కర‍్నూలులో స్వైన్‌ప్లూ కలకలం | three swine flu cases filed in kurnool | Sakshi

కర‍్నూలులో స్వైన్‌ప్లూ కలకలం

Published Thu, Jan 26 2017 9:47 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

కర‍్నూలులో స్వైన్‌ప్లూ కలకలం - Sakshi

కర‍్నూలులో స్వైన్‌ప్లూ కలకలం

కర్నూలు నగరంలో ముగ్గురు రోగులకు స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో ఆందోళన నెలకొంది.

కర్నూలు : కర్నూలు నగరంలో స్వైన్‌ప్లూ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వాస్పత్రిలో ఏఎంసీ విభాగంలో ఇద్దరు రోగులకు స్వైన్‌ప్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

వీరితో పాటు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రకాష్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో అక్కడి వైద్యులు స్వాప్‌ ద్వారా పరీక్షకు పంపించారు. ఒకే రోజు నగరంలో ముగ్గురు రోగులకు స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement