూనియన్ నాయకులు ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే మున్సిపాల్టీలలో దుర్వాసనతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. -
అరగుండు గీయించుకుని నిరసన
కర్నూలు(హాస్పిటల్): కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు అరగుండుతో నిరసన తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వారు ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహం వద్ద అరగుండు గీయించుకున్నారు. ఈ సందర్భగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ మాణిక్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ.. కనీస వేతనాలు అమలు చేయాల్సిన ఆసుపత్రి, కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. అనంతరం ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, మూడవ పట్టణ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి సమక్షంలో ఏఐటీయూసీ నాయకులతో చర్చలు జరిపారు. రెండు గంటల పాటు చర్చలు నిర్వహించినా ఫలితం రాలేదు. దీంతో ఆందోళన కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి, నాగరాజు, జయరాజు తదితరులు పాల్గొన్నారు. -
దిష్టిబొమ్మతో శవయాత్ర
కర్నూలు(హాస్పిటల్): వేతనాలు పెంచాలని కోరుతూ గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు.. కాంట్రాక్టర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. మనోహర్ మాణిక్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ.. కనీస వేతనాలు ఇవ్వాలని 18 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా.. కాంట్రాక్టర్, అధికారులు స్పందించడం లేదన్నారు. వేతనాలు పెంచకుండా కార్మికుల కడుపుకొడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సి. రమణ, ఎస్. యేసు, రామునాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నల్లన్న, నరసింహులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరితాళ్లతో వినూత్న నిరసన
కర్నూలు(హాస్పిటల్): వేతనాల పెంపు కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు బుధవారం సాయంత్రం ఉరితాళ్లతో వినూత్న నిరసన తెలిపారు. అంతకుముందు వేతనాల పెంపుకోసం ఆసుపత్రి అధికారుల సమక్షంలో ఏఐటీయూసీ నాయకులు ఏజెన్సీతో చర్చలు జరిపారు. జీవో నెం.68 తమకు ఇచ్చిన అగ్రిమెంట్లో లేదని, వేతనాలు పెంచే ప్రసక్తి లేదని ఏజెన్సీ ప్రతినిధులు తేల్చిచెప్పారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు. దీంతో ఏఐటీయూసీ నాయకులు మనోహర్ మాణిక్యం, మునెప్ప మాట్లాడుతూ.. ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం సాయంత్రం దీక్షా స్థలి వద్ద ఉరితాళ్లతో మెడకు కట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.అబ్రహాం, జయరాజు, ఏఐటీయుసి నాయకులు పాల్గొన్నారు. -
‘ఉద్యమాల వల్లే పర్మనెంట్ అయ్యారు’
– టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సర్వేపల్లి(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): తాము చేపట్టిన ఉద్యమాల ఫలితంగా 24 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం పర్మినెంట్ చేసిందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు ఏపీజెన్కో ప్రాజెక్టులో బీసీ విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే–సావిత్రీ బాయి ఫూలే విగ్రహాలను శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వం కూడా తీసుకోవాలన్నారు. వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఉద్యమం చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. జెన్కో డైరెక్టర్లు అప్పారావు, సుందర్సింగ్, సీఈలు, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
బాబొచ్చారు.. జాబులూడాయి..
800 మంది ఆయుష్ ఉద్యోగులకు తొలగింపు ఉత్తర్వులు సాక్షి, అమరావతి: బాబొస్తే జాబొస్తుందని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజా గా కాంట్రాక్టు ఉద్యోగులకు షాకిచ్చారు. ఆయుష్ విభాగంలో పని చేస్తున్న 800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్ల అవసరం లేదని, జీతాలు ఇవ్వలేమని, వారిని ఇంటికి పంపించండని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా 2016 – 17లో పని చేసిన 12 నెలల కాలానికి వేతనం కూడా ఇవ్వకూడదని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. తాజా ఉత్తర్వులతో భవిష్యత్లో ఇంకా ఎంత మందిని సర్కారు తొలగిస్తుందోననే భయాందోళన మొదలైంది. -
వెన్నుపోటు
► ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణకు మంగళం ► ఎన్నికల హామీని తుంగలో తొక్కిన బాబు సర్కారు ► ఉపసంఘం పేరుతో మూడేళ్ల కాలయాపన ► తీరా కుదరదంటూ చేతులెత్తేసిన సర్కారు ► జిల్లాలో ప్రశ్నార్థకంగా 24 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంట్రాక్టు ఉద్యోగులను బాబు సర్కారు వంచించింది. అధికారంలోకి వస్తూనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారు. ఉపసంఘం పేరుతో మూడేళ్లు కాలయాపన చేసి న్యాయపరమైన చిక్కుల సాకు చూపి ఇప్పుడు క్రమబద్ధీకరణ కుదరదంటూ చేతులెత్తేశారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఒక వైపు తెలంగాణ సర్కారు ఎన్నికల హామీని అమలు చేస్తుండగా ఇక్కడ చంద్రబాబు మాత్రం హామీని తుంగలో తొక్కి వంచనకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగులు 8500కు పైగా ఉన్నారు. ఇక స్కీమ్ వర్కర్ల పరిధిలో మధ్యాహ్న భోజనం, గ్రామసమాఖ్యలు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, ఆయూష్, క్షయ వ్యాధి, అర్బన్ హెల్త్ సెంటర్లు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, రైతుబజార్ తదితర విభాగాల్లో 17 వేల మంది వరకు కాంట్రాక్టు వర్కర్లు పనిచేస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 25 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు, వర్కర్లు పనిచేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. బాబు మాటలు నమ్మి ఉద్యోగులు, కార్మికులు ఓట్లేశారు. గద్దెనెక్కాక బాబు ఎన్నికల హామీని మరిచారు. కాలయాపన కోసం 2014, సెప్టెంబర్ 9న మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. 11 మార్లు సమావేశమైన ఉపసంఘం చివరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించలేమని తేల్చి చెప్పింది. ఇందుకు న్యాయపరమైన చిక్కులు అంటూ సాకు చూపి ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటే... చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగానే హామీని నెరవేర్చక వంచించిందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వైఎస్ హయాంలో క్రమబద్ధీకరణ దివంగత వైఎస్ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది. 2007 ఆగస్టు 10న జీవో ఎంఎస్ నెం.89 విడుదల చేసి సాంఘిక సంక్షేమశాఖలో ఉన్న కాంట్రాక్టు టీచర్లను క్రమబద్ధీకరించారు. 2009 జూన్ 19న మరో జీవో నెం.128 విడుదల చేసి వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఎంపీహెచ్ఎలను క్రమబద్ధీకరించారు. 2009, జులై 24న జీవో నెం.84 విడుదల చేసి స్కూలు ఎడ్యుకేషన్ విభాగంలో పని చేస్తున్న పార్ట్టైం ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్చర్లను క్రమబద్ధీకరించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వంచించిన బాబు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సీఎం చంద్రబాబు వంచించారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని చెప్పి తరువాత వారి ఊసే ఎత్తలేదు. పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వరుసపెట్టి తొలగిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేది లేదని ప్రకటించడం దారుణం. పైగా 10వ పీఆర్సీ ప్రకారం 104 శాతం జీతం పెంచాల్సి ఉంటే, కేవలం 50 శాతం మాత్రమే పెంచారు. బాబు నిర్వాకం కారణంగా 64 శాతం జీతం కాంట్రాక్టు ఉద్యోగులు నష్టపోయారు. – ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి టి.మహేష్ -
‘కాంట్రాక్టు’కూ వెన్నుపోటు!
-
‘కాంట్రాక్టు’కూ వెన్నుపోటు!
క్రమబద్ధీకరణ కుదరదన్న బాబు సర్కార్.. న్యాయపరమైన చిక్కులంటూ కాకమ్మ కబుర్లు ♦ మూడేళ్లుగా నాన్చి చివరకు తేల్చింది ఇదా.. ♦ కాంట్రాక్టు ఉద్యోగులలో ఆగ్రహావేశాలు ♦ రెగ్యులరైజేషన్, జీతభత్యాలపై స్పష్టత ఇవ్వండి ♦ కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల డిమాండ్.. సాక్షి, అమరావతి: కాంట్రాక్టు కార్మికులనే కాదు.. నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాలనూ చంద్రబాబు ఇలాగే మోసం చేశారు. అన్ని హామీలను అటకెక్కించారు. అవసరం తీరాక వెన్నుపోటు పొడిచారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, చేనేత కార్మికులు, విద్యార్థులు.. ఇలా ఎవరినీ వదలలేదు. తాజాగా ఆ జాబితాలో కాంట్రాక్టు ఉద్యోగులు చేరారు. క్రమబద్ధీకరణ కుదరదని చంద్రబాబు తేల్చేయడంతో వారంతా ఇపుడు లబోదిబోమంటున్నారు. న్యాయపరమైన చిక్కులున్నాయని చెబుతున్నా ఉద్యోగులు నమ్మడం లేదు. ఎందుకంటే పొరుగున ఉన్న తెలంగాణ కాంట్రాక్టు కార్మికులను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తోంది. ఈ మూడేళ్లలో మూడు జీవోలిచ్చింది. అక్కడ లేని న్యాయపరమైన చిక్కులు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడి నుంచి వచ్చాయి? రెగ్యులరైజ్ చేయడం బాబుకు ఇష్టం లేదు. హామీ ఇచ్చి మోసం చేయడం, పొంతనలేని సాకులు చెబుతుండడం, మూడేళ్లు నాన్చి ఇపుడు కుదరదనడం.. ఉద్యోగులలో ఆగ్రహావేశాలను రగిలించింది. అలాగే ప్రభుత్వం చెప్పినట్టుగా 50శాతం వేతనం పెంచినా పెద్దగా ఒనగూరేది లేదని వారు మండిపడుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలయాపన తమను మోసగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని కాంట్రాక్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 2014 సెప్టెంబర్ 9న మంత్రు లు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డిల తో ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ సంఘం 2016 సెప్టెంబర్ 16 నుంచి 2018 ఏప్రిల్ 18 వరకు 11 సార్లు సమావేశమైంది. చివరకు క్రమబద్ధీకరించలేమని తేల్చింది. ఉద్యోగుల సంఖ్యపైనా గందరగోళం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అనే దానిపై ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కోరకంగా చెపుతుండటం అనుమానాలకు దారి తీస్తోందని కాంట్రాక్టు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 56,714 మంది ఉన్నారని మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో చెప్పింది. ఇందులో ప్రభుత్వ శాఖల్లో 13,671 మంది, ప్రభుత్వ రంగ సంస్థల్లో 43,043 మంది ఉన్నట్టు పేర్కొంది. తాజాగా 26,664 మంది మాత్రమే అంటోంది. అంటే మిగతా 30,050 మంది ఉద్యోగులు ఏమైనట్టు? పైగా జాతీయ ఆరోగ్యమిషన్ పరిధిలో సుమారు 8 వేల మంది పనిచేస్తున్నారు. వీళ్లందరికీ కేంద్రమే వేతనాలు చెల్లిస్తోంది. వీళ్లనూ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో చూపి వేతనాలు చెల్లిస్తున్నట్టు లెక్కలు చూపుతోంది. న్యాయపరమైన చిక్కులు ఎక్కడున్నాయి? కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. చంద్రబాబు 2014లో ఎన్నికల హామీ ఇచ్చే నాటికి న్యాయ పరమైన చిక్కులు లేవా? ఎన్నికల్లో గెలిచాక చిక్కులొచ్చా యా? ఒకవేళ ముందే న్యాయపరమైన చిక్కులు ఉండి ఉంటే మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? ఊరూవాడా ఉపన్యాసాల్లో ఎందుకు చెప్పారు? అనే ప్రశ్నలకు ప్రభు త్వం నుంచి సమాధానం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు... గిరిజన సంక్షేమశాఖలో ఉన్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2016 ఫిబ్రవరి 19న జీవో ఎంఎస్ నెం.57ను, వైద్య ఆరోగ్యశాఖలోని ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2017 మార్చి 22న జీవో ఎంఎస్ నెం.19ను, జీవో ఎంఎస్ నెం.20ను జారీచేసింది. కాంట్రాక్టు లెక్చరర క్రమబద్ధీకరించే ప్రక్రియా కొనసాగుతోంది.కాగా సుప్రీంకోర్టు సహా రాజస్థాన్,బాంబే,ఏపీ హైకోర్టులు కూడా క్రమబద్ధీకరణకు అనుకూలంగా వివిధ సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయి. దారుణంగా మోసం చేశారు మంత్రివర్గ ఉపసంఘమంటూ మూడేళ్ల పాటు నాన్చి ఇప్పుడు చెయ్యలేమని చేతులెత్తేయడమంటే దారుణంగా వంచించడమే. తెలంగాణకు లేని అడ్డంకులు ఏపీకి ఎందుకు వస్తున్నాయి? కాంట్రాక్టు ఉద్యోగులకు హామీ ఇచ్చినప్పుడు చంద్రబాబుకు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇది వంచన కాక మరేంటి? .–మేసా ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాలు పరమవేస్ట్.. ఉద్యోగులు సోమరులుగా తయారవుతారు’’ – సీఎం చంద్రబాబు బాబు ‘మనసులో మాట’ రాష్ట్రంలో అరలక్ష కాంట్రాక్టు సిబ్బంది, ఆ కుటుంబాల్లో 4 లక్షల ఓట్లున్నాయి. – అందుకే 2014 ఎన్నికల ముందు క్రమబద్ధీకరణ హామీ ఇచ్చారు అందుకే చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను సృష్టించారు... తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించేయాలనుకున్నారు. ఎన్నికలయిపోయాయి. అవసరం తీరిపోయింది.. ఎలా గోలా వారిని, వారికిచ్చిన హామీని చెత్తబుట్టలో వేయాలి.. – అందుకే ఓ మంత్రివర్గ ఉపసంఘం వేశారు.. మూడేళ్లు నాన్చారు. ఇప్పుడు క్రమబద్ధీకరణ కుదరదని తేల్చేశారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల గొంతు కోశారు: వెల్లంపల్లి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు... కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గొంతు కోశారని ఆయన మండిపడ్డారు. వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై అందరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కొన్ని పత్రికలు ఉద్యోగులకు తీపి కబురని రాయడం బాధకరమన్నారు. 2012లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చంద్రబాబు అన్నారనే విషయాన్ని వెల్లంపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారని ఆయన అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. విశాఖలో రైల్వేజోన్ కోసం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, నిరుద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు లోను కావద్దని ఆయన సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని వెల్లంపల్లి పేర్కొన్నారు. కాగా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ నిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేసింది. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల గొంతు కోశారు
-
రెగ్యులరైజ్ చేయలేం
- కాంట్రాక్ట్ ఉద్యోగులపై మంత్రివర్గ ఉపసంఘం స్పష్టీకరణ - క్రమబద్ధీకరణకు ఇబ్బందులున్నాయని వెల్లడి - ఎన్నికల హామీ అమలు చేయకుండా చేతులెత్తేసిన సర్కారు - 50 శాతం జీతాల పెంపునకు ఆమోదం.. కేబినెట్కు సిఫార్సు సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీ కరించేది లేదని అధికారం చేపట్టిన మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ నిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయమై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం మంగళ వారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సమావేశమైంది. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ను రెగ్యులరైజ్ చేయడానికి ఇబ్బందులు ఉన్నందున వారికి 50% జీతాలు పెంచాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్కు సిఫార్సు చేస్తూ ఉపసంఘంలోని మంత్రులు యనమల, గంటా, కామినేని, కాల్వ శ్రీనివాసులు నిర్ణయించారు. ఉపసంఘం నిర్ణయాలను మంత్రులు కాల్వ, కామినేని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో 26,664 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల పెంపుతో ప్రభుత్వంపై రూ.199.74 కోట్లు భారం పడుతుందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఆయా శాఖలే తమ బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవాలన్నారు. భవిష్యత్ లో ఏ శాఖ అయినా ఆర్థిక శాఖ అనుమతితోనే ఉద్యోగుల్ని నియమించుకోవాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెన్యూవల్స్ను ఆయా శాఖలే చేసుకుని, వాటిని ఆర్థిక శాఖకు అందించాలని చెప్పారు. -
ట్రామాలో భారీ డ్రామా
► కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి ప్రేమ ► కొత్తగా చేరిన ఉద్యోగులకు వేతనాలెక్కువ ► అదే క్యాడర్లోని పాతవారికి అన్యాయం ట్రామాలో భారీ డ్రామా నడుస్తోంది.. కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభుత్వ సవతి ప్రేమ చూపుతోంది. íసీనియారిటీతో పని లేకుండా కొత్తగా చేరిన ఉద్యోగులకు వేతనాలు ఎక్కువగా ఇస్తూ.. అదే క్యాడర్లో ఉన్న సీనియర్లకు అన్యాయం చేస్తోంది. ఇటీవల డీసీహెచ్ డాక్టర్ సుబ్బారావు విడుదల చేసిన నోటిఫికేషన్తో ఈ వ్యవహారం బయటపడింది. నెల్లూరు(అర్బన్): హైవేలపై ప్రమాదాలు జరిగినప్పుడు వారికి అత్యవసర సేవలు అందించేందుకు నెల్లూరులోని పెద్దాస్పత్రిలో ఏడేళ్ల క్రితం ట్రామా కేర్, ఐసీయూ యూనిట్ల ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాలపరిమితి తీరాక రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని అప్పట్లో ఒప్పందం జరిగింది. అప్పట్లో ట్రామాలో 65 మంది ఉద్యోగులు చేరారు. వీరిలో నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు, డ్రైవర్లు ఉన్నారు. జీతం రూ.12,900 మాత్రమే: అప్పట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేరిన స్టాఫ్ నర్సులకు వేతనం ఇప్పటికీ రూ.12,900 మాత్రమే ఇస్తున్నారు. గత నెలలో పెద్దాస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిపై స్టాఫ్ నర్సులుగా చేరిన 198 మందికి రూ.15,000 ఇస్తున్నారు. సర్వీసు ఉండి, ఒకే చోట పని చేస్తున్నప్పటికీ పాత వారికి వేతనాల్లో అన్యాయం చేస్తున్నారు. డీసీహెచ్ నోటిఫికేషన్లోనూ అన్యాయమే: గత వారంలో పెద్దాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లు, డిజిటల్ ఇమేజింగ్ టెక్నీషియన్ తదితర 51 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు డీసీహెచ్ డాక్టర్ సుబ్బారావు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ పరిశీలిస్తే ల్యాబ్ టెక్నీషియన్లకు, డిజిటల్ టెక్నీషియన్లకు నెలకు రూ.21,000 జీతంగా నిర్ణయించారు. అయితే ఏడేళ్లుగా ట్రామా కేర్ యూనిట్లో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి రూ.11,500 ఇస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లో కొత్తగా చేరేవారికి మాత్రం రూ.21,000 ఇవ్వాలని నిర్ణయించడం, ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికి రూ.11,500 ఇవ్వడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం పెంచకుండా పనిచేయించుకుంటున్నారు: అన్ని శాఖల రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింప చేశారు. ట్రామా కేర్లో పనిచేసే వారికి మాత్రం లేదు. జీతం పెంచకుండా ఏళ్ల తరబడి పని చేయించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తోంది. --- టి.మధు, బి.వెంకటేశ్వర్లు, ఆంబులెన్స్ డ్రైవర్లు ఎలా బతకాలో అర్థం కావడం లేదు: ట్రామా కేర్లో క్యాడర్ను బట్టి కేవలం రూ.7,200 నుంచి రూ.12,900 ఇస్తున్నారు. మాకు సీనియారిటీ ఉన్నప్పటికీ తక్కువ జీతాలు ఇస్తున్నారు. కొత్తగా చేరేవారికి ఎక్కువగా చెల్లిస్తున్నారు. ఇంత తక్కువ జీతాలతో ఎలా బతకాలో అర్థం కావడం లేదు.---షేక్.రఫీ, ట్రామాకేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి -
శతాబ్ది వేళ..నిధుల గోల
⇒ఓయూను వెంటాడుతున్న నిధుల సమస్య ⇒కొన్నేళ్లుగా నిలిచిపోయిన నియామకాలు.. ⇒కాంట్రాక్టు ఉద్యోగులతో నెట్టుకొస్తున్న అధికారులు... ⇒వందేళ్ల పండుగలోగా సమస్యలు ⇒పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులు.. తార్నాక: వందేళ్లు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నిధుల కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటోంది. జాతీయస్థాయిలో ర్యాంకుల జాబితాలో చోటు సంపాదించుకుంటున్నప్పటికీ వర్సిటీని నిధుల సమస్య పట్టిపీడిస్తోంది. ఎన్నో ఏళ్లుగా నియామకాలు నిలిచిపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. వర్సిటీకి ప్రభుత్వం ఇచ్చే బ్లాక్గ్రాంట్ సరిపోక, వర్సిటీ అంతర్గతంగా నిధులను సమకూర్చుకోలేక సతమతమవుతోంది. మరో వైపు ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న వందలాదిమంది ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్సిటీ వందేళ్ల పండుగ సమయంలోనైనా తమ ఆశలు నెరవేరుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలకే సరిపోని ప్రభుత్వ బ్లాక్గ్రాంట్లు... ప్రభుత్వం యూనివర్సిటికీ ఏటా బ్లాక్గ్రాంటుగా ఇచ్చే నిధులు అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకే సరిపోని పరిస్థితి నెలకొంది. చాలీ చాలని బడ్జెట్తో వర్సిటీ అంతర్గత ని«ధులతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. యేటా ఉద్యోగులు,అధ్యాపకుల వేతనాలు 20శాతం పెరుగుతుండగా, ప్రభుత్వం అందుకు అనుగుణంగా బ్లాక్గ్రాంటును మంజూరు చేయడంలేదు. దీంతో పరీక్షల విభాగం, దూర విద్యా కేంద్రం, సెల్ఫ్ఫైనాన్స్ కోర్సుల ద్వారా వచ్చే నిధులతో గట్టెక్కిస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో వర్సిటీ ఉద్యోగులు, అధ్యాపకుల వేతనాలకు రూ.458కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ.269కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఈ లోటును భర్తీ చేసేందుకు వర్సిటీ నానా తంటాలు పడాల్సి వచ్చింది. తగ్గుతున్న అంతర్గత నిధులు.. ఏటా ఓయూకు అంతర్గతంగా వచ్చే ఆదాయ వనరులు తగ్గుతున్నాయని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఏటా పరీక్షల విభాగం నుంచి వచ్చే ఆదాయంతో పాటు దూర విద్యా కేంద్రం , సెల్ప్ఫైనాన్స్ కోర్సులతో ఆదాయం లభించేది. అయితే దూరవిద్యా కేంద్రంలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా, వర్సిటీ కొత్తగా ఎలాంటి కోర్సులు, ముఖ్యంగా సెల్ఫ్ఫైనాన్స్ కోర్సులు ప్రవేశ పెట్టకపోవడం కూడా ఆదాయం తగ్గుదలకు కారణాలుగా అధ్యాపకులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతోనే.. ఓయూలో ఐదేళ్ల క్రితం అధ్యాపక నియామకాలు జరిగినా, 25 ఏళ్లుగా బోధనేత సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. దీంతో వర్సిటీ కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడి నడుస్తోంది. వర్సిటీలో సుమారు 1800 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తుండగా, దాదాపు 700 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. అయితే వీరికి కనీస వేతన చట్టం అమలు జరగడం లేదు. వేతనాలు, వైద్య , పీఎఫ్ సదుపాయాలు కూడా కల్పించడం లేదు. దీనికితోడు పర్మినెంట్ ఉద్యోగులకు సైతం హెల్త్కార్డులు లేని దుస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని హాస్టళ్లు లేకపోగా, ఉన్న వాటిలో సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని పురాతన భవనాలే కావడంతో ఎప్పుడు కూలుతాయోఅనే భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. వందేళ్ల పండుగకైనా..వెలుగు వచ్చేనా? శతాబ్ది ఉత్సవాల కానుకగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న తమను పర్మినెంట్చేయాలని, పీఎఫ్ సదుపాయం కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని వారు కోరుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటిని నియమించింది. అయితే ఈ కమిటీ నివేదిక ఇచ్చినా తమను పర్మినెంట్ చేస్తారా లేదా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలు ఆర్థిక అంశాలతో ముడివడి ఉన్నందున, వర్సిటీకి నిధుల కేటాయింపుతోనే వీటికి పరిష్కారం లభిస్తుందని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొంటున్నారు. అయితే శతాబ్ది ఉత్సవాల్లోగా తమ సమస్యలు తీరుతాయనే నమ్మకం కనిపించడం లేదని ఉద్యోగులు, కాంట్రాక్టు అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వర్సిటీకి అధిక నిధులు తేవడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. -
వేదన.. అరణ్య రోదన
► కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపని సర్కారు ► అటవీశాఖలో 30 ఏళ్లుగా ఊడిగం ► ఆరంభం నుంచి రూ.7500 జీతంతో బతుకీడుస్తున్న ఏఎఫ్బీఓలు ► ఉద్యోగ భద్రత, జీతాల పెంపు కోసం వేడుకోలు ఎండనక వాననక, అటవీ ప్రాంతంలో క్రూర మృగాల నడుమ పని చేస్తున్నాం. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. అయినా మూడు దశాబ్దాలుగా అరకొర జీతాలతోనే బతుకు వెళ్లదీస్తున్నాం. అటవీ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఆవేదన ఇది. సర్కారు తమను కనికరించి, ఉద్యోగ భద్రతతో పాటు, జీతాలు పెంచి ఆదుకోవాలని ఉద్యోగులు వేడుకొంటున్నారు. అర్ధవీడు : అటవీశాఖలో 1987లో 280 మంది విలేజ్ ఫారెస్ట్ వర్కర్లుగా చేరారు. ప్రభుత్వం 2004లో వీరికి కాంట్రాక్ట్ పద్ధతిపై ఏఎఫ్బీఓలుగా పదోన్నతి కల్పించి జీతం 7500 ఇస్తోంది. 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి కూడా జీతాలు మాత్రం పెంచలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎన్జిఓ అధ్యక్షులు అశోక్బాబు ముఖ్యమంత్రితో చర్చలు జరగపగా ఆయన తమను రెగ్యులర్ చేసేందుకు అంగికరించారని, ఇంకోసారి ఆర్థికమంత్రితో చర్చించి రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్న చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రూ.15వేలుపైగా జీతం చెల్లిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం రూ.7500 ఇవ్వడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఈ జీతాలతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో రెగ్యులర్ చేశారు. తమతో పాటు విలేజ్ ఫారెస్ట్ వర్కర్లుగా చేరిన పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఉద్యోగ భద్రతతో పాటు జీతాలు పెంచారని, వారికి అలవెన్సులు అందజేస్తున్నారని ఇక్కడ మా బతుకులు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ చేయడంతో పాటు జీతాలు పెంచి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కుటుంబ పోషణ భారమైంది నేను 1987 నుంచి వీఎఫ్ఓగా విధుల్లో చేరాను. 2004లో ఏఎఫ్బీఓగా కాంట్రాక్టర్ పద్ధతిలో తీసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు రూ.7500 జీతంతోనే కుటుంబాలు పోషించుకుంటున్నాం. నిన్న, మొన్న చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 15వేలకు పైగా జీతాలు చెల్లిస్తున్నారు. అందరు ఉద్యోగుల్లాగే మేం కూడా పని చేస్తున్నాం. వివక్ష మాని ఉద్యోగాకు రెగ్యులర్ చేయాలి. జిల్లాలో 280 మంది ఇలాంటి పరిస్థితులే అనుభవిస్తున్నారు. – కిఫాయతుల్ల, ఏఎఫ్బీఓ -
రెగ్యులర్ చేయకపోతే సమ్మె తప్పదు
► విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ► కార్మిక మంత్రికి అవగాహన లేదు ► యూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబ్రహ్మాచారి అరసవిల్లి : రాష్ట్రంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజేషన్ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యూఈఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నాగబ్రహ్మాచారీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మె తప్పదని స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని అవోపా కల్యాణ మండపంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెగ్యులరైజేషన్ అంశాన్ని పెట్టి ఇప్పుడు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ, తమిళనాడు , హర్యానా రాష్ట్రాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు అంగీకారం తెలుపుతూ చర్యలకు దిగాయని, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అసెంబ్లీలో విరుచుకుపడటం తప్ప కార్మికుల సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మొత్తం 23 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారనే విషయం కూడా మంత్రికి తెలియకపోవడం దారుణమన్నారు. కేవలం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారని చెప్పడం మంత్రి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై మొదటి దశ పోరాటం చేశామన్నారు. అయినా కనీసం స్పందించకపోవడంతో రెండో దశగా జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇచ్చి త్వరలోనే రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని ప్రకటించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఇది తక్షణమే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సంఘ జిల్లా కార్యదర్శి పి.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘ నాయకులు యోగేశ్వరరావు, విష్ణుమూర్తి, వెంకటేశ్వరరావు, కె.వి.కృష్ణారావు, జి.సుదర్శనరావు, రమణమూర్తి, త్రినాథరావు, కుమారస్వామి, సురేష్ బాబు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
'ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కుదరదు'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రూ.9 నుంచి 10 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి లోటు బడ్జెట్ రూ.24 వేల కోట్లకు చేరే అవకాశముందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా అందుకు అడ్డుగా ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు ఉద్యోగులు కృషి చేయాలని యనమల అన్నారు. మంత్రి తాజా వ్యాఖ్యలతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. -
గాలిలో దీపం.. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం
బాబూ...ఎన్నికల హామీలు నెరవేర్చండి l సీఎంకి చిరుద్యోగుల మొర రాజానగరం : ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత గాలిలో దీపంలా తయారైంది. చేసే పనికి తగ్గట్టు వేతనాలు పొందలేక, ఉద్యోగ భద్రత లేక దిక్కుతోచని పక్షుల్లా అల్లాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు తమ కుటుంబాలను వీధిన పడేయకుండా మేలు చేయాలని వారు కోరుతున్నారు. ఓ వైపు ఉద్యోగ అర్హత వయస్సు దాటిపోతుంటే, మరోవైపు భార్య, పిల్లలతో కుటుంబ భారం కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేథప్యంలో వేరొక ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే తీరిక లేక, ఉన్న ఉద్యోగాలకు గ్యారంటీ లేక చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కూలీకి ఉన్న భద్రత కూడా తమ ఉద్యోగాలకు లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఉప సంఘం వేశారు గానీ... రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా మంత్రి వర్గ ఉపసంఘాన్ని వేస్తే ఈ చిరుద్యోగులు తమకు మేలు చేస్తారని ఆశించారు. రెండున్నరేళ్లు కావొస్తున్నా, ఈ సంఘం తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వలేదు. వీరి ఉద్యోగాలకు భద్రత కల్పించే చర్యలు చేపట్టలేదు. 106,700 మంది తాత్కాలిక ఉద్యోగులు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో 56,700 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 50 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఇచ్చే జీతాలు నెలకు సగటున రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉన్నాయి. వీరు తక్కువ వేతనాలు ఎక్కువ పని భారంతో బాధపడుతున్నారు. విద్యాలయాల్లోనూ తాత్కాలికమే ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులను నియమించి పనులు చేయించుకుంటున్న పాలకులు విద్యాలయాల్లో కూడా అదే పందాను అనుసరిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు, అడ్హక్ అధ్యాపకులు వంటి పేర్లతో తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 4,690 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, యూనివర్సిటీలలో 1650 మంది అడ్హక్ అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. కోర్టు తీర్పుల నెపంతో... వీరి సర్వీసులను రెగ్యులరైజ్ చేసే విషయంలో గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులు ప్రతిబంధకంగా ఉన్నాయంటూ పాలకులు తప్పించుకుంటున్నారనే విమర్శ ఉంది. అది వాస్తవం అయితే కొత్తగా చేసే రిక్రూట్మెంట్లోనైనా మానవతా ధృక్పదంతో వీరికి కొంత ప్రత్యేక కోటా ఇవ్వాలంటూ కోర్టు చేసిన సూచనను పట్టించుకుంటున్నారా? అంటే అదీ లేదు. ఇక నుంచైనా ఇటువంటి నియామకాలకు స్వస్తి పలుకుతున్నారా? అంటే అదీ జరగడం లేదు. ఇప్పటికీ విద్యాలయాల్లో అధ్యాపకులను సైతం రకరకాల పేర్లతో తాత్కాలిక పద్ధతిలోనే తీసుకుంటున్నారు. అటకెక్కిన నిరుద్యోగ భృతి రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తరువాత ఆ మాటలను మరిచారు. ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఆందోళనలు చేపట్టే పరిస్థితులు వద్దు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల్లో ఎక్కువగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేకుండా ఉంది. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇందుకోసం ఆందోళనలు చేపట్టే పరిస్థితులను తీసుకురావొద్దు. – డాక్టర్ కనకరాజు, తెలుగు అధ్యాపకులు, గోకవరం ఉద్యోగ భద్రత లేదు సంవత్సరాల తరబడి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడం లేదు. దీంతో ఉద్యోగ భద్రత కరువై ఏరోజు ఏవిధమైన ఆదేశాలు వస్తాయోననే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవితాలను నెట్టుకొస్తున్నాం. – టి. అమర్కల్యాణ్, కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేష¯ŒS ప్రతినిధి -
'కాంట్రాక్ట్ను మించిన దోపిడీ మరొకటి లేదు'
హైదరాబాద్: ‘‘కాంట్రాక్ట్ వ్యవస్థ అన్యాయమైనది. ఓ వ్యక్తిని పోషించే వ్యవస్థ. ఏ పనీ చేయని మధ్య దళారి, కార్మికుల జీతాల్లో కొంత భాగాన్ని ఎగరేసుకుపోతున్నాడు. ఆ కాంట్రాక్టర్ ఎవరో కార్మికులకూ తెలియదు.. పని చేసే కార్మికులను కాదని ఏ పనీ చేయని కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వడం సరికాదు..ఇంతకు మించిన అన్యాయమైన దోపిడీ వ్యవస్థ మరోకటి ఉండదు.’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరామ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల యాత్రకు సంబంధించిన పోస్టర్ను సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆవిష్కరించారు. విద్యుత్ జేఏసీ సమన్వయకర్త, జేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు నేతృత్వంలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కోదండరామ్ ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అంటూ వేర్వేరుగా పిలుచుకోవడమే కాని రెండింటి మధ్య తేడా లేదన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించమని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదన్నారు. ‘సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ సబ్ స్టేషన్ను కార్మిక యూనియన్ దత్తత తీసుకుని కేవలం రూ.30 వేల ఖర్చుతోనే నిర్వహణ జరుపుతోంది. అదే కాంట్రాక్టర్లు సబ్ స్టేషన్ల నిర్వహణకు రూ.1.50లక్షలు తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ చేసి చూపెట్టిన ఈ పనులను ప్రభుత్వం చేయలేదా?’’ అని కోదండరాం ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో తీవ్ర అవినీతి జరుగుతోంది, భవిష్యత్తులో క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో నిరుద్యోగులు రూ.5లక్షల వరకు ముడుపులు చెల్లించి ఉద్యోగాల్లో చేరుతున్నారని విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు ఆరోపించారు. విద్యుత్ కార్మికుల హక్కుల సాధన కోసం 31వ తేదీ నుంచి 90 రోజుల పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో యాత్రను నిర్వహిస్తామని, అన్ని శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులను ఏకం చేస్తామని యూనియన్ అధ్యక్షులు జి.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, పురుషోత్తం, గురజాల రవీందర్, వెంకట్ రెడ్డి, బైరీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు క్రమబద్ధీకరణ.. సశేషం
ఇప్పటి వరకు కేవలం 64 మందికి నియామక ఉత్తర్వులు - 700 ఫైళ్లకు ఆర్థిక శాఖ అనుమతి - అన్ని శాఖల్లో ఫైళ్లను ఆపేసిన అధికారులు సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ అర్ధాంతరంగానే ఆగిపోయింది. 3 నెలల కిందట అన్ని శాఖల్లో దాదాపు 14 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసింది. ఇప్పటివరకు కేవలం 2 విభాగాల్లో 64 మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 36 మంది, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ పరిధిలో మిగతా ఉద్యోగులు ఈ ఉత్తర్వులు అందుకున్నారు. మిగతా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఫైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు జీవో నం.16 జారీ చేసింది. జీవోలో ఉన్న మార్గదర్శకాల మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఏప్రిల్ చివరి నాటికే ఈ వివరాలన్నిం టినీ పంపించాలని సీఎస్ రాజీవ్శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశిం చారు. 2 నెలల పాటు పురోగతిని సమీక్షించారు. కాగా, ఇప్పటివరకు 15 శాఖల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిలో దాదాపు 700 ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు అనుమతి తెలుపుతూ ఫైళ్లను తిరిగి సంబంధిత శాఖలకు పంపించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వీరిని క్రమబద్ధీకరిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేసే బాధ్యత ఆయా శాఖల ఉన్నతాధికారులపైనే ఉంటుంది. కానీ కొత్త జిల్లాల హడావుడికి తోడు కోర్టులో కేసు ఉందనే సాకుతో కొన్ని శాఖలు ఈ ప్రక్రియను నిలిపేశాయి. ఆందోళన బాటలో కాంట్రాక్టు ఉద్యోగులు ఆర్థిక శాఖ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం 47 విభాగాల పరిధిలో 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. ‘మా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. చెక్లిస్ట్లన్నీ సిద్ధం చేశారు. రోస్టర్ ప్రకారం ప్రతిపాదనలు తయారు చేశారు. మా ఫైళ్లు కమిషనరేట్కు చేరాయి.. అక్కడి నుంచి ఆర్థిక శాఖ అనుమతితో ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ కోర్టులో కేసు ఉందని 3 నెలలుగా రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేయలేదు’ అని కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,800 మంది జూనియర్ లెక్చరర్లు, 126 డిగ్రీ కాలేజీల్లో 926 మంది లెక్చరర్లు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. అధికారుల జాప్యం వల్లే ఇప్పటివరకు వీరికి రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ కాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ పరిధిలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని, కానీ వీరిని క్రమబద్ధీకరించేందుకు రకరకాల సమస్యలున్నాయని అధికారులు గతంలోనే సీఎస్ రాజీవ్శర్మ దృష్టికి తీసుకెళ్లారు. కానీ వీటిని పరిష్కరించి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చే దిశగా చేపట్టే ప్రయత్నాలు ఆగిపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. క్రమబద్ధీకరణ పురోగతిని వారం రోజులకోసారి సమీక్షించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తుతో అటకెక్కినట్లయింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. -
‘దయచేసి ప్రతిపాదనలు పంపకండి’
హైదరాబాద్: ‘దశలవారీగా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం.. అంతేకాదు ఇంటికొక ఉద్యోగం కల్పిస్తాం.. ఉద్యోగాలు కల్పించలేక పోతే ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు ఇస్తాం...’ సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు. వీటిని మర్చిపోక ముందే 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కల చెదిరిపోయింది. నాలుగు రోజుల కిందట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు ఎవరినీ రెగ్యులరైజ్ చెయ్యలేమని చెప్పటం ఇందుకు కారణం. ఆర్థిక శాఖే తిరస్కరించింది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రతిపాదనను స్వయానా ఆర్థిక శాఖే తిరస్కరించిందంటే ప్రభుత్వమే వెనుక నుంచి ఇలా చేయించినట్లు అవగతమవుతుంది. కొన్ని నెలల క్రితం ఆరోగ్యశాఖ నుంచి 3500 మంది ఉద్యోగులకు సంబంధించి రెగ్యులరైజేషన్ ప్రతిపాదన ఆర్థిక శాఖకు పంపిస్తే ఫైలును తిరస్కరించారు. ఆ తర్వాత మళ్లీ ఒకసారి ప్రతిపాదన పంపినా వెనక్కే వచ్చింది. పదే పదే ప్రతిపాదనలు పంపించవద్దని, రెగ్యులరైజేషన్పై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ లేనప్పుడు మీరు ప్రతిపాదనలు పంపించడంలో అర్థం లేదని చెప్పింది. దీంతో ఇక ఏ శాఖ నుంచి కూడా ఉద్యోగుల వివరాలు, వారి వేతనాల వివరాలు, సర్వీసు, తదితర వివరాలేవీ పంపించడం లేదు. మంత్రులే నాన్నెళ్లకోసారి మీటింగు పెట్టి ఏదో ఒకటి మాట్లాడి వెళ్లిపోతున్నారు. కేబినెట్ సబ్కమిటీ ఓ ఎత్తుగడే..! కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం కేబినెట్ సబ్కమిటీని వేయడం కూడా ఓ ఎత్తుగడగానే ఉన్నట్టు కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2014 సెప్టెంబర్ 9న నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్కమిటీ వేస్తే..ఇప్పటి వరకూ ఏమీ తేల్చలేదు. సాంకేతిక కారణాలని, సుప్రీం మార్గదర్శకాలు అడ్డొస్తున్నాయని చెప్పి తప్పించుకుంటున్నారు. ఓవైపు స్వయానా హైకోర్టే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను నియమించుకోవద్దని, శాశ్వత ప్రాతిపదికన నియమించుకోవాలని చెబుతున్నా ప్రస్తుతం ఉన్న వారికి హామీ ఇవ్వడం లేదు. వేతనాలు కూడా లేవు.. రాష్ట్రంలో 40 వేల మంది వరకూ కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు రాక మూడు నెలలయింది. పశ్చిమ గోదావరి లాంటి కొన్ని జిల్లాల్లో 5 నెలల దాటినా జీతాలు లేవు. కాంట్రాక్టు వేతన జీవులు నెలకు రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే తీసుకునే వారున్నారు. ఆ ఇచ్చే వేతనం కూడా నెలల తరబడి రాకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. 2016 ఆగస్ట్ 31తో వీరి పదవీకాలం ముగిసింది. అయినా ఇప్పటివరకూ కొనసాగింపు ఉత్తర్వులివ్వలేదు. -
తుది దశకు..
వేగంగా పునర్విభజన ప్రక్రియ ఇందూరు : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కసరత్తు దాదాపు తుది దశకు చేరుకుంది. దసరా నుంచే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వేర్వేరుగా పరిపాలన జరిగాలని రాష్ట్ర సర్కారు స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం బిజీగా మారింది. కొత్త జిల్లాల మ్యాపులు, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ, ఇతర జిల్లా ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కొత్త మండలాల్లో ఏర్పాటు చేసే మండల కార్యాలయాల పరిశీలనతో మొదలైన ప్రక్రియ ఫైళ్ల విభజన, స్కానింగ్, ఉద్యోగుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, వాహనాలు, ఫర్నిచర్ వరకు విభజన ప్రక్రియ ఈ పాటికే 90 శాతం పూర్తయింది. మిగిలిన పది శాతం పని ఆదివారం పూర్తిచేసి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇక కలెక్టరేట్కు వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. రెండో శనివారం, ఆదివారం సెలవులు రద్దు చేసి పునర్విభజన పనులను కలెక్టర్ యోగితారాణా చక చకా చేయిస్తున్నారు. ఏ అధికారికి, ఉద్యోగికి సెలవులు మంజూరు చేయడం లేదు. వివరాలు పోర్టర్లో నమోదు చేయాలి.. కొత్తగా ఏర్పాటు కానున్న కామారెడ్డి జిల్లా కార్యాలయం, బాన్సువాడ రెవెన్యూ కార్యాలయం, తొమ్మిది మండల కార్యాలయాల ఫైళ్ల విభజన, స్కానింగ్, పరికరాలు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సమాచారాన్ని పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. శనివారం ప్రగతి భవన్లో జిల్లా అధికారులతో జరిగిన జిల్లాల పునర్విభజన సమావేశంలో కలెక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. సదరు నమోదులపై సంబంధిత శాఖ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, దీంతోపాటు శాఖల్లో పని చేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు కూడా నమోదు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులను ప్రతిపాదించాలన్నారు. ఉదాహరణకు ఆర్మూర్ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు డిమాండ్ ఉన్నందున, ఆ యూనిట్లను ప్రోత్రహించేందుకు ఒక పరిశ్రమల విభాగాన్ని ప్రతిపాదించాలని చెప్పారు. అలాగే రాష్ట్ర్ట ప్రభుత్వం అన్ని పాఠశాలలను డిజిటల్ బోధనతో అనుసంధానం చేస్తున్నందున డివిజన్ స్థాయిలో డిజిటల్ బోధనను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఐకేపీ, ఆరోగ్యం, ఐసీడీఎస్ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు డివిజన్ స్థాయిలో వ్యవస్థ పరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయాల్లో వినియోగిస్తున్న ఫర్నిచర్కు కూడా వారితో తరలించాలని స్పష్టం చేశారు. ఏ శాఖకు కూడా కొత్తగా ఫర్నిచర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉన్నదానితోనే పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎ, రవీందర్రెడ్డి, డీఆర్వో పద్మాకర్, డీడీ గ్రౌండ్ వాటర్ జగన్మోహన్ ఉన్నారు. 1,150కు చేరిన అభ్యంతరాలు జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మండలాల ఏర్పాటు, గ్రామాల మార్పులు–చేర్పులపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సెల్కు అభ్యంతరాలు, వినతులు అందుతూనే ఉన్నాయి. శనివారం వరకు 1,150 నమోదయ్యాయి. వచ్చిన అభ్యంతరాలలో తమ గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని, పాత మండలాల్లోనే కొనసాగించాలని, వద్దని, కామారెడ్డి జిల్లాలోనే మండలాన్ని, గ్రామాన్ని ఉంచాలని, వద్దని ఎక్కువ మొత్తంలో అభ్యంతరాలు, వినతులు అందాయి. ఈ నెల 21 వరకు అవకాశం ఉండడంతో అభ్యంతరాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం కొత్త మండలాలకు డిమాండ్ పెరగడంతో ఏడు మండలాలను పరిశీలన చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. అభ్యంతరాలు, వినతులు స్వీకరణ గడువు ముగిసిన తరువాత జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. అనంతరం సర్కారు వాటిని పరిశీలించి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పూర్తి స్వరూపంతో తుది జాబితాను ప్రకటించనుంది. -
కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
మిర్యాలగూడ : విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక నూకల వెంకట్రెడ్డి ఫంక్షన్హా ల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్శాఖలో ఖాళీగా ఉన్న 30 వేల పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల పని భారం పెరుగుతుందన్నారు. ఉద్యోగంలో ఉండి ప్రమాదంలో చనిపోయిన సిబ్బందికి కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్పీడీసీఎల్లో 1,175 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి మంత్రి జగదీశ్రెడ్డి సహకరించారన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు డిస్కం అద్యక్షులు వేణు, డిస్కం కార్యదర్శి సాయిబాబు, డివిజన్ కార్యదర్శి కాతోజు సోమాచారి, మేరెడ్డి రాంరెడ్డి, సలీం పాల్గొన్నారు. -
తెలంగాణ వచ్చినా మావి బిక్షపు బతుకులే
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తెలంగాణ కాంట్రాక్టు 2వ ఏఎన్ఎంల ఆధ్వర్యంలో బిక్షాటన చేశారు. రాష్ట్రంలో 4వేల మంది 2వ ఎఎన్ఎంలు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని, గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కూడ ఇక మా బతుకులు బిక్షపు బతుకులుగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆర్.వాణి, కుమార్, కిరణ్మయి, మమత, రజిత, సమత, సబిత తదితరులు పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరణ ఎప్పుడో?
ఆందోళనలో కాంట్రాక్టు ఉద్యోగులు తెలంగాణలో సంబరాలు... ఇక్కడ నిట్టూర్పులు టీడీపీ హామీ విస్మరించిందంటూ సర్వత్రా విమర్శలు గుంటూరు వెస్ట్: అధికారం చేపడితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ రూపుదాల్చలేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపశమనం లభించలేదు. క్రమబద్ధీకరణ కోసం నియమించిన కమిటీ సమావేశాల పేరుతో కాలయాపన చేయడం మినహా సాధించిందేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం సుమారు 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. అంతటితో ఆగకుండా ఉద్యోగుల కుటుంబంలోని సభ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంబరాలు నిర్వహిస్తోంది. కమిటీతో కాలక్షేపం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 13,671 మంది, ప్రభుత్వరంగ సంస్థల్లో 43,043 మంది మొత్తంగా 56,714 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరుకాక ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 50 వేల మంది ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకష్ణుడు నేతత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీని నియమించింది. కమిటీ ఇప్పటికే రెండు మూడుసార్లు భేటీ అయినా ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతున్న కమిటీ ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో సక్రమంగా స్పందించకపోవడంపట్ల ఉద్యోగుల నుంచి తీవ్రవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిత్తశుద్ధి ఏదీ... గుంటూరు జిల్లాలో సుమారు 803మంది, కష్ణాజిల్లాలో 442మంది వరకూ కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా రెవెన్యూ, మెడికల్, వ్యవసాయశాఖ, ఆర్అండ్బీ, డ్వామా, డీఆర్డీఏ, శిశు, మహిళా, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమశాఖలు తదితర ప్రభుత్వశాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆఫీస్ సబార్డినేట్స్, కంప్యూటర్ ఆపరేటర్లు తదితర హోదాల్లో పనిచేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్/టైపిస్టుకు నెలకు రూ.8400, ఆఫీసు సబార్డినేట్కు రూ.7 వేలు చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నా పాలకులు వాటిని విస్మరిస్తున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేతనాలు పెంచినప్పటికీ ఇందుకు సంబంధించిన జీఓ ఇంకా విడుదల కాకపోవడం, రెండు, మూడునెలలకొకసారి జీతాలు అందిస్తుండడం తమ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండేది ఎప్పుడు? ఓ కాంట్రాక్టు ఉద్యోగి 20 ఏళ్ల నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నా. ప్రభుత్వం ఇస్తున్న వేతనంతో కుటుంబాన్ని నడపడం కష్టంగా ఉంది. ఇప్పుడు బైటకు వెళ్లి మరో ఉద్యోగం చేయలేని పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు తమ జీతాలు పెంచుకుంటూ లక్షల రూపాయలు పొందుతున్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటు ఉంటూ విధులు నిర్వహించే మాకు అరకొర జీతాలే. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీని నమ్మి ఓట్లు వేశాం. టీడీపీ అధికారం చేపట్టాక కాంట్రాక్టు ఉద్యోగులను విస్మరించడం బాధాకరం. మా జీవితాల్లో వెలుగులు నిండేది ఎప్పుడు? ప్రభుత్వం మా ఉద్యోగాలు వెంటనే క్రమబద్ధీకరించాలి. చట్టసవరణలు చేసైనా క్రమబద్ధీకరించాలి వై.నేతాజీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బేసిక్ వేతనాలను కూడా ఇవ్వడం లేదు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు కానీ ఆ విషయాన్ని ఇంతవరకూ తేల్చలేదు. అవసరమైతే అసెంబ్లీలో చట్టసవరణలు చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. -
12 పోస్టులు.. రూ.16లక్షలు!
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. 12 మంది సిబ్బందిని రెగ్యులర్ చేసేందుకు ‘లక్ష’ణంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. వారి వద్ద రూ.16లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని ఓ ‘సెస్’ ఉద్యోగి వసూలుచేసి పనికాగానే పంపిణీ చేసేందుకు సిద్ధంచేశారు. సహకార రంగంలో ఉత్తమ సేవలందించే విద్యుత్ సంస్థలో కాసుల వసూళ్ల పర్వం సంస్థ ప్రతిష్టను దిగజార్చుతోంది. -సిరిసిల్ల ♦ సెస్లో కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీకి గ్రీన్సిగ్నల్ ♦ రూ.16 లక్షలు వసూలు ♦ సిబ్బందే మధ్యవర్తులు ♦ 12 మందికి ఉద్యోగాలిచ్చేందుకు ఫైల్ సిద్ధం ♦ యూనియన్లతో అంగీకారపత్రాలకు ఒత్తిళ్లు ఏం జరుగుతోంది ..? సిరిసిల్ల ‘సెస్’లో ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.10,500 చొప్పున వేతనమిస్తున్నారు. వీరితోపాటు మరో ఐదుగురు డ్రైవర్లు, ఇద్దరు వాచ్మెన్లు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లతో ఒక్కరికి డిగ్రీ లేని కారణంగా అర్హత పొందలేకపోయారు. మరో ఐదురుగు కంప్యూటర్ ఆపరేటర్లు, ఐదుగురు డ్రైవర్లు, ఇద్దరు వాచ్మెన్లను పర్మినెంట్ చేసేందుకు ఫైల్సిద్ధంచేశారు. తమను పర్మినెంట్ చేయాలని ఇప్పటికే డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు పన్నెండు మందిని పర్మినెంట్ చేసేందుకు రూ.16లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఎనిమిదిమంది వద్ద రూ.రెండు లక్షల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. తెర వెనుక అసలు కథ.. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయమని జీవో ఇచ్చింది. అరుుతే సహకార సంస్థ ‘సెస్’కు ఆ జీవో వర్తించదని ‘సెస్’ వర్గాలు పేర్కొంటున్నాయి. 1995 బైలా ప్రకారం ఉద్యోగుల నియామకాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అరుుతే ఈ 12 మందిని నియమించుకునేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఎన్పీడీసీఎల్ రూల్స్ ప్రకారం నియూమకాలు చేయాలన్నా.. అక్కడ ఇంకా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరేషన్ జరగడం లేదు. మరోవైపు ‘సెస్’ లో పనిచేసే ఉద్యోగులు కాసులు వసూలుచేసి పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టించి ఫైల్ను నడుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ‘సెస్’ పాలకవర్గం సై తం తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తోంది. పన్నెండు నియమకానికి సంబంధించిన ‘సెస్’ పనిచేసే ఉద్యోగుల సంఘాల తో ముఖ్య అధికారులు చర్చించినట్లు సమాచారం. యూనియన్ నాయకులతో ఈ నియూమకాలపై తమ కు అభ్యంతరం లేదని రాత పూర్వకంగా రాయించుకు నే ప్రయత్నంచేశారు. ఎంప్లాయూస్ యూనియన్ నా యకులు దీనికి నిరాకరించారు. మొత్తం వ్యవహా రంలో ‘లక్ష’ణంగా పని కానిచ్చేందుకు ‘సెస్’ ఉద్యోగు లే ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. రూల్ప్రకా రం ఉద్యోగ నియూమకాలు చేస్తున్నప్పుడు ఈ డబ్బు వసూళ్లు ఏంటని ‘సెస్’లోని మరో వర్గం వాదిస్తోంది. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే ఫైల్ నిబంధనల ప్రకారం సర్క్యులేట్ అవుతుంది. ‘సెస్’ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాం. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని జీవో ఇచ్చింది. దానిప్రకారం అర్హతలను పరిశీలిస్తున్నాం. డబ్బుల వసూలు వ్యవహారం నాకు తెలియదు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే చర్య తీసుకుంటాం. - కె.నాంపల్లిగుట్ట,‘సెస్’ ఎండీ -
క్రమబద్ధీకరణపై ఎందుకింత ఆలస్యం?
* కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ జాప్యంపై సీఎస్ ఆగ్రహం * 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 4 వేల ప్రతిపాదనలేనా? * వారానికోసారి పురోగతిని సమీక్షించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయా శాఖలకు సూచించారు. సచివాలయంలో గురువారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పురోగతిపై సీఎస్ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్షించారు. ఇప్పటివరకు 12 శాఖల నుంచి కేవలం 4 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలు మాత్రమే తమకు అందాయని ఆర్థిక శాఖ అధికారులు సీఎస్కు నివేదించారు. రాష్ట్రంలో 20 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేయగా, ఇప్పటివరకు అందులో నాలుగో వంతు ప్రతిపాదనలు కూడా ఎందుకు రాలేదని సీఎస్ ముఖ్య కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలోనే స్పష్టమైన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు విడుదల చేసినప్పటికీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వకపోవటంపట్ల అసహనం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ, విద్యాశాఖల పరిధిలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని, కానీ వీరిని క్రమబద్ధీకరించేందుకు రకరకాల అడ్డంకులున్నాయని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటినీ ఒక్కటొక్కటిగా పరిష్కరించాల్సిన అవసరముందని, అందుకే ఆలస్యమవుతోందని గుర్తించారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల కింద పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలా.. లేదా అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. మార్గదర్శకాలకు భిన్నమైన సమస్యలు, ప్రత్యేకమైన కేసులేమైనా ఉంటే, వాటిని ప్రత్యేకంగానే పరిగణించాలని సీఎస్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. క్రమబద్ధీకరణ పురోగతిని వారం రోజులకోసారి సమీక్షించాలని సీఎస్ అధికారులకు సూచించారు. 18న కాంట్రాక్టు ఉద్యోగుల భేటీ మరోవైపు క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరింత జాప్యం చేస్తుండటంపట్ల కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18న హైదరాబాద్లో సమావేశమై కార్యాచరణ రూపొం దించేందుకు సిద్ధమవుతున్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ డిమాండ్ చేశారు. -
క్రమబద్ధీకరణకు అర్హుల వడపోత
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకోసం ప్రభుత్వం అర్హుల వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఉద్యోగుల ప్రతిపాదనలు పంపించాలని ఆర్థిక శాఖ ఇదివరకే అన్ని శాఖలకు లేఖ రాసింది. మార్చి నెలాఖరులో అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, అవసరమైన సమాచారాన్ని వేగంగా పంపించాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీంతో అన్ని శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వడపోత మొదలైంది. ఆర్థిక శాఖ జారీ చేసిన చెక్లిస్ట్ ప్రకారం ప్రతిపాదనలను తయారు చేసే పనిలో పడ్డాయి. ఫిబ్రవరిలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక శాఖ ఈ చెక్లిస్ట్ను రూపొందించింది. ఇందులో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, స్థానికత వివరాలు, ఉద్యోగంలో చేరిన తేదీ (రుజువు చేసే పత్రం), ఫుల్టైమా లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియమితులయ్యారా..? ప్రస్తుత నెలసరి జీతం, ఏ పోస్టులో క్రమబద్ధీకరించాలని ప్రతిపాదిస్తున్నారు..? ఆ పోస్టు మంజూరు తేదీ, జీవో వివరాలు, రోస్టర్ పాయింట్, లోకల్ కేడర్, సంబంధిత పోస్టుకు ఉండాల్సిన అర్హతలు, సదరు ఉద్యోగికి ఉన్న అర్హతలు(ధ్రువీకరణ పత్రాలు), 2014 జూన్ 2 నాటికి ఉద్యోగంలో ఉన్నారా.. ఇప్పటికీ కొనసాగుతున్నారా..? అనే వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఈ చెక్లిస్ట్ ప్రకారం అందిన ఉద్యోగుల ప్రతిపాదలను పరిశీలించి క్రమబద్ధీకరణకు అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ విద్యలో అధికంగా కాంట్రాక్టు ఉద్యోగులు మరోవైపు మంజూరీ పోస్టులు లేకున్నా ఏళ్లకేళ్లుగా జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న దాదాపు 745 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు సైతం తమను రెగ్యులరైజ్ చేయాలని మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు ఆర్థిక శాఖ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం 47 విభాగాల పరిధిలో 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా 5,757 మంది ఇంటర్మీడియెట్ విద్య, 2,473 మంది ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలోనే ఉన్నారు. పంచాయతీరాజ్ పరిధిలో 823, మున్సిపల్ శాఖలో 732, పాఠశాల విద్యా విభాగంలో 714, కళాశాల విద్యా విభాగం పరిధిలో 667, ఉపాధి శిక్షణ విభాగంలో 445, సాంకేతిక విద్యా విభాగంలో 412, మహిళా శిశు సంక్షేమంలో 319. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 228 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. -
అత్యధిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి: ఈటల
సాక్షి, హైదరాబాద్: అత్యధిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆర్థికమంత్రి ఈటల రాజేం దర్ తెలిపారు. 25,589 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయా శాఖలల్లో పనిచేస్తున్నట్లు హెచ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం ఇప్పటివరకు వివరాలు వచ్చాయన్నారు. ఉన్నతవిద్యలో 7,434, వైద్యశాఖలో 6,186, పంచాయతీరాజ్లో 3,454, సోషల్ వెల్ఫేర్లో 1,370 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఖాళీలు ఉన్నచోట నియామకాలు జరిగినవి, 2014 జూన్ 2 కు ముందు సర్వీసులో చేరినవారు, ప్రతినెలా జీతాలు తీసుకుంటున్నవారు, పార్ట్టైం జాబ్ చేయనివారు, అనుమతి లేకుండా విధులకు దూరం కాకపోవడం, ఇతరత్రా క్రమశిక్షణ చర్యలు తీసుకోనివారు, రిజర్వేషన్ విధానంలో రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, తదితరులకు ప్రాధాన్యం వంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ముఖ్యమైన అంశాల ప్రాతిపదికన వీటిని చేపడతామని మంత్రి తెలిపారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కర్నె ప్రభాకర్, గంగాధర్గౌడ్ అడిగిన ప్రశ్నకు విపక్ష నేత షబ్బీర్అలీ, పొంగులేటి సుధాకరరెడ్డి, ఎన్.రామచంద్రరావు, పాతూరి సుధాకరరెడ్డి, పూల రవీందర్, ఎమ్మెస్ ప్రభాకర్రావు వేసిన ఉపప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. -
ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయలేం
♦ బడ్జెట్ చర్చకు సమాధానం సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడి ♦ 20 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటాం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బడ్జెట్ మీద జరిగిన చర్చకు శుక్రవారం శాసనసభలో ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు. 20 వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే చర్యలు చేపట్టామని, త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిధులు ఉండే పీడీ ఖాతాల్లో సొమ్ము వాడుకున్న మాట వాస్తవమేనని అం గీకరించారు. అలా వాడుకోవడం నేరమేమీ కాదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు పీడీ ఖాతాల్లో సొమ్మును వాడుకొని, తర్వాత సర్దుబాటు చేయడం మామూలేనని వివరణ ఇచ్చారు. గత రెండు బడ్జెట్లలో యువతకు పెద్దగా ప్రాధాన్యమివ్వలేదని అంగీకరించారు. త్వరలో ‘యువజన విధానం’ తీసుకురానున్నామని చెప్పారు. యనమల చెప్పిన ముఖ్య విషయాలు.. ► కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా సహకారం అందాల్సి ఉంది. రాబడి ఆశించినంతగా పెరగడం లేదు. అప్పులు చేసైనా స్వర్ణాంధ్రకు బాటలు వేస్తాం. పన్నులు, కేంద్రసాయంతో ప్రభుత్వానికి రాబ డి వస్తుంది. అది సరిపోకపోతే అప్పే దిక్కు. ► 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల్లో అవాస్తవాలున్నాయని ప్రతిపక్షం విమర్శించింది.సవరించిన అంచనాలన్నీ తాత్కాలిక గణాంకాలే. వాస్తవ గణాంకాలు ఆడిట్ తర్వాత వస్తాయి. ► 2016-17లో ప్రణాళికేతర వ్యయం 16 శాతం పెరిగింది. ఈ వ్య యాన్ని 8 శాతం తగ్గించాం.ప్రణాళికా వ్యయం పెరిగిందంటే.. రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉందని అర్థం. ►నష్టాల్లో ఉన్న చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహకాలు ప్రకటించాం. ఫెర్రోఅల్లాయ్స్, స్పిన్నింగ్, చక్కెర పరిశ్రమలకూ ప్రోత్సాహకాలు ఇచ్చాం. ► పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి యత్నిస్తున్నాం. చైనా ప్రతిపాదిస్తున్న సిల్క్రూట్కు కేంద్రం అంగీకరిస్తే.. అమరావతి ‘ఆగ్నేయ ఆసియా ముఖద్వారం’గా మారడం ఖాయం. గాలిలో చేపల ఉత్పత్తి చేయడం లేదు: మంత్రి పుల్లారావు ఫిషరీస్లో 32 శాతం వృద్ధిరేటు సాధించామని తాము చెబుతుంటే, ప్రతిపక్ష సభ్యులు ఎగతాళి చేస్తున్నారని వ్యవసాయ బడ్జెట్పై సమాధానం సందర్భంగా ఆ శాఖ మంత్రి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. తాము గాల్లో చేపలు ఉత్పత్తి చేయడం లేదన్నారు. ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేమని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. బడ్జెట్ చర్చపై మంత్రి శుక్రవారం శాసన మండలిలో సమాధానం ఇచ్చారు. దాదాపు 63 వేల మంది ఔట్సోర్సింగ్, 16 వేల మంది కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేనందున జీతాలు పెంచే ఆలోచన ఉందన్నారు. -
‘104’ ప్రైవేటుకు రంగం సిద్ధం
నెలాఖరుకు కసరత్తు పూర్తి లక్షలాదిమంది రోగుల పరిస్థితి అగమ్యగోచరమే వీధిన పడనున్న 1,670 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు సమాయత్తం ఫిబ్రవరి 1న చలో కమిషనరేట్ నిర్వహిస్తున్నట్టు వెల్లడి సాక్షి, హైదరాబాద్: సంచార వైద్య శాలల(104 వాహనాలు) నిర్వహణ బాధ్యత నుంచి ఏపీ ప్రభుత్వం తప్పుకోనుంది. వీటిని ప్రైవేటుకు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండుసార్లు టెండర్ల నోటిఫికేషన్ను ఇచ్చినప్పటికీ ఎవరూ రాలేదు. అయితే పట్టువదలని ప్రభుత్వం మరోసారి టెండర్ల ప్రక్రియను చేపట్టడమేగాక.. 104 వాహనాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల ఐదున మళ్లీ టెండర్లను ఆహ్వానించగా ఆరు కంపెనీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన సాంకేతిక పరిశీలన(టెక్నికల్ ఎవాల్యుయేషన్) జరుగుతోంది. ఈ నెలాఖరుకల్లా వీటిలో ఒక కంపెనీని ఎంపిక చేసి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం దానికి అప్పజెప్పనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు.. ముఖ్యంగా పేదలకు ప్రస్తుతం 104 వాహనాల ద్వారా అందుతున్న వైద్యం అందుతోంది. నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగిస్తే.. ఇకమీదట వారికీ వైద్యం అందడం గగనమే. అదే సమయంలో 104 వాహనాల్లో పనిచేస్తున్న 1,670 మంది కాంట్రాక్టు సిబ్బంది వీధిన పడడం ఖాయంగా కనిపిస్తోంది. పేదరోగుల పరిస్థితి అగమ్యగోచరమే! సంచార వైద్యశాలలుగా పేరున్న 104 వాహనాల నిర్వహణ ప్రైవేటుకిస్తే పల్లెల్లోని పేద రోగుల పరిస్థితి ఏమిటన్నది అగమ్యగోచరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా లక్షలాదిమంది 104 వాహనాలద్వారా ఇచ్చే మందులపై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వాసుపత్రులకు వెళ్లలేక, వెళ్లినా అక్కడ మందులు దొరకని పరిస్థితుల్లో వృద్ధులకు 104 వాహనాల నుంచి వచ్చే మందులు ప్రాణాధారమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వాహనాలు జిల్లా వైద్యాధికారుల సమక్షంలో నడుస్తున్నాయి. 1,670 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతినెలా వీరు 18,191 గ్రామాలకు వెళ్లి వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్యమందిస్తున్నారు. అలాంటి ఈ వాహనాల్ని నిర్వహణ కష్టసాధ్యమంటూ ప్రైవేటుకివ్వడాన్ని రోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీటిని ప్రైవేటుకిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆందోళనలో ఉద్యోగులు మరోవైపు 104 వాహనాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడాన్ని వాటిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను క్రమబద్ధీకరిస్తారని ఆశతో ఎదురుచూస్తుంటే ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించడం దుర్మార్గమని వాపోతున్నారు. ఇందుకు నిరసనగా ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. దీనిపై 104 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జె.సింహాచలం మాట్లాడుతూ 104 ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏడేళ్లుగా పల్లెలకు వెళ్లి సేవలందిస్తున్నామని, ఇప్పుడు ప్రైవేటుకిస్తే తమ కుటుంబాలు ఏం కావాలన్నారు. టెన్మెన్ కమిటీ రిపోర్టు ఆధారంగా డేట్ ఆఫ్ జాయినింగ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జిల్లా ఎంపిక కమిటీ ద్వారా జేడీ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టారని, ఈ పరిస్థితుల్లో క్రమబద్ధీకరణ చేయాల్సిందిపోయి ప్రైవేటుకివ్వడం దుర్మార్గమన్నారు. ఇందుకు నిరసనగా ఫిబ్రవరి 1న చలో కమిషనరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. -
ఆరోగ్య మిత్ర ఉద్యోగుల అందోళన
-
ఏపీలో కేసీఆర్కు ఫ్లెక్సీ
వై.రామవరం: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును అభినందిస్తూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఫ్లెక్సీలు కట్టింది. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల చీకటి జీవితాలకు వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రి వర్యులు’ అన్న విశేషణంతో ‘శతకోటి అభివందనములు’ చెబుతూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్లో శుక్రవారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించడంగా భావించిన టీడీపీ నేతలు వాటిని తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని కోరారు. -
ఉద్యోగుల విభజన తర్వాతే వైద్య పోస్టుల భర్తీ!
