ఆకలితో మహిళ మృతి | woman dies of hungry | Sakshi
Sakshi News home page

ఆకలితో మహిళ మృతి

Apr 5 2015 11:02 AM | Updated on Sep 2 2017 11:54 PM

ఆకలిబాధ తట్టుకోలేక ఓ మహిళ ఆదివారం ప్రాణం విడిచింది.

కృష్ణా: ఆకలిబాధ తట్టుకోలేక ఓ మహిళ ఆదివారం ప్రాణం విడిచింది.  ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలం అకపాలెం గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన మీనుగు రుక్మిణమ్మ(50) వితంతువు. భర్త చనిపోవటంతో ఒంటరిగా ఉంటోంది. ఆమెను పిల్లలు వదిలేశారు.  "నా" అన్నవారు ఎవరూ చూడకపోయినా వితంతువు ఫించన్తోనే జీవనం సాగిస్తోంది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక జన్మభూమి కమిటీ వారు 4 నెలల క్రితం రుక్మిణమ్మకు ఫించన్ తొలగించారు. దీంతో ఆ ఇంటా ఈ ఇంటా అడుక్కుని కాలం