తెలంగాణ వైద్య ఆరోగ్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జూపల్లి రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జూపల్లి రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన కార్యదర్శిగా కలిముద్దీన్ అహ్మద్ ఎన్నికయ్యారు. వీరు మూడేళ్లపాటు పదవుల్లో ఉంటారని పేర్కొన్నారు.