వైద్య, పారామెడికల్ అభ్యర్థుల ఆశలపై సర్కారు నీళ్లు అన్ని ఆసుపత్రుల్లో కలిపి 3 వేలకు పైగా ఖాళీలు కనీసం కొత్త పోస్టుల మంజూరుపైనా స్పందించని సర్కారు మరింత ఆలస్యం కానున్న నియామకాల ప్రక్రియ 2 వేల మంది ‘కాంట్రాక్టు’ ఉద్యోగుల జాబితా తయారు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వైద్య, పారామెడికల్ అభ్యర్థుల ఆశలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నీళ్లు చల్లింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ ముగిశాకే.. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే కొత్తగా మంజూరైన పోస్టులను మాత్రం భర్తీ చేస్తామని సంకేతాలు ఇస్తోంది. ఈ నిర్ణయం వైద్య, పారామెడికల్ అభ్యర్థులకు శరాఘాతంగా మారింది. తుస్సుమన్న హడావుడి.. ఇటీవల వైద్య పోస్టులను భర్తీ చేస్తామని, ఖాళీల వివరాలను ఆగమేఘాల మీద అందజేయాలని అధికారులను ఆదేశించి సర్కారు హడావుడి చేసింది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు ఖాళీల వివరాలను సేకరించి సర్కారుకు అందజేశారు. మొత్తంగా మూడు వేలకుపైగా వైద్య, పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. దీనికి సంబంధించి 300 వైద్యుల పోస్టులతో పాటు నర్సింగ్, ఇతర పారామెడికల్ పోస్టులతో జాబితా కూడా రూపొందించారు. కానీ వాటిని ఇప్పుడే భర్తీ చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. భారీ లక్ష్యం.. చర్యలు శూన్యం వైద్య ఆరోగ్యశాఖను, ఆస్పత్రులను బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసింది. కానీ కీలకమైన సిబ్బంది నియామకాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. ప్రతి జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని, 20 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ప్రతి నియోజకవర్గంలో వంద గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఏరియా ఆసుపత్రి ఉండాలని గతంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పీహెచ్సీలను 30 పడకల ఆస్పత్రులుగా, ఏరియా ఆసుపత్రులను 100 పడకలుగా, జిల్లా ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చుతామనీ చెప్పారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే కనీసం 10 వేలకు పైగా వైద్య, పారామెడికల్ సిబ్బంది అవసరమని ఆ శాఖే అంచనా వేసింది. కానీ ఖాళీగా ఉన్న 3 వేల పోస్టుల భర్తీపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కొత్తగా మంజూరైన కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ, వరంగల్ ఎంజీఎంల్లోనే భర్తీకి చర్యలు చేపట్టింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక ఖాళీ పోస్టుల భర్తీ మొదలుపెడతామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి చెప్పారు. రెండు వేల కాంట్రాక్టు పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలో రెండు వేల కాంట్రాక్టు పోస్టులున్నట్లు అధికారులు గుర్తించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడిన తర్వాత రెండు వేల మందిలో ఎందరు అర్హులుగా తేలతారనేదానిపై చర్చ జరుగుతోంది. అనుభవం, రిజర్వేషన్ సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే క్రమబద్ధీకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. -
నెలాఖరులోగా ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ
-
నెలాఖరులోగా ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ
- రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం - ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు - 15,628 టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం - ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం కాలుష్య భత్యం - దరఖాస్తు చేసుకున్న వారంలో కారుణ్య నియామకాలు - చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు, భద్రత - 40 టీఎంసీల సామర్థ్యంతో ‘గ్రేటర్’కు రెండు తాగునీటి జలాశయాలు, ఆస్తి పన్ను రాయితీ, నల్లా బిల్లు బకాయిల మాఫీ - సుదీర్ఘంగా 11 గంటలపాటు కేబినెట్ సమావేశం సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. కొత్త పంథాలో బడ్జెట్ తయారీకి రూపకల్పన చేయటంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెలాఖరులోగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినేట్ ఆదేశించింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది. దాదాపు 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని సీఎం కేసీఆర్ ఉజ్జాయింపుగా వెల్లడించారు. ‘తొలిసారిగా జరిగిన కాంట్రాక్టు నియామకాల్లో రిజర్వేషన్లను పాటించలేదు. ఆ తర్వాత పాటించారు. అందుకే ఈ రెగ్యులరైజేషన్తో రిజర్వేషన్ రోస్టర్ నిబంధనలకు ఇబ్బంది కలిగితే సంబంధిత కేటగిరీలో అవసరమైనన్ని బ్యాక్లాగ్ పోస్టులు సృష్టించి తర్వాత వాటిని భర్తీ చేస్తాం. అవినీతి, పైరవీలకు ఆస్కారం లేకుండా అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. శాఖల వారీగా ఉద్యోగులు, విధివిధానాలు త్వరలోనే ఖరారవుతాయి’ అని సీఎం వెల్లడించారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచే పెరిగిన వేతనం అమల్లోకి రానుంది. మూడు కేటగిరీలుగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో రూ.6,700 జీతం పొందుతున్న వారికి రూ.12 వేలు, రూ.8,400 వేతనం ఉన్న వారికి రూ.15 వేలు, రూ.10,900 వేతనం పొందుతున్న వారికి రూ.17 వేలకు పెంచింది. ప్రభుత్వానికి దాదాపు రూ.400 కోట్ల అదనపు భారమైనప్పటికీ సరిపడేంత వేతనం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో 15,628 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అందులో 1,225 ఉర్దూ పాఠశాలల పోస్టులున్నాయి. శనివారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు సుదీర్ఘంగా పదకొండు గంటల పాటు కేబినెట్ సమావేశమైంది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ ఇంత సుదీర్ఘంగా కేబినేట్ సమావేశం కావటం ఇదే మొదటిసారి. మారియట్ హోటల్లో మధ్యాహ్న భోజనానికి, డిప్యూటీ సీఎం మనుమరాలి వివాహానికి సీఎం సహా మంత్రులు వెళ్లటంతో కేబినేట్ మధ్యలో రెండుసార్లు దాదాపు గంట పాటు విరామం ఇచ్చారు. కేబినేట్లో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం, పద్మారావు సీఎం వెంట ఉన్నారు. దాదాపు అరవై అంశాలకుపైగా ఇందులో చర్చించారు. సీఎం వెల్లడించిన ముఖ్యాంశాలివీ.. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేలకు పైగా ఉన్న హెయిర్ సెలూన్స్కు వాణిజ్య కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారు. వాటిని గృహాల కేటగిరీకి మార్చాలని ఎన్నో ఏళ్లుగా నాయి బ్రాహ్మణులు కోరుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి మేరకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే సెలూన్లను గృహ కేటగిరీ కిందకి మార్చాలని నిర్ణయించాం. అందుకు సంబంధించిన రూ.144 కోట్లను ప్రభుత్వం రూ.144 కోట్లు సబ్సిడీగా చెల్లిస్తుంది. ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం భద్రత కల్పిస్తాం. వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో రుణాల మంజూరీలో సహకరిస్తాం. వారిపై వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ పోలీసులు కాలుష్యం బారిన పడి తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. వీరికి చెల్లిస్తున్న మూల వేతనంపై 30 శాతం అదనంగా కాలుష్య భత్యం చెల్లించాలని నిర్ణయించాం. నేటి నుంచే (జనవరి 3) దీన్ని అమలు చేస్తాం. హైదరాబాద్ నగరానికి ఎప్పుడో నిజాం నవాబు నిర్మించిన హిమాయత్నగర్, గండిపేట జలాశయాలే ఇప్పటికీ దిక్కు. హైదరాబాద్ను గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకునే గత పాలకులు నగరానికి తాగునీటి రిజర్వాయర్లను నిర్మించలేకపోయారు. దేశంలోని ఏ చిన్న నగరాన్ని చూసినా దానికి సమీపంలోనే తాగునీటి జలాశయం కనిపిస్తుంది. హైదరాబాద్ నగర శివార్లలో సైతం 40 టీఎంసీల సామర్థ్యంతో కేవలం తాగునీటి అవసరాల కోసం రెండు జలాశయాలను నిర్మిస్తాం. ఒకటి రామోజీ ఫిల్మ్సిటీకి దగ్గరగా రాచకొండ గుట్టల్లో, రెండోది శామీర్పేట వద్ద నిర్మిస్తాం. ఇందుకు ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ రూ.7,500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేబినేట్ ఆమోదించింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్షిక ఆస్తి పన్ను రూ.1,200 లోపు ఉన్న గృహ యజమానుల నుంచి కేవలం రూ.101 మాత్రమే వసూలు చేయాలన్న నిర్ణయాన్ని కేబినేట్ ఆమోదించింది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. దీంతో 3.12 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో గత 15 ఏళ్లుగా పేరుకుపోయిన నీటి చార్జీల బకాయిలను మాఫీ చేయాలని నిర్ణయించాం. ఇకపై కచ్చితంగా బిల్లులు వసూలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాఫీ వల్ల రూ.455 కోట్ల బాకాయిలు మాఫీ కానున్నాయి. మైనారిటీల సంక్షేమ శాఖలో ఒక్క రెగ్యులర్ పోస్టు లేదు. ఉన్నవారంతా డిప్యూటేషనే. ఇకపై ప్రతి జిల్లాలో ఆరుగురు అధికారులు, రాష్ట్ర స్థాయిలో మైనారిటీల డెరైక్టరేట్ కార్యాలయంలో 20 మంది అధికారులు ఉండేలా మైనారిటీల సంక్షేమ శాఖ డెరైక్టరేట్కు 80 పోస్టులను మంజూరు చేశాం. నీటిపారుదల శాఖకు 108 కొత్త పోస్టులు, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 147 పోస్టులు, మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు 462 పోస్టులు మంజూరు చేశాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మైనారిటీ బాలికలకు 30, బాలురకు 30... మొత్తం 60 మైనారిటీల రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తాం. జీహెచ్ఎంసీలో స్థలా భావంతో పేదలకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నాం. 9 అంతస్తులుండే భవనాల్లో లిఫ్టులు అవసరం. అందుకే జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వ్యయాన్ని రూ.5.30 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచాలని నిర్ణయించాం. నిర్ణీత సమయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు 1.5 శాతం ప్రోత్సాహకంగా అందజేస్తున్నాం. ఈ ప్రోత్సాహకాలను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సైతం వర్తింపజేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని 97 పట్టణ ఆరోగ్య కేంద్రాలను పీహెచ్సీల స్థాయికి తగ్గట్లు అభివృద్ధి పరుస్తాం. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలంలో ఇండియన్ రిజర్వు పోలీసు బెటాలియన్కు 115 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించాం. ఉద్యోగ విరమణ రోజే ఉద్యోగులకు పెన్షన్ ప్యాకేజీని అందించటంతో పాటు ప్రభుత్వ వాహనంలో వారిని ఇంటికి గౌరవంగా సాగనంపుతాం. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల దరఖాస్తులు వెంటనే పరిష్కరిస్తాం. కారుణ్య నియామకాలు పెండింగ్లో ఉంచకుండా 7 రోజుల్లోనే ఉద్యోగాన్ని కల్పిస్తాం. సంబంధిత శాఖ ఖాళీలు లేకపోయిన ఇతర ఏ శాఖలోనైనా అవకాశాన్ని కల్పిస్తాం. -
పనితీరు బాగుంటేనే ‘క్రమబద్ధీకరణ’
♦ కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కొత్త మలుపు ♦ పర్యాటకాభివృద్ధి సంస్థపై ప్రత్యేక దృష్టి ♦ ఈ విభాగాన్ని శాసిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ♦ అవినీతి ఆరోపణలున్న సిబ్బందిపై ప్రభుత్వం సీరియస్ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ అంశం కొత్త మలుపు తిరిగింది. మొత్తం ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పనితీరు ఆధారంగా కాంట్రాక్టు సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. దీనికి సంబంధించి వారి పనితీరు నివేదికలను ఆయా విభాగాధిపతుల నుంచి సేకరిస్తోంది. ముఖ్యంగా పర్యాటక శాఖలాంటి చోట్ల దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ శాఖ పూర్తిగా కాంట్రాక్టు ఉద్యోగుల ఆధ్వర్యలోనే నడుస్తోంది. ముఖ్యంగా ఈ శాఖ పరిధిలోకి వచ్చే పర్యాటకాభివృద్ధి సంస్థ పూర్తిగా వారి చెప్పుచేతల్లో నడుస్తోంది. గతంలో అడ్డదిడ్డంగా ఉద్యోగాలు పొందిన పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సంస్థ కార్యకలాపాలను నిర్వీర్యం చేశారు. కిందిస్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా ఉన్నతాధికారుల పోస్టుల్లో కూడా కాంట్రాక్టు సిబ్బందే పనిచేస్తున్నారు. వీరిలో కొందరు కేవలం జేబులు నింపుకొనేందుకే పరిమితం కావటంతో కొంతకాలంగా పర్యాటకాభివృద్ధి సంస్థ పనితీరు దిగదుడుపుగా మారింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో అలాంటి వారి పనితీరుపై నివేదికలు సేకరిస్తున్న ప్రభుత్వం... సిబ్బంది పనితీరును పరిగణనలోకి తీసుకునే వారి సర్వీసుల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. పనితీరు సరిగా లేని వారిని విధుల నుంచి తొలగించటంతోపాటు అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించటం విశేషం. దీన్ని కేవలం పర్యాటక శాఖకే పరిమితం చేయకుండా ఇతర విభాగాలలో కూడా అమలు చేయాలని భావిస్తోంది. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో ప్రభుత్వ ఉద్యోగులు 97 మంది ఉంటే కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు మూడొందల మంది ఉన్నారు. అంతే సంఖ్యలో ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాల్సిందిగా చాలాకాలంగా కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే సంఘం పేరుతో కొందరు సిబ్బంది నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఇక తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టు సిబ్బందికి ఎడాపెడా పోస్టులు కేటాయిస్తూ కొందరు ఉన్నతాధికారులు కార్పొరేషన్ను అస్తవ్యస్తంగా మార్చారు. కార్పొరేషన్లో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగికి గతంలో ప్రతిష్టాత్మక డాక్టర్ వైఎస్సార్ నిథిమ్ బాధ్యతలు అప్పగించారు. అది కాకుండా ఆ అధికారికి మరో మూడు పోస్టులు ఇన్చార్జి హోదాలో ఉన్నాయి. వాటిని అడ్డుపెట్టుకుని నిధులు స్వాహా చేశారని తీవ్ర ఆరోపణలున్నాయి. మరోవైపు నిథిమ్ పూర్తి అస్తవ్యస్తంగా మారింది. అక్కడి పరిస్థితులు నచ్చక కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువు మానేశారని, వేరే రాష్ట్రాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడా కాంట్రాక్టు ఉద్యోగి ఆ సంస్థ డైరక్టర్ పోస్టుకోసం పైరవీలో ఉన్నారని సమాచారం. తాజాగా ప్రభుత్వం వారి సర్వీసు క్రమబద్ధీకరణలో పనితీరును కొలబద్ధగా తీసుకోవటంతో అవినీతి సిబ్బందిలో ఆందోళన మొదలైంది. క్రమబద్ధీకరణ జాబితాలో తమ పేరుండేలా రాజకీయ పార్టీ నేతలతో ఒత్తిళ్లు ప్రారంభించారని తెలుస్తోంది. తెలంగాణేతరులపై ఆరా... పర్యాటకశాఖలో పనిచేస్తున్న తెలంగాణేతరుల పనితీరుపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆ శాఖ మంత్రి చందూలాల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పర్యాటక శాఖ, పర్యాటకాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న తెలంగాణేతరుల పనితీరుపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణేతరుల సంఖ్య అధికంగా ఉన్నందున వారి పనితీరును సమీక్షించి.. కొనసాగించాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. -
విద్యార్థిని వేధిస్తున్న ఉద్యోగిపై కేసు నమోదు
గుంటూరు : కాంట్రాక్ట్ ఉద్యోగి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చోటు చేసుకుంది. యూనివర్శిటీలోని విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి రమేష్... యూనివర్శిటీలో చదువుతున్న ఎంబీఏ విద్యార్థిని తనను పెళ్లి చేసుకోవాలని వెంట పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె పెదకాకాని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. -
రానుంది.. కొలువుల జాతర!
