Medical Health and Family Welfare Department
-
ఏపీలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం: మంత్రి విడదల రజిని
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ,ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తగా ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో వందల క్రితం విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే. మేము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక చరిత్ర’’ అని మంత్రి రజిని అన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యం. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చాం. సీఎం జగన్ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం భర్తీ చేసిన అన్ని ఖాళీలు ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదు. వైద్య ఆరోగ్యశాఖలో నాలుగేళ్లలో 49 వేల పోస్టులను భర్తీ చేశాం’’ అనిమంత్రి విడదల రజిని తెలిపారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు పునాది -
‘వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే ఏపీ రోల్ మోడల్’
విజయవాడ: ఎకో ఇండియా సంస్థతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందని..ఎకో ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, సిబ్బంది సామర్థ్యం పెంచేలా ఎకో ఇండియా ఆధ్వర్యంలో ఎకో ప్రాజెక్టుపై నిర్వహించే రెండు రోజుల సదస్సును ఆయన విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ..ఎకో ఇండియాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా శిక్షణ ఉంటుందన్నారు. వార్డు బాయ్ నుంచి అత్యున్నత స్థాయి వైద్యాధికారి వరకు ఎకో ప్రాజెక్టుపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని..హెల్త్ కేర్ రంగంలో ఇలాంటి శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ ఆరు నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. రోగులతో వైద్య సిబ్బంది మసులుకునే విధానం వల్ల కూడా వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో చాలామంది స్థానిక ఆస్పత్రులపైనే ఆధారపడతారని..అందుకే గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్ఎచ్పీ తదితర సిబ్బందికి వివిధ విధానాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఏపీలో మెరుగైన వైద్య సదుపాయాల ద్వారా ముందస్తు రోగ నివారణ జరుగుతోందని..గ్రామస్థాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకి చికిత్స అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 48వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించామని..వారందరికీ ఎకో ప్రాజెక్టు ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మరింత పెంచామన్నారు. పలుచోట్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తెలుసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని గుర్తించాలన్నారు. వైద్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని..కాలంతో పాటు ప్రజల జీవనశైలిలో మార్పు రావాలన్నారు. టెలీ మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్, టెలీ లెర్నింగ్ వంటి అంశాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ ఏడాది అయిదు మెడికల్ కళాశాలలు ప్రారంభించబోతున్నామని.. ఇప్పటికే విజయనగరం మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చాయన్నారు. ఎకో ఇండియా సంస్ధతో ఎంవోయూ ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడలేదని..వారే ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజలు ఆస్పత్రులకు వచ్చే పరిస్థితులు తగ్గించాలనేది ప్రభుత్వ భావనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించలేదన్నారు. రాష్ట్రానికి 20 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కావాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని..జాతీయ రహదారుల పక్కనే 13 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ శ్రీ.జె.నివాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో వైద్య ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేయడంలో భాగమే ప్రాజెక్ట్ ఎకో అన్నారు. ఎకో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. మాతా శిశు సంరక్షణ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పెంచడం, వైద్యులు, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం ఎకో ప్రాజెక్టులో భాగంగా జరుగుతుందన్నారు. ఈ ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకి మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు, అధికారులు, తదితర సిబ్బంది ఉపయోగించుకోవాలని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె.నివాస్ సూచించారు. ఎకో ప్రాజెక్ట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డా.సందీప్ భల్లా మాట్లాడుతూ.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలుకు, వాటిని బలోపేతం చేసేందుకు ఎకో ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. 180 దేశాల్లో ఎకో ప్రాజెక్టు సేవలు అందిస్తోందని..2008లో భారత్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో 20 రాష్ట్రాలతో ఎకో ఇండియా సంస్థ ఎంవోయూ చేసుకుని ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎకో ప్రాజెక్టు ద్వారా డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నర్సులు, డెంటిస్టులు, ఆశా, ఏఎన్ఎం, వైద్య సంబంధింత స్పెషలిస్టులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు పరికరాలను ఉపయోగించడంలో నాణ్యమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాస్మిన్, నోడల్ ఆఫీసర్ ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రమేష్, స్టేట్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మీ, నేషనల్ హెల్త్ మిషన్ ఎస్పీఎమ్ డాక్టర్ వెంకట కిశోర్, సీఏవో గణపతిరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కన్సల్టెంట్స్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. -
ఆ శాఖలో 1,610 కొత్త పోస్టుల సృష్టి.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టులను కొత్తగా సృష్టిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలానికి రెండు పీహెచ్సీలు ఉండాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 88 పీహెచ్సీల కోసం 1,232 పోస్టులను కేటాయించింది. పీహెచ్సీ, సీహెచ్సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయడం కోసం మిగిలిన 378 పోస్టులను కేటాయించింది. కొత్తగా సృష్టించిన వాటిలో 302 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 264 స్టాఫ్ నర్స్, 151 ఎంపీహెచ్ఈవో/సీహెచ్వో, ఇతర పోస్టులు ఉన్నాయి. కాగా ఇప్పటికే వైద్య శాఖలో ప్రభుత్వం 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. కొత్తగా భర్తీ చేసే సిబ్బందితో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. -
ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శం కావాలి
సాక్షి, తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఏపీ సీఎస్ జవహార్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజారోగ్యానికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే.. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిగ్రామంలో క్లినిక్కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ వెళ్తారని, జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. సీఎం జగన్ స్పందిస్తూ.. అనుకున్నట్లు మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై వారి వైపునుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలి. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ► అలాగే.. మార్చి 1వ తేదీ నుంచి కూడా.. గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్ అందించాలన్నారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. డబ్ల్యూహెచ్ఓ లేదంటే జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడది. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి అని ఆకాక్షించారు సీఎం వైఎస్ జగన్. ► వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలి. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. ఇప్పటికే ఎనిమీయా కేసులపై సర్వే చేయించామని అధికారులు బదులిచ్చారు. వీరిలో రక్తహీనతను నివారించడానికి వైద్య పరంగా, పౌష్టికాహారం పరంగా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్. వైద్యారోగ్యశాఖ – స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, డేటా అనుసంధానత ఉండాలన్న ఆయన.. స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలన్నారు. విలేజ్ క్లినిక్స్ - ఎస్ఓపీ విలేజ్ క్లినిక్స్ ఎస్ఓపీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం తదితర అంశాలను గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు చేర్చామని అధికారులు తెలిపారు. దానికి స్పందించిన సీఎం వైఎస్ జగన్.. విలేజ్ క్లినిక్స్ సిబ్బంది నుంచి సంబంధిత సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలని సూచించారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రతిరోజూ ఈ అంశాలపై కూడా సమీక్షించాలని, కలెక్టర్లు కూడా నిరంతర పర్యవేక్షణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలి. సిబ్బంది, ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలి. తాము అందుబాటులో ఉంటున్న తీరు, అందుతున్న సేవలపై ప్రతికుటుంబానికీ వారి ద్వారా వివరాలు అందాలి. గ్రామ సచివాలయాల సిబ్బంది తరహాలోనే ఈ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలి. హైరిస్క్గా గుర్తించిన వారిని, ప్రసవం కోసం ముందస్తుగానే మంచి ఆస్పత్రులకు తరలించాలని సీఎం జగన్.. అధికారులకు సూచించారు. దీనికి స్పందించిన అధికారులు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎక్కడా రాజీ పడొద్దు గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) నివారణ, చికిత్సలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. రక్తపోటు, మధుమేహం లాంటి ఎన్సీడీ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా వీరిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెడుతున్నాం. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నాం. అక్కడి సమస్యకు శాశ్వతంగా మన ప్రభుత్వం పరిష్కారాలు చూపుతోంది. అలాగే పాలకొండకు కూడా మరో సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. దానికి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని నియమించాలి. ఎక్కడా రాజీ పడొద్దు అని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. దానికి స్పందించిన అధికారులు.. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండు కూడా మార్చికల్లా పూర్తవుతాయని వివరించారు. అలాగే.. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి వారికి తగిన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వైద్య సిబ్బందికి స్క్రీనింగ్, చికిత్సలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు, సీఎం జగన్కు వివరించారు. ప్రతీ బోధనాసుపత్రిలో కూడా క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలు ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో కూడా ఈ పరికరాలు, చికిత్సలు ఉండాలి. ప్రతి బోధనాసుపత్రిలోనూ గుండెజబ్బుల చికిత్సా కేంద్రాలు ఉండాలి. అన్ని చోట్లా క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఇవి ఏర్పాటు కావాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్, గుండెజబ్బులకు సంబంధించి మరిన్ని పీజీ సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారని సీఎం వైఎస్ జగన్.. అధికారులతో పేర్కొన్నారు. ఇదీ చదవండి: తెలుగు వారి హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు: సీఎం జగన్ -
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: పోలవరం పనులు భేష్ జనవరి 10వ తేదీ నుంచి రెండో డోసు వేసుకొని 9 నెలలు పూర్తయిన హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్కు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ వర్కర్స్, రెండు డోసులు పూర్తయిన వారికి డాక్టర్ల సూచనల మేరకు జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. హెల్త్ క్లినిక్స్ పనులకు సంబంధించి ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామని అధికారులు తెలిపారు. చదవండి: Andhra Pradesh: 60 ఏళ్లకు కదలిక ►రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ►ఇప్పటికే 8585 చోట్ల పనులు మొదలయ్యాయన్న అధికారులు ►పీహెచ్సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు ►డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయన్న అధికారులు ►అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ►వీటి నిర్మాణాలు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలన్న సీఎం ►సీహెచ్సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు ►అత్యవసర పనులను ఇప్పటికే పూర్తిచేశామన్న అధికారులు ►మిగిలిన పనులుకూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం 16 కొత్త మెడికల్కాలేజీల్లో పనుల ప్రగతినీ సమీక్షించిన సీఎం ►ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు ►కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు ►వీటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం ఆదేశాలు ►ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపైనా సీఎం సమీక్ష గణనీయంగా పెరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు: ♦2019 జూన్కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న వైద్య ప్రక్రియలు 1059 ♦2019 జూన్ తర్వాత 2446 వైద్య ప్రక్రియలకు పెంపు ♦2019 జూన్కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న కవరేజీ ఆస్పత్రులు 919, తర్వాత 1717 ఆస్పత్రులకు పెంపు. ♦కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్యశ్రీ కింద లబ్ధి ♦2019 జూన్కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు లబ్ధి 1570 మందికి జరిగితే.. ప్రస్తుతం 3300 మందికి లబ్ధి. ♦బధిర, మూగ వారికి పూర్తి ఖర్చులతో శస్త్రచికిత్సలు. ♦ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపు. ♦ఇప్పటివరకూ 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ. 439.4 కోట్లు చెల్లింపు ♦శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225లు ఇస్తున్న ప్రభుత్వం. ♦కాన్సర్ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం. వైఎస్సార్ కంటి వెలుగుపైనా సీఎం సమీక్ష ♦ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్న సీఎం ♦కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలన్న సీఎం ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ♦దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం ♦ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మంది కంటి అద్దాలు ఇచ్చామని తెలిపిన అధికారులు ♦60 ఏళ్ల పైబడ్డ వారికి 13,58,173 మందికి పరీక్షలు చేశామన్న అధికారులు ♦ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు, మరో 1,00,223 మందికి శస్త్రచికిత్సలు చేయించామన్న అధికారులు. మరో 26,437 మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయించాలన్న అధికారులు ♦కోవిడ్ పరిస్థితులు కారణంగా కంటివెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయన్న అధికారులు. ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్న సీఎం. హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష ♦వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం ♦జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦మొత్తం 16 చోట్ల ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తింపు ♦జిల్లాలో స్పెషాల్టీ సేవల అవసరం మేరకు ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సీఎంకు వివరాలందించిన అధికారులు ♦మొత్తం పాజిటివ్ కేసులు 3366 ♦పాజిటివిటీ రేటు 0.7 శాతం ♦పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12 ♦పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ♦2 కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లా 1 ♦అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 23,457 ♦అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ–టైప్ సిలిండర్లు 27,311 ♦ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు మొత్తం 140 ♦15 డిసెంబరు నాటికి పీఏస్ఏ ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేస్తామన్న అధికారులు వ్యాక్సినేషన్ ♦సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,17,71,458 ♦రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 2,17,88,482 ♦మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 3,35,59,940 ♦మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జిఎస్ నవీన్కుమార్, ఏపీఎంస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవియన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్తో పాటు హెల్త్ హబ్స్పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతిపై చర్చించారు. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్లో ఉంటే.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్పైనా సీఎం సమీక్ష కొత్త పీహెచ్సీల నిర్మాణం, ఉన్న పీహెచ్సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు.. వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని.. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టిపెట్టామని సీఎం జగన్ తెలిపారు. స్వేచ్ఛ ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామని.. నెలకు ఒక్కసారి ఈ రకమైన కార్యక్రమం చేపట్టాలన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ పై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్ పెట్టి.. దాని రిఫరెల్ మీద ప్రచారం ఉండాలని.. ఆరోగ్య మిత్రల ఫోన్నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్లో ఉంచాలలని సీఎం ఆదేశించారు. ఎమ్పానెల్ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలన్నారు. డిజిటల్ పద్ధతుల్లో పౌరులకు ఎమ్పానెల్ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలని అలానే 108 వెహికల్స్ సిబ్బందికి కూడా రిఫరెల్ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. ఏపీ డిజిటల్ హెల్త్పై సీఎం సమీక్ష హెల్త్కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలని సీఎం జగన్ తెలిపారు. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలన్నారు. దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగావైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. బ్లడ్ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలన్న సీఎం జగన్ 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్కార్డుల్లో పొందుపర్చాలన్నారు. డిజిటిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్ఐడీలు క్రియేట్చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై సీఎంకు వివరాలందించిన అధికారులు... ►రాష్ట్రంలో యాక్టివ్ పాజిటివ్ కేసులు 9,141 ►రికవరీ రేటు 98.86 శాతం ►ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 2201 ►కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు 313 ►హోం ఐసోలేషన్లో ఉన్నవారు 6627 ►జీరో కేసులు నమోదైన సచివాలయాలు 11,997 ►పాజిటివిటీ రేటు 1.62 శాతం ►0 నుంచి 3 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 12 ►3 లోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా 1 ►ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బెడ్స్ శాతం 92.27 శాతం ►ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్ 69.70 శాతం ►104 కాల్సెంటర్కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ 649 థర్డ్ వేవ్ సన్నద్ధత ►మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 20,964 ►ఇంకా రావాల్సినవి 2,493 ►అందుబాటులో ఉన్న డి టైప్ ఆక్సిజన్ సిలెండర్లు 27,311 ►రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు 140 ►అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిగా అందుబాటులో రానున్న ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ►సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,38,32,742 ►రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,44,94,731 ►మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 2,83,27,473 ►వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు 4,28,22,204 వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి యస్ నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: AP: రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ‘రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతలకు కడుపుమంట’ -
ఆస్పత్రుల నిర్వహణపై సీఎం సమీక్ష
-
వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: హెల్త్హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్హబ్స్లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై మంగళవారం సమీక్ష చేపట్టారు. అదే విధంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హెల్త్హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్హబ్స్ ద్వారా నెరవేరుతుందన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలని తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్లో ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పారు. ఆస్పత్రుల నిర్వహణపై సీఎం సమీక్ష వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను సీఎంకు అధికారులు వివరించారు. ఆస్పత్రుల నిర్వహణకోసం ప్రత్యేక అధికారుల నియమిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవలను అధికారులు నిర్వహించనున్నారు. సీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని సీఎం ఆదేశించారు. అలాగే వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమని తెలిపారు. రిసెప్షన్ సేవలు కూడా కీలకమని అన్నారు. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందినట్లేనని పేర్కొన్నారు. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయాలని, ఎవరి ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆకాక్షించారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలోపేతంగా ఉండాలని, నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు సంబంధించి వివరాలు అందించిన అధికారులు ► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు ► నవంబర్ 15 నుంచి 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు ► వచ్చే జనవరి 26 నుంచి పూర్తి స్ధాయిలో అమలు ► జనాభానుకూడా దృష్టిలో ఉంచుకుని ఆమేరకు 104 లను వినియోగించాలని సీఎం ఆదేశం ► అలాగే విలేజ్ క్లినిక్స్ విధివిధానాలను, ఎస్ఓపీలను ఖరారుచేయాలన్న సీఎం ► పీహెచ్సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలని, ఒక డాక్టరు పీహెచ్సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా చూడాలన్న సీఎం ► కొత్త పీహెచ్సీల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. కోవిడ్ 19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్పై సీఎంకు వివరాలు అందించిన అధికారులు ► ఏపీలో మొత్తం యాక్టివ్ కేసులు 14,652 ► పాజిటివిటీ రేటు 2.23 శాతం ► రికవరీ రేటు 98.60 శాతం ► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు 2699 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 854 ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నవారి బెడ్స్ 91.66 శాతం ► ప్రైవైటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నవారి బెడ్స్ 71.04 శాతం ► 104 కాల్ సెంటర్కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ 753 ► ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 ఫీవర్ సర్వేలు పూర్తయ్యాయి ► రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు 10,541 ► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువ నమోదైన జిల్లాలు 9 ► పాటిజివిటీ రేటు 3శాతం కంటే ఎక్కువున్న జిల్లాలు 4 థర్డ్ వేవ్ సన్నద్ధత ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ టైప్ సిలిండర్లు 27,311 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు 20,964 ► ఇంకా రావాల్సినవి 2493 ► 50 అంతకంటే ఎక్కువ బెడ్స్ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటు ► 11 అక్టోబరు నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానున్న పీఎస్ఏ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ► ఇప్పటివరకు సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తైన వారు 1,33,30,206 ► రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన వారు 1,08,54,556 ► మొత్తం వ్యాక్సినేషన్ (సింగిల్, డబుల్ డోసు కలిపి) పూర్తైన వారు 2,41,84,762 ► వ్యాక్సినేషన్ కోసం వినియోగించిన మొత్తం డోసులు 3,50,39,318 ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్పోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జే వి యన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: బహ్రెయిన్లో భారతీయ బాధితులను వెనక్కి తీసుకురండి -
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే టీకాలు..!
సాక్షి, హైదరాబాద్: కళాశాలలు తెరిచిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు కరోనా టీకాలు వేయడంపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశంలో థర్డ్వేవ్పై నిపుణుల హెచ్చరికలు కొనసాగుతు న్నాయి. మరోవైపు రాష్ట్రంలో విద్యాసంస్థలు బుధవారం నుంచి ప్రారంభమ య్యాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ తదితర ఉన్నత విద్యా సంస్థల వద్ద విద్యార్థులకు టీకాలు అందు బాటులోకి తేనున్నారు. అలాగే అన్ని యూని వర్సిటీల్లోనూ ఈ మేరకు ఏర్పాట్లు చేయను న్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో 18 ఏళ్లు నిండిన వారు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. కాగా ఇప్పటివరకు టీకాలు తీసుకోనివారికి వీలైనంత త్వరగా టీకాలు వేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అన్ని వసతిగృహాల్లోనూ వ్యాక్సినేషన్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన హాస్టళ్లలోనూ టీకాలు వేయాలని నిర్ణయించారు. 20–30 మంది ఉన్న వసతిగృహాలు, ప్రైవేట్ హాస్టళ్లలోనూ టీకాలు వేస్తారు. ఏదైనా ప్రైవేట్ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉన్నా, సమాచారం ఇస్తే అక్కడకు కూడా మొబైల్ వాహనంలో వెళ్లి వ్యాక్సినేషన్ చేపడతారు. ఎక్కడ వీలైతే అక్కడ వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తాజాగా జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాలు పాఠశాల, కాలేజీ బస్సు ఎక్కే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి. వీలైతే ఒక సీటులో ఒకరు మాత్రమే కూర్చునేలా చూడాలి. హాస్టళ్లలో విద్యార్థులు గుమికూడకుండా, ఒకే రూములో ఎక్కువమంది ఉండకుండా చూడాలి. భోజనాలకు వేర్వేరు సమయాలు పెట్టాలి. తద్వారా విద్యార్థులు గుంపులుగా ఏర్పడకుండా చూడాలి. ప్రతిరోజూ అన్ని హాస్టళ్లలో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఏమాత్రం కన్పించినా తక్షణమే ఆయా హాస్టళ్లలోని ఐసోలేషన్ గదుల్లో ఉంచాలి. అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలి. -
కొత్త కరోనా: ఏపీ సర్కార్ మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: యూకే స్ట్రెయిన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాస్క్ ధరించేలా చూడాలని, కంటైన్మెంట్ వ్యూహాలను అనుసరించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ‘‘సంక్రాంతి దృష్ట్యా భారీ జనసమూహాలు లేకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న 1,519 నమూనా సేకరణ కేంద్రాలను వికేంద్రీకరించాలి. కరోనా టోల్ ఫ్రీ నంబర్ 104ను కొనసాగించాలి. కంటైన్మెంట్ జోన్లను నోటిఫై చేయడంతో పాటు ఫీవర్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని’’ వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. (చదవండి: కరోనా వ్యాక్సిన్.. అతి పెద్ద సవాల్) కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి సర్వే చేపట్టాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. కోవిడ్తో చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15వేలు ఆర్ధిక సాయం అందించాలని, రాష్ట్రంలోని ప్రతి కోవిడ్ ఆస్పత్రికి నోడల్ అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలి. ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందేలా చూడాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. (చదవండి: మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్ వద్దు) -
రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నాం. ఇందుకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఆస్పత్రుల్లో పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు. జనరేటర్లు, ఏసీలు పని చేయడం లేదని, శానిటేషన్ సరిగా లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమాలకు రూ.17,300 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు జనవరిలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాడు –నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్ కాలేజీలు, ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు, సీహెచ్సీలు, పీహెచ్సీలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలన్నారు. ప్రతి అంశానికీ బాధ్యులు ఉండాలని చెప్పారు. ఆస్పత్రిలో పరికరాల దగ్గర నుంచి ఏసీల వరకు ప్రతిదీ సక్రమంగా పని చేసేలా దృష్టి పెట్టాలన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదని హెచ్చరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉండాలి ఆస్పత్రుల నిర్మాణంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలించి, వాటిని పాటించండి. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు నవంబర్ లోగా టెండర్లు పిలవాలి. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నర్సాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు డిసెంబర్లో.. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్ కాలేజీల నిర్మాణాలకు జనవరిలో టెండర్లు పిలవాలి. వీటి కోసం రూ.7,500 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడున్న మెడికల్ కాలేజీల్లో నాడు –నేడు పనులకు మరో రూ.5,472 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీటికి అవసరమైన పరిపాలనా పరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలి. నిర్మాణ రీతిలో హరిత విధానాలు పాటించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాలి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సౌకర్యాలు ఉండాలి. ఆరోగ్యశ్రీ రిఫరల్ విధానం బాగుండాలి వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ వచ్చేంత వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమాచారం ఇవ్వండి. అక్కడున్న హెల్త్ అసిస్టెంట్/ఏఎన్ఎంల ద్వారా రిఫరల్ చేయించాలి. ఎంపానల్ అయిన ఆస్పత్రుల జాబితాను గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచండి. వైద్యం కావాలనుకున్న వారికి మార్గ నిర్దేశం చేయాలి. ఆరోగ్య శ్రీ కింద 2 వేల వ్యాధులకు ఇప్పటికే 7 జిల్లాల్లో చికిత్స అమలవుతోంది. నవంబర్ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో (శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం) చికిత్స అందుబాటులోకి వస్తుంది. అవసరం అనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను ఈ జాబితాలో చేర్చండి. అంతిమంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలి
-
అనుమానితుల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు..
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లు ప్రభుత్వం పంపించిందని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి కరోనా రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు వైద్యారోగ్యశాఖ సూచించింది.(ఏపీలో మరో 1919 కరోనా కేసులు) కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే..అలాంటి వారికి మరోసారి రియల్ టైమ్లో ఆర్టీపీసీఆర్ చేయాలని, హైరిస్క్ కేసులున్న ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులను పరీక్షించేందుకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల అనంతరం డిశ్చార్జి అవుతున్నవారిని పరీక్షించవచ్చని, కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరికీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ
సాక్షి, విజయవాడ: వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని.. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వైద్యులు, సిబ్బందిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొంది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రజలు సహకరిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘‘చిన్న చిన్న టైపింగ్ పొరపాట్లను పని గట్టుకుని ఎత్తి చూపి విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. వైద్య శాఖ ఇచ్చే సమాచారం పై ఎవ్వరికీ సందేహాలున్న సంప్రదించొచ్చు. పూర్తి పారదర్శకంగా కరోనా వైద్య పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 5 నాటికి రాష్ట్రాల్లో ఒక్క వైరల్ ల్యాబ్ కూడా లేదు.. అలాంటిది ఇప్పుడు రోజుకి 2300 పరీక్షల సామర్థ్యం గల వైరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసాం. ఇప్పటి వరకు 21450 మందికి కరోనా పరీక్షలు జరిపాం. రోజుకి 17, 500 టెస్టులు చేసే సామర్థ్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఇందుకోసం వైరల్ ల్యాబ్లతో పాటు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సమకూర్చుకున్నాం. లక్ష ర్యాపిడ్ కిట్లు, 50 వేల టెస్టింగ్ కిట్ల కు కొనుగోలు ఉత్తర్వులు ఇచ్చామని’’ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. -
ఆ పనులు చరిత్రాత్మకం కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షించారు. ఆసుపత్రుల నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్ మొదటివారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16వేల కోట్లు ఖర్చువుతుందని సీఎం తెలిపారు. (కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం.. నాడు – నేడు కింద చేపట్టే పనులు ఇప్పటివారికే కాదని.. భవిష్యత్తు తరాలకూ సంబంధించిందని సీఎం పేర్కొన్నారు. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించడానికి ఉపయోగపడతాయని.. అందుకే నాడు-నేడు కింద చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని.. మంచి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పనులు చరిత్రాత్మకం కావాలన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజారోగ్య వ్యవస్థ గురించి ఆలోచించడం లేదని.. రూ.16వేల కోట్లు ఖర్చుచేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాల కింద చేపట్టే పనులకు ప్రజలు, ఈ దేశం మద్దతుగా నిలబడుతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. (పురోహితులను ఆదుకోండి) -
‘కరోనా’పై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి : చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధి.. అక్కడ నుండి వస్తున్న వారి ద్వారా ఇక్కడ కూడా వ్యాపించే అవకాశం ఉన్నందున జిల్లాల వైద్యాధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై 13 జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలపై ఇప్పటికే రాష్ట్రస్థాయిలో విధివిధానాలు జారీచేశామని, జిల్లా స్థాయి అధికారులు కూడా వాటిని అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల డీఎంహెచ్వోలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారనే విషయమై ఆరా తీశారు. కాగా, చైనా నుండి తిరిగివచ్చిన 28 రోజుల్లోపు ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వారు వెంటనే మాస్క్ ధరించి సమీప ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లను సంప్రదించాలని జవహర్రెడ్డి సూచించారు. ఇతర సమాచారం కోసం 1100, 1102 టోల్ఫ్రీ నంబర్లకు గానీ లేదా 7013387382 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం తదితర ఓడరేవుల అధికారులను సంప్రదించి విదేశాల నుంచి ఓడల ద్వారా వచ్చిన వారి వివరాలు సేకరించాలని కూడా ఆదేశించారు. -
‘అమ్మ’కు హైబీపీ శాపం
సాక్షి, హైదరాబాద్: ప్రసవ సమయంలో బీపీ పెరగటం కారణంగానే మాతృత్వపు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సంభవించిన మాతృత్వపు మరణాలను ఆ శాఖ విశ్లేషించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ మధ్య కాలంలో రాష్ట్రంలో 313 మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక వివరించింది. అందులో బోధనాసుపత్రుల్లో 120 మంది, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 28 మంది, ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలోని ఆసుపత్రిలో ఒకరు, ఇంటి వద్ద జరిగిన ప్రసవాల్లో 31 మంది, ప్రయాణ సమయాల్లో 39, ఇతరత్రా కారణాలతో 12 మంది మరణించారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 82 మంది మృతిచెందారు. పెద్దాసుపత్రుల్లో పరిశీలిస్తే అత్యధికంగా గాంధీ ఆసుపత్రిలో 49 మంది, ఉస్మానియా ఆసుపత్రిలో 21 మంది, వరంగల్ ఎంజీఎంలో 12 మంది చనిపోయారు. మరణాల్లో గర్భిణిగా ఉన్నప్పుడు 58 మంది చనిపోగా, ప్రసవ సమయంలో 63 మంది చనిపోయారు. ప్రసవమయ్యాక వారం రోజుల వ్యవధిలో అత్యధికంగా 124 మంది చనిపోవడం గమనార్హం. ఇక 7 నుంచి 42 రోజుల వ్యవధిలో 68 మంది చనిపోయారు. బీపీ, రక్తస్రావం, షుగర్లతో.. మాతృత్వపు మరణాలకు గల కారణాలను వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషించింది. ప్రసవ సమయంలో బీపీ పెరగడం, దాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో అధికంగా 81 మంది చనిపోవడం గమనార్హం. ఆ తర్వాత రక్తస్రావంతో 55 మంది చనిపోయారు. మధుమేహం తదితర కారణాలతో 45 మంది చనిపోయారు. ఇన్ఫెక్షన్లతో 44 మంది చనిపోయారు. గుండె సంబంధిత జబ్బుల కారణంగా 40 మంది మృతిచెందారు. తెలియని కారణాలతో 27 మంది, రక్తహీనత, మెదడులో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులపైన ప్రభావం చూపడం, సిజేరియన్ వికటించడం వంటి తదితర కారణాలతో మిగతా వారు మృతి చెందారు. హైదరాబాద్లో అత్యధిక మరణాలు... ఈ ఏడు నెలల కాలంలో జరిగిన మరణాల్లో అత్యధికంగా హైదరాబాద్లోనే సంభవించాయి. నగరంలోనే 32 మంది చనిపోయారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 18 మంది, రంగారెడ్డి జిల్లాలో 17 మంది, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 16 మంది చొప్పున మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది. ఈ మాతృత్వపు మరణాల్లో బోధనాసుపత్రుల పరిధిలోనే 38 శాతం సంభవించాయి. ఇక ఇటీవల కేంద్రం విడుదల చేసిన 2015–17 ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షకు 76 మాతృత్వపు మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ సంఖ్య 2001–03లో ఏకంగా 195 ఉండటం గమనార్హం. -
కొండ కోనల్లోనూ ఆరోగ్య భాగ్యం
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఫీడర్ (బైక్) అంబులెన్స్లు మరిన్ని రానున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఇటీవల జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈమేరకు ఆదేశించారు. దీంతో ఈ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల ద్వారా వైద్యసేవలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. 108, 104లతో పాటు ఫీడర్ అంబులెన్స్ల సంఖ్య పెంచాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీంతో ఇప్పటి వరకు 15 ఉన్న బైక్ అంబులెన్స్లు రెట్టింపు కానున్నాయి. సీతంపేట, కొత్తూరు, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, మందస పీహెచ్సీల పరిధిలో 108 అంబులెన్స్లు 6 ఉండగా వీటి అనుసంధానంగా ఫీడర్ అంబులెన్స్లు 15 ఉన్నాయి. ఎం.సింగుపురం, ఎంఎస్పల్లి, ఎస్జే పురం, భామిని, బుడంబోకాలనీ, అల్తి, సిరిపురం, బాలేరు, నేలబొంతు, పాలవలస, లబ్బ, కరజాడ, చిన్నబగ్గ, శంబాం, పెద్ద పొల్ల గ్రామాల్లో బైక్ అంబులెన్స్లు నడుస్తున్నాయి. వీటితోపాటుగా మరో 15 కొత్తవి కావాలని వైద్యాధికారులు ప్రతిపాదించారు. అలాగే మరో రెండు 108 వాహనాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇవి వస్తే మారుమూల గ్రామాలన్నింటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదీ పరిస్థితి... ప్రస్తుతం ఉన్న బైక్ అంబులెన్స్లు గతేడాది డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు 6,072 మందికి వైద్యసేవలు అందించాయి. ఎపిడమిక్ సీజన్లో డయేరియా, మలేరియా కేసులు నమోదవుతుంటాయి. ఇంకా అనుకోని ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటాయి. గర్భిణులకు అత్యవసర వైద్య సేవలు అవసరం. ఈ తరుణంలో అపర సంజీవినిగా పేరుగాంచిన 108లు మారుమూల కొండలపై ఇరుకు రహదారులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యవసర సమయాల్లో రోగులను పీహెచ్సీలకు తరలించడానికి ఫీడర్ అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చాయి. కొండ ప్రాంతాల మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్లు వెళ్లలేని గ్రామాలకు వెళ్లి రోగులను నేరుగా ఆసుపత్రులకు గాని 108 అందుబాటులో ఉండే ప్రదేశానికి తీసుకువస్తాయి. గర్భిణులకు ఫీడర్ అంబులెన్స్లో సుఖ ప్రసవం అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్లు అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్లు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటికే 15 నిర్వహిస్తున్నాం. మరో 15 కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. కొత్తవి వచ్చిన వెంటనే సేవలు ప్రారంభిస్తాం. బైక్ అంబులెన్స్లు సకాలం లో సంబంధిత పీహెచ్సీలు, సీహెచ్సీల్లో రోగులను చేర్చడానికి ఉపయోగకరంగా ఉంటాయి. –ఈఎన్వీ నరేష్కుమార్, డిప్యూటీ డీఎఅండ్హెచ్వో మాలాంటి మారుమూల గిరిజనులకు ఉపయోగం మాలాంటి మారుమూల గిరిజన గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గర్భిణులకు పురిటి నొప్పులు వంటివి వచ్చినపుడు ఏదో ఒక అంబులెన్స్ రావాలని ఫోన్లు చేస్తుంటాం. వాటి రాక కోసం ఎదురు చూస్తుంటాం. వాటికి ముందే బైక్ అంబులెన్స్లు వస్తే సకాలంలో వైద్యం అందుతుంది. –ఎస్.రజిని, కోసిమానుగూడ -
కంటి ఆపరేషన్లు ఎందుకు వికటించాయి?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించిన అంశంపై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించింది. ఆ çఘటనకు సంబంధించి వివరణ కోరుతూ వైద్య ఆరోగ్యశాఖకు నోటీసులు జారీచేసింది. ఆపరేషన్లు వికటించడంలో బాధ్యత ఎవరిది? ఆస్పత్రిలో ఎక్కడ లోపం జరిగింది? అందులో ప్రభుత్వ బాధ్యత ఎంత? వైద్యుల నిర్లక్ష్యం ఉందా? వంటి అంశాలపై ప్రశ్నించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బాధితుల పరిస్థితెలా ఉంది? వారికెలాంటి చికిత్స అందిస్తున్నారు? వంటి వివరాలనూ పంపాలని ఆదేశించి నట్లు తెలిసింది. ఇటీవల వరంగల్ జయ ఆస్పత్రిలో 17 మందికి కంటి ఆపరేషన్లు వికటించిన సంగతి తెలిసిందే. వారందరినీ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అందులో 13 మందిని డిశ్చార్జి చేయగా.. మిగిలిన నలుగురికి చికిత్స జరుగుతోంది. ఆస్పత్రిదే బాధ్యత: కంటి ఆపరేషన్లు వికటించిన çఘటనలో వరంగల్లోని ప్రైవేటు ఆస్పత్రిదే బాధ్య తని వైద్యారోగ్యశాఖ నిర్ధారణకు వచ్చింది. దీన్నే హెచ్చార్సీకి విన్నవించాలని నిర్ణయించింది. హెచ్చార్సీకి వివరిస్తూ సమగ్ర నివేదికను ఆ శాఖ తయారు చేసింది. ఆపరేషన్ చేసిన వైద్యులూ బాధ్యులేనని స్పష్టం చేసింది. ఆపరేషన్ థియేటర్ను ప్రొటోకాల్ ప్రకారం నిర్వహించకపోవడం, రోగులకు శస్త్రచికిత్స సమయంలో నిర్లక్ష్యం కనిపించిందని వివరించింది. అవి కంటి వెలుగు కింద చేసిన ఆపరేషన్లు కావని హెచ్చార్సీకి విన్నవించనుంది. తద్వారా కంటి వెలుగు పథకంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడాలన్నదే సర్కారు ఉద్దేశం. ఆస్పత్రి సీజ్..? ఘటన జరిగిన వెంటనే తాము ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని వరంగల్కు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెచ్చార్సీకి పంపే నివేదికలో ప్రస్తావించింది. ఆస్పత్రిదే బాధ్యతగా నిర్ధారణకు వచ్చామని సర్కారు వెల్లడించింది. దీంతో ఆస్పత్రిపైనా, వైద్యం చేసిన డాక్టర్లపైనా చర్యలు తీసుకుంటామని విన్నవించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. వైద్య బృందం సిఫార్సుల మేరకు ఆస్పత్రి లైసెన్సు రద్దు చేయడమా? లేదా ఆస్పత్రిని సీజ్ చేయడమా? లేదా ఆస్ప త్రిలో కంటి వైద్య విభాగాన్ని సీజ్ చేయడమా అన్నది పరిశీలన చేస్తున్నట్లు హెచ్చార్సీకి ఇచ్చే వివరణలో తెలిపింది. అలాగే వైద్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
నా చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలి
సాక్షి, అమరావతి: ఉద్యోగులు సమస్యలపై కోర్టుకెళ్లడం చూశాం.. భూ తగాదాల విషయంలో కోర్టును ఆశ్రయించిన వారినీ చూశాం.. కానీ ఓ అరుదైన వ్యాధి బాధితుడు తనకు ప్రభుత్వం వైద్య చికిత్స అందించేలా ఆదేశించాలంటూ ఇటీవల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. బాధితుడికి అందించే వైద్యం అత్యంత ఖరీదైనది కావడం, చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వెళితే సదుపాయాలు లేకపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. విజయనగరం జిల్లా నల్లబిల్లికి చెందిన ఓ అరుదైన వ్యాధిగ్రస్థుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులను బాధ్యులుగా పేర్కొంటూ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అరుదైన వ్యాధితో అవస్థలు కోర్టును ఆశ్రయించిన బాధితుడు కొన్నేళ్లుగా ‘గాచర్స్’ (ఎంజైమ్ లోపంతో పుట్టడం)తో బాధపడుతున్నాడు. ఇలాంటి వ్యాధిగ్రస్థులు 50 లక్షల మందిలో ఒకరు కూడా ఉండరు. కాలేయం, మూత్రపిండాల మార్పిడి తరహాలోనే ఈ జబ్బుకు ఎంజైమ్ మార్పిడి చేయాలి. లేదంటే ఖరీదైన మందులు వాడాలి. బాధితుడు విజయనగరం జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించగా అంత ఖరీదైన మందులు తమ వద్ద లేవని చెప్పారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. చికిత్స ఖర్చు ఏటా కోటి రూపాయలు... హైకోర్టు ఆదేశాలతో సర్కారు దీనిపై నివేదిక రూపొందించింది. ఇది జన్యుపరమైన వ్యాధి అని, గ్లూకోసెరిబ్రోసైడస్ ఎంజైము లోపంతో ఈ వ్యాధి సోకడం వల్ల పలు అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు నిర్ధారించారు. దీనికి చికిత్స కోసం ఏటా కోటి రూపాయలకు పైగా వ్యయం అవుతుందని తేల్చారు. దీనికోసం వాడే ఖరీదైన సెరిటైజం ఇంజెక్షన్ దేశంలో అందుబాటులో లేదు. 400 యూనిట్లు ఉన్న ఈ ఇంజెక్షన్ వైల్ (బాటిల్) ధర రూ.1,10,000 ఉంటుంది. వ్యక్తి బరువును బట్టి కిలోకు 60 యూనిట్లు (50 కిలోలు ఉంటే 3000 యూనిట్లు) చొప్పున వాడాలని వైద్యులు తెలిపారు. భారీ వ్యయంపై సర్కారు తర్జనభర్జన చికిత్సకు ఏటా కోటి రూపాయలకుపైనే వ్యయం కానుండడంతో బాధితుడికి వైద్యమందించేందుకు ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఓ పేషెంట్కు ఇంత వ్యయంతో వైద్యం అందించడం కష్టమని అభిప్రాయపడుతోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పలువురు స్పెషలిస్టుల అభిప్రాయాలు సేకరించారు. దేశంలో ఈ వైద్యం అందుబాటులో లేనందున తామేమీ చేయలేమని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించనున్నట్లు ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. బాధితుడు ప్రస్తుతం విజయనగరంలో ఉంటున్నాడు. కింగ్జార్జి ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా చేరితే అందుబాటులో ఉన్న వైద్యం అందించేందుకు తమకు అభ్యంతరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యాధి లక్షణాలు ఇలా... –గాచర్స్ వ్యాధినే గ్లూకోసెరిబ్రోసైడస్ అని కూడా అంటారు –ఎంజైము లోపం వల్ల కాలేయం పెరుగుతూ ఉంటుంది –ప్లేట్లెట్స్ ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా ఉంటాయి –ఎర్రరక్త కణాలను గాచర్స్ వ్యాధి ధ్వంసం చేస్తూ ఉంటుంది –గాయమైతే రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూనే ఉంటుంది –గాచర్స్ కణాలు ఎముకల్లో మూలుగను కూడా పీల్చేస్తూ ఉంటాయి –ఎర్రరక్త కణాలు తక్కువ కావడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది –ఇనుప ధాతువు మోతాదు రోజు రోజుకూ పడిపోతూ ఉంటుంది –రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది –ఊపిరితిత్తుల సమస్యతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది –ఎముకలు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి –ఈ వ్యాధిని బెటా–గ్లూకోసైడస్ లుకోసైట్ (బీజీఎల్) అనే రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. -
3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 34.08 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సిన అవసరాన్ని వైద్యులు నిర్ధారించారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. అందులో అత్యధికంగా 2.42 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సిన అవసరముందన్నారు. 16,265 మందికి కరోనా, 68,788 మందికి ఇతరత్రా కంటి శస్త్రచికిత్సలు చేయాలని నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోనే అత్యధికంగా 41 వేల మందికి ఆపరేషన్లు చేయాలని గుర్తించారు. అంచనాలను మించి..: కంటి వెలుగుకింద రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్యశాఖ మొదట్లో అంచనా వేయగా ఇప్పుడు పరిస్థితి మారింది. అంచనాలకు మించి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి అంచనాలు కాస్తా నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు సుదీర్ఘంగా నిర్వహిస్తారు. ఒక అంచనా ప్రకారం కోటిన్నర మంది ప్రజలు కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకుంటారని భావిస్తున్నారు. నాలు గు రెట్లు ఆపరేషన్లు పెరిగే అవకాశమున్నందున ఆ మేరకు ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు 70 ఆసుపత్రులకు అనుమతిచ్చారు. అదనంగా మరో 41 ఆసుపత్రులను గుర్తించారు. ఇలా మొత్తం 111 ఆసుపత్రుల్లో కంటి ఆపరేషన్లు చేస్తారు. వారందరికీ ఆయా ఆసుపత్రుల్లో ఆప రేషన్లు చేయాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 60 రకాల ఆపరేషన్లు ఉచితంగా.. కంటి వెలుగు కింద 60 రకాల ఆపరేషన్లను ఉచితంగా చేస్తారు. ఆరోగ్యశ్రీలో కేవలం 25 వరకు మాత్రమే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుంటే, ఇప్పుడు ‘కంటి వెలుగు’లో 60 వరకు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అంటే కంటికి సంబంధించిన అన్ని ఆపరేషన్లు ఇందులోనే కవర్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కంటి ఆపరేషన్కు కనిష్టంగా రూ.2 వేలు, గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రభుత్వం సంబంధిత ఆసుపత్రికి చెల్లిస్తుంది. కంటి పరీక్షలు, ఆపరేషన్లు ఉచితంగా చేసే పరిస్థితి రావడం తో రాష్ట్రంలో ప్రైవేటు కంటి ఆసుపత్రులు రోగులు లేక వెలవెల పోతున్నాయి. మరోవైపు కంటి అద్దాల దుకాణాలకు కూడా గిరాకీ తగ్గినట్లు చెబుతున్నారు. -
పేదోడి ఆరోగ్యంతో ప్రైవేటు వ్యాపారం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 7,683 ఆరోగ్య ఉప కేంద్రాల(సబ్ సెంటర్స్)ను టెలిమెడిసిన్ పేరుతో ప్రైవేట్కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. అతి త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 26 సేవలను ప్రైవేట్పరం చేసి ఏటా రూ.2 వేల కోట్లకు పైగా కాంట్రాక్టు సంస్థలకు పంచి పెడుతున్న సర్కారు తాజాగా సబ్సెంటర్లను సైతం అప్పగించడం ద్వారా ఏటా మరో రూ.276.58 కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమైంది. టెలిమెడిసిన్ కింద పట్టణాల్లో పేదల కోసం ఇప్పటికే 222 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆర్నెళ్లుగా వీటికి బిల్లులు కూడా సరిగా చెల్లించడం లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులు చూడటం లేదని ఫిర్యాదులు వచ్చాయి. మౌలిక వసతులున్న చోటే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లోని సబ్సెంటర్లలో టెలిమెడిసిన్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. టెలిమెడిసిన్ కింద ఒక్కో ఆరోగ్య కేంద్రానికి నెలకు రూ.4.08 లక్షలు చెల్లిస్తున్నా పర్యవేక్షణ లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లే లేకపోయినా బిల్లులు చెల్లిస్తున్నారు. చంద్రన్న సంచార చికిత్స బాధ్యతలు నిర్వహిస్తున్న పిరమిల్ సంస్థ ఒక్క పేషెంట్ వచ్చినా ఆరుగురి ఆధార్ కార్డులు తీసుకుని వైద్యం చేసినట్టు చూపిస్తున్నారు. మండలానికి ఒకటి కూడా లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను నియమించకుండా సబ్సెంటర్లకు ఎలా నిర్వహిస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఆరోగ్యమిషన్ / ప్రపంచ బ్యాంకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్కు పందేరం చేస్తోందని పేర్కొంటున్నారు. 20 సెంటర్లకు ఇంటర్నెట్ లేదు.. ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల కింద ఒక్కో కేంద్రానికి నెలకు రూ.30 వేల వరకూ వ్యయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు రుణం కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సబ్సెంటర్లలో డాక్టర్లు ఉండనందున టెలిమెడిసిన్ యంత్రం ద్వారా రోగికి సూచనలు, సలహాలు అందచేస్తారు. రోగి వివరాలన్నీ ఎలక్ట్రానిక్ డేటాలో రికార్డు చేస్తారు. అయితే 20 సబ్సెంటర్లకు ఇప్పటివరకూ ఇంటర్నెట్ కనెక్షన్లే లేకపోవడం గమనార్హం. ఏజెన్సీల్లో డాక్టర్లే లేరు.. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు. 80% మంది కాంట్రాక్టు వైద్యులే పని చేస్తున్నారు. తమను క్రమబద్ధీకరించాలని వారు విన్నవిస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. మరోవైపు సబ్సెంటర్లకు సొంత భవనాలే లేవు. ఈ అంశాలను పట్టించుకోకుండా టెలిమెడిసిన్ పేరుతో కోట్లు కుమ్మరించడం దుబారాకు పరాకాష్టని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో సేవలు ఇవీ - అంటువ్యాధులు ప్రబలినప్పుడు అవగాహన కల్పించడం - మాతాశిశు సంరక్షణపై సూచనలు ఇవ్వడం - జీవన శైలి వ్యాధులను గుర్తించి చికిత్సకు సహకరించడం - హెచ్ఐవీ బాధితులకు మందులు ఇప్పించడం - కుష్టు, అంధత్వ నివారణ లాంటి జాతీయ కార్యక్రమాల అమలు - వ్యాధి నిరోధకత, వ్యాధులపై అవగాహన కల్పించడం - సబ్సెంటర్ పరిధిలో గర్భిణులను గుర్తించి ప్రతినెలా పరీక్షలు చేయించడం తమిళనాడులో సర్కారు నిర్వహణలోనే.. తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక వైద్యం అమలు తీరు అద్భుతంగా ఉందని టీడీపీ సర్కారుకు అధికారులు పలుదఫాలు నివేదిక ఇచ్చారు. రాజస్థాన్లో సైతం ప్రభుత్వమే నిర్వహిస్తోందని నివేదించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని సుమారు 140 గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం తమిళనాడు పీహెచ్సీలకే వెళుతుండటం గమనార్హం. -
రెండువేలైతే కుదరదు!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ప్రభుత్వమిచ్చే సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఒ క్కో క్యాటరాక్ట్ ఆపరేషన్కు రూ. 2వేలు ఇస్తుండటంతో గిట్టుబాటు కావడంలేద ని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీం తో పలుచోట్ల ఆపరేషన్లు ఆలస్యం అవుతున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. 11 శాతం మందికి.. ప్రభుత్వం గత నెల 15న ప్రారంభిం చిన కంటి వెలుగు కార్యక్రమంలో సోమ వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 22.13 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9.52 లక్షల మంది పురుషులు, 12.60 లక్షల మంది స్త్రీలున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన కంటి పరీక్షల అనంతరం 4.26 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. మరో 5.13 లక్షల మందికి ఇతర దృష్టిలోపం కారణంగా సంబంధిత అద్దాలివ్వాలని నిర్ణయించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 11 శాతం మందికి క్యాటరాక్ట్ అవసరమని నిర్ధారించినట్లు సమాచారం. మరో 4 శాతం మందికి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. పెరుగుతున్న ఆపరేషన్లు కంటి వెలుగు ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 3 లక్షల మందికే ఆపరేషన్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ పరిస్థితి చూస్తుంటే 12 లక్షల మందికి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. దీంతో ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల సంఖ్యనూ పెంచారు. ఇప్పటివరకు 70 ఆస్పత్రులకు అనుమతివ్వగా.. మరో 41 ఆస్పత్రులను గుర్తించారు. వీరి ఆపరేషన్లకు కనీసం ఏడాదిన్నర పడుతుందని వైద్యారోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీలో 25 వరకే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుండగా కంటి వెలుగులో 60 వరకు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కంటి ఆపరేషన్కు కనిష్టంగా రూ. 2 వేలు, గరిష్టంగా రూ. 35 వేల వరకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏదైనా ఆస్పత్రి అంతకు మించి వసూలు చేస్తే జాబితా నుంచి ఆస్పత్రిని తీసేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్యాటరాక్ట్వే ఎక్కువ కంటి ఆపరేషన్లలో ఎక్కువగా క్యాటరాక్ట్వే ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో క్యాటరాక్ట్ ఆపరేషన్ల ధర లేకపోవడంతో ఆపరేషన్కు రూ. 2,000లను ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇతర ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ ధరల ప్రకారం ఇస్తోంది. అయితే కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్భవలో క్యాటరాక్ట్కు రూ. 6 వేలు ఇస్తున్నారని.. ఇక్కడ కనీసం రూ. 5,000 అయినా ఇవ్వాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేదంటే మున్ముందు ఆపరేషన్లను నిలిపేసే ప్రమాదముందని కొన్ని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. -
నిమ్స్లో మరణ మృదంగం
హైదరాబాద్: ఏపీలోని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన విషయం మరువక ముందే తెలంగాణలోని నిమ్స్ వైద్యశాలలో 19 మంది మరణించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిమ్స్లో వైద్యుల ఆందోళన నేపథ్యంలో సోమవారం 10 మంది, మంగళవారం 9 మంది మరణించారు. అవినీతి ఆరోపణలున్న ఆర్.వి.కుమార్ను నిమ్స్కు నూతన డీన్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 8 నుంచి రెసిడెంట్ వైద్యులు, వైద్య బోధకులు విధుల్ని బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 2 రోజుల్లోనే 19 మంది మరణించారు. ఇక బుధవారం నాటి మృత్యు గణాంకాలు నిమ్స్ రికార్డుల్లోకి ఎక్కలేదు. లిఖితపూర్వక హామీకి డిమాండ్.. ప్రభుత్వం ముందస్తు ఎన్నికల హడావుడిలో పడిపోవడంతో వైద్యుల సమ్మె గురించి పట్టించుకునే నాథుడు లేకపోయాడు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకారుల బృందం బుధవారం మంత్రి లక్ష్మారెడ్డిని కలసి వినతిపత్రం అందించిం ది. మంత్రితోపాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సుశీల్ శర్మను కలసి తమ సమస్యల సాధన కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే సమస్యల్ని పరిష్కరిస్తామని వారు మౌఖిక హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని వైద్యులు తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టుబట్టగా.. అందుకు వారు నిరాకరించారు. విదేశీ పర్యటన ఏర్పాట్లలో బిజీ.. నిమ్స్లో ఈ విధమైన దయనీయ పరిస్థితులు నెలకొంటే.. నిమ్స్ డైరెక్టర్ గురువారం (13న) విదేశీ పర్యటన ఏర్పాట్ల హడావుడిలో ఉన్నారు. గెస్ట్ లెక్చర్ ఇచ్చే నిమిత్తం అమెరికా వెళ్తున్న ఆయన ఈ నెల 18న వస్తారు. ఈలోగా వైద్యుల ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నాలు చేసే వారు ఉండకపోవచ్చని, ఇదే పరిస్థితి కొనసాగితే రోగుల పరిస్థితి దారుణం అవుతుందని రోగుల బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పర్యవేక్షణ కీలకం.. ఆపద్ధర్మ పాలన ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య అంశాలపై గవర్నర్ పర్యవేక్షణ చాలా కీలకం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గవర్నర్ కూడా గతంలో మాదిరిగానే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలకు, మంత్రి వర్గానికి వదిలేస్తే.. ఇంతవరకూ ఉన్నట్టుగానే ప్రభుత్వమూ తమకే సంబంధం లేదన్నట్లుగా ఉన్న పక్షంలో హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని రోగులు చెబుతున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో బిజీ.. నిమ్స్లో మరణ మృదంగం మోగుతుంటే ఏ మాత్రం పట్టని పాలక పెద్దలు ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. నిమ్స్లో గురువారం కేన్సర్ వైద్య విభాగం రెండో అంతస్తు ప్రారంభోత్సవానికి మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ హాజరుకానున్నారు. వీరి రాక సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో నిమ్స్ అధికారులు నిమగ్నమయ్యారు. -
పీహెచ్సీల్లో డయాగ్నొస్టిక్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్సీ) మరిన్ని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం అత్యాధునిక వసతులతో డయాగ్నొస్టిక్ సెంటర్లను నెలకొల్పాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.37.45 కోట్లు కేటాయించింది. ఆ నిధులను ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి మంజూరు చేయనుంది. ఒక్కో పీహెచ్సీకి రూ.5 లక్షల చొప్పున కేటాయించనున్నారు. మొత్తంగా 644 పీహెచ్సీలు, 41 సీహెచ్సీల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పుతారు. పీహెచ్సీల్లో ప్రస్తుతం కొన్ని పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లను నెలకొల్పాక పీహెచ్సీల్లో 20 రకాలు, సీహెచ్సీల్లో 39 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈఎస్ఆర్, బ్లడ్ షుగర్, హెచ్ఐవీ, మలేరియా రాపిడ్, యూరిన్ షుగర్, ప్లేట్లెట్ కౌంట్, డెంగీ రాఫిడ్, వాటర్ క్వాలిటీ తదితర పరీక్షలను పీహెచ్సీల్లో నిర్వహిస్తారు. ఇక సీహెచ్సీల్లో పై వాటితోపాటు ఎక్స్రే, ఎస్ క్రియాటిన్, సీబీసీ, ఈసీజీ, కొలెస్ట్రాల్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసం సెమీ ఆటో ఎనలైజర్, హెమటాలజీ ఎనలైజర్, మైక్రోస్కోప్, సెంట్రిఫ్యూజ్ వంటి పరికరాలను కొనుగోలు చేస్తారు. రిఫ్రిజిరేటర్, బార్కోడ్ ప్రింటర్ అండ్ స్కానర్, కంప్యూటర్ అండ్ ప్రింటర్లను కూడా కొనుగోలు చేస్తారు. 15 మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు రాష్ట్రంలో 15 మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపింది. దాంతోపాటు వివిధ ఆసుపత్రుల్లో పడకల పెంపు ఫైలును కూడా సీఎం ఆమోదానికి పంపింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి.. ముఖ్యమంత్రి వద్దకు ఇతర ముఖ్య ఫైళ్లను కూడా తీసుకెళ్లినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. -
521 గ్రామాల్లో కంటి వెలుగు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం 521 గ్రామాల్లో పూర్తయింది. 7.16 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3.07 లక్షల మంది పురుషులు కాగా, 4.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళలే లక్ష మంది అధికంగా కంటిపరీక్షలు చేయించుకోవడం గమనార్హం. మొత్తం జనాభాలో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఇప్పటి వరకు ఓసీలు 72 వేల మంది, బీసీలు 4.06 లక్షల మంది, ఎస్సీలు 1.41 లక్షల మంది, ఎస్టీలు 55 వేల మంది, మైనారిటీలు 40 వేల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 1.33 లక్షల మందికి రీడింగ్ గ్లాసులను అందజేశారు. అంతేకాకుండా చత్వారం కారణంగా ఇతర కంటి అద్దాల కోసం ప్రిస్కిప్షన్ రాయించుకున్న వారు 1.91 లక్షల మంది, కేటరాక్ట్కు గురైనవారు 84 వేల మంది ఉన్నారు. తదనంతర వైద్యం అవసరమైనవారు 2.22 లక్షల మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తం వచ్చినవారిలో 2.19 లక్షల మందికి ఎటువంటి కంటి సమస్య లేనట్లుగా నిర్ధారించారు. పట్టణాల్లోకంటే పల్లెల్లోనే కంటి పరీక్షలకు భారీ ఎత్తున స్పందన వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాదు వచ్చేవారిలో 40 ఏళ్లు పైబడిన వారే అధికంగా ఉంటున్నారు. అలాగే పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలే కంటి వెలుగు శిబిరాల వద్ద బారులు తీరుతున్నారు. -
టీకా వికటించి పసికందు మృతి
సాక్షి, సిరిసిల్ల: టీకా వికటించి ఓ పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం ఓ తల్లికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ.. డాక్టర్ సహా ఎనిమిది మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.బాధిత కుటుంబానికి సర్కారు రూ.3 లక్షల పరిహారం, ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అసలు ఏం జరిగింది..? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి బుధవారం చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఎప్పటిలాగే కోరుట్లపేటకు చెందిన తాడ మాధవి, బాపురెడ్డి దంపతుల నలభై ఐదు రోజుల (ఇంకాపేరు పెట్టని) పసిపాపకు టీకా వేశారు. అది వికటించి పసికందు మరణించింది. మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కరీంనగర్, హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. టీకాను భద్రపరచడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పాయిజన్గా మారి నిండు ప్రాణం తీసినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని వైద్యశాఖ అధికారుల విచారణలో నిర్ధారించారు. కదిలిన యంత్రాంగం ఎల్లారెడ్డిపేట వైద్యశాఖ నిర్లక్ష్యపు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు కోరుట్లపేటకు వెళ్లి విచారణ జరిపారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో జి.వి.శ్యామ్ప్రసాద్లాల్ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. రూ.3 లక్షల పరిహారం అందిస్తామని, ఒకరికి అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్లో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కరీంనగర్లో చికిత్స పొందుతున్న చిన్నారిని సైతం హైదరాబాద్కు తరలించాలని ఆదేశించారు. డాక్టర్ సహా 8 మంది సస్పెన్షన్ పసికందు మృతితో పాటు మరో ముగ్గురు చిన్నారుల విషమ పరిస్థితికి కారణమైన ఎనిమిది మంది వైద్య సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారిణి మీనాక్షి, పీఎచ్ఎన్ శోభారా ణి, ఎపీఎచ్ఎస్లు అజాం, ప్రేమలత, సీఎచ్ లక్ష్మీ ప్రసాద్, గ్రేడ్2 ఫార్మసిస్ట్ వెంక న్న, ఎంపీఎచ్ఏ శారద, ఏఎన్ఎం పుష్పలతలను విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 8 మందిని ఒకేసారి సస్పెండ్ చేయడంతో వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం మొదలైంది. -
పాత పద్ధతిలోనే మెడికల్ కౌన్సెలింగ్..
సాక్షి, న్యూఢిల్లీ: పాతపద్ధతిలోనే మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైద్య ఆరోగ్యశాఖ సుప్రీంలో అప్పీలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ పాత పద్దతి ప్రకారమే మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించింది. అంతేకాకుండా జీవో 550లో మార్పులు చేయాలని కూడా పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 550 తీసుకొచ్చింది. ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత ఆ స్టేను సమర్థ్ధిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఆగస్టు 31లోపు దేశ వ్యాప్తంగా మెడికల్ కౌన్సెలింగ్లు పూర్తి చేయాలి. ఇప్పటికే జాతీయస్థాయి కౌన్సెలింగ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. -
రాష్ట్రమంతటా బస్తీ దవాఖానాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్పత్రులకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలుత రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు పూర్వ జిల్లాకేంద్రాల్లో వీటిని ప్రారంభించాల ని అధికారులను మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ఆదేశించారు. బస్తీ దవాఖానాల విస్తరణపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో వీరు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. నిజామాబాద్లో 5, కరీంనగర్లో 5, వరంగల్లో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టామని తెలిపారు. ‘అందరికీ అందుబాటులో ఆరోగ్యం’స్ఫూర్తితో ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని.. ఇందులో భాగంగా సర్కారు ఆస్పత్రుల బలోపేతం, కొత్త దవాఖానాల ఏర్పాటు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నామని వివరించారు. డిసెంబర్లో 175 ప్రారంభం గత నెలలో బేగంపేటలోని బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు ఆస్పత్రికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రాథమిక వైద్యం కోసం ప్రైవేటు క్లినిక్లలో డబ్బులు ఖర్చు చేసేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి తప్పిందని చెప్పారన్నారు. మరిన్ని బస్తీ దవాఖానాలు నెలకొల్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, అందుకే వాటి విస్తరణకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే వేసవి నాటికి హైదరాబాద్లో 500 బస్తీ దవాఖానాలు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ డిసెంబర్ చివరి నాటికి సుమారు 175 దవాఖానాలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఆన్లైన్లో మ్యాపింగ్ బస్తీ దవాఖానాలన్నింటినీ ఆన్లైన్లో మ్యాపింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే ఐటీ శాఖ సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో నెలకొల్పే 500 బస్తీ దవాఖానాలకు భవనాలు గుర్తించాలని, అందుబాటులో లేకుంటే కొత్తగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభానికి సిద్ధం చేస్తున్న 28 బస్తీ దవాఖానాలను వచ్చే నెల మొదటి వారంలో ఒకే రోజు ప్రారంభించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్స్ తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల సేవలను కూడా మంత్రులు సమీక్షించారు. ఇప్పటికే ఈ సెం టర్లకు మంచి స్పందన వస్తోందని మంత్రులకు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ ప్రణాళికలు తయారు చేస్తోందని చెప్పారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్సీ సెంటర్ల వద్ద సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. -
ఏజెన్సీల్లో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమ త్తంగా ఉండాలని అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. వరుసగా వర్షాలతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శాఖ అధికారుల సమన్వయంతో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని వైద్యారోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, అపరిశుభ్ర వాతావరణం లేకుండా పంచాయతీలను అప్రమత్తం చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలలు, స్కూళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. -
‘కంటి వెలుగు’ ఆపరేషన్ కోసం వచ్చి..
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో శస్త్రచికిత్సకు సిద్ధం చేస్తుండగా అస్వస్థతకు గురై మృతి చెందింది. మత్తు మందు వికటించడం వల్లే చనిపోయిందంటూ విమర్శ లు వస్తుండగా.. ఆ సమయంలో గుండెపోటు రావడం వల్లే వృద్ధురాలు మృతి చెందిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గంట్లవెళ్ళి చెన్నమ్మ (68).. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న గ్రామంలో నిర్వహించిన శిబిరానికి కంటి పరీక్ష కోసం వచ్చారు. ఆమెకు క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని గుర్తించిన వైద్యులు.. రిఫరల్ ఆస్పత్రి పేరుతో చీటీ రాసిచ్చినట్లు తెలిసింది. ఆ చీటీతో శనివారం కొత్తూరు సమీపంలోని ఓ ప్రైవేటు కంటి ఆస్పత్రికి చెన్నమ్మ వెళ్లారు. అక్కడ ఆపరేషన్కు ముందు ఆమెకు మత్తు మందు ఇవ్వగా అ తర్వాత కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది. ఆరోగ్యంగా వెళ్లి శవమై తిరిగి వచ్చిందని, కంటి వెలుగు కోసమని వెళితే మా ఇంటి వెలుగు పోయిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యా రు. కాగా, ఆపరేషన్కు ముందే చెన్నమ్మకు కంటి చికిత్స కోసం మత్తు మందు ఇచ్చారని, చికిత్స కు ముందే ఆమె శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడ్డారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. వెంటనే డాక్టర్లు షాద్నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి పంపారని, దురదృష్టవశాత్తు మార్గ మధ్యంలోనే గుండెపోటుతో చెన్నమ్మ మరణించినట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కొద్దిపాటి మత్తుమందుతో ఎవరూ చనిపోవడం జరగదన్నారు. తమ తల్లికి ఆస్తమా ఉందని.. గతంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నట్లు కొడుకు సాయిలు తెలిపారు. ముందే ఆపరేషన్కు.. కంటి వెలుగు కింద పరీక్షలు నిర్వహిస్తున్న వారిలో ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే రెండు వారాల తర్వాత చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. అయితే కొందరు పరీక్షలు చేయించుకున్న వెంటనే రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలూ అందుకు సుముఖత వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆపరేషన్ చేయడానికి ముందు వ్యక్తుల శరీర సామర్థ్యం (ఫిట్నెస్) పరీక్షించాలి. అలా చేయనందునే మరణం సంభవించిందని ఆరోపణలున్నాయి. 50 ఏళ్ల తర్వాతే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తుంటారు. కాబట్టి ఫిట్నెస్ తప్పనిసరిగా చూడాలి. -
‘కంటి వెలుగు’కు విశేష స్పందన
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’కార్యక్రమానికి మూడో రోజూ విశేష స్పందన లభించింది. శుక్రవారం సెలవు కావటంతో వైద్య శిబిరాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒక్క శుక్రవారమే రికార్డు స్థాయిలో 1,07,361 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో మహిళలు 61 వేలు, పురుషులు 46 వేల మంది ఉన్నారు. ప్రజలు భారీగా తరలివస్తుండటం తో రాత్రి ఏడుగంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. శిబిరాలు నిర్వహించే ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రతి ఇంటికీ టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లలో సూచించిన సమయానికి రావటం వల్ల వేచిచూసే అవసరముండదని ప్రచారం చేస్తు న్నారు. ప్రభుత్వం ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఈ నెల 15న ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి రెండు రోజుల్లో 1.13 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకోగా..మూడు రోజులకు కలిపి 2.19 లక్షల మంది చేయించుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తు న్నామని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాస్ వెల్లడించారు. -
‘మెడికల్’ రెండో విడత మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జీవో నంబర్ 550కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రెండో విడత కౌన్సెలింగ్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన విద్యార్థి ఎవరైనా ఒక మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీటు పొంది చేరాక, అతనికి మరో మంచి కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వస్తే అక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసిన ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వేషన్ విద్యార్థికి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 550 తీసుకొచ్చింది. ఈ జీవోపై ఇటీవల స్టే ఇచ్చిన హైకోర్టు, తర్వాత తానిచ్చిన స్టేను సమర్థ్ధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఇదిలా ఉండగా రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసుకొని సీట్లు పొందిన విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో తరగతులకు హాజరవుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. జీవో నంబర్ 550పై హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నందున కౌన్సెలింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రకారం ఈ నెలాఖరులోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి చేసి అడ్మిషన్ల ప్రక్రియను ముగించాలి. అప్పటిలోగా కౌన్సెలింగ్ నిర్వహించలేని పరిస్థితుల్లో ఎంసీఐ అనుమతి ఇవ్వాలి. కానీ అంత సులువుగా ఎంసీఐ అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో ఏం చేయాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. రెండో విడతలో 444 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. -
కంటి వెలుగుపై గవర్నర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఈ నెల15 నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు పథకంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆరా తీశారు. ఈ పథకం వివరాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణలు శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి కంటి వెలుగు పథకం గురించి వివరించారు. ‘అంధత్వ రహిత తెలంగాణ’దిశగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగని వారు వివరించారు. దీనిద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలు చేశాక అవసరమైన వారందరికీ ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ, ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. సాధారణ కంటి వ్యాధులున్న వారికి ఉచిత మందులను అందిస్తామన్నారు. -
గ్రామానికి కీడు సోకిందని...
ఆత్మకూర్ (ఎస్), (సూర్యాపేట): గ్రామానికి కీడు సోకిందని ప్రజలందరూ తమ ఇళ్లకు తాళాలు వేసి వన వాసానికి వెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో నెల రోజులుగా కొందరు జ్వరాల బారిన పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా తగ్గడం లేదు. అంతేకాకుండా వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించినా తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో గ్రామానికి కీడు సోకిందని.. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఊరంతా తమ ఇళ్లకు తాళాలు వేసి తెల్లవారుజామునే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నిప్పును కొనుక్కుని వనవాసానికి వెళ్లారు. దీంతో గ్రామంలో వీధులన్నీ బోసిపోయి కనిపించాయి. -
బోధనా వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే మార్గదర్శకాలు విడుదల అవుతాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. డీఎంఈ ప్రతిపాదనల ప్రకారం బోధనాసుపత్రుల్లో నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్గా, ఆరేళ్ల సర్వీసు పూర్తయిన అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్గా పదోన్నతి లభించనుంది. దీంతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్గా మూడేళ్లు పూర్తయిన వారి పే స్కేల్లో మార్పు తీసుకొస్తారు. తాజా ప్రతిపాదనలు బోధన వైద్యులకు ప్రయోజనం కల్గిస్తాయని అధికారులు చెబుతున్నారు. 2,700 మందికి ప్రయోజనం... ప్రస్తుతం బోధన వైద్యుల పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైర్ అయితేనే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో కొందరికి మాత్రమే పదోన్నతులు లభిస్తుండగా చాలా మందికి లభించడం లేదు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చిన పరిస్థితులున్నాయి. కొందరికైతే 20 ఏళ్లకు గాని పదోన్నతి వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలుచేస్తున్నాయి. డీఎంఈ తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 2,700 మంది వైద్యులకు ప్రయోజనం కలగనుంది. అంతేకాక వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి స్కేల్స్ల్లోనూ మార్పులు చేయనున్నారు. అంటే ఆర్థికంగా కూడా వారికి మరింత ప్రయోజనం కలుగనుంది. ఇక ప్రొఫెసర్గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా నిర్ణీత సమయం ప్రకారం వారి స్కేల్స్లో మార్పులు చేయనున్నారు. -
వైద్య,ఆరోగ్యశాఖ, పీబీఎస్ కంపెనీపై హైకోర్టులో పిల్
-
వైద్యశాఖపై విజి‘లెన్స్’
ఆదాయపు పన్ను మినహాయింపునకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు అడ్డదారి తొక్కి అడ్డంగా దొరికిపోయారు. ప్రైవేటు బ్యాంకుల నుంచి గృహరుణాలు పొందినట్లు కొందరు ఉద్యోగులు సమర్పించిన తప్పుడు అఫిడవిట్లపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎంఅండ్హెచ్ఓ) పరిధిలో పనిచేసే ఉద్యోగులతో పాటు, మలేరియా విభాగం, సిద్ధార్థ వైద్య కళాశాల, దంత వైద్య కళాశాల, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 50 మంది తప్పుడు పత్రాలు దాఖలు చేసినట్లు తేల్చారు. ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే ఈ గుట్టు రట్టయిందని సమాచారం. లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఆదాయపు పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖలో కొందరు ఉద్యోగులు చేసిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రుణాలు తీసుకున్నామంటూ గుట్టుగా సమర్పించినవన్నీ తప్పుడు పత్రాలేనని నిర్థారించారు. ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. మరింత మంది ఉండవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా మలేరియా విభాగంలో ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఈ బాగోతం బహిర్గతమైంది. ఆదాయపు పన్ను మినహాయింపునకు తప్పుడు పత్రాలు సమర్పించిన గుట్టు బయటకు పొక్కింది. కొందరు ఉద్యోగులు తప్పుడు పత్రాలతో పన్ను మినహాయింపు పొందుతున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు, విజిలెన్స్కు లేఖలు రాశారు. దీంతో ఫిర్యాదులు వచ్చిన ఉద్యోగులను విజిలెన్స్ విచారణ ప్రారంభించగా ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చింది. విచారణ కోసం వచ్చిన ఉద్యోగులు తామే కాదు... మరింత మంది అలా తప్పుడు పత్రాలు సమర్పించారని పేర్కొనడంతో ఆ జాబితా రోజు రోజుకు చాంతాడులా పెరుగుతూ వచ్చింది. మలేరియాతో పాటు, డీఎం అండ్ హెచ్ఓ పరిధిలోని సిబ్బంది, విజయవాడ ప్రభుత్వాస్పత్రి, దంత వైద్య కళాశాల, ఈఎస్ఐ ఆస్పత్రి, సిద్ధార్థ వైద్య కళాశాలల్లోని పలువురు ఉద్యోగులు ఇలాంటి తప్పుడు పత్రాలు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చాయి. ఏటా అంతే.... వైద్య ఆరోగ్యశాఖలో నెలకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకూ జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు ఆదాయపు పన్ను పరిధిలోకి రావడంతో పన్ను నుంచి మినహాయింపు కోసం దొడ్డిదారులు వెతికారు. ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ రుణాలు పొందినట్లు అఫడవిట్లు సృష్టించి ఒక్కో ఉద్యోగి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ పన్ను రాయితీ పొందినట్లు చెబుతున్నారు. నాలుగేళ్ల వివరాల సేకరణ... వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల నాలుగేళ్ల ఆదాయపు పన్ను వివరాలు తమకు తెలియపర్చాలంటూ విజిలెన్స్ విభాగం ఆయా శాఖల అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరింది. అందులో భాగంగా 2013–14, 2014–15, 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల డేటా ఇవ్వాలని ఆదేశించారు. రెండు రోజుల కిందట ప్రభుత్వాస్పత్రి, డెంటల్ కళాశాల, సిద్ధార్థ వైద్య కళాశాలల్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ డీఎస్పీ విజయపాల్, మరలా మంగళవారం రానున్నట్లు సమాచారం. అప్పటికి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారని తెలిసింది. మలేరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో తప్పుడు పత్రాలు సమర్పించిన ఉద్యోగులను ఇప్పటికే గుర్తించారు. దీంతో పలువురు ఉద్యోగులు రికవరీ పొందిన మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించేసినట్లు తెలిసింది. ఈ విషయమై విజిలెన్స్ అధికారులను వివరణ కోరగా, విచారణలో ఉన్నందున వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. -
పారదర్శకంగా పోస్టింగులు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైద్య విధాన పరిషత్ సహా మిగతా విభాగాల్లో కొత్తగా ఎంపిౖMðన అభ్య ర్థులకు పోస్టింగ్ల కేటా యింపుల్లో పారదర్శకత పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పోస్టింగులు ఇవ్వాలని సూచించారు. చరిత్రాత్మకంగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 1,133 పోస్టుల నియామకం చేపట్టగా, అందులో 919 పోస్టులు భర్తీ చేశామని, వారికి త్వరలో పోస్టింగ్లు కేటాయించాలని కోరారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంకా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియలో కూడా వేగం పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఏయే స్పెషాలిటీ డాక్టర్ల అవసరం ఉందో గుర్తించి, ఆయా చోట్ల వారిని నియమించాలని ఆదేశించారు. ప్రజా వైద్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకంతో సర్కారీ దవాఖానాల్లో కాన్పుల సంఖ్య పెరిగినందున వాటిని దృష్టిలో పెట్టుకొని, ఎనస్థీసియా, స్త్రీ వ్యాధులు, ప్రసూతి నిపుణులను నియమించాలన్నారు. అలాగే ఇప్పటికే ప్రకటించిన, వివిధ స్థాయిల్లో ఉన్న నియామకాల ప్రక్రియల మీద కూడా మంత్రి సమీక్షించారు. -
కొత్త డాక్టర్లొచ్చారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. 919 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు దాదాపు 24 గంటల పాటు పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ శివప్రసాద్, ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరుల నేతృత్వంలో పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. భర్తీ చేసిన వెంటనే సంబంధిత వైద్యులకు నియామక ఉత్తర్వులను ఆన్లైన్లో పంపారు. వారం రోజుల్లో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి జిల్లాలు, ఆసుపత్రుల వారీగా పోస్టుల కేటాయింపు చేస్తారు. వివిధ విభాగాల వారీగా 15 రకాల స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేశారు. ఆర్థోపెడిక్–47, రేడియాలజీ–50, డెర్మటాలజీ–20, ఫోరెన్సిక్–28, జనరల్ మెడిసిన్–68, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్–09, పల్మనరీ–39, ఆప్తల్మాలజీ–34, సైకియాట్రిక్–22, అనస్తీషియా–156, ఈఎన్టీ–17, పాథాలజీ–55, జనరల్ సర్జన్స్–78, ఓబీజీ–146, పీడియాట్రిక్స్–150 పోస్టులను భర్తీ చేశారు. సొంత జిల్లాల్లో కేటాయింపు.. రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 125 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. అందులో జిల్లా ఆసుపత్రులు 31, ఏరియా ఆసుపత్రులు 22, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 58, హైదరాబాద్లో ఫస్ట్ రిఫరల్ యూనిట్లు 14 ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 1,133 స్పెషలిస్టు పోస్టుల కోసం వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అందుకు 2,200 మంది స్పెషలిస్టులు దరఖాస్తు చేసుకున్నారు. 1,133 పోస్టుల్లో 919 పోస్టుల భర్తీ జరిగింది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా నియామకాలు జరిపారు. వారు సాధించిన మార్కులు, పాసైన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నేళ్లయిందో దానికి వెయిటేజీ, కాంట్రాక్టు పద్ధతిలో ఇప్పటికే పనిచేస్తున్నట్లయితే దానికీ వెయిటేజీ, అలాగే రోస్టర్ పాయింట్ల ఆధారంగా పోస్టులను భర్తీ చేశారు. నియమించిన 919 మందిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. వైద్యులందరికీ సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు డాక్టర్ శివప్రసాద్ పేర్కొన్నారు. అన్యాయం జరిగింది: నియామకాలు జరిపిన ప్రభుత్వం తక్షణమే ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదో చెప్పాలని కొన్ని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొందరు కుమ్మక్కయినందునే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. అలాగే నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని కొందరు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు ఈఎన్టీ విభాగపు మెరిట్ లిస్టులో రోస్టర్ ప్రకారం ఐదో స్థానం వచ్చిందని డాక్టర్ అనిల్ చెబుతున్నారు. మొత్తం 18 పోస్టులు ఉన్నందున తప్పక రావాల్సి ఉందని, కానీ తుది నియామకపు ఉత్తర్వులో తన పేరు కనిపించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై తాను ఫిర్యాదు చేసినా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఇక డాక్టర్ నరహరి అనే స్పెషలిస్టు మాట్లాడుతూ నోటిఫికేషన్ మార్చి 19న వచ్చిందని, దాని ప్రకారం 46 ఏళ్లున్న వారు అర్హులన్నారు. ఆ తేదీ నాటికి తనకు 45 ఏళ్ల 10 నెలలుందన్నారు. కానీ జూలై 1వ తేదీని కట్ ఆఫ్గా తీసుకోవడం శోచనీయమన్నారు. ఈఎన్టీ జాబితాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలోనూ తనకు విషయం చెప్పలేదని, అప్పుడు తన దరఖాస్తును తిరస్కరించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం వయసు లేదంటూ భర్తీలో తన పేరు లేకుండా చేశారని ఆరోపించారు. వైద్య ఆరోగ్య మంత్రి హర్షం.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి భారీ నియామకాలు జరిపామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీరిందన్నారు. మొదటిసారిగా అందుబాటులోకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ల స్పెషలిస్టులు వచ్చారన్నారు. ఈ నియామకాలతో మౌలిక వసతులతో పాటు వైద్యుల కొరత తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన ఓపీ, ఐపీలకు అనుగుణంగా నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తిచేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియామకాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన అధికారులను ప్రశంసించారు. -
‘పీజీ వైద్యుల ప్రభుత్వ సేవలు తప్పనిసరి కాదు’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పీజీ వైద్యుల తప్పనిసరి సేవలు ఇక నుంచి వారి ఇష్టానుసారానికే పరిమితం కానున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ పలు సడలింపులతో సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పనిసరి వైద్య సేవలను ఎత్తివేయాలన్న డిమాండ్ నేపథ్యంలో సర్కారు ఈ ఏడాది ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరి వైద్య సేవలను ఎత్తివేసినట్లయింది. దీంతో జూన్ 30 నుంచి తప్పనిసరి వైద్య సేవల నిలుపుదల అమల్లోకి వచ్చింది. కాగా, రెండు మూడు నెలల్లో ఏడాది సర్వీసు పూర్తయ్యే వైద్యులు స్టైఫండ్ లేకుండా సేవలు చేయాలన్న నిబంధనను విధించారు. అలాగే ప్రస్తుతం పనిచేసే వారే కాకుండా భవిష్యత్లో ప్రభుత్వ సేవలు చేయాలనుకునేవారు సర్కారుకే కొంత సొమ్ము చెల్లించి సేవలు చేసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇలా ఉచితంగా సేవలు చేయాలనుకునేవారికి ఎలాంటి పారితోíషికం చెల్లించబోమని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఒకే ఒక్కడు!
జగిత్యాల : జిల్లాలో వైద్యశాఖలో ఒకే అధికారి పలు శాఖలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంగా అవతరించి రెండేళ్లు అయింది. అయినా వైద్య శాఖలో పూర్తిస్థాయి అధికారుల నియామకం జరుగడంలేదు. దీంతో ఉన్న అధికారులకే పలు శాఖల అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో పలు శాఖల్లో పూర్తిస్థాయిలో అధికారులు కేటాయించలేదు. వైద్యశాఖలో డెప్యూటీ డీఎంహెచ్వోగా జైపాల్రెడ్డి నియమితులయ్యారు. డీఎంహెచ్వో సుగంధిని ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జైపాల్రెడ్డికి అదనంగా ఇన్చార్జి డీఎంహెచ్వోగా బాధ్యతలు అప్పగించారు. డెప్యూటీ డీఎంహెచ్వోతోపాటు, ఇన్చార్జి డీఎంహెచ్వో, రాష్ట్ర బాలస్వస్తీయ కార్యక్రమం(ఆర్బీఎస్కే) జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైంది. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లకు వెళ్లి చికిత్స అందిస్తుంటారు. 10 వాహనాలు, 10 మంది ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. ఈ శాఖకు సైతం ఆయన జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేసీఆర్ కిట్ పథకానికి జిల్లాలో ఎలా అమలు జరుగుతుందనే విషయం తెలుసుకునేందుకు అధికారులను నియమించారు. కేసీఆర్ కిట్కు సైతం జిల్లా ఇన్చార్జిగా జైపాల్రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్యశాఖలో నాలుగు ప్రధానమైన ఈ శాఖలను జైపాల్రెడ్డి ఇన్చార్జి. నాలుగు శాఖలకు ఒకరే ఇన్చార్జి కావడంతో ఆయన ఒత్తిడికి లోనవుతున్నారు. -
వైద్యారోగ్యంలో పురోగమనం
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య రంగంలో తెలంగాణ పురోగమన పథంలో పయనిస్తోందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. జాతీయ స్థాయిలో రాష్ట్రం 12వ ర్యాంకు పొందినట్లు వెల్లడించింది. కేరళ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే విజయవంతంగా పురోగమించాయని, తెలంగాణ ఆ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొంది. గుజరాత్, హిమాచల్ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలూ పురోగమన దిశలో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్యరంగం మెరుగైన స్థితిలో ఉందని వివరించింది. నీతి ఆయోగ్ మొదటిసారిగా నిర్వహించిన ‘బేస్లైన్ ర్యాంకింగ్ అండ్ రియల్ టైం’సర్వే వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషించాయి. దేశంలో 101 జిల్లాల్లో నీతి ఆయోగ్ బేస్లైన్ సర్వే నిర్వహించింది. ఆరోగ్యం, పోషకాహారం, నవజాత శిశువుల ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, మౌలిక సదుపాయాల వంటి 13 అంశాలపై ఆయా జిల్లాల్లో సర్వే నిర్వహించింది. అందులో ఖమ్మం జిల్లా పదకొండో ర్యాంకు సాధించగా భూపాలపల్లి జిల్లా 20వ ర్యాంకు, ఆసిఫాబాద్ జిల్లా వందో ర్యాంకు సాధించాయి. తగ్గిన నవజాత శిశు మరణాల రేటు... నవజాత శిశువుల మరణాల రేటులో తెలంగాణ మెరుగుపడిందని నీతి ఆయోగ్ పేర్కొంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో మరణాల సంఖ్య 23గా ఉంది. అలాగే ఐదేళ్లలోపు మరణించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యలో మెరుగుదల కనిపిస్తుంది. అది గతంలో 6.11 శాతముంటే ఇప్పుడు 5.70 శాతానికి చేరింది. సంతాన సాఫల్య అవకాశం ఉన్న వారి రేటు 1.8 ఉంది. అయితే పురుషులు, స్త్రీల నిష్పత్తిలో మాత్రం పురోగతి లేకపోవడం గమనార్హం. ప్రతి వెయ్యి మంది బాలురకు 918 మంది బాలికలే ఉన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 85.35% ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. అయితే వివిధ రకాల టీకాలు ఇప్పించడంలో రాష్ట్రం కాస్త వెనుకబడింది. కేవలం 89.09 శాతమే టీకాలు ఇస్తున్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు మెరుగుపడింది. ప్రతి లక్ష మందిలో టీబీ రోగులు 123 మంది ఉంటున్నారు. అయితే టీబీ చికిత్సలు విజయవంతం చేయడంలో తెలంగాణ వెనుకబడిందని నివేదిక స్పష్టం చేసింది. పీహెచ్సీల్లో ఖాళీల భర్తీపై అసంతృప్తి... రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లలో మెడికల్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. గతంతో పోలిస్తే పరిస్థితి ఏమాత్రం మారలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. గతం నుంచీ ఇప్పటికీ పీహెచ్సీల్లో 22.31 % మెడికల్ ఆఫీసర్ల ఖాళీలు ఉన్నాయి. ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మాత్రం స్పెషలిస్టుల కొరతను తీర్చడంలో మెరుగుదల ఉంది. ప్రస్తుతం వాటిల్లో స్పెషలిస్టుల ఖాళీలు 54.81% ఉన్నాయి. అదే తమిళనాడులో కేవలం 16.73% మాత్రమే స్పెషలిస్టుల ఖాళీలున్నాయి. ఏఎన్ఎంల కొరత లేకుండా చేయడంలో మెరుగుదల కనిపిస్తోంది. స్టాఫ్ నర్సుల ఖాళీలను నింపడంలో ఇప్పటికీ మార్పు కనిపించడంలేదు. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ఇప్పటికీ 12.79 % స్టాఫ్ నర్సుల ఖాళీలున్నాయి. ఇక 24 గంటలూ పనిచేసే పీహెచ్సీల్లో పూర్తిస్థాయి సేవలు అందించడంలో మార్పు రాలేదు. పీహెచ్సీల్లో 26.99 శాతమే 24 గంటలు సేవలందిస్తున్నాయి. అయితే తమిళనాడుతో పోలిస్తే మనం చాలా మెరుగ్గానే ఉన్నామని చెప్పొచ్చు. సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్సీ)ల గ్రేడింగ్ పరిశీలిస్తే గతం కంటే మెరుగుపడింది. అంతకుముందు వాటి గ్రేడింగ్ శూన్యమైతే ఇప్పుడు 11.63%తో మెరుగ్గా ఉంది. జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూల కొరత ఉంది. -
నేషనల్ పూల్కు 15 శాతం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ సీట్ల లో 15% సీట్లను ఆలిండియా కోటా కింద నేషనల్ పూల్కు కేటాయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి మిగిలిన 85% కోటా సీట్లలో 5% సీట్లను దివ్యాంగులకు కేటాయించింది. గతంలో వీరికి కేవలం 2 శాతమే కోటా ఉండగా.. సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,150 ఎంబీబీఎస్ సీట్లు, ఒక ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 100 బీడీఎస్ సీట్లున్నాయి. సర్కారు తాజా ఉత్తర్వులతో వాటిలోని 15 శాతం సీట్లు నేషనల్ పూల్లోకి వెళ్లాయి. ఆ మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి 173 ఎంబీబీఎస్ సీట్లు, మరో 15 బీడీఎస్ సీట్లు నేషనల్ పూల్లోకి వెళ్లాయి. ఇప్పటికే నీట్ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. అయితే మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి మన రాష్ట్ర వైద్య సీట్లను నేషనల్ పూల్లో చేర్చలేదు. తాజాగా చేర్చిన నేపథ్యంలో జూలై 6 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత నీట్ కౌన్సెలింగ్ నాటికి ఆయా సీట్లలో అందరూ పోటీ పడే అవకాశముందని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ రమేశ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 32,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. -
వైద్య ఆరోగ్యశాఖలో 4,120 మంది బదిలీ
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఆన్లైన్లో చేపట్టిన ఈ ప్రక్రియలో 4 వేల మందికి పైగా ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. ప్రాథమిక ఆస్పత్రి మొదలు పైస్థాయి వరకు అన్ని ఆస్పత్రుల్లోనూ బదిలీలు జరిగాయి. మొత్తం 4,120 మందిని బదిలీ చేయగా.. వారిలో 190 మంది వైద్యులు, వెయ్యి మంది వరకు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. బదిలీల్లో 2,120 హైదరాబాద్ కేంద్రంగా జరిగితే, 2 వేల బదిలీలను జిల్లాల స్థాయిలో నిర్వహించారు. దంత వైద్యులు తక్కువగా ఉన్నందున వారిని బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తమకు బదిలీ కావాలని వారు కోరుకున్నందున కౌన్సెలింగ్ చేపట్టామని ఆరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 35 ఏళ్లుగా ఒకే దగ్గర తిష్టవేసిన వారిని కూడా ఈ సారి కదిలించినట్లు ఆయన చెప్పారు. కాగా, బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు వైద్య సిబ్బంది ఆరోగ్య సంచాలకుల కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఎవరికీ అన్యాయం జరగలేదని.. ఆన్లైన్ ద్వారానే బదిలీల ప్రక్రియ నిర్వహించామని శ్రీనివాసరావు తెలిపారు. -
వైద్య శాఖలో432 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో 432 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను వైద్య, ఆరోగ్య శాఖలోని ఎంపిక కమిటీ భర్తీ చేస్తుంది. మిగతా మూడు రకాల పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం భర్తీకి అనుమతించిన పోస్టులు: సివిల్ అసిస్టెంట్ సర్జన్–108, స్టాఫ్ నర్స్–216, ఫార్మసిస్ట్(గ్రేడ్ 2)– 54, ల్యాబ్ టెక్నీషియన్(గ్రేడ్ 2)–54. -
‘108’ సేవలు నిలిపేస్తాం
సాక్షి, అమరావతి/మంగళగిరి రూరల్: ఏదైనా ప్రమాదం సంభవిస్తే ‘108’కు ఫోన్ చేయగానే పరుగెత్తుకు రావాల్సిన అంబులెన్స్ సేవలు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిలిచిపోయాయి. ఈ అంబులెన్స్లలో పనిచేస్తున్న సిబ్బందికి, ‘108’నిర్వహణా సంస్థ బీవీజీ యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలం కావడమే ఇందుకు కారణం. తమ డిమాండ్ల పరిష్కారానికి బీవీజీ సంస్థ అంగీకరించకపోవడంతో సిబ్బంది నాలుగు గంటలపాటు అంబులెన్స్లను నిలిపి వేసి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘108’సిబ్బందిని చర్చలకు ఆహ్వానించారు. గురువారం ఉదయం 11 గంటలకు చర్చలు జరగనున్నాయి. ముఖ్య కార్యదర్శితో జరిగే చర్చల్లో సిబ్బందికి న్యాయం జరగకపోతే ఇకపై రోజూ 8 గంటలపాటు అంబులెన్స్ సేవలను నిలిపివేస్తామని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘108’కార్యాలయంలో 13 జిల్లాల రాష్ట్ర కమిటీ సభ్యులు.. బీవీజీ సంస్థ ప్రతినిధులతో బుధవారం చర్చలు జరిపారు. నిబంధనల ప్రకారం తాము రోజుకు 8 గంటలే పనిచేయాల్సి ఉండగా 12 గంటలకుపైగా పని చేయాల్సి వస్తోందని వాపోయారు. 12 గంటల పనివేళలను 8 గంటలకు కుదించాలని, వేతనాలను 50 శాతం జీతాలు పెంచాలని ‘108’కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లను బీవీజీ సంస్థ ఎండీ దేశ్పాండే తిరస్కరించారు. -
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి
సూర్యాపేట / హుజూర్నగర్ :రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, విద్యుత్శాఖ మంత్రి గుండకండ్ల జగదీశ్రెడ్డిలు పేర్కొన్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లను మంత్రులు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రజల ఆరోగ్యాలకు భరోసానిచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయనున్నామన్నారు. శిబిరాల ద్వారా ప్రజలందరికీ పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లు కూడా చేస్తామన్నారు. కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు అం దించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని తెలి పా రు. సీఎం హామీ మేరకు నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నా రు. నల్లగొండలో భవనాలు సిద్ధంగా ఉన్నాయని.. సూ ర్యాపేట జిల్లా కేంద్రంలో స్థలాన్ని పరిశీలించామని.. త్వరలో కళాశాలలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా అంటేనే ఫ్లోరో సిస్ గుర్తుకు వస్తుందన్నారు. ఇలాంటి జిల్లాల ప్రజలకు మేలు చేసేందుకే సీఎం మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ సురేంద్రమోహన్, కార్పొరేషన్ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ మురళీమోహన్, డీసీహెచ్ఎస్ సంపత్కుమార్, సూర్యా పేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, బైరు దుర్గయ్యగౌడ్, నిమ్మల శ్రీనివాస్గౌడ్, వైవి, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, మారిపెద్ది శ్రీని వాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్యగౌడ్, పుట్ట కిషోర్నాయుడు, నాతి సవిందర్కుమార్, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీని వాస్ గౌడ్, వైస్ చైర్మన్ దొంతిరెడ్డి సంజీవరెడ్డి, ఎంపీపీ జి. నిర్మల, జడ్పీటీసీ ఎండీ.హఫీజా, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కె.శంకరమ్మ, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ సాముల శివారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లం ప్రభాకర్రెడ్డి, ఆర్డీఓ భిక్షానాయక్, వైద్యశాల సూపరింటెండెంట్ డా.ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు . -
కంటి పరీక్షలకు సన్నద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ సర్వ సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న కంటి పరీక్షలపై ఆదివారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు. ఓ అంచనాకు రండి.. ‘రాష్ట్రంలో ఎన్ని కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించాలో తొలుత నిర్ధారించాలి. ఒక వైద్య బృందం ఒక రోజుకు ఎంత మందికి పరీక్ష చేయగలుగుతుందో అంచనాకు రావాలి. అందుకు అనుగుణంగా జనాభాను బట్టి ప్రతి గ్రామానికి అవసరమైనన్ని వైద్య బృందాలను పంపాలి. ఒకే రోజు గ్రామంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలి. వరుసగా ఒక్కో గ్రామం పూర్తి చేయాలి. వైద్య బృందానికి వారంలో ఐదు రోజులు మాత్రమే పని కల్పించాలి. పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలను ముందే సమకూర్చుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 900 వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే పొరుగు రాష్ట్రాల కంటి వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలి’ అని ఆదేశించారు. కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరమైన వారికి వెంటనే కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి కంటి వైద్యశాలలకు రిఫర్ చేయాలన్నారు. విస్తృత ప్రచారం చేయాలి.. ‘గ్రామాలు, పట్టణాల్లో చాలా మంది కంటి జబ్బులతో బాధ పడుతున్నారు. కంటి జబ్బు ఉన్నా గుర్తించకుండా నెట్టుకొస్తున్న వారు కూడా ఉన్నారు. అందరికీ ముందుగా అవగాహన కల్పించాలి. ప్రభుత్వం నిర్వహించే కంటి వైద్య శిబిరాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి’ అని సీఎం పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు జీఆర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ వాకాటి కరుణ, వైద్యారోగ్య శాఖ ఓఎస్డీ గంగాధర్, చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎన్పీసీబీ డైరెక్టర్ మోతీలాల్ నాయక్, సీఐవో గోపీకాంత్ రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
భార్యలకేనా..ఆ బాధ్యత భర్తలకు లేదా!
మగ మహా రాజులుగా మీసాలు మెలేస్తారుమగ ధీరులుమంటూ మాటలు కోటలు దాటిస్తారుధైర్యానికి ప్రతీకలుగా కండలు తిప్పుతారువాస్తవానికి ఇవన్నీ మహిళలకే వర్తిస్తాయి... ఓ యువతా... ఇల్లరికం వస్తావా అంటేకొత్తవాళ్ల మధ్య నే మసలలేననే సమాధానం... ఓ మొగుడా గర్భం దాల్చి బిడ్డను కంటావా అంటేఆ భారం మోయలేను..ఆ బాధ భరించలేనంటావ్ పసి బిడ్డను లాలించగలవా అని ప్రశ్నిస్తే...పసికందు ఏడుపును నేనెలా ఆపగలనంటావ్ కనీసం కు.ని. శస్త్ర చికిత్స చేయి ంచుకో అంటేయోజనాల దూరం పరుగులు తీస్తావ్... మాకు తెలుసులే..మీదంతా మేకపోతు గాంభీ ర్యమేమీరంతా మగ మహా భయస్తులనేది నిజంలే... తూర్పుగోదావరి, కొత్తపేట: ఒక బిడ్డ ముద్దు..ఇద్దరు బిడ్డలు హద్దు..మూడో బిడ్డ వద్దు..అన్నది వైద్య ఆరోగ్య శాఖ నినాదం. ఆ దిశగానే ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. చేయించుకున్నవారికీ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దాదాపు అందరూ ఒకరు, ఇద్దరితోనే సరిపెట్టుకుని స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే సంతానానికి భార్యా, భర్త ఇద్దరూ కారకులైనా..కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు మాత్రం భర్తలు ఆమడ దూరంలో ఉంటున్నారు. పురుషులకే వేసక్టమీ ఆపరేషన్లు చేయాలని లక్ష్యాలను నిర్దేశిస్తున్నా.. ఆ లక్ష్య సాధనకు అధికారులు కృషి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కేవలం స్త్రీలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ల సంఖ్యనే చూపించి లక్ష్యాలు సాధించినట్టు చంకలు గుద్దుకుంటున్నారు. వేసక్టమీ ఆపరేషన్ సులువైనా... పురుషులకు కోత, కుట్టు, కట్టు లేని అతి సులువైన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స అందుబాటులో ఉన్నా ముందుకు రావడం లేదు. ఎక్కడో అతి కొద్దిమంది మాత్రమే వేసక్టమీ చేయించుకుంటున్నారు. అదీ పట్టణ ప్రాంతాల్లోనే. గ్రామీణ ప్రాంతాల్లో మచ్చుకు కూడా ఆ జాడ కనిపించడం లేదు. మహిళలకు చేసే ట్యూబెక్టమీ కంటే పురుషులకు చేసే వేసక్టమీ ఆపరేషన్లకే ప్రభుత్వం ఎక్కువ పారితోషికం చెల్లిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు రూ. 660 చెల్లిస్తుండగా పురుషులకు రూ.1,100 ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సహజ ప్రసవమయ్యేలా ప్రయత్నిస్తూ... అత్యవసరమైతేనే సిజేరియన్ చేస్తున్నారు. అనేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం సహజ ప్రసవంమయ్యే అవకాశం ఉన్నా పెద్ద మొత్తంలో బిల్లులు దండుకునేందుకు సిజేరియన్ చేస్తుండగా, కొందరు నొప్పులు బాధ నుంచి తప్పించుకొనేందుకు స్వచ్ఛందంగా సిజేరియన్ ద్వారా బిడ్డకు కంటున్నారు. అపోహలు కారణం... వేసక్టమీ శస్త్ర చికిత్సలు ఎక్కువగా జరగకపోవడానికి పురుషుల్లో పలు అపోహలే కారణం. పురుషులు వేసక్టమీ చేయించుకుంటే లైంగిక సామర్ధ్యం, బలం, కోరిక తగ్గుతుందని పురుషులు భావించడం ఒక ప్రధాన కారణం. వాస్తవానికి పురుషులకు కత్తిరింపుతో కాకుండా చిన్న రంధ్రం ద్వారా వేసక్టమీ చేస్తాం... కొంత సేపు అనంతరం ఇంటికి వెళ్లిపోవచ్చు. ట్యూబెక్టమీ కన్నా వేసక్టమీ సులువైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ట్యూబెక్టమీతో మహిళ చర్మం 6 పొరలు కోయాలి. 7 నుంచి 10 రోజులు ఆస్పత్రిలో ఉండాలి. అదే వేసక్టమీ అయితే పురుషులకు చిన్నగాటు పెట్టి కుట్టు కూడా లేకుండా ఆపరేషన్ చేస్తారు. వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు.– డాక్టర్ ప్రదీప్తి కరుణ, గైనకాలజిస్ట్, కొత్తపేట -
రూ.3 వేలు వసూలు చేశారు!
‘రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మా బంధువుకు పోస్టుమార్టం చేయమంటే డాక్టర్ రూ.3 వేలు లంచం అడిగాడు. ఎమ్మెల్సీ అయి న నేను, ఓ ఎమ్మెల్సీ పీఏ అక్కడే ఉన్నామన్న భయం కూడా ఆ డాక్టర్లో లేదు. ఇదేం పద్ధతి’ – శాసన మండలిలో ఓ ఎమ్మెల్సీ ఫిర్యాదు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఇలా డబ్బులు అడిగే పద్ధతి అన్ని ఆసుపత్రుల్లో ఉండేది. ఇప్పుడు అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ – వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం. సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యంపై బుధవారం శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో వైద్యారోగ్య శాఖ పనితీరు చర్చకు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల కీళ్ల మార్పిడి అంశంపై టీఆర్ఎస్ సభ్యులు గంగాధర్గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ, భూపతిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటనను సభ ముందుంచారు. గత ఆదివారం తన బంధువు రోడ్డు ప్రమాదంలో చనిపోతే చూడ్డానికి వెళ్లానని, పోస్ట్మా ర్టం కోసం సిబ్బంది మధ్యాహ్నం వరకు ఎదురు చూసేలా చేసి చివరకు రూ.3 వేలు వసూలు చేసి ఆ తంతు పూర్తి చేశారని ఫిర్యాదు చేశారు. తాను, మరో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పీఏ అక్కడే ఉండగానే వసూళ్లు సాగాయని, మరి పేదల విషయంలో వేధింపులు ఇంకెలా ఉంటాయని సభ దృష్టికి తెచ్చారు. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, ‘ఉమ్మడి రాష్ట్రంలో ఈ అవినీతి ఇంకా ఎక్కువగా ఉండేది. అన్ని ఆసుపత్రుల్లో వసూలు చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ తెలిపారు. ఈ సమాధానంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ విరామ సమయంలో మంత్రిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు చనిపోయి దుఃఖంలో ఉంటే, వైద్యులు పోస్టుమార్టం కోసం వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. -
వడగాడ్పులపై ప్రత్యేక ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలని ఆదేశించారు. శనివారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. గత వేసవిలో 23 రోజుల పాటు వడగాడ్పులు వీచాయని ఈ సారి అంతకంటే ఎక్కువ రోజుల పాటు గాలులు వీచే అవకాశముందన్నారు. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. వడగాడ్పుల తీవ్రతపై అధికార యంత్రాంగానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలను చేరవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో తగినన్ని ఓఆర్ఎస్, ఐడీ ఫ్లూయిడ్స్ తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎప్పటికప్పుడు హెల్త్ అడ్వైజరీస్ విడుదల చేయాలన్నారు. వడగాడ్పుల తీవ్రతపై ప్రచారం.. సమాచార శాఖ ద్వారా వడగాడ్పుల తీవ్రతపై పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్స్, సోషల్ మీడియా, టీవీ, రేడియోల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బందికి వేసవి ప్రణాళికపై శిక్షణనివ్వాలని సూచించారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, మెట్రోస్టేషన్లు, బస్స్టాప్లలో మంచినీటిని ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో మంచి నీరు, ఐస్ ప్యాక్లను యాజమాన్యాలు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ, అర్బన్ లోకల్ బాడీలకు సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సీఎస్ చెప్పారు. -
ఆశల ‘అడవి’లో గోండ్ గొవారీలు!
సాక్షి, హైదరాబాద్: గొవారీ, గోండ్ గొవారీ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతా ల్లోని తెగలివి.. పశువుల కాపరులు.. గోండు రాజుల దగ్గర పనిచేస్తూ అటవీ ప్రాంతాల్లోనే జీవించేవారు.. ఇప్పుడిప్పుడే బయటి ప్రపం చం బాట పట్టారు. కానీ వారికి ‘గుర్తింపు’ సమస్య ఎదురవుతోంది. ప్రభుత్వ గెజిట్లోనే ఆ తెగల ప్రస్తావన లేక పోవడంతో అధికారులు వారికి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. సంక్షేమ పథకాలు అం దాలన్నా.. చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తించాలన్నా కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. దీంతో గొవారీలు, గోండ్ గొవారీ లు ఏమీ అర్థంకాని దుస్థితిలో పడిపోయారు. మూడు వేలకుపైగా కుటుంబాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేల, కౌటాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మండలాల్లో మహారాష్ట్ర సరిహద్దులకు సమీపంగా గొవారీలు, గోండ్ గొవారీ తెగలకు చెందిన మూడు వేలకుపైగా కుటుంబాలున్నాయి. వృత్తిరీత్యా పశువుల కాపరులైనా.. కాలక్రమంలో వ్యవసాయ కూలీలు, ఇతర పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవలికాలంలోనే పిల్లలను బడికి పంపడం మొదలుపెట్టారు. అయితే ప్రాథమికోన్నత స్థాయి వరకు కుల ధ్రువీకరణ పెద్దగా అవసరం లేకున్నా.. పైతరగతుల్లో కుల నమోదుకు ప్రాధాన్యత ఉంటుంది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు కుల ధ్రువీకరణ తప్పనిసరి. దీంతో కుల ధ్రువీకరణ పత్రాల కోసం గొవారీలు, గోండ్ గొవారీ ల దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ప్రభు త్వ గెజిట్లో ఆ కులాలే లేవంటూ అధికారులు కుల ధ్రువీకరణ పత్రాల జారీకి నిరాకరిస్తున్నారు. చదువు కష్టం.. ఉద్యోగం రాదు గొవారీలు, గోండ్ గొవారీలు కుల ధ్రువీకరణేదీ లేకపోవడంతో ఓపెన్ కేటగిరీ కింద పాఠశాలల్లో చేరుతున్నారు. అలా పదోతరగతి వరకు చదివి ఆపేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దుస్థితిలో ఓపెన్ కేటగిరీలో పోటీపడలేక, ఫీజులు చెల్లించి ప్రైవేటు కాలేజీల్లో చదవలేక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఎలాగోలా కష్టపడి చదువుకున్నా అటు ఉద్యోగాలు కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలూ అందని దుస్థితి ఉంది. కల్యాణలక్ష్మి పథకం వర్తించాలన్నా.. సహకార సంస్థల నుంచి రుణాలు, స్వయం ఉపాధి పథకాలు అందాలన్నా కుల ధ్రువీకరణ పత్రం లేక సమస్యలు ఎదురవుతున్నాయి. అసలు ఇప్పటివరకు గొవారీ, గోండ్ గొవారీల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు కేవలం ఒక్కరే కావడం గమనార్హం. ఇంటర్ చదివినా.. ‘‘అమ్మ నాన్న ఇద్దరూ వ్యవసాయ కూలీలే. చదువు మీద ఆసక్తితో ఇంటర్ చదివిన. కానిస్టేబుల్, వీఆర్ఓ, వీఆర్ఏ, ఆర్ఆర్బీ లాంటి నోటిఫికేషన్లు వచ్చినా.. దరఖాస్తు చేద్దామంటే కుల ధ్రువీకరణ పత్రం లేదు. దీంతో కూలికి పోతున్నా’’ – రావుత్ కౌడు, బేల మండలం పోనాల ప్రభుత్వోద్యోగం పొందింది నేనొక్కడినే.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో కొంతకాలం గొవారీ, గోండ్ గొవారీలకు బీసీ సర్టిఫికెట్లు ఇచ్చారు. అలా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత బీసీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు. మహారాష్ట్రలో మా తెగల వారికి ఎస్టీలుగా గుర్తింపు ఉంది. ఇక్కడ మా గోడు వినేవారే లేరు. ’’ – లోహత్ జానాజి, విశ్రాంత పోలీసు అధికారి, బేల అవకాశం వదులుకున్నా... ‘‘కష్టపడి ప్రైవేటు కాలేజీలో ఫీజు కట్టి ఎంఎల్టీ కోర్సు చదివిన. వైద్య శాఖలో పారామెడికల్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు చేసుకోలేకపోయిన. అర్హత ఉన్నా లాభం లేక బాధపడ్డా..’’ – దుద్కుర్ పూజ, బేల -
పోరుబాట..
సూర్యాపేట : వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు, రెండో ఏఎన్ఎంలు, ఆర్బీఎస్కే, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 104 ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పదిరోజులనుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు పోస్టుకార్డుల ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉత్తరాలు, నిరసనలు, ధర్నాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,168 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 45 శాతం వేయిటేజీ మార్కులు కల్పించి రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులరు భర్తీ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ నందు గత ప్రభుత్వాలు అమలు చేసిన పీఆర్సీ బేసిక్ పే విధానాన్ని,హెల్త్కార్డులు ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే లోపభూయిష్టమైన ప్రభుత్వ జీఓ నం:16ను వెంటనే పునరుద్ధరించి.. 2006 సంవత్సరంలో జస్టిస్ ఉమాదేవి ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. ఈనెల 27న ధర్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఈనెల 27వ తేదీన పెద్ద ఎత్తున తరలివచ్చి హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ఎదుట పబ్లిక్ హెల్త్, మెడికల్ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. ధర్నాకు అన్ని జిల్లాల్లోని ఉద్యోగులు తరలిరావాలని ఇప్పటికే యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల మద్దతు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిరసన, ధర్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్కేవీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, జేఏసీ నాయకులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీఓ నంబర్16ను పునరుద్ధరించాలి అస్పష్టమైన జీఓ నంబర్16ను పునరుద్ధరించాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. గత ప్రభుత్వం అమలు చేసిన రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో 45 శాతం మార్కులు ఇచ్చి రెగ్యులర్ చేయాలి. -ఆర్.మనోజ్కుమార్రెడ్డి, కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ సూర్యాపేట పీఆర్సీ అమలు చేయాలి గత ప్రçభుత్వాలు అమలు చేసిన విధంగానే రెండో ఏఎన్ఎంలకు కూడా పీఆర్సీ అమలు చేయాలి. సుప్రీం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది. ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. -మద్దిరెడ్డి భవాని, రెండో ఏఎన్ఎం, కోదాడ -
గాడితప్పుతున్న ఆరోగ్యశ్రీ!
సాక్షి, హైదరాబాద్: దేశానికి ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ గాడితప్పుతోంది. పథకంపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. పూర్తిస్థాయి ఉన్నతాధికారి లేకపోవడం, ఇతర సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తుండటంతో సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులతో కలసి పలువురు అధికారులు, సిబ్బంది చేస్తున్న నిర్వాకాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి పరిశీలనలోనూ ఇవే అంశాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో వైద్య శాఖ పనితీరు, కేంద్ర పథకాల అమలును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్.. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించి వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఇన్చార్జి సీఈవో కె.మనోహర్ ఇచ్చిన నివేదికపై ప్రీతి అనేక సందేహాలు వ్యక్తం చేశారు. రోగులకు అవసరం లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలు జరుగుతున్నాయని, నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రస్టు సీఈవో చెప్పగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో లోపాలు సరిదిద్దాలని సూచించారు. -
వెయిటేజీ మార్కులపై స్టేకు నో
సాక్షి, హైదరాబాద్: వైద్య శాఖ, ట్రాన్స్కోల్లో ఔట్సోర్సింగ్(పొరుగు సేవలు), కాంట్రాక్టు (ఒప్పంద సేవలు) పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే పరీక్షలను నిలుపుదల చేయడంవల్ల ప్రయోజనం ఉండబోదని, ఈ దశలో స్టే మంజూరు అవసరం లేదని సోమవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో చేసే ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలనే నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. మరో సింగిల్ జడ్జి.. పరీక్షలో సమాన మార్కులు వచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని అందుకు విరుద్ధమైన ఆదేశాలిచ్చారు. దాంతో ఈ వివాదం ధర్మాస నం ముందుకు వచ్చింది. ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతుల్లో సేవలందించే వారికి వెయి టేజీ ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం విచా రిస్తూ.. ఉద్యోగ భర్తీకి నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులందరికీ ఒకే తరహా పశ్నపత్రం ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోటీ పరీక్షల తేదీ సమీపిస్తున్నందున ఈ కేసులను వీలైనంత త్వర గా విచారణ జరుపుతామని ప్రకటించింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేసేవారికి వెయిటేజీ మార్కులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. పరీక్షలు నిర్వహించకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరా రు. దీనిపై అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడే పరీక్షలు జరిపేసి అర్హుల్ని వెంటనే ఉద్యోగాల్లో చేర్చేసుకోవడం లేదు కాబట్టి పరీక్షల్ని వాయి దా వేయాల్సిన అవసరం లేదన్నారు. వాదనల అనంతరం విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది. -
ప్రజల్లో మార్పు తీసుకురాకపోతే.. మీకెందుకు జీతాలు?
శ్రీకాకుళం, అరసవల్లి: ‘‘సార్ జిల్లాలో సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు ఎక్కువ. గర్భం దశను కూడా కొంతమంది బయటకు చెప్పరు. ♦ డెలివరీలకు ప్రభుత్వ ఆస్పత్రులకు రారు.. వస్తున్నవారు ముహూర్తాలంటూ సిజేరియన్ చేయమంటుంటారు. ♦ చాలా మండలాలు ఒడిశా బోర్టర్లో ఉన్నాయి సార్.. ఇక్కడ ఇలాంటి సంప్రదాయ పరిస్థితులతో ఇబ్బందులు తప్పడం లేదు.. ♦ చాలా పీహెచ్సీల్లో స్టాప్ లేరు...ఓపీ ఎక్కువగా ఉంటోంది. అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రుల కు వెళ్లిపోతున్నారు’’ గురువారం జిల్లా పరిషత్ సమావే శ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ సమీక్షను నిర్వహిం చిన జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డికి హాజరైన వైద్యులు, అధికారులు దాదాపుగా చెప్పిన సమాధానాలివి..! ఏ విభాగంలో ప్రగతి అంశాన్ని అడిగినా, వైద్యుల నుంచి ఇవే సమాధానాలు వస్తుండడంతో కలెక్టర్కు కోపమోచ్చింది. ‘‘ ఎందుకిలా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు?. 20 ఏళ్ల నాటి పాత కారణాలు పదేపదే చెబుతుంటే వినడానికి నేను సిద్ధంగా లేను.. వెనుకబడిన జిల్లా కాబట్టే ఇన్ని గంటలపాటు సమీక్షలు చేయాల్సి వస్తోంది..అయినా మీరు పనిచేస్తున్న ప్రాంతాల ప్రజల్లో మార్పులు తేలేకపోతే మీకెందుకు జీతాలు..? ప్రజలు మారడం లేదా...లేదా మీరు హ్యాపీగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారా..! ఎందరు గ్రామాల్లో ఉన్నారో..ఇంకెందరు పట్టణాల్లో ఉన్నారో ..నాకు తెలియదనుకున్నారా...! అంటూ కలెక్టర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో సమావేశం సీరియస్గా మారిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపై నమ్మకం పెరగాలి గ్రామీణ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై నమ్మకం కలిగించేలా విధులు నిర్వహించా లని కలెక్టర్ వైద్యులకు సూచించారు. 24 గంటల ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఖాళీగా ఉన్న వైద్యయేతర పోస్టులను ఈ నెల 20వ తేదీలోగా అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని డీఎంహెచ్వో తిరుపతిరావును ఆదేశించా రు. ఇటీవల తాను ఓ ప్రభుత్వ పాఠశాలలో 238 మంది విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశానని.. అయితే అక్కడ అమ్మాయిలకు చూపు సామర్ధ్యం –6, –4 కూడా ఉండడం బాధించిందన్నారు. ఇక మీదట జిల్లాలో విద్యార్థులందరికీ నేత్ర పరీక్షలు చేయాలని, అవసరమైతే చికిత్సలు కచ్చితంగా జరగాలన్నారు. ఈ ప్రక్రియను వైద్యులు ఉద్యమంలా చేయాలని.. ఇందుకోసం రూ.50 లక్షలైనా నిధులు ఇస్తానని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘తల్లీబిడ్డ’ ఎక్స్ప్రెస్పై అనుమానాలు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల వినియోగంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కలెక్టర్ అన్నా రు. జిల్లాలో 2016–17లో 20 వేలకు పైగా డెలివరీలు అయితే 11,205 మంది మాత్రమే ఈ వాహన సేవలను వినియోగిచుకున్నారన్నారు. అలాగే 2017–18లో డెలివరీలు 16,082 కాగా, వాహనాలను విని యోగించుకున్నవారు కేవలం 9,785 మంది మాత్రమే నమోదయ్యావన్నారు. ఓడీఎఫ్ ఉద్యమంలో కీలకంగా వ్యవహారించాలి జిల్లాను ఈ ఏడాది మార్చి 31 నాటికి ఓడీఎఫ్ జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో ఉద్యమంగా పనిచేస్తున్నామని, ఇందులో ప్రతి వైద్యుడు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. మీ వద్దకు వచ్చే రోగులతో అదనంగా రెండు నిమిషాలు మాట్లాడి వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉపాధ్యాయుడు, వైద్యుడికి చాలా గౌరవం ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్యం కీలకమన్నారు. ఉద్దానంలోని 8 మండలాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని కోరారు. కిడ్నీ వ్యాధుల నిర్ధారణకు కొందరు సోషల్ సిగ్మాతో వెనకంజ వేస్తున్నారని, దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు వైద్యం కోసం వేలాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ఈ ప్రాంతంలో వైద్య పరీక్షలు అందరికీ జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే చేయగలదని తాను విశ్వసిస్తున్నానన్నారు. ఏజెన్సీలో రక్తహీనత (హెచ్బీ) 11కి మించి పెరిగేలా చర్యలు చేపట్టాలని, అందుకు తగ్గ సూచనలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. పీహెచ్సీల్లో పనితీరుపై అసంతృప్తి పీహెచ్సీలో ఆంటీనాటల్ చెకింగ్ (ఏఎన్సీ), ఎర్లీ ఆంటీనాటల్ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని తాడివలస, గోవిందపురం, బూరాడ, బొరివంక, తొగరాం, సారవకోట, కొర్లాం, కంచిలి, వెంకటాపురం, బూరగాం, కె.సైరిగాం, దండుగోపాలపురం, కింతలి తదితర సీహెచ్సీల్లో పనితీరు, ప్రగతి రిపోర్టులు బాగాలేవని, దీనిపై వైద్యుల నుంచి వచ్చిన సమాధానాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలు డాక్టర్లుగా ఉన్నచోట కూడా డెలివరీలు జరగకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాత్రమే మేం మాట్లాడతాం..బయట వారిని ఏఎన్ఎంలు చూసుకుంటారులే అని వైద్యులు భావిస్తే సహించనని హెచ్చరించారు. మీరంతా అసలు ఆస్పత్రుల్లో ఉంటున్నారా? ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పీహెచ్సీల్లో వెంటనే విచారణ చేపట్టి, వైద్యులు చెబుతున్న కారణాలు నిజమో కాదో నివేదిక అందజేయాలని డీఎంహెచ్వో తిరుపతిరావు కలెక్టర్ ఆదేశించారు. నిజంగా మీకు గుర్తింపు రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేయాలని, ఇక ఇలాంటి కారణాలు, నిర్లక్ష్యం మళ్లీ కనిపిస్తే చర్యలు తప్పవన్నా రు. సమావేశం అనంతరం ఐసీడీఎస్ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించా రు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ఈ రెండు శాఖలు సమన్వయంగా పనిచేయాల్సి ఉందని సూచించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి బొడ్డేపల్లి సూర్యారావు, డీఐవో బగాది జగన్నాథరా వు, అడిషినల్ డీఎంహెచ్వో మెండ ప్రవీణ్, వై.వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ లీలావతి, పీవో పక్కి చంద్రకళ, నోడల్ అధికారిణి సీహెచ్. ఝాన్సీ, మాస్ మీడియా ప్రచార అధికారి పాలవలస విశ్వనాథం పాల్గొన్నారు. -
ఆయన మిస్సింగ్.. ఓ మిస్టరీ.!
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఓ)లో జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఎస్ఓ)గా పనిచేసిన ఈగ ఉమామహేశ్వరరెడ్డి గత ఏడాది ఆగస్టు 30వ తేదీన కర్నూలుకు బదిలీ అయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఐదు నెలలు దాటినప్పటికీ ఆయనకు సంబంధించిన కనీస సమాచారం కూడా లభించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు సార్లు కడపకు వచ్చి ఆయన బంధువులను విచారించి వెళ్లారు. తాజాగా మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి కర్నూలు నుంచి పోలీసులు వచ్చారు. కొంతమంది ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించి వెళ్లారు. ‘మిస్సింగ్’ వివరాలు ఇలా... కడప నగరం ఎన్జీఓ కాలనీకి చెందిన ఉమామహేశ్వర్రెడ్డి వయస్సు 48 సంవత్సరాలు. ఆయన ఇక్కడి డీఎంహెచ్ఓలో ఎస్ఓగా దీర్ఘకాలికంగా పనిచేశారు. ఆయనకు భార్య అనసూయ. ఒక కుమారుడు శివసాయిరెడ్డి ఉన్నారు. ఇతనికి మెడిసిన్లో విశాఖపట్నంలో ఫ్రీ సీట్ వచ్చింది. అక్కడ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా ఉమామహేశ్వర్రెడ్డి మంచి అధికారిగా గుర్తింపు పొందారు. గత జూన్ నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన కర్నూలులోని హెల్త్ ట్రైనింగ్ సెంటర్కు బదిలీ అయ్యారు. అయితే ఆయన సేవలు ఇక్కడ కీలకమైనందున నాటి డీఎంహెచ్ఓ రామిరెడ్డి ప్రభుత్వ అనుమతితో ఆయనను ఇక్కడే డిప్యుటేషన్పై విధులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆయన డిప్యుటేషన్ను ప్రభుత్వం రద్దు చేయడంతో గత ఆగస్టు నెల 30వ తేదీన కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఎస్ఓగా బదిలీ అయ్యారు. 14న సాయంత్రం 7.30కి చివరి ఫోన్ కాల్... బంధువుల సమాచారం మేరకు ఉమామహేశ్వర్రెడ్డి కర్నూల్లోని తన కార్యాలయం (మెడికల్ కాలేజీకి)కు ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జీలో బసచేశారు. సెప్టెంబర్ 14వ తేదీన సాయంత్రం 4.45 గంటలకు లాడ్జి నుంచి కిందకు వచ్చారు. ఈ సన్నివేశాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడు తెలుపు షర్టు, నల్లని ప్యాంట్ ధరించి ఉన్నాడు. అనంతరం ఆయన 6.30 గంటలకు తన ఆఫీసు (డీఎంహెచ్ఓ) నుంచి బయటకు వెళ్లారు. తరువాత ఆయన లాడ్డీకి వెళ్లలేదు. అనంతరం 7.30 గంటలకు ఆఫీస్లోని రవి అనే ఉద్యోగికి ఫోన్ చేశాడు. అదే చివరి ఫోన్ కాల్. అనంతరం అతని దగ్గర ఉన్న నాలుగు ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్లోనే ఉన్నాయి. 15వ తేదీన తెలిసిన విషయం... 15వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో కర్నూలులోని ఆఫీసు ఉద్యోగి వసంతరెడ్డి కడపలోని ఆఫీసులో ఉమామహేశ్వరరెడ్డి వద్ద పనిచేస్తున్న బాషాకు ఫోన్ చేశారు. ఉమామహేశ్వరరెడ్డి డ్యూటీకి రాలేదని చెప్పారు. దీంతో బాషా ఆ విషయాన్ని ఆయన భార్య అనసూయకు ఫోన్ చేసి తెలిపాడు. అప్పుడు అనసూయ తన భర్త సెల్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో ఆమె కర్నూలు డీఎంహెచ్ఓకు ఫోన్ చేయగా ఆయన కూడా ఈ విషయం తనకు తెలియదని చెప్పారు. కడప నుంచి ఆయన బంధువులు కర్నూలు వెళ్లి అక్కడ 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే అక్కడి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. మూడు బృందాలు ఏర్పాటు... ఉమామహేశ్వర్రెడ్డి బంధులు, కర్నూలు జిల్లా పోలీసులు ఆయన ఆచూకీ కోసం ఆ ప్రాంతాల్లో వెతికారు. ఇంతవరకు స్పష్టంగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే అతను మంత్రాలయం, కోడుమూరు ప్రాంతాల్లో కనిపించినట్లుగా అక్కడ బస చేయడంతో పాటు హోటళ్లలో టిఫిన్ చేశారని ఆయా ప్రాంతాల్లోనివారు కొంతమంది చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉమామహేశ్వరరెడ్డి చేతికి ఉన్న వేళ్ల వ్యత్యాసాన్ని పలువురు ప్రశ్నించినట్లుగా తెలిసింది. అయితే ఈ అంశాలు కూడా అస్పష్టంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ ఆచూకీ కోసం మూడు బృందాలను నియమించినట్లుగా సమాచారం. ఈ విషయమై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని ఆయన బంధువులు తెలిపారు. గతంలో ఆయన భార్య అనసూయ ‘సాక్షి’తో మాట్లాడారు. మా ఆయన కర్నూలుకు బదిలీ అయ్యాక చాలా డల్గా కని పించాడు. అంతేగాక ఆయనకు అప్పుడు కామెర్లు కూడా ఉన్నాయి. బీపీ ఉంది. అక్కడ భోజనం బాగాలేదని, వాతావరణం సరిగా లేదని చెప్పేవాడు. తనను కూడా అక్కడికి తీసుకుపోవడానికి సరైన ఇల్లు కోసం చూస్తున్నట్లుగా చెప్పాడు. ఇంతలోనే ఇలా అయింది. ఆయనకు ఎవరితోనూ గొడవలు, ఎలాంటి సమస్యలు లేవు. అలాగే మాకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా లేవు. అయితే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదు అని తెలిపారు. మొత్తానికి ఉమామహేశ్వరరెడ్డి మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
‘గాంధీ’లో నవ శకం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే కార్పొరేట్ హంగులు సంతరించుకున్న గాంధీ జనరల్ ఆస్పత్రిని ప్రత్యేక అవయవ మార్పిడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆస్పత్రిలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి, ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తే గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కాంక్లీయర్ ఇంప్లాంటేషన్స్, మోకాలి చిప్పల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ సాంకేతిక బృందం ఇటీవల ఆస్పత్రిని సందర్శించింది. రూ.20 కోట్లతో ఆరు థియేటర్లు మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, జన్యుపర లోపాల వల్ల చాలామంది చిన్నతనంలోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, మోకీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి, మూగ, వినికిడి లోపంతో జన్మించడం, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఈ చికిత్సలు అందడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చాలా ఖరీదుతో కూడినవి కావడంతో ఆ స్తోమత లేని పేద రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. ఆ మేరకు గాంధీ ఆస్పత్రి ఇన్పేషెంట్ భవనం ఎనిమిదో అంతస్థులో రూ.20 కోట్లతో ఆరు అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు కు నిర్ణయించింది. గాంధీలోనే ఎందుకంటే.. అవయవ మార్పిడి చికిత్స కోసం నిమ్స్ జీవన్దాన్లో ప్రస్తుతం 4,503 మంది దరఖాస్తు చేసుకో గా, వీరి లో 2,403 మంది కిడ్నీ బాధితులు, 2,012 మం ది కాలేయ బాధితులు ఉన్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు 723 కిడ్నీ, 423 కాలేయం, 63 గుండె, 166 హార్ట్వాల్వస్, 391 కార్నియాలు, 8 ఊపిరితితుత్తలు, ఎనిమిది ప్రాంకీయాస్ మార్పి డి చికిత్సలు చేశారు. 250పైగా కాంక్లీయర్ ఇంప్లాం ట్స్ సర్జరీలు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రిల్లో గుండె, కాలేయ మార్పిడి చేయించుకో వాలంటే రూ.25 లక్షలకుపైగా ఖర్చు చేయాలి. సాధారణ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకే రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యనిపుణులకు లోటు లేదు. దీంతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి.. రోగులకు పైసా ఖర్చు లేకుండానే ఖరీదైన వైద్య సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావించింది. -
బీబీనగర్లో నిమ్సే
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రానికి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మంజూరు కాదని తేలడంతో బీబీనగర్లోని క్యాంపస్ను రాష్ట్ర స్థాయి ఉత్తమ సంస్థగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వైద్య సేవల సంస్థగా పేరొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) బీబీనగర్ క్యాంపస్పై కదలిక వస్తోంది. వైద్యసేవల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకంకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపూర్లోని నిమ్స్ విశ్వవిద్యాలయం క్యాంపస్ పూర్తి స్థాయి కార్యకలాపాల నిర్వహణకు కొత్తగా 873 పోస్టులు అవసరమవుతాయని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు గత నెల 28న కొత్తగా పోస్టులను మంజూరు చేసింది. కొత్తగా మంజూరైన పోస్టులు కావడంతో ఏ విధానంలో భర్తీ చేయాలనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి అనుసరించే ప్రక్రియపై అనుమతికోసం వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఆమోదం రాగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీబీనగర్ నిమ్స్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులలో 248 బోధన సిబ్బంది కేటగిరీవి ఉన్నాయి. మరో 625 బోధనేతర (వైద్య సహాయక, పరిపాలన, సాంకేతిక) పోస్టులు ఉన్నాయి. ఎయిమ్స్ తరహాలోనే నిమ్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని వైద్య శాఖ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో పేర్కొంది. ప్రతిపాదనల ప్రకారం బోధన సిబ్బంది పోస్టులను నిమ్స్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. నిమ్స్ ఉన్నతస్థాయి కమిటీ బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తుంది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య సంచాలకుడు, నిమ్స్ డైరెక్టర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరో ఉన్నతాధికారి ఈ కమిటీలో ఉంటారు. మొత్తం బోధన సిబ్బంది పోస్టులను మెరిట్ ఆధారంగా ఈ కమిటీ భర్తీ చేస్తుంది. జనవరిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో... బీబీనగర్ నిమ్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మొత్తం 873 పోస్టులు 58 కేటగిరీలో ఉన్నాయి. వీటిని మినహాయించి 50 కేటగిరీలోని 625 పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) భర్తీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. -
సర్కార్ ఆస్పత్రుల్లో పడకల పెంపు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కీలకమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులు అన్నింటిలోనూ రోగుల పడకల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో కొత్తగా 8,500 పడకల పెంపునకు వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెద్దాసుపత్రులైన ఉస్మానియా, గాంధీల్లో 2,000 చొప్పున పడకలను పెంచనున్నారు. వరంగల్ ఎంజీఎంలో 1,500, నిలోఫర్లో 1,000 చొప్పున పడకలను పెంచేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పడకల పెంపు పనులు జరగనున్నాయి. మారుతున్న జీవనశైలి, ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2016–17లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు 4.60 కోట్ల మంది రోగులు వచ్చారు. వీరిలో ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చిన వారు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ప్రతి ఏటా 20 శాతం వరకు పెరుగుతోంది. ముఖ్యమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులకు ప్రతి ఏటా 70 లక్షల మంది రోగులు వస్తున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య వసతులు ఉండటంలేదు. ఈ పరిస్థితులను మార్చేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల పెంపు... ఆస్పత్రి ప్రస్తుతం పెంచేవి ఉస్మానియా 1,168 2,000 గాంధీ 1,012 2,000 ఎంజీఎం 1,000 1,500 నిలోఫర్ 500 1,000 పేట్ల బురుజు 462 750 సుల్తాన్బజార్ 160 400 ఆదిలాబాద్ రిమ్స్ 500 650 హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి 100 200 -
వైద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన సడలింపు
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్ల భర్తీలో జాతీయ పూల్లోకి చేరేందుకు అడ్డంకిగా ఉన్న 371డి నిబంధనను కేంద్రం సడలించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దీని వల్ల ఏపీతో పాటు తెలంగాణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలు కూడా వచ్చే ఏడాది నుంచి జాతీయ పూల్ పరిధిలోకి వస్తాయన్నారు. జాతీయ స్థాయిలో చేరడం వల్ల ఎక్కువ ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లలో పోటీపడే అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 27,710 ఎంబీబీఎస్ సీట్లుండగా, రాష్ట్రంలో 1,900 సీట్లు ఉన్నాయని, 15% చొప్పున మనం 285 సీట్లు ఇస్తే 4,482 సీట్లలో పోటీపడే అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 13,872 పీజీ వైద్య సీట్లున్నాయని, మన రాష్ట్రంలో 660 సీట్లుండగా, 50 శాతం లెక్కన 330 సీట్లు ఇస్తే 7,236 సీట్లలో పోటీ పడవచ్చన్నారు. -
మర్యాదగా కోచింగ్లో చేరండి
సాక్షి, అమరావతి: ‘ఇలాగైతే మీకు నీట్లో సీట్లు రావు, గీట్లు రావు.. మర్యాదగా కోచింగ్లో చేరి చదువుకోండి’ అంటూ ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులకు సీఎం పేషీ నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఓవైపు ఫాతిమా కాలేజీ వ్యవహారమై ఎంసీఐతో చర్చించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్యా సంచాలకులు(అకడమిక్) డా.బాబ్జీ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ చర్చలు జరుగుతుండగానే సీఎం పేషీకి చెందిన కొందరు అధికారులు ఫాతిమా విద్యార్థులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మర్యాదగా నీట్ కోసం కోచింగ్లో చేరండి. లేదంటే మీ కెరీర్ పాడవుతుంది’ అని బెదిరింపులకు దిగుతున్నారని బాధిత విద్యార్థులు వాపోయారు. మరోవైపు ఫాతిమా కాలేజీ యాజమాన్యం కూడా తమకు ఫోన్లు చేసి భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు వాపోయారు. -
బతకాలని ఉంది.. ప్రాణభిక్ష పెట్టండి..
హైదరాబాద్: ‘నాకు బతకాలని ఉంది. వైద్యం అందించి ప్రాణభిక్ష పెట్టండి..’ఎంజైమ్ లోపం కారణంగా అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ యువతి ఆక్రందన ఇదీ. తనకు జీవించే హక్కు ఉందని, సరైన వైద్యం అందించడం లేదంటూ ఐదు నెలల క్రితం ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనికి స్పందించిన న్యాయస్థానం తక్షణమే ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ బాధిత యువతికి సమాచారం అందించడంతో ఆమె గురువారం ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. కాగా, ఆమె వైద్యానికి ఏడాదికి రూ.3.25 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం. అయితే ఈ స్థాయిలో నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఆస్పత్రి యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. జన్యులోపంతో జీవన్మరణ పోరాటం.. నగరంలోని హస్తినాపురానికి చెందిన శ్రీనివాస్, విజయ దంపతుల కుమార్తె మంగిన నాగసాయి రమ్యశ్రీ(19) పుట్టుకతోనే మ్యూకోపొలి శాకరిడోసిస్–6(ఎంపీఎస్–6) అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్న రమ్య వయసు పెరుగు తున్న కొద్దీ శరీరంలోని అవయవాల్లో ఎదుగుదల లేదు. ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించినా వ్యాధి నిర్థారణ జరగలేదు. దీంతో వైద్యుల సూచన మేరకు ఢిల్లీలోని సెంట్రల్ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించి ఆమె శరీరంలో నాగల్జైమో అనే ఎంజైమ్ లోపం ఉందని, దీంతో శరీరంలోని అవయవాలు క్రమంగా బలహీనపడి మృత్యువుకు చేరువవుతుందని నిర్థారించారు. ఈ ఎంజైమ్ను ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించాలని, దీనిని అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించాలని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ రకమైన ఎంజైమ్ రీప్లేస్మెంట్ చికిత్సకు ఏడాదికి రూ.3.25 కోట్ల్ల వ్యయం అవుతుందన్నారు. వైద్య సేవలు అందిస్తున్నాం:గాంధీ సూపరింటెండెంట్ హైకోర్టుతోపాటు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రమ్యశ్రీని అడ్మిట్ చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ తెలిపారు. వైద్యానికయ్యే ఖర్చు విషయమై అధికారుల ఆదేశాల మేరకు తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నాగల్జైమో ఇంజెక్షన్ డేంజర్: నిపుణుల కమిటీ అమెరికాలో తయారయ్యే నాగల్జైమో ఇంజెక్షన్ ప్రాణాంతకమని, ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులే చేయాలని నిపుణుల కమిటీ తీర్మానించినట్లు తెలిసింది. రమ్యశ్రీ వైద్యానికి సంబంధించి పది మంది వైద్యనిపుణులతో కమిటీని ఏర్పాటు చేయగా, గురువారం సాయంత్రం కమిటీ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించి నివేదిక రూపొందించారు. నాగల్జైమో ఇంజెక్షన్ను ఇక్కడకు తెప్పించేందుకు అవసరమైన లైసెన్స్ ఇండియన్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఇవ్వలేదని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఇంజెక్షన్ వలన చాలా సైడ్ఎఫెక్ట్స్ ఉన్నట్లు, ఎంజైమ్ వినియోగించవద్దని యూరోపియన్ డ్రగ్ కమిటీ రూపొందించిన పత్రాలను నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. రమ్యశ్రీకి నాడీమండల వ్యవస్థ మూసుకుపోతోందని, ఈ సమయంలో నాగల్జైమో ఇంజెక్షన్ ఇస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీపై ఇక్కడి వైద్యులకు అవగాహన లేదని, అనుభవలేమితో వైద్యం అందించి యువతి ప్రాణాలను పణంగా పెట్టలేమని తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. సదరు నివేదికను శుక్రవారం హైకోర్టుకు సమర్పించేందుకు వైద్యశాఖ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. అమెరికా వెళ్లి చదువుకుంటా..: రమ్యశ్రీ ప్రస్తుతం తాను ఇందిరాగాంధీ నేషనల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు రమ్యశ్రీ తెలిపింది. మనదేశంలో సరైన వైద్యం అందకుంటే తనకు మెడికల్ వీసాపై అమెరికా పంపిస్తే అక్కడ వైద్యం చేయించుకుంటూ ఉన్నతవిద్య అభ్యసిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెపుతోంది. ప్రధాని మోదీని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని ప్రధానికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నానని వివరించింది. -
వైద్య శాఖలో 13,496 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 13,496 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వైద్యా రోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వీటిలో 5,766 నర్సుల పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ‘దక్షత’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తండ్రికి ఆపరేషన్ జరుగుతున్నా సభకొచ్చా: శ్రీనివాస్గౌడ్ తన తండ్రికి ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరుగుతోందని, అయినా గీత కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు సభకు వచ్చానని, తనకు అదనపు సమయం కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ స్పీకర్ మధుసూదనాచారికి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని.. తాటి, ఈత చెట్లపై దళారీల పెత్తనం పెరుగుతోందన్నారు. బార్లు, రెస్టారెంట్ల లైసెన్సుల్లో గీత కార్మిక యువతకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి పద్మారావు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.69 కోట్లకు పైగా ఈత చెట్లు నాటామని, వాటిని సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కల్లును ఔషధంగానే చూస్తున్నామని, దాని వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే భావన ఉందన్నారు. ప్రమాదవశాత్తూ మరణించే గీత కార్మికులకు రూ. 6 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. -
133 ఆరోగ్యశ్రీ చికిత్సలు.. మళ్లీ ప్రైవేటు వైద్య కాలేజీలకు!
సాక్షి, హైదరాబాద్: పేదల ఆరోగ్య రక్షణ, ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని మార్చేలా ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్డు ప్రతిపాదనలు చేసింది. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే వైద్యం అందించే 133 రకాల చికిత్సలను రాష్ట్రంలోని మొత్తం 15 ప్రైవేటు వైద్య కాలేజీలకూ వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు మళ్లీ పాత పరిస్థితి వస్తుందని వైద్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పేదలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించాలనే లక్ష్యంతో 2008లో ఆరోగ్యశ్రీ పథకం మొదలైంది. ఈ పథకం కింద ప్రస్తుతం 942 రకాల చికిత్సలు అందిస్తున్నారు. మొదట్లో అన్ని చికిత్సలను అందించేలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేశాయి. అవసరం లేకున్నా గర్భాశయాలను తొలగించడంతోపాటు థైరాయిడ్, అపెండిక్స్, మొర్రి, ఫిస్టులా, హెర్నియా వంటి సమస్యల పేరుతో భారీగా శస్త్రచికిత్సలు నిర్వహించాయి. దీనివల్ల చికిత్సల కోసం వచ్చిన పేదల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ప్రభుత్వానికి ఆర్థికంగా అనవసర భారం పడింది. ఈ అంశాలపై అధ్యయనం చేసిన ప్రభుత్వం 133 రకాల చికిత్సలను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగిస్తూ 2012లో నిర్ణయం తీసుకుంది. ఈ చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. దీంతో అవసరమైన వారికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఈ 133 చికిత్సలు నిర్వహణతో ఆరోగ్యశ్రీ నిధులు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతం అవుతున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోంది. మళ్లీ అదే తీరు... ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం తమకు రద్దు చేసిన 133 రకాల చికిత్సలను ఎలాగైనా పొందేందుకు ప్రైవేటు ఆస్పత్రులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు చికిత్సల నిర్వహణ బోధించాలనే కారణంతో ప్రైవేటు వైద్య కాలేజీలకు రద్దు చేసిన 133 చికిత్సలను తిరిగి వర్తింపజేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్టును కోరాయి. ఐదేళ్లుగా అవసరంలేదని భావించిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు కూడా ఇందుకు అంగీకరించారు. అనంతరం ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వం దీనికి అనుమతిస్తే ప్రస్తుతం 133 చికిత్సలను నిర్వహిస్తూ ఆరోగ్యశ్రీ నుంచి నిధులు పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రులకు పోటీగా ప్రైవేటు వైద్య కాలేజీలూ ఆ చికిత్సలను అందిస్తాయి. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు తగ్గి ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రభావం పడనుంది. -
మరో ఉద్దానం.. చింతలూరు!
రాయికల్: ఇవి జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామస్తులు పరిస్థితి ఉదాహరణలు మాత్రమే. పేరులో ‘చింత’మాదిరిగానే ఆ ఊరిలోని ప్రతి ఇంటా రోగాలు ‘చింత’పెడుతున్నాయి. పరిస్థితి విషమిస్తే మరో ‘ఉద్దానం’అవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలో 280 మంది కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. మరో 40మంది టీబీ, 20 మందికిపైగా మంది ఎముకల బలహీనత వ్యాధులతో నరకయాతన అనుభవిస్తున్నారు. చాలామంది వృద్ధులు ఎముకల బలహీనతతో మంచానపడ్డారు. యువకుల్లో సైతం శరీరంలో ఎముకల అరిగిపోవడం శాపంగా మారింది. వెయ్యి మంది జనాభా.. 280 ఇళ్లు ఉన్న ఈ పల్లెలో ఇంటికొకరి చొప్పున కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. మట్లగాజం నాగయ్య, ఎండ్లగట్ట పోచయ్య టీబీ వ్యాధితో మృతిచెందారు. వైద్య చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఎందరో మంచానికే పరిమితమయ్యారు. నీటిలో క్యాల్షియం ఎక్కువ.. గ్రామస్తులు తాగే నీటిలో కాల్షియం అధికంగా ఉండటం వల్లే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉండటంతోపాటు తగిన మోతా దులో నీరు తాగకపోవడంతో ఈ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు సైతం సరిగా వైద్యం అందించకపోవడంతో ఒకరినుంచి మరొకరికి సోకి మృతి చెందుతున్నారని గ్రామంలో ఆందోళన నెలకొంది. చలనం లేని వైద్యారోగ్యశాఖ.. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని పట్టిపీడిస్తున్నా ఈ వ్యాధుల గురించి వైద్యాధికారులకు తెలియకపో వడం గమనార్హం. వ్యాధుల విజృంభణకు కారణం తెలుసుకోవడంలో విఫలమయ్యారు. వెలుగు చూసిందిలా.. ఒడ్డెర కాలనీకి చెందిన వారు అనారోగ్యం బారిన పడటమే కాకుండా, రెండేళ్లలో ఏడు గురు చనిపోయారు. అయితే, అనారోగ్యాలకు.. చావులకు మంత్రాలే కారణమని కాలనీవాసులు నమ్మారు. ‘సాక్షి’గ్రామస్తులతో మాట్లాడగా కిడ్నీ వ్యాధి వెలుగులోకి వచ్చింది. జిల్లా వైద్యాధికారిణి సుగంధిని వివరణ కోరగా మంచినీళ్లు తాగక పోవడం, ఆహారం లోపంతో ఇలాంటి సంభవిస్తాయని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఎక్కువ గ్రామంలో కిడ్నీలో రాళ్లవంటి వ్యా« దులతో చాలా మంది బాధపడుతున్నాం. అసలు ఈ వ్యా« ది ఎలా వస్తుందో అర్థమయితలేదు. గతంలో ఆపరేషన్కు నాకు రూ. 40 వేలు ఖర్చు అయ్యాయి. వైద్యంకోసం భూమి అమ్ముకున్న. టీబీ, ఎముకల అరుగుదల వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. –సబ్బినేని రాజం, గ్రామస్తుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా గ్రామంలో చాలా మంది కిడ్నీలో రాళ్లవంటి వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ చేసుకుంటున్నా నొప్పి పదేపదే రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మా సమస్య ఎవరు పట్టించుకోవడంలేదు. –అనుపురం శ్రీనివాస్గౌడ్ -
ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరిగింది
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ కిట్స్ పథకం ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజలకు ఎంతో నమ్మకం ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. దాంతోపాటే ప్రభుత్వ వైద్యులపై గౌరవం పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వైద్య, ఆరోగ్య శాఖ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైద్య శాఖకు ప్రభుత్వం అవసరమైన చేయూత అందిస్తుందని ప్రకటించారు. రాబోయే కాలంలో తెలంగాణలో ప్రజా వైద్యం ఎలా ఉండాలనే విషయంలో అధికారులు హెల్త్ మ్యాప్ రూపొందించాలని కోరారు. కేసీఆర్ కిట్స్ పథకం వల్ల పెరిగిన పనిభారాన్ని ఎంతో ఓపికతో, చిత్తశుద్ధితో మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై ఆయన సంతకం చేశారు. శనివారం ప్రగతి భవన్లో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘కేసీఆర్ కిట్స్ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిభారం పెరిగింది. పీహెచ్సీ నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు ప్రతీ చోటా గర్భిణుల సంఖ్య పెరుగుతున్నది. అధిక సంఖ్యలో గర్భిణులు వస్తున్నా సరే, పేదలకు వైద్య సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. చాలా మంది ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. వారి సేవలు శ్లాఘనీయం. ప్రజలు వైద్యుల సేవలను కొనియాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు మారింది. వైద్యులకు, సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి’’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనవసర ఆపరేషన్ల గండం తప్పింది.. ‘‘కేసీఆర్ కిట్స్ బహుళ ప్రయోజనాలు అందిస్తున్నాయి. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులకే రావ డం వల్ల అనవసర ఆపరేషన్ల గండం నుంచి బయటపడుతున్నారు. క్రమం తప్పకుండా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవడంవల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఫలితంగా ఆరోగ్యవంతమైన మరో తరం వస్తున్నది. పేదలకు ప్రసూతి సందర్భంగా అయ్యే ఖర్చు తప్పడమే కాకుండా, తిరిగి ప్రభుత్వమే రూ.15వేల దాకా ప్రోత్సాహకం అందిస్తున్నది. పేదలు ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. గర్భిణుల రద్దీకి తగినట్లుగా వసతులు కూడా పెంచాలి. అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించుకోవాలి. వైద్య, ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలి’’అని సీఎం సూచించారు. వైద్య శాఖ చర్యలతో రోగాలు తగ్గాయి.. ‘‘ఆదిలాబాద్తో పాటు ఇతర ఏజెన్సీలలో ప్రతీ ఏడాది వర్షాకాలంలో అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలి అనేక మంది చనిపోయేవారు. కానీ ఈసారి వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన కార్యక్రమాల వల్ల అంటు వ్యాధులు, జ్వరాలు బాగా తగ్గాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు వచ్చినా తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉంది. ఇది వైద్యుల పనితీరుకు నిదర్శనం’’అని సీఎం ప్రశంసించారు. ఈ సమీక్షలో మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ తివారీ, కమిషనర్ వాకాటి కరుణ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ లలితకుమారి, మెడికల్ సర్వీసెస్ ఎండీ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో సీఎం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు... ♦ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏండ్లకు పెంచే అవకాశాలు పరిశీలించాలి. ♦ ఆదిలాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేటతో పాటు కొత్తగా ఏర్పడే నల్లగొండ, సూర్యాపేటలోని సెమీ అటానమస్ హోదా కలిగిన మెడికల్ కాలేజీల్లో బోధన డాక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ♦ నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో మెడికల్ కాలేజీల స్థాపనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో వసతులు కల్పించాలి. ♦ అర్హులైన వైద్యులకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంట వెంటనే పదోన్నతులు కల్పించాలి. ♦ ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వైద్యులు స్థానికంగానే ఉండాలనే నిబంధనను సడలించాలి. వారు సమీప పట్టణాల్లో ఉండేందుకు అనుమతించాలి. ♦ శిథిలమైన ఆసుపత్రి భవనాల స్థానంలో దశల వారీగా కొత్త భవనాలు నిర్మించాలి. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలి. ♦ ఆసుపత్రి భవనంతో పాటు డాక్టర్లు, సిబ్బంది నివాసం ఉండటానికి క్వార్టర్లు కూడా నిర్మించాలి. ♦ పెద్దాసుపత్రుల వద్ద రోగుల బంధువుల కోసం షెల్టర్లు నిర్మించాలి. వాటిలో కనీస వసతులు కల్పించాలి. ♦ నిమ్స్ తరహాలో హైదరాబాద్ ఓఆర్ఆర్ వెంట మరో రెండు పెద్దాసుపత్రులు నిర్మించాలి. వరంగల్ దారిలోని బీబీనగర్లో ఎయిమ్స్ వస్తున్నందున, అటువైపు కాకుండా మిగతా రెండు ప్రాంతాల్లో వీటి కోసం స్థలం సేకరించాలి. ♦ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య, ఆరోగ్య పథకాలను అధ్యయనం చేసి, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. -
ప్రాణాలు పోతున్నా పట్టదా?