కంపెనీల సన్నాహాలు: సర్వే న్యూఢిల్లీ : భారతీయ కంపెనీలు అధిక మొత్తంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నాయి. అలాగే కంపెనీలు ఉద్యోగుల వేతనాలను పెంచాలని భావిస్తున్నాయి. ఈ విషయాలు కెరీర్బిల్డర్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రానున్న కాలంలో శాశ్వత ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు 73% కంపెనీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 60% కంపెనీలు తెలిపాయి. దాదాపు 46% మంది వర్కర్లు ఉద్యోగ బదిలీ వేటలో ఉన్నారు. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ఉద్యోగుల వేతనాలను పెంచాలని దాదాపు 86% కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగుల ప్రారంభ జీతాన్ని ఐదు శాతంపైగా పెంచాలనే ఉద్దేశంలో 57% కంపెనీలు ఉన్నాయి. రానున్న కాలంలో కస్టమర్ సర్వీసెస్, సేల్స్, మార్కెటింగ్, ఐటీ, తయారీ, ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో అధిక ఉద్యోగ నియామకాలు నమో దు కానున్నాయి. అలాగే మొబైల్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి తదితర విభాగాల్లో కూడా నియామకాల జోరు కనిపించనుంది. -
అధికారి నిర్లక్ష్యం..కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాపం!
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న విధంగా ఉంది రాజీవ్ విద్యామిషన్ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వం వేతనాల గ్రాంటును విడుదల చేసినా సకాలంలో బిల్లులు తయారు చేయని కారణంగా వేతనాలు చెల్లించడంలో జాప్యం కలుగుతోంది. ఒక అధికారి నిర్లక్ష్య ధోరణి రాజీవ్ విద్యామిషన్ కింద పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు శాపంగా పరిణమించింది. - మోర్తాడ్ మండల ఉద్యోగుల వేతనాల బిల్లు పంపడంలో జాప్యం - జిల్లాలోని అన్ని మండలాల వారికీ వేతనాలు నిలుపుదల - ఇబ్బందులు పడుతున్న రాజీవ్ విద్యామిషన్ ఉద్యోగులు మోర్తాడ్ : రాజీవ్ విద్యామిషన్ పథకం కింద మోర్తాడ్ మండల విద్యావనరుల కేంద్రం పరిధిలో పని చేస్తున్న 11 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జూలై నెల వేతనాల బిల్లును జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి ఈ నెల ఐదో తేదీ వరకు పంపాల్సి ఉంది. జిల్లాలోని మిగతా మండలాల ఉద్యోగుల వేతనాల బిల్లులను ఆయా మండలాల అధికారులు సకాలంలో పంపారు. అయితే మోర్తాడ్ మండలానికి సంబంధించిన బిల్లును పంపకపోవడంతో జిల్లాలోని అన్ని మండలాల ఉద్యోగుల వేతనాలకు బ్రేక్ పడింది. జిల్లావ్యాప్తంగా 206 మంది క్లస్టర్ రీసోర్స్ పర్సన్(సీఆర్పీ)లు, 36 మంది ఎంఐఎస్లు, 36 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 36 మంది మెసెంజర్లు, 72 మంది ఐఈఆర్టీలు పని చేస్తున్నారు. వీరి పదవి కాలంలో ఈ ఏడాది ఏప్రిల్లో పూర్తి కాగా ప్రభుత్వం మరో ఏడాది కాంట్రాక్టును పొడగించింది. కాంట్రాక్టును పొడిగిస్తూనే వేతనాలు సకాలంలో చెల్లించడానికి వీలుగా గ్రాంటును విడుదల చేసింది. ప్రతీ నెలా ఐదో తేదీలోగా వేతనాలకు సంబంధించిన బిల్లును మండల విద్యాశాఖ అధికారి తయారు చేసి జిల్లా కేంద్రంలోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయానికి పంపాల్సి ఉంది. ఐదో తేదీలోగా వచ్చిన బిల్లులను అక్కడి అధికారులు జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పంపిస్తారు. ప్రతీ నెలా పదో తేదీలోగా కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి అనుగుణంగా బిల్లులను ఐదో తేదీలోగా పంపాల్సి ఉంది. మోర్తాడ్ మండల విద్యావనరుల కేంద్రం నుంచి ఇప్పటివరకు బిల్లును పంపకపోవడంతో జిల్లాలోని మిగతా మండలాల ఉద్యోగుల వేతనాల బిల్లును ఆర్వీఎం అధికారులు కలెక్టర్ ఆమోదం కోసం పంపలేదు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల ఉద్యోగుల వేతనాల చెల్లింపు నిలచిపోయింది. ఆగస్టు నెల సగం గడచినా గత నెల వేతనాలు రాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. మరోసారి ఇలాంటి జాప్యం లేకుండా వేతనాలు చెల్లించడానికి ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. బిల్లులు పంపడంలో జాప్యం కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల బిల్లులు పంపడంలో జాప్యం ఏర్పడింది. పని ఒత్తిడితోనే బిల్లులు పంపలేకపోయాం. ఇకముందు ఆలస్యం జరుగకుండా చూస్తాం. - ఎం.శ్రీనివాస్, ఎంఈవో, మోర్తాడ్ బిల్లులు అందితేనే వేతనాలు జిల్లాలోని 35 మండలాల బిల్లులు అందాయి. మోర్తాడ్ మండలానికి సంబంధించిన బిల్లు అందలేదు. అందుకే వేతనాలు చెల్లించడం వీలు కాలేదు. ప్రతీ నెల ఐదో తేదీలోపు వేతనాల బిల్లు పంపాలని గతంలోనే ఆదేశించాం. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు బిల్లులు పూర్తిగా అందితేనే వేతనాలు చెల్లిస్తాం. - వినయ్, ఫైనాన్స్ వింగ్ ఇన్చార్జి, ఆర్వీఎం -
విజయవాడలో కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు , రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదని విజయవాడ సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ధర్నాకు దిగారు. 10 వ పీఆర్సీ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగుల కనీస వేతనానికి సమానంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు పెంచి, రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మహిళలకు 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నటీ లీవు సౌకర్యం కల్పించాలని, డీఏ, హెల్త్కార్డులు, బస్పాస్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా మొదటి తేదీన వేతనాలు చెల్లించి, పీఎఫ్, ఇఎస్ఐలు సక్రమంగా అమలు చేయాలన్నారు. -
ఆశల ఊసుల్లోనే క్రమబద్ధీకరణ
⇒ జూన్లో ఇస్తామన్న ఉత్తర్వులకు ఇంకా దిక్కులేదు ⇒ స్క్రీనింగ్ పరీక్షకు నోటిఫికేషన్ ఎప్పుడు..? ⇒స్థానికులు, స్థానికేతరులతోనే కొత్త పీటముడి ⇒ ఆర్థిక భారం పడుతుందని దాటవేస్తున్న సర్కారు ⇒ 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఇంకా మోక్షం సిద్ధించలేదు. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జూన్లోనే ఉత్తర్వులు ఇచ్చి... జూలై నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమం చేపడతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అవతరణ దిన వేడుకల్లో ప్రకటించారు. ఈ సంవత్సరంలోనే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజులు దాటినా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడ లేదు. జూన్లో జరిగిన రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చ జరిగింది. స్థానికులైన కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, తెలంగాణ స్థానికేతరులను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సర్కారు ఊసెత్తకపోవటంతో 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే విషయంలోనే ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడించలేదు. ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు పాటించిన నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులనూ విభజించే వీలుంది. కానీ.. అందుకు సంబంధించిన మార్గదర్శకాల షెడ్యూలును ముందుగా విడుదల చేయాలి. ఆ దిశగా సర్కారు కసరత్తు చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది. స్థానికేతరుల గుర్తింపే సమస్య ప్రధానంగా స్థానికులు, స్థానికేతరులను గుర్తించాలనే నిర్ణయమే రెగ్యులరైజేషన్కు పీటముడిగా మారిందని, అందుకే జాప్యం అవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించటంలో ఇబ్బంది లేదని.. అదే సమయంలో ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలా.. వద్దా.. అనే సందిగ్ధత కూడా కొనసాగుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్క్రీనిం గ్ పరీక్షకు నోటిఫికేషన్ వేసే సమయంలో రెండు రాష్ట్రాల్లో పని చేస్తున్న వారికీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తే ఈ చిక్కుముడి తొలగిపోతుందని కాంట్రాక్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం పంపించాలని తెలంగాణ ఆర్థిక శాఖ అన్ని విభాగాలను కోరింది. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 28 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే ప్రతి నెలా దాదాపు రూ.9 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. ఆర్థికం గా రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉం ది. ఈ నేప థ్యంలో కాం ట్రాక్టు ఉద్యోగు ల రెగ్యులరైజేషన్ను వేగవంతంగా పూర్తి చేస్తే అంతకంతకు భారం పడుతుంది. అందుకే సర్కారు ఈ అంశాన్ని పెండింగ్లో పెట్టి సాగదీస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పరిశీలనలో అంశం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ సారథ్యంలో సర్కారు నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్కు మార్గదర్శకాలను సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను మొదటగా రెగ్యులరైజ్ చేయాలని సూచించింది. ఈ కమిటీ నివేదికతో పాటు ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. ఈలోగా తెరపైకి వచ్చిన స్క్రీనింగ్ పరీక్ష, స్థానికత అంశాలతో ఈ ఫైళ్లు ఎక్కడివక్కడే అన్నట్లుగా ఆగిపోయాయి. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు మళ్లీ కొంతకాలం కంచికి చేరినట్లయింది. -
బాబు చేసిన చట్టమే అడ్డంకి!
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల కిందట అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన చట్టమే కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ చట్టాన్ని సవరించిన తర్వాతే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా ప్రకటించడంతో వేలాది కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. వెంటనే ఆర్థిక శాఖ సన్నాహాలు ప్రారంభించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని దాదాపు 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందుతారని అంచనా వేసింది. ఇందుకు విధివిధానాలను కూడా ప్రభుత్వం ఇటీవలే సిద్ధం చేసింది. కానీ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను నిషేధిస్తూ 1994లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చట్టాన్ని చేసింది. దీంతో ప్రస్తుతం ఇది అడ్డంకిగా మారింది. ఆ చట్టానికి సవరణ చేసేంత వరకు వేచి చూడాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. చట్ట సవరణకు రాష్ట్ర కేబినేట్ ఆమో దం తప్పనిసరి. సీఎం ప్రకటన నేపథ్యంలో తదుపరి కేబినేట్ సమావేశంలో దీన్ని ఎజెం డాగా పొందుపరిచే అవకాశముంది. ఆ తర్వాతే రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వెలువడుతాయి. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ సారథ్యంలోని ఉన్నతాధికారుల కమిటీ తగిన మార్గదర్శకాలను సిఫారసు చేసింది. వీటి ప్రకారం గత ఏడాది జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను ముందుగా రెగ్యులరైజ్ చేస్తారు. రెండో విడతలో మిగతా వారిని ఐదేళ్ల పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగానే పరిగణించి తర్వాతే క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ఇది వర్తిస్తుంది. ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించదు. ప్రస్తుతం పని చేస్తున్న పోస్టులకు సరిపడే విద్యార్హత, వయస్సు నిబంధనలున్న అభ్యర్థులకే అవకాశమిస్తారు. నియామక పద్ధతిని అనుసరించి ఉద్యోగంలో చేరిన వారికే రెగ్యులరైజేషన్ చెల్లుబాటవుతుంది. అడ్డదారిలో నియమితులైన వారిని అనర్హులుగా పక్కనబెడతారు. రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే ప్రభుత్వ సర్వీసు మొదలవుతుందని.. గతంలో పని చేసిన సర్వీసు లెక్కలోకి రాదని కమిటీ నిర్ణయించింది. -
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
క్రమబద్ధీకరణకు సర్కారు పచ్చజెండా అయిదేళ్ల సర్వీసు ఉంటేనే అర్హులు విధివిధానాలు ఖరారు చేసిన కమిటీ సీఎంకు నివేదిక సమర్పించిన సీఎస్ హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా ఈ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందుతారని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు అవసరమయ్యే విధివిధానాలను అధ్యయనం చేసేందుకు గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ నేతృత్వంలో ఏడు విభాగాల ముఖ్య కార్యదర్శుల కమిటీ సుదీర్ఘంగా కసరత్తు చేసింది. గత నెలలోనే ఈ కమిటీ తమ నివేదికను సిద్ధం చేసింది. మార్గదర్శకాలన్నింటినీ అందులో పొందుపరిచింది. ఈ కమిటీ నివేదికతో పాటు ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. సీఎం ఆమోదించిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువడతాయని ఆర్థిక శాఖ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కమిటీ సిఫారసు చేసిన నిబంధనల ప్రకారం... రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను ముందుగా రెగ్యులరైజ్ చేస్తారు. రెండో విడతలో అయిదేళ్లు నిండని అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. అయిదేళ్ల పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగానే గుర్తించి.. తర్వాతే రెగ్యులర్ అయ్యే అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ఈ క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించదు. అంటే... నెలనెలా ప్రభుత్వం ఫుల్ టైమ్ స్కేల్ అందుకుంటున్న వారినే ఇందుకు అర్హులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులకు సరిపడే విద్యార్హత, వయసు నిబంధనలున్న అభ్యర్థులకే అవకాశమిస్తారు. ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్య మేరకే ఈ నియామకాలుంటాయి. రిజర్వేషన్లు, రోస్టరు పద్ధతిని సైతం అనుసరిస్తారు. పార్ట్ టైం, డైలీ వేజ్ కార్మికులు సైతం ఈ క్రమబద్ధీకరణ పరిధిలోకి రారు. క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే ప్రభుత్వ సర్వీసు మొదలవుతుందని.. గతంలో పని చేసిన సర్వీసు లెక్కలోకి రాదని కమిటీ నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆర్టీసీ సమ్మె ముగిసిన వెంటనే అందులో పని చేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించారు. దీంతో మిగతా విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు సైతం తమకెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. -
అదే సీన్ పరేషాన్
ఒక్క బస్సు బయటకు రావాలంటే ఇంత బందోబస్తు తప్పదు.. రోడ్డెక్కిన 531 బస్సులు అయినా ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు అన్ని డిపోల వద్ద కార్మికుల ఆందోళన అదనంగా ఎంఎంటీఎస్ సర్వీసులు యథావిథిగా ప్రైవేటు వాహనాల దోపిడీ మెట్టు దిగని ప్రభుత్వం.. పట్టు వీడని ఆర్టీసీ కార్మికులు.. వెరసి మూడో రోజూ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పోలీసుల రక్షణ మధ్య అధికారులు శుక్రవారం కొన్ని బస్సులను డిపోల నుంచి బయటకు తీశారు. అడ్డుకున్న కార్మికులను అరెస్టు చేశారు. నిరసనలు.. ఆందోళనల మధ్య 531 బస్సులను రోడ్డెక్కించారు. ప్రైవేటు వాహనాల దోపిడీ పర్వం కొనసాగింది. సిటీబ్యూరో: కార్మికుల సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సులు మూడో రోజుకు (శుక్రవారం) కొద్దిగా పెరిగాయి. రాత్రి వరకు సుమారు 531 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ఏపీ ఎంసెట్కు హాజరైన విద్యార్థులు, ఉద్యోగులకు కొంత మేర ప్రయాణ సదుపాయం లభించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ సిబ్బంది సహాయంతో ప్రధాన రూట్లలో కొన్ని బస్సులు తిప్పినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు మాత్రం తప్పలేదు. లక్షలాది మంది సెట్విన్ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఆటోవాలాలు, ప్రైవేట్ వాహనదారులు యథావిథిగా తమ దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. ద.మ.రైల్వే ప్రతి రోజు నడిపే 121 సర్వీసులతో పాటు సికింద్రాబాద్- లింగంపల్లి మార్గంలో మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులు శుక్రవారం అదనంగా నడిపింది. రోజు వారి రాకపోకలు సాగించే లక్షా 60 వేల మందికి తోడు 40 వేల మంది ప్రయాణికులు అదనంగా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు. నిరసనలు.. ఆందోళనలు.. మరోవైపు నగరంలోని 28 డిపోలు, ప్రధాన బస్స్టేషన్ల వద్ద కార్మిక సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయి. హయత్నగర్, కంటోన్మెంట్, ఉప్పల్, బర్కత్పురా తదితర డిపోల్లో జరిగిన ధర్నాల్లో టీఎంయూ నేతలు అశ్వద్ధామరెడ్డి, థామస్రెడ్డి తదితరులు పాల్గొని యాజ మాన్య వైఖరిని నిరసించారు. ‘ఎస్మా’ చట్టాలకు వెరవబోమని స్పష్టం చేశారు. ఎండీ సాంబశివరావు తమతో సంప్రదింపులు జరిపేం దుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే మరోసారి చర్చలకు ఆహ్వానించినట్లు పేర్కొనడం సరికాదన్నారు. ఫలక్నుమా డిపో వద్ద కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. 43 శాతం ఫిట్మెంట్ సాధించే వరకు సమ్మె విరమించమని హెచ్చరించారు. ఆగని ప్రైవేట్ దోపిడీ ఆర్టీసీ సమ్మెను అన్ని రకాల ప్రైవేట్ వాహనాలు సొమ్ము చేసుకున్నాయి. న గరంలో తిరిగే ఆటోరిక్షాలు మీటర్ రీడింగ్తో సంబంధం లేకుండా ప్రయాణికులపై దోపిడీ సాగించారు. దూరప్రాంతాలకు వెళ్లే టాక్సీ కార్లు, ఇతర వాహనాలు, ప్రైవేట్ బస్సులు సైతం రెట్టింపు చార్జీలతో జేబులు లూటీ చేశాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, కరీంనగర్, సిద్ధిపేట్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట్, ఏపీలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు, కార్లలో బయల్దేరిన ప్రయాణికులు రెట్టింపు చార్జీలు చెల్లించుకోవలసి వచ్చింది. కిక్కిరిసిన రైళ్లు.. ఒకవైపు పెళ్లిళ్లు, మరోవైపు వేసవి సెలవులు కావడంతో నగరవాసులు దూర ప్రాంతాలకు పయనమయ్యారు. అసలే అరకొర రైళ్లు.. ఆకస్మాత్తుగా ఆర్టీసీ సమ్మెతో మూడు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో వెళ్లలేనివారు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి బయలుదేరే రైళ్లన్నీ కిక్కిరిసి వెళ్తున్నాయి. సమ్మె దృష్ట్యా కాచిగూడ- నిజామాబాద్, సికింద్రాబాద్ -కాజీపేట్, మల్కాజిగిరి- మిర్యాలగూడ రూట్లలో ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల్లో నడిచే రెగ్యులర్ రైళ్లలో 2,200 అదనపు సీట్లు, బెర్తులు ఏర్పాటు చేసినట్లు ద.మ. రైల్వే సీపీఆర్వో ఎం. ఉమాశంకర్ కుమార్ తెలిపారు. టిక్కెట్ సొమ్ము తిరిగి చెల్లింపు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టిక్కెట్ చార్జీలు పూర్తిగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టిక్కెట్ రిజర్వేషన్ కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు తగినంత సిబ్బంది లేనందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్నవారు తమ మొబైల్కు ‘సర్వీస్ కాన్సిల్’ అయినట్లు మెసేజ్ వచ్చిన వెంటనే రెండు రాష్ట్రాల ఆర్టీసీ వెబ్సైట్(ఠీఠీఠీ.్చఞటట్టఛిౌజ్ఛీ.జీ), (ఠీఠీఠీ.్టటట్టఛిఛఠట.జీ)కు లాగిన్ అయి టిక్కెట్లు రద్దు చేసుకుంటే వారి బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అవుతుంది. ఆదరైజ్డ్ టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు (ఏటీబీ), ఆర్టీసీ బస్ స్టేషన్ల లోని కౌంటర్లలో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న వారు సమ్మె విరమించిన తేదీ నుంచి 7 రోజుల్లో తమ టికెట్లను రద్దు చేసుకొని సొమ్ము పొందవచ్చు. కాన్సిలేషన్కు సంబంధించిన వివరాలకు 1800 200 4599 నంబర్లో సంప్రదించవచ్చని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుడిపై దాడి హయత్నగర్: ఆర్టీసీ డిపో మేనేజర్ను కలిసేందుకు వచ్చిన కార్మికుడిపై తోటి కార్మికులు దాడిచేసిన సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. హైదరాబాద్-2 డిపోకు చెందిన డ్రైవర్ రాములు హయత్నగర్-2 డిపో మేనేజర్ను కలిసేం దుకు సంస్థ జీపులో వచ్చాడు. డిపో వద్ద జీపును అడ్డగించిన కార్మికులు రాములుపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చెవులు పిండి ఉద్యోగ భద్రత సాధిస్తాం...
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయూకర్రావు వరంగల్ : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించకుంటే అధికార పార్టీ చెవులు పిండి సాధిస్తామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరారుు. ఈ సందర్భం గా ఎర్రబెల్లి దయూకర్రావు దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీల ను విస్మరించడంలో సీఎం కేసీఆర్ ఘనుడు అని ఆరోపించారు. మేనిఫెస్టోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా టమార్చడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్.. పూటకో మాట చెబుతున్నాడే తప్పా... హామీల ను అమలు చేయడంపై దృష్టి పెడ్టడంలేదని ధ్వజమెత్తారు. రేషన్ కార్డులపై తీసుకొచ్చి న కొత్త జీవోలో ఇళ్లు, కారు, ట్రాక్టర్ ఉన్న వారికి ఆహార భద్రత కార్డులు ఇవ్వదన్న నిబంధనలు పేర్కొన్నారని, అరుుతే వాటిపై తాను అసెంబ్లీ లో నిలదీయడంతో జీవో రద్దయ్యిందన్నారు. అవుట్ సోర్సింగ్తో జీతాలు లేకుండా పూర్తిగా పర్మనెంట్ చేసేంత వరకు ఉద్యమాలు చేయూలని సూచించారు. టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షు డు అనిశెట్టి మురళీమనోహర్ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పేరిట చేపట్టిన మిషన్ కాకతీయ.. కమీషన్ కాకతీ యగా మారిందని ఆరోపించారు. టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న హామీ లు ప్రకటనలుగా మిగిలి పోతున్నాయన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నాయకుడు నవీన్ మాట్లాడుతూ తమకు వేతనాలు సంస్థ ద్వారానే నేరుగా ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రచార కార్యదర్శి పుల్లూరు అశోక్కుమా ర్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సాంబయ్యనాయక్, సంతోష్నాయక్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, వెంకట్, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపు
తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ బోధనేతర సిబ్బంది తొలగింపు సర్క్యులర్ను రద్దు చేయాలని సంక్షేమభవన్ ఎదుట నిరసనను వ్యక్తం చేసినట్లు తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ నాన్ టీచింగ్ అసోసియేషన్ నేతలు పి.లింగారెడ్డి, బానోతు కృష్ణ తెలిపారు. ఈ నిరసనపై స్పందించిన సంస్థ కార్యదర్శి ప్రస్తుతం పనిచేస్తున్న 550 మందిని ఎవరినీ తొలగించబోమని హామీనిచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
మాచర్ల : గత మూడు నెలలుగా జీతాలు చెల్లించటంలేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. మాచర్ల పురపాలక సంఘం ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే 55 మంది ఒప్పంద కార్మికులకు మూడు నెలలుగా జీతాలందటంలేదు. దీంతో శుక్రవారం సీఐటీయూ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మాచర్ల పురపాలక సంఘ కార్యలయం ఎదుట ఒప్పంద కార్మికులు ధర్నాకు దిగారు. వెంటనే జీతాలు చెల్లించాలని, పీఎఫ్కు నగదు చెల్లించాలని కోరారు. అకారణంగా తొలగించిన ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
'కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం'
హైదరాబాద్: గురుకుల పాఠశాల ఉపాధ్యాయ, సిబ్బందికి ఉద్యోగ వయో పరిమితిని ప్రస్తుతమున్న 58 సంవత్సరాల నుంచి 60కి పెంచుతామని సాంఘికసంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అంతేకాకుండా వారికి హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు. వారి జీతాలు ట్రెజరీ ద్వారా అందిస్తామన్నారు. అంతేకాకుండా గురుకుల పాఠశాల కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. -
హరిత తెలంగాణే లక్ష్యం: కేసీఆర్
ఆ దిశగా పని చేయండి.. తెలంగాణలో అడవుల శాతం పెంచండి అటవీ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం కాంట్రాక్టు ఉద్యోగులను, విలేజ్ ఫారెస్ట్ వర్కర్లను క్రమబద్ధీకరిస్తాం అటవీశాఖ అధికారులతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చే లక్ష్యంతో పనిచేయాలని అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి పెంచి.. దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. అటవీ శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామని.. వేతన సవరణ, వాహన సదుపాయంతో పాటు భద్రతను కూడా కల్పిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ శివార్లలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీని సీఎం కేసీఆర్ శనివారం సందర్శించారు. ముందుగా అకాడమీలో మొక్కలు నాటి, ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ లోగోను ఆవిష్కరించారు. తర్వాత అటవీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.. అట వీ భూముల ఆక్రమణలు, కలప స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న అటవీ చట్టాలను అధ్యయనం చేసి, అవసరమైతే కొత్త చట్టాలను తీసుకురావాలని ఉన్నతాధికారులకు సూచించారు. అటవీ సిబ్బందికి సాయుధ పోలీసుల సాయం ఉండేలా చూస్తామన్నారు. అటవీ సంబంధమైన కేసుల పరిష్కారానికి ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, అటవీశాఖలో ప్రత్యేక న్యాయ విభాగాన్ని నెలకొల్పుతామని తెలిపారు. అటవీ అభివృద్ధి సెస్తో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్మగ్లర్ల నుంచి ముప్పున్న వారందరికీ భద్రత కల్పించాలని పోలీసుశాఖను ఆదేశించారు. అటవీ భూములకు హద్దులు.. కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి అటవీ భూముల సరిహద్దులను నిర్ణయించాలని సీఎం కేసీఆర్ సూచించారు. భూ అసైన్మెంట్ కమిటీల్లో అటవీ శాఖ అధికారులను సభ్యులుగా నియమించాలన్నారు. హైదరాబాద్లో పచ్చదనం కోసం జీహెచ్ఎంసీ నుంచి రూ. 25 కోట్లు కేటాయిస్తామని, ఒక అటవీశాఖాధికారిని జీహెచ్ఎంసీలో నియమిస్తామని తెలిపారు. అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను, విలేజ్ ఫారెస్ట్ వర్కర్లను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. అడవుల్లో ప్రవహించే నదులు, ఉపనదులపై చెక్డ్యాంలు నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం డైరీని కేసీఆర్ ఆవిష్కరించారు. సమావేశంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. పేరు మారలేదు.. తీరు మారలేదు ఏ సంస్థ భవనానికైనా పేరు ఓ గుర్తింపు.. కానీ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ మాత్రం పేరుకు ‘ఫ్లెక్సీ’ ముసుగేసుకుంది. తెలంగాణ ఏర్పడి ఏడు నెలలైనా.. ఇక్కడ మాత్రం ‘ఆంధ్రప్రదేశ్’ పేరు మీదే కొనసాగుతోంది. దూలపల్లిలో ఉన్న ఈ అకాడమీకి శనివారం సీఎం వచ్చారు. ఈ సందర్భంగా ఆ పేరు కనిపించకుండా అధికారులు ఇలా ఏర్పాటు చేశారు. -
నెల్లూరులో కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
నాయుడు పేట టౌన్ (పొట్టిశ్రీరాములు జిల్లా) : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు. సూళ్లూరుపేట, నాయుడు పేట, వెంకటగిరికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. -
అరకులో కాంట్రాక్టు ఉద్యోగుల మెరుపు సమ్మె
అరకు: ప్రముఖ పర్యాటక ప్రాంతం విశాఖపట్నం జిల్లా అరకులో కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మకు దిగారు. 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు సమ్మె చేపట్టారు. మ్యూజియం, పద్మావతి గార్డెన్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అరకు అందాలను తిలకిద్దామని వచ్చిన పర్యాటకులకు ఉద్యోగుల సమ్మెతో నిరాశ ఎదురైంది. -
బాధితులతో.. పరిహాసం
విజయనగరం కంటోన్మెంట్: ఇటీవల వచ్చిన హుద్హుద్ పెను తుపానుతో జిల్లా అతలాకుతలమయింది. తుపాను బీభత్సంతో రూ.2,995 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికార గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గతంలోని నష్టాలకు బాధితులకు అందజేయాల్సిన పరిహారాలకే దిక్కులేని పరిస్థితుల్లో ఇప్పుడీ భారీ నష్టానికి సాయమందే అవకాశం ఉందా? అని బాధితులు వాపోతున్నారు. గతంలో రావాల్సిన పలు పంట నష్ట పరిహారాలు అందక రైతులు అప్పుల పాలవుతూ ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క ఈ ఏడాది వేసవిలో వడగాడ్పులు భారీగా వీయడంతో వందలాది మంది మృతి చెందారు. మృతుల్లో 140 మందిని ప్రభుత్వం గుర్తించి వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం బాధిత కుటుంబాలకు అందజేస్తామని ప్రకటించింది. కానీ నేటికీపరిహారం అందలేదు. దీనికి సంబంధించిన ఫైళ్లు ఇంకా పెండింగ్లోనే ఎందుకు ఉంచారో అర్థం కావడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ పరిహారాలపై పెద్దగా పట్టించుకోలేదని బాధిత కుటుం బాలు వాపోతున్నాయి. మే,జూన్ నెలల్లో వీచిన వడగాడ్పులకు మృతి చెందిన వారికి పరిహారాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, డాక్టర్, తహశీల్దార్లు కమిటీగా ఎండ వేడిమి తాళలేక వారంతా మృతి చెందారని నివేదించినప్పటికీ ప్రభుత్వం పరిహారాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇంటికి పెద్ద దిక్కు అయిన వారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా విధులు నిర్వహిస్తుండగా ఎండధాటికి తాళలేక మృతి చెందినప్పటికీ పరిహారం ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని ఆయా కుటుంబాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ప్రభుత్వం ప్రక టించిన పరిహారం అందలేదని 69ఏళ్ల వృద్ధురాలు కలెక్టరేట్కు వచ్చి వాపోయింది. నెల్లిమర్ల మండలం తాళ్లపూడి పేటకు చెందిన తాళ్లపూడి నారాయణమ్మ మిద్దె ఇంట్లో నివసిస్తోంది. వర్షాలకు మిద్దె ఇంటి గోడ కూలిపోవడంతో కాలు విరిగిపోయిందని నారాయణమ్మ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం క్షతగాత్రులకు రూ.50వేలు, కేంద్ర ప్రభుత్వం మరో రూ.50వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తే అధికారులు కేవలం రూ.15వేలు మాత్రమే ఇస్తామంటున్నారని వృద్ధురాలి అల్లుడు ఆరోపించాడు. ఇప్పటికే తమ అత్తకు చికిత్స కోస వేలాది రూపాయలు ఖర్చయ్యాయని, ప్రభుత్వాలు ప్రకటించిన పరిహారాన్ని వెంటనే అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరాడు. గ్రామానికి చెందిన కార్యదర్శి రూ.3వేలు ఇస్తే పూర్తి పరిహారం ఇస్తానన్నాడని తీవ్రంగా ఆరోపించాడు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. -
వయోపరిమితి ఐదేళ్లు సడలింపు
ఆదిలాబాద్ టౌన్/రిమ్స్ : నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ కొలువుల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ వార్తతో నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు. ఆయా కేటగిరీలకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి కూడా ఐదేళ్లు సడలింపునిస్తూ పెంచడంతో వారికి ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో యువత ఉద్యోగాలు వస్తాయన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో నిరుద్యోగులు 65 వేలకు పైనే.. డిగ్రీలు, పీజీలు పట్టాలు పొంది ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు జిల్లాలో 66,346 మంది ఉన్నారు. కేవలం విద్యా, పోలీసు శా ఖల్లో మాత్రమే పోస్టులను భర్తీ చేస్తూ మిగతా శా ఖల్లో పోస్టులను గత ప్రభుత్వాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగు తూ వచ్చింది. ఉన్నత చదువులు చదివిన వారు సై తం చిన్నచిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు. నాలుగేళ్లుగా అరకొరగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో ఈ పరిస్థితి నెల కొం ది. ప్రతినెలా ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండడంతో ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడుతున్నా యి. కొత్త వారిని నియమించకపోవడంతో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకే ఇన్చార్జి బాధ్యత లు అప్పగిస్తున్నారు. దీంతో వారికి కూడా పనిభారం పెరిగి విధులకు న్యాయం చేయలేకపోతున్నారు. వయోపరిమితి పెంపు వరం.. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల అర్హతకు వయసు పరిమితి ముగియడంతో చాలా మంది నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం కోసం తప్ప.. ప్రభుత్వ కొలువు పొందే అవకాశం కోల్పోతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉద్యోగాలకు వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉద్యోగాలకు అర్హత సాధించనున్నారు. దీంతో వారు పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్.. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి ఇది వరకే ప్రకటించిన విషయం విధితమే. తాజాగా మరోసారి అసెంబ్లీలో దీనిపై స్పష్టత ఇచ్చి ఉద్యోగులకు భరోసా కల్పించారు. దీంతో జిల్లాలో సుమారు వెయ్యికి పైగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. -
కో టాలేదు..తలే
నీలగిరి : జిల్లా విద్యుత్శాఖ పీకల్లోతు కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు విద్యుత్ కోతల కారణంగా తలెత్తుతున్న సమస్యలు అధికార యంత్రాంగాన్ని హడలెత్తిస్తుంటే...మరోవైపు కొద్ది రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా ఎక్కడి సేవలు అక్కడే స్తంభించిపోయాయి. ఇక ఓవర్లోడ్ పుణ్యమాని వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు తరచు కాలిపోతున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. అప్రకటిత కోతలు.. విద్యుత్శాఖ అమలు చేస్తున్న అప్రకటిత విద్యుత్ కోతల వల్ల అన్ని రంగాలపై కోలుకోలేని దెబ్బపడింది. రాష్ట్రంలో విద్యుత్ లోటు కారణంగా జిల్లా కోటా అనేది లేకుండా చేశారు. కోతలు లేని కాలంలో జిల్లాకు నెలవారీ విద్యుత్ కోటాను కేటాయిస్తూ ఆ మేరకు అన్ని అవసరాలకు విద్యుత్ సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం అప్రకటిత కోతల వల్ల జిల్లా కోటాను పూర్తిగా బంద్ చేశారు. లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచే నేరుగా విద్యుత్ సరఫరా చేస్తూ కోతలు విధిస్తున్నారు. వ్యవసాయ రంగానికి 6 గంటలు కరెంట్ ఇచ్చేందుకుగాను పరిశ్రమలు, గృహావసరాలకు సరఫరా అయ్యే విద్యుత్లో కోత విధించారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. భువనగిరి డివిజన్ పరిధిలో మాత్రం శని, ఆదివారాలు పవర్ హాలిడే అమలుచేస్తున్నారు. ఇక జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామాల్లో 9 గంటల పాటు కోత విధిస్తున్నారు. వ్యవసాయరంగానికి రా త్రి 3 గంటలు, పగలు 3 గంటలు సరఫరా చేస్తున్నా రు. వాస్తవానికి వ్యవసాయానికి 7 గంటలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక గంట కత్తిరిస్తున్నారు. ఈ విధంగా అ న్ని రంగాలకు కోతలు విధిండచడం వల్ల ఇక జిల్లాకు ప్రత్యేకంగా కోటా అనేది లేకుండా పోయింది. కాలిపోతున్న ట్రాన్స్పార్మర్లు... అప్రకటిత విద్యుత్ కోతలు, ఓవర్ లోడ్ సమస్యతో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు తరచు కాలిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, బావుల కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ వల్ల ఎక్కువ కాలిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని కేటగిరీల్లో కలుపుకుని మొత్తం 56,762 ఉన్నాయి. దీనికిగాను కనీసం 4 శాతం ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్శాఖ స్టోర్లో ఉండాలి. కానీ 16 కేవీ నుంచి 100 కేవీ వరకు 780 ట్రాన్స్ఫార్మర్లు కొరత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్ రిపేరు కేంద్రాలు 20 వరకు ఉన్నాయి. ఈ కేంద్రాలకు రోజుకు రెండు చొప్పున కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు 40 వరకు వస్తున్నాయి. కరెంట్ వ చ్చిరావడంతోనే రైతులందరూ ఒకేసారి విద్యుత్ మోటర్లు ఆన్చేస్తున్నారు. దీని వల్ల ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడ్ పడుతోంది. తరచు కరెంట్ ట్రిప్ అవుతుండడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ట్రా న్స్ఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో మరో ట్రాన్స్ఫార్మరు బిగిం చాలి. కానీ ఎక్కడా దీనిని అమలు చేయడంలేదు. స్తంభించిన సేవలు... విద్యుత్ పంపిణీ సంస్థ, ట్రాన్స్కో కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు కొద్ది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో సేవలు స్తంభించిపోయాయి. వీరి స్థానాల్లో లైన్మన్లు, ఏఈలు, డీఈలు, టెక్నికల్ డీఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో పనిభారం పెరిగి సబ్స్టేష న్లలో విధులు నిర్వర్తించడం కష్టసాధ్యమవుతోందని అధికారులు అంటున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ, దాని పరిధిలోని సబ్స్టేషన్లలో కలిపి కాంట్రాక్టు ఉద్యోగులు సుమారు 1500మంది ఉన్నారు. వీరంతా సమ్మెలోకి దిగడంతో జిల్లా కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి సబ్స్టేషన్లో కరెంట్ కటర్స్ వరకు అన్ని విధులు లైన్మన్, ఏఈలు మొదలుకొని డీఈల వరకు పనిచేయాల్సి వస్తోంది. ఇక ట్రాన్స్కో పరిధిలో 132 కేవీ సబ్స్టేషన్లు 27,220 కేవీ సబ్స్టేషన్లు 5 మొత్తం కలిపి 32 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో సబ్స్టేషన్కు 11మంది చొప్పున కాంట్రాక్టు ఉద్యోగులు 352మంది ఉన్నారు. ఆయా సబ్స్టేషన్లలో ప్రతి 8 గంటల కోసారి కాంట్రాక్టు ఉద్యోగులు డ్యూటీలు మారి పనిచేయా ల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వారంతా ఒకేసారి సమ్మెలోకి దిగడంతో ఆ బాధ్యతలను జూనియర్ లైన్మన్ నుంచి డీఈ వరకు చేయాల్సి వస్తోంది. లైన్స్ బ్రేక్డౌన్ సరిచూసుకోవడం, సబ్స్టేషన్ మెయింటెన్స్ వంటివన్నీ కూడా ప్రస్తుతం లైన్మన్లు, డీఈలు దగ్గర ఉండి చూసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడా లేకపోవడంతో వంతుల వారీ విధులు నిర్వర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో రోజువారీ విధులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయి నాంపల్లి మండలంలో కరెం టు కోత తీవ్రంగా ఉంది. రోజుకు ఐదారు గంటలు కూడా రావట్లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నరు. పగలు రెండు గంటలు,రాత్రి మూడు గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందులోనూ లోఓల్టేజీతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. ఓవర్లోడ్తో ట్రాన్స్ఫార్మర్లు తగులబడుతున్నాయి. కాలిన ట్రాన్స్ఫార్మర్లను వారంరోజులైనా బాగుచేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. - దండిగ సత్తయ్య, రైతు, పసునూరు, నాంపల్లి -
‘కాంట్రాక్టు’ను రెగ్యులరైజ్ చేయొద్దు
తెయూ(డిచ్పల్లి): కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీ బాలుర వసతి గృహం వద్ద సోమవారం జేఏసీ నాయకులు తమ మెడలకు తాళ్లతో ఉరి బిగించుకుని వినూత్న నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాల పేరిట నిరుద్యోగ విద్యార్థులను మోసం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనం, వెయిటేజీ ఇస్తే నిరుద్యోగ విద్యార్థులకు ఇబ్బం ది లేదని, కానీ వారిని రెగ్యులరైజ్ చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. హోంమం త్రి నాయిని నర్సింహారెడ్డి తన పదవికి రాజీనా మా చేసి విద్యార్థులను విమర్శిస్తే బాగుంటుందన్నారు. తెలంగాణవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు రాజ్కుమార్, చైర్మన్ సంతోశ్గౌడ్, బాలాజీ, సంతోశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లుంటేనే క్రమబద్ధీకరణ?
మార్గదర్శకాలు రూపొందిస్తున్న ప్రభుత్వ కమిటీ.. త్వరలో తుదిరూపు సాక్షి, హైదరాబాద్: కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి మంజూరై భర్తీకాని పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజ్ చేయనుంది. వారికి ప్రభుత్వోద్యోగులకు వర్తించే అలవెన్సులు, పింఛను సౌకర్యం మాత్రం వర్తింపజేయవద్దని యోచిస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ విధి విధానాలు రూపొందిస్తోంది. ఈ నెల 17న సమావేశమైన ఆ కమిటీ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పరిధిలోకి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై చర్చించింది. రెగ్యులరైజ్ చేయడమంటే ‘ఉద్యోగ భద్రత’ కల్పించడమేనని తేల్చింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సీనియారిటీ పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ‘ఉద్యోగ భద్రత’ కల్పించాలని నిర్ణయించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అలవెన్సులు గానీ, పింఛను సౌకర్యం గానీ ఉండవు. దాంతోపాటు రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కాకుండా... ప్రభుత్వం నుంచి మంజూరై భర్తీ కాకుండా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికే అవకాశం కల్పిస్తారు. వారు నియామక సమయంలో ప్రభుత్వ రిజర్వేషన ్లకు అనుగుణంగా రోస్టర్ పద్ధతిలో నియమితులై ఉండాలి. ఈ మేరకు రాజీవ్ శర్మ కమిటీ రూపొందించిన విధి విధానాలను అన్ని ప్రభుత్వ విభాగాలకు పంపించి అర్హులైన వారిని ఎంపిక చేయిల్సి ఉంది. ఇందుకోసం ముందుగా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ‘యాక్ట్ 2 ఆఫ్ 1994’ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.దీనిపై మరోసారి సమావేశమై తుది మార్గదర్శకాలను రూపొందించి, సీఎం ఆమోదం తీసుకున్న అనంతరం ఆర్డినెన్స్ ముసాయిదా రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. -
ఓయూలో పోటాపోటీ ర్యాలీలు... ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థుల మధ్య వైరం రోజురోజూకు తీవ్రతరం అవుతుంది. యూనివర్శిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగులు రెగ్యులరైజ్కు మద్దతుగా సదరు ఉద్యోగులు శుక్రవారం... ఆర్ట్స్ కాలేజీ నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ర్యాలీకి వ్యతిరేకంగా యూనివర్శిటీ విద్యార్థులు మరో ర్యాలీ నిర్వహించారు. దాంతో యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణమంతా మోహరించారు. అయితే నిన్న సాయంత్రం భగీరథ హాస్టల్లో కొంత మంది ఆగంతకలు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో యూనివర్శిటీ రహదారులు, హాస్టళ్లు, కాలేజీల వద్ద పోలీసుల పహారాను భారీగా పెంచారు. -
‘కాంట్రాక్ట్’ లెక్కెంత!
* ఉద్యోగుల సంఖ్యపై మరోసారి వివరాల సేకరణ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వారి అసలు సంఖ్య ఎంత అని తేల్చేందుకు మరోసారి వివరాలు సేకరించాలని భావిస్తోంది. ప్రభుత్వం ఇదివరకే అనుమతించిన లేదా మంజూరు పోస్టులు ఖాళీగా ఉంటేనే కాంట్రాక్టు ఉద్యోగులను ఆ పోస్టుల్లో నియమించడానికి వీలవుతుందని, ఉద్యోగులు లేనిచోట ఇష్టానుసారం కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్న పక్షంలో వారిని పర్మనెంట్ చేయడానికి అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వద్దనున్న కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాకు సంబంధించి పూర్తి వివరాలు లేనందున, మరోసారి అన్ని విభాగాల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల జాబితా సేకరించాలని యోచిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తీసుకున్న సమాచారంలో పూర్తి వివరాలు రాలేదని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఈనెల 17వ తేదీన జరుగనుంది. -
పెట్టుబడిదారుల ముద్దుబిడ్డ మోడీ
ఖమ్మం మయూరిసెంటర్: పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనం కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాభాస్కర్ విమర్శించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే ప్రధాని తహతహలాడుతున్నారన్నారు. తెలంగాణ మావల్లే అభివృద్ధి చెందుతుందన్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మాటమార్చిందన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సాయిబాబా అధ్యక్షతన ఖమ్మం పెవిలియన్గ్రౌండ్లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, ఔట్సోర్పింగ్ ఉద్యోగులను చేయమనడం కేసీఆర్కు తగదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు వేసిన కమిటీ ఎప్పటికి నివేదిక ఇస్తుందో తెలియదన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తూనే ఉన్నా స్పందించడం లేదన్నారు. ఏ రంగంలో పనిచేసే వారికైనా రూ.15వేల కనీస వేతనం ఉండాలని కార్మికవర్గం పోరాటం చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షన్నర మంది మధ్యాహ్న భోజన వర్కర్లు ఉన్నారన్నారు. తెలంగాణలో 70 వేల మంది వరకు పనిచేస్తున్నారని తెలిపారు. వీర్ని తొలగించాలనే యో చనలో ప్రభుత్వం ఉందన్నారు. పొరుగు రా ష్ట్రాల్లో ఓ జాబ్కార్డు ఉంది..మనరాష్ట్రంలో ఉ ద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. వరంగల్లో ఇనుపఖనిజాలు ఉన్నాయని 1953 నుంచి చెబుతున్నా ఇప్పటి వరకు వా టిని వెలికి తీసిన దాఖలాలు లేవన్నారు. ఆ దిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పత్తి బాగా పండుతుందని తెలిసినా ఏ ప్రభుత్వ మూ టెక్స్టైల్స్ ఇండస్ట్రీని నెలకొల్పదన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సీఐటీయూ జాతీయ కార్యదర్శి హేమలత అన్నారు. ధ రలు తగ్గిస్తారని, ఉద్యోగ అవకాశాలు మె రుగుపడుతాయని, లంచగొండి తనాన్ని రూపుమాపుతారని ఆశాపడ్డారని తెలిపా రు. ప్రభుత్వాలు ఏర్పడి వందరోజులైనా ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏవీ లేవన్నారు. ఎన్నికలకుముందు ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరుతున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయిబాబా పేర్కొన్నారు. అసంఘిత రంగంలో ఉన్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి మాటలు, పనితీరుపై సందేహాలను ఆయనే నివృత్తి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య కోరారు. ఇటీవల జరిపిన సమగ్ర కుటుంబ సర్వేపై పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వేస్తున్న అడుగులు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దళితులకు మూడు ఎకరాల భూమి అంటూ ఆగస్టు 15న పట్టాలు ఇచ్చారు కానీ నేటికీ భూమి అప్పగించలేదన్నారు. సింగరేణిని అద్భుత సంస్థగా అభివృద్ధి చేస్తామని, సింగరేణికి చెందిన కేంద్ర వాటాలు కొనుగోలు చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారన్నారు. ఆర్టీసీ, విద్యుత్ రంగాల్లో వస్తున్న పరిణామాలు సింగరేణి గురించి ఆందోళన పడేలా చేస్తున్నాయన్నారు. జిల్లాలోని 5,500 మంది ఆశావర్కర్లకు 18 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సభ దృష్టికి తీసుకొచ్చారు. జూన్ 5న భద్రాచలం వచ్చిన ఉప ముఖ్యమంత్రి రాజయ్య దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా వెంటనే ఇస్తామని వాగ్దానం చేసి నేటికీ దాన్ని నెరవేర్చలేదన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజారావు, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు ఎ.జె.రమేష్, ఆహ్వానసంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యర్రా శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చుక్కా రామయ్య, ఎస్.ఎన్.రెడ్డి, భిక్షమయ్య, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, వెంకటేష్, వీరారెడ్డి, ఎస్.రమ, చుక్కయ్య, వంగూరి రాములు, ఎండి.అబ్బాస్, టి.విష్ణువర్దన్, అఫ్రోజ్సమీన, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు గ్రెయిన మార్కెట్ నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ఎర్రజెండాలు చేబూని ప్రదర్శనగా తరలివచ్చారు. -
శ్రీకాళహస్తీశ్వరాలయంలో 105 మందికాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు
శ్రీకాళహస్తి: చంద్రబాబు వస్తే..జాబ్ వస్తుంది.. అనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ వరుసగా జాబ్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాబ్లు ఇవ్వడం మాట దేవుడికెరుక..ఉన్న ఉద్యోగాలను ఇబ్బముబ్బడిగా తొలగిం చేస్తున్నారు. మొన్నటి వరకు ఆదర్శరైతులు, ఉపాధి పథకం క్షేత్ర సహాయకులు,స్కిట్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులను వందల సంఖ్యలో తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాళహస్తి దేవస్థానంలో పనిచేస్తున్న 105 మంది కాంట్రాక్ట్ కార్మికులను మంగళవారం తొలగించారు. బాధితులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ బిక్షాలగోపురం వద్ద రిలే దీక్షలు ప్రారంభిం చారు. వారికి వైఎస్సార్ సీపీ నాయకులు,సీఐటీయూ నాయుకులు మద్దతుగా నిలిచారు. శ్రీకాళహస్తి దేవస్థానం పరిధిలో పదేళ్లుగా 105మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. రెండేళ్లకు ఒక కాం ట్రాక్టర్ ఆధ్వర్యంలో సిబ్బంది పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితం యువశేఖర్ అనే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఆ తర్వాత వేసిన కాంట్రాక్ట్ర్ డాక్యుమెంట్స్ సక్రమంగా లేకపోవడంతో టెండర్ రద్దు చేశారు. అయినప్పటికీ 105 మంది సిబ్బందిని కొనసాగిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 1వతేదీ(సోమవారం) సాయంత్రం తొలగిం చినట్లు వారికి సమాచారం ఇచ్చారు. దాంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయంటూ బాధితులు ఆలయం వద్ద ఆందోళకు దిగారు. సీఐటీయూ నాయకులు రఫి, పుల్లయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు మిద్దెల హరి, అంజూరు శ్రీనివాసులు, చిందేపల్లి మధుసూదన్రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి,బాలాజీ,అంక య్య తదితరులు మద్దతివ్వడంతో బిక్షాలగోపురం వద్ద నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయుకులు మాట్లాడుతూ పదేళ్లుగా పనిచేస్తు న్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిం చడం సరికాదన్నారు. దేవాదాయశాఖ క మిషనర్ వారికి రోజుకు రూ.295 చెల్లిం చాలని జీవో విడుదల చేసినా ఆలయాధికారులు రోజుకు రూ.115 చెల్లిస్తున్నారని, అరుునా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూనే ఉన్నారని తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుబ్రమణ్యం,లక్ష్మి,శ్రీదేవి, అ మరావతి, నాగభూషణమ్మ, రేణుక, మల్లీశ్వరి, సుబ్బమ్మ, బత్తెమ్మ,గురవమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి కోటి ఆదాయం.... ఆలయానికి అవసరమైన మేరకు కాం ట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. అదనం గా ఉన్నవారిని మాత్రమే తొలగించారు. ఆలయానికి ఏడాదికి సుమారు రూ. కో టి ఆదాయం వస్తోంది. నాలుగు నెలల క్రితమే కాంట్రాక్ట్ గడువు ముగిసింది. నూతనంగా వేసిన టెండర్ రద్దు అయిం ది. అయినా నాలుగు నెలలుగా కొనసాగించాం.అదనపు సిబ్బంది అవసరం లేదు. ఉన్న సిబ్బందే సరిపోతారు. -శ్రీనివాసరావు,ఆలయ ఈవో.