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను నిలబెట్టాల్సిన ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి. చికిత్స చేయా ల్సిన ప్రదేశాలే.. తగిన భద్రతా ప్రమాణాలు పాటించక తుదిశ్వాసకు కేంద్రాలుగా మారు తున్నాయి. ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల కాసుల కక్కుర్తి కూడా ఈ దుస్థితికి కారణామని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్లోని రోహిణి ఆస్పత్రి ఘటనతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీస స్పందనా లేదేం? రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వపరంగా పర్యవేక్షణ కనిపించడం లేదు. వైద్యారోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. రోహిణి ఆస్పత్రి ప్రమాదంలో ఇద్దరు చనిపోయినా వైద్యారోగ్య శాఖలో ఏ మాత్రం కదలిక కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు రోహిణి ఆస్పత్రి ప్రమాదం నేపథ్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు ఎలా ంటి చర్యలు తీసుకోబో తున్నారనేది ఆ శాఖలో ఉత్కంఠ కలిగించింది. కానీ ఉన్నతాధి కారులు మాత్రం ఏమీ జరగనట్లు గానే వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై జిల్లా అధికారుల ను ంచి కనీసం ఆరా కూడా తీయలేదని తెలిసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఉన్న రోహిణిలో ప్రమాదానికి కారణాలు ఏమిటనే దానిపై తమకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వరంగల్ అర్బన్ జిల్లా వైద్యాధికారులే చెబుతున్నారు. అయితే ఘటనకు కారణాలను తెలుసుకుని విశ్లేషించే వరకు ఆస్పత్రిలో వైద్యసేవలను ప్రారంభించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అధికారుల ‘భాగస్వామ్యం’తోనే.. రోహిణి ఆస్పత్రి దుర్ఘటనపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. రోహిణి ఆస్పత్రి యాజమాన్యంలో ఓ ఉన్నతాధికారికి భాగస్వామ్యం ఉండడమే చర్యలపై వెనుకంజకు కారణమని తెలుస్తోంది. గతేడాది నవంబర్లో జరిగిన రోహిణి ఆస్పత్రి సిల్వర్జూబ్లీ ఉత్సవాలకు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూడా. దీంతో అధికారులు ఆస్పత్రిపై చర్యల విషయంలో వెనుకంజ వేస్తున్నా రనే చర్చ జరుగుతోంది. అసలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు భాగస్వాములుగా ఉండడమే రక్షణ చర్యల విషయంలో లోపాలకు కారణామని వైద్య వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అనుమతులు అక్కర్లేదా..? రాష్ట్రంలో అన్ని రకాల ప్రైవేట్ ఆస్పత్రులు కలిపి 6,964 వరకు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆస్పత్రులు 537 ఉన్నాయి. ఇలాంటివాటిలో చాలా ఆస్పత్రులు వైద్య శాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యుల భాగస్వామ్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణకు ప్రధానంగా 15 శాఖల అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ వైద్యశాఖ అధికారుల ‘చల్లని చూపు’ కారణంగా చాలా వరకు అనుమతులు లేకుండానే ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. ఈ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణంగా మారుతోంది. ‘‘వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు భాగస్వాములుగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు అనుమతుల విషయంలో నిబంధనలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా వెంటనే అనుమతులు ఇస్తున్నారు. ఇదే రోగుల భద్రతకు ఇబ్బందిగా మారుతోంది..’’ అని వైద్యారోగ్య శాఖ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. -
టైమ్కు రావాలి.. తెల్లకోటు ధరించాలి
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సహాయ సిబ్బంది కచ్చితంగా యూనిఫామ్ ధరించాల్సిం దేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ సమయాల్లో కచ్చితంగా ఆస్పత్రిలో ఉండాలని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ఆస్పత్రులను సందర్శించిన సందర్భాల్లో.. ఎక్కువ మంది వైద్యులు, పారామెడికల్, సహాయ సిబ్బంది యూనిఫామ్ లేకుండా వస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, సహాయ సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. సమయానికి వచ్చి చివరి పేషెం టును పరిశీలించే వరకు వెళ్లొద్దని పేర్కొన్నారు. వైద్యులు తెల్లకోటు (ఆప్రాన్) ధరించాలని, పారామెడికల్ సిబ్బంది వారి యూనిఫాం వేసుకోవాలని స్పష్టం చేశారు. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు సైతం యూనిఫాం విషయంలో నిబంధన లు పాటించాలని సూచించారు. పారిశుధ్య పనులు నిర్వహించే సిబ్బంది సైతం యూనిఫాం ధరించాలని ఆదేశించారు. ఈ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘కేసీఆర్ కిట్’ సిబ్బందికి జీతాల్లేవ్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ కిట్’ పథకం విజయవంతంగా నడుస్తున్నప్పటికీ ఇలాంటి కీలకమైన పథకం అమలు కోసం పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి మాత్రం వేతనాలు రావడం లేదు. కేసీఆర్ కిట్ ఉత్తమ పరిపాలన కేటగిరీలో అందించే అవార్డుకు సైతం ఎంపికైంది. కేసీఆర్ కిట్ అమలు బాధ్యతను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టింది. వైద్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పథకం అమలు కోసం ప్రత్యేక అధికారిని, రాష్ట్ర కార్యాలయంలో మరో ఐదుగురు, ప్రతి జిల్లాలో ఒకరు చొ ప్పున సిబ్బందిని నియమించారు. ఈ పథ కం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అధి కారి సహా మిగిలిన వారికి వేతనాలు అంద డంలేదు. ఎవరికి ఎంత వేతనం అనేది ఇప్పటికీ ఖరారు కాలేదని తెలుస్తోంది. -
77 లక్షల మందికి ఎంఆర్ టీకా
సాక్షి, హైదరాబాద్: తట్టు(మీజిల్స్), రుబెల్లా వ్యాధుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఎంఆర్ టీకా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 86 శాతం మంది పిల్లలకు టీకాలు వేశారు. ఎంఆర్ టీకా కార్యక్రమం ఆగస్టు 17న మొదలైంది. తొమ్మిది నెలలు నిండిన, 15 ఏళ్లలోపు ఉన్న పిల్లలందరికీ ఈ టీకాలు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 90,01,117 మంది టీకా వేయాల్సిన పిల్లలు ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. సెప్టెంబర్ 12 వరకు రాష్ట్రంలోని 77,21,477 మంది పిల్లలకు టీకాలు వేయడం పూర్తయింది. ఈ నెల 25 వరకు ఎంఆర్ టీకా వేసే కార్యక్రమం అమలు కానుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంఆర్ టీకా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరితో గ్రేటర్ హైదరాబాద్లో తొలుత ఈ కార్యక్రమం సక్రమంగా సాగలేదు. అనంతరం వైద్య శాఖ చేపట్టిన చర్యలతో పురోగతి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో 72 శాతం మంది పిల్లలకు ఎంఆర్ టీకా వేసినట్లు ఆరోగ్య శాఖ తాజా నివేదిక పేర్కొంది. ఎంఆర్ టీకా అమలులో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. -
చల్లని చూపు... 2019లోపు
రాష్ట్రంలో కంటి వ్యాధుల నివారణకు వైద్య శాఖ ప్రణాళిక - వ్యక్తుల వారీగా వివరాల సేకరణ - మొదటి దశలో 10 జిల్లాల్లో అమలు - 550 గ్రామాల్లో వివరాల సేకరణ - మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి సాక్షి, హైదరాబాద్: కంటి చూపు సమస్యల నివారణపై కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2019లోపు రాష్ట్రంలో కంటి చూపు సమస్య ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. ‘అంధత్వ రహిత తెలంగాణ (అవైడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ)’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కంటి వైద్యంలో ప్రఖ్యాతి పొందిన... స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంటి చూపు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. ఏటా కంటి చూపు సమస్యలకు గురవుతున్న వారిలో 60 శాతం మంది 12 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. భవిష్యత్తుతరం జీవనానికి ప్రమాదకరంగా మారుతున్న కంటి చూపు సమస్యల నివారణపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. కార్నియా సమస్యలతో ఇబ్బందిపడే వారిని గుర్తించి చికిత్స చేయించేలా కార్నియా అంధత్వ్ ముక్తి భారత్ అభియాన్(కాంబా) కార్యక్రమాన్ని చేపట్టింది. మన రాష్ట్రంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ విషయంలో మరింత విస్తృతంగా ఆలోచించింది. కార్నియా సమస్యతోనే కాకుండా... రెటీనా, గ్లుకోమా, మధుమేహం.. ఇతర సమస్యలతోనూ కంటిచూపు కోల్పోతున్న వారికి వైద్యపరంగా అండగా ఉండాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని ప్రతి వ్యక్తి కంటి చూపు సమస్యలను తెలుసుకునేలా ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో 10 జిల్లాలను ఎంపిక చేసింది. ఈ జిల్లాల్లోని 550 గ్రామాల్లో వ్యక్తుల వారీగా కంటి చూపు సమస్యలను తెలుసుకుంటారు. వారికి అవసరమైన వైద్య సేవలను వెంటనే అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుంది. స్థానిక ఆస్పత్రులలో చికిత్స చేయించడం నుంచి ఇది మొదలవుతుంది. సమస్య తీవ్రత ఆధారంగా... ఆయా వ్యక్తులకు జిల్లా స్థాయి ఆస్పత్రులలో, హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్, ఆనంద్, పుష్యగిరి, శరత్ ఆస్పత్రులలో చికిత్స చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల వైద్య చికిత్స పథకాలను వీరికి వర్తింపజేయనున్నారు. ఇదే తరహాలో 2018లో మరో 10 జిల్లాల్లో, 2019లో మిగతా 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దానంతోనే చూపు... ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరు వ్యక్తులకు చూపు వస్తుంది. ఏ వయస్సు వారైనా నేత్రదానం చేయవచ్చు. వ్యక్తి చనిపోయిన ఆరు గంటలలోపు కార్నియా సేకరించాలి. శిక్షణ పొందిన వైద్యుడు మాత్రమే కార్నియా సేకరించి తిరిగి అమరుస్తాడు. నేత్ర బ్యాంకు బృందం... మరణించిన వ్యక్తి ఇంటి వద్ద, ఆస్పత్రిలో, మార్చురీ వద్ద, స్మశాన స్థలాల్లోనూ కార్నియాను సేకరిస్తుంది. గరిష్టంగా 15 నిమిషాలలో కార్నియా సేకరించే ప్రక్రియ ముగుస్తుంది. కార్నియా సేకరణతో వ్యక్తి రూపురేఖలు ఏమీ మారవు. కంటిపై పొరను మాత్రమే తొలగిస్తారు. చాలా మంది అపోహపడుతున్నట్లు పూర్తిగా కనుగుడ్డును తీయరు. దేశంలో కార్నియా అవసరమైన వారు 2 లక్షలు ఏటా కార్నియా సమస్యవల్ల అంధత్వానికి గురవుతున్న వారు 20 వేలు 45 ఏళ్లలోపు వారు 90శాతం వీరిలో 12 ఏళ్ల లోపు వారు 60 శాతం మొదటి విడతలో ఏబీఎఫ్టీ అమలు చేసే గ్రామాలు జిల్లాల వారీగా.. -
ఐదు నెలలుగా జీతాల్లేవు
307 మంది కాంట్రాక్టు వైద్యుల అవస్థలు సాక్షి, హైదరాబాద్: పేదలకు సేవచేసే కాంట్రాక్టు వైద్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారి సేవలను రెగ్యులర్ చేయడం ఎలా ఉన్నా.. కనీసం చేస్తున్న పనికి జీతం కూడా ఇవ్వట్లేదు. సర్వీస్ రెగ్యులర్ కావడంపై ఆందోళనతో ఉన్న కాంట్రాక్టు వైద్యులకు 5 నెలలుగా వేతనాలు రాకపోవడం మరింత ఇబ్బంది కలిగిస్తోంది. ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా 307 మంది వైద్యులు కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా పని చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం 2014 జూలై 1న జారీ చేసిన కాంట్రాక్టు ఉద్యోగుల మార్గదర్శ కాల ప్రకారం వీరు పని చేస్తున్నారు. ఏళ్లుగా కాంట్రాక్టు వైద్యులుగా పని చేస్తున్న వీరు సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అంశంపై చర్చ జరుగుతున్నా ఆచరణలోకి రావట్లేదు. కాంట్రాక్టు అసిస్టెంట్ సర్జన్ల సర్వీసును ప్రతి ఏటా కొనసాగిస్తేనే వీరికి వేతనాలు అందు తాయి. వీరి కాంట్రాక్టు సర్వీసును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పొడిగించడంలో వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 307 మంది కాంట్రాక్టు వైద్యులకు 2017 మొదటి నుంచి వేతనాలు అందట్లేదు. 307 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ల కాంట్రాక్టు సర్వీసును పొడిగిస్తూ జూలై 25న ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి 31 వరకు వీరి సర్వీసు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర్వులు విడుదలై 2 వారాలైనా ఇప్పటికీ వేతనాలు రాలేదు. వీరికి వేతనాలు చెల్లించక పోవడంతో గ్రామీణ పేదలకు అందే వైద్య సహాయంపై ప్రభావం పడుతోంది. -
అమ్మ ఇచ్చే అమృతం అందడం లేదు!
- జాతీయ సగటు 41.6 శాతం.. రాష్ట్రంలో 37 శాతమే - అవగాహనపై వైద్య శాఖ నిర్లక్ష్యం సాక్షి, హైదరాబాద్: భావితరాలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ సమాజమైనా ప్రగతివైపు అడుగులు వేస్తుంది. అయితే నవజాత శిశువుల ఆరోగ్యంలో కీలక పాత్ర అయిన తల్లిపాల విషయంలో మన రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ముఖ్యంగా పుట్టిన గంటలోగా శిశువులకు తల్లిపాలు అందించడం వల్ల రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నా, ఈ దిశగా ప్రయ త్నాలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నా మన దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో మాత్రం పురోగతి కనిపించడంలేదు. దేశంలో ఏటా 26 కోట్ల మంది పిల్లలు పుడుతుండగా సగటున ప్రతిరోజూ 70 వేల మందికిపైగా మహిళలు ప్రసవిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 41.6 శాతం మంది నవజాత శిశువులకు మాత్రమే పుట్టిన గంటలోగా తల్లిపాలు అందుతు న్నాయి. అలాగే 55 శాతం మంది శిశువులు మాత్రమే పుట్టిన ఆరు నెలలపాటు పూర్తి కాలం తల్లిపాలు తాగుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం 37.1 శాతం మంది పిల్లలకు మాత్రమే పుట్టిన గంటలోగా తల్లిపాలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన సర్వే కావడంతో మన రాష్ట్రంలో పాత జిల్లాల వారీగానే ఈ గణాంకాలు ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం నవజాత శిశువులకు పుట్టిన గంటలోగా తల్లిపాలు తాగించే విషయంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో తల్లిపాల పాత్ర ఎంతో కీలకమైనది. తల్లీపిల్లల ఆరోగ్యం, పోషణ, విద్య, ఆర్థిక ప్రగతి, వ్యాధుల నివారణలో తల్లిపాల సంస్కృతి పాత్ర ముఖ్యమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తేల్చింది. శిశువులకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలు అందించడంతోపాటు అదనపు ఆహారం ప్రారంభిం చిన తర్వాత నుంచి రెండు ఏళ్ల వరకు వీలైతే మరికొంత కాలం తల్లిపాలు కొనసాగించడం వల్ల ఆర్యోకరమైన భావితరం తయారవుతుందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. 1989 నుంచి తల్లిపాల సంస్కృతిని పెంచే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలని డబ్ల్యూహెచ్వో నిర్ణయించింది. దేశం లోనూ ఏటా ఈ వారోత్సవాలు నిర్వ హిస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని మరిచిపోయింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా మాతాశిశు సంరక్షణకు ఏటా కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ మాతాశిశు రక్షణలో కీలకమైన తల్లి పాల వారోత్సవాలను మాత్రం పట్టించుకోవడంలేదు. -
'కుని'కిపాట్లు..!
కుటుంబ నియంత్రణ పట్టని వైద్య, ఆరోగ్య శాఖ.. మూడేళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న పురుషులకు ఇస్తున్న ప్రోత్సాహకం రూ. 1,500 స్త్రీలకు ఇస్తున్న ప్రోత్సాహకం రూ. 1,000 సాక్షి, హైదరాబాద్: దేశానికి అతి పెద్ద సవాలు.. జనాభా పెరుగుదల. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ (కు.ని.)కోసం పలు చర్యలు చేపట్టారు. అవగాహన, ప్రోత్సాహకాలతో పాటు దీని పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించారు. అయితే ఇప్పుడు ఈ శాఖ పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. గత మూడేళ్లుగా దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. గతంలో ఏటా జిల్లాలవారీగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ప్రణాళిక సిద్ధం చేసి.. ఆయా జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించేది. ప్రస్తుతం లక్ష్యాలను సైతం నిర్దేశించే పరిస్థితి లేకుండాపోయింది. ఎవరైనా సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను చేయించడమేగానీ.. శాఖాపరంగా పర్యవేక్షణ ఉండటంలేదు. దీంతో మూడేళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఏడు జిల్లాల్లోనే.. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తోంది. కుటుంబ నియంత్రణ చేయించుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. మిగిలిన నిధులతో పోల్చితే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాల నిధులను ముందుగానే విడుదల చేస్తోంది. గత ఏడాది వరకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న పురుషులకు, వైద్య సిబ్బందికి కలిపి రూ.1,500, అదే మహిళ అయితే ఆమెకు సిబ్బంది కలిపి అయితే రూ.వెయ్యి ఇచ్చేవారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని శస్త్రచికిత్స చేయించుకున్న వారికే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయినా రాష్ట్రంలో శస్త్రచికిత్సలు బాగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, వికారాబాద్, యాదాద్రి భువనగరి జిల్లాల్లోనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లు వైద్య శాఖ తాజా నివేదికలో పేర్కొన్నాయి. పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో మాత్రమే పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నమోదయ్యాయి. ఈ ఏడాది 112 మంది పురుషులు మాత్రమే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారని నివేదికలో వెల్లడైంది. -
వైద్య శాఖలో 251 పోస్టులు మంజూరు
సాక్షి, హైదరాబాద్: ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ– ప్రాంతీయ కేంద్రం (ఎంఎన్జేఐవో–ఆర్సీసీ) కోసం 251 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనల మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రికి కొత్త రూపు తెచ్చేలా ఈ పోస్టులను మంజూరు చేసింది. అలాగే ఆ ఆస్పత్రిలో నిర్వహణ సేవల కోసం 9 ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకానికి అనుమతిచ్చింది. పోస్టుల వివరాలు..: ప్రొఫెసర్ 5, అసోసియేట్ ప్రొఫెసర్ 13, అసిస్టెంట్ ప్రొఫెసర్ 20, సీనియర్ రెసిడెంట్ 23, బ్లడ్బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ 1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1, మెడికల్ ఫిసిషిస్ట్ 6, నర్సింగ్ సూపరింటెండెంట్ 1, బయో మెడికల్ ఇంజనీర్ 1, ఆఫీస్ సూపరింటెండెంట్ 2, సీనియర్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 4, చీఫ్ రేడియోగ్రాఫర్ 2, రేడియోగ్రాఫర్ 10, ఫార్మసిస్ట్ 2, సోషల్ వర్కర్ 6, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–1) 5, ల్యాబ్ టెక్నీషియన్(గ్రేడ్ 2) 8, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, బ్లడ్ బ్యాంక్ సూపర్వైజర్ 2, ల్యాబ్ అటెండెంట్ 10, ల్యాబ్ అసిస్టెంట్ 16, మౌల్డ్ టెక్నీషియన్ (సీనియర్) 2, ఈసీజీ టెక్నీషియన్ 2, హెల్త్ సబ్ఇన్స్పెక్టర్ 1, మెడికల్ రికార్డర్ (టెక్నాలజీ) 3, థియేటర్ అసిస్టెంట్ 10, హెడ్ నర్స్ 6, స్టాఫ్ నర్స్ 85. -
ఖాళీగా కాళోజీ వర్సిటీ
మొదలుకాని పూర్తిస్థాయి పాలన - ఖాళీలను భర్తీ చేయని యంత్రాంగం - 82 పోస్టులు మంజూరు.. - ఖాళీగా 61 పోస్టులు - పట్టించుకోని వైద్య ఆరోగ్య మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఏర్పాటైన కాళోజీ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా వర్సిటీలో పూర్తిస్థాయి పరిపాలన సాగట్లేదు. గతంలో రాష్ట్రంలోని సగం సీట్లనే వర్సిటీ భర్తీ చేసేది. గతంతో పోల్చితే వర్సిటీపై పనిభారం పెరుగుతోంది. నీట్ పరీక్ష నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లోని సీట్లన్నింటినీ కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలోనే భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులతో ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ నిర్వహణకు అవసరమైన పోస్టులను ప్రభు త్వం మంజూరు చేసినా.. భర్తీ చేయడంపై దృష్టి పెట్టట్లేదు. వర్సిటీ ఉన్నతాధికారులు సైతం పోస్టుల భర్తీ విషయాన్ని పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణలో కీలకమైన వర్సిటీపై ఆ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సమీక్షించ కపోవడం వల్లే పోస్టుల భర్తీ ప్రక్రియను ఎవరూ పట్టించు కోవట్లేదనే అభిప్రాయముం ది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వైద్య విద్య నిర్వహణ చూసేది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో 2014 సెప్టెంబర్ 26న కాళోజీ ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక వైస్ చాన్సలర్ను, రిజిస్ట్రార్ నియమించింది. వర్సిటీ నిర్వహణకు అవసరమై 82 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 22 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ గతేడాది జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమ తిచ్చి ఏడాదిన్నర గడిచినా వర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవట్లేదు. వైద్య శాఖలో, ఇతర వర్సిటీల్లో పని చేస్తున్న 21 మందిని డిప్యూటేషన్ పద్ధతిలో నియమిం చారు. దీంతో 61 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మిగతా ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఇటీవలే రెండు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఒకే ఏజెన్సీకి ఈ కాంట్రాక్టు అప్పగించాల్సి ఉండగా.. మంత్రి పేషీలోని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి మేరకు 2 సంస్థలకు అప్పగించినట్లు తెలి సింది. ప్రస్తుత ఏడాది వైద్య విద్య కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయ్యేలోపు ఈ ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. -
2,118 పోస్టుల భర్తీకి గ్రహణం!
వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంపై ఆరోపణలు - గత ఏడాది జూలైలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి - ఇప్పటికీ పూర్తి ఇండెంట్లు ఇవ్వని వైద్య ఆరోగ్య శాఖ - టీఎస్పీఎస్సీ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోని అధికారులు - వైద్య ఆరోగ్యశాఖ తీరుపై చీఫ్ సెక్రటరీకి టీఎస్పీఎస్సీ నివేదిక! సాక్షి, హైదరాబాద్: అధికారుల అలసత్వం నిరుద్యోగులపాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 2,118 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసి ఏడాది కావ స్తోంది. అయితే ఇంతవరకు పోస్టుల వారీగా సమ గ్రంగా ఇండెంట్లు, రోస్టర్ పాయింట్లు ఇవ్వడంలో వైద్య ఆరోగ్య శాఖ అలసత్వం కారణంగా అవి భర్తీకాకుండా ఉండిపోయాయి. రూల్ ఆఫ్ రిజ ర్వేషన్, రోస్టర్ పాయింట్లు ఇస్తే తప్ప నోటిఫికే షన్లను జారీ చేసే అవకాశం లేదు. టీఎస్పీఎస్సీ ఎన్ని సార్లు వైద్య ఆరోగ్య శాఖను అడిగినా ఇండెంట్లు ఇవ్వక పోవడంతో వాటి భర్తీ ముం దుకు సాగడం లేదు. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ జాప్యం చేస్తోందంటూ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రచారంపై టీఎస్పీఎస్సీ స్పందించింది. పోస్టుల భర్తీ ఎందుకు ఆలస్యం అవుతోందన్న అంశంపై జూన్ 29న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ సమగ్ర నివేదికను అందజేసినట్లు తెలిసింది. గత ఏడాది ఉత్తర్వులు జారీ అయినా.. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 2,118 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గతేడాది జూలై 13న ఉత్తర్వులు (జీవో 89) జారీ చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేయాలని అందులో స్పష్టం చేశారు. ఆయా పోస్టులకు సంబంధిం చిన లోకల్ కేడర్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వివరాలు, అర్హతలతో కూడిన ఇండెంట్లు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. అయితే వాటిని ఇంతవరకు వైద్య ఆరోగ్యశాఖ సమగ్రంగా ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న 2,118 పోస్టుల్లో నుంచి 228 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 7 డెంటల్ సర్జన్ పోస్టు లను తొలగిస్తున్నట్లు పేర్కొం ది. కానీ ఈ విషయాన్ని అధికా రికంగా చెప్పడం లేదు. ఆ పోస్టులకు రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివరాలను ఇవ్వకుండా, కావాలనే వాటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం లేకుండా చేస్తోందనే ఆరోపణలు ఉన్నా యి. ఇదిలా ఉండగా ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారి కోసమే నోటిఫికేషన్ను ఆపు తోందన్న వాదనలూ ఉన్నా యి. అయితే వారికి 30 శాతం వెయిటేజీ ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ సిద్ధమైనా, అసలు రాత పరీక్ష లేకుండా వారికి ఆ పోస్టులను ఇవ్వాలన్న తలంపుతో జాప్యం చేస్తోందన్న ఆరోప ణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 1,844కు పైగా పారామెడికల్ పోస్టులు ఖాళీ... రాష్ట్ర వ్యాప్తంగా 1,844 పైగా పారా మెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులు 2, రేడియోగ్రాఫర్స్ 35, స్టాఫ్ నర్సు పోస్టులు 1,200, ల్యాబ్æ టెక్నీషియన్ పోస్టులు 200, ఫార్మసిస్టు పోస్టులు 238, ఏఎన్ఎంలు 150, ఫిజియోథెరపిస్టు 6, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 6 వరకు ఉన్నాయి. పోస్టుల భర్తీలో ఆలస్యంపై సీఎం ఆగ్రహం.. వైద్య పోస్టుల భర్తీ వ్యవహారంలో జరుగుతున్న జాప్యం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాదాపు ఏడాది కిందట భర్తీకి ఉత్తర్వులు ఇస్తే ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. నోటిఫికేషన్ల జారీలో ఆలస్యానికి గల కారణాలను టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని సీఎం అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ గత నెల 29వ తేదీన ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు అందజేసినట్లు తెలిసింది. వివాదం లేని పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు! ఎలాంటి వివాదంలేని 274 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు ఇటీవల అందాయని సీఎస్కు అందజేసిన నివేదికలో వాణిప్రసాద్ పేర్కొన్నట్లు తెలిసింది. వాటితోపాటు మరో 215 పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు, వివరణలు వచ్చాయని, వాటికి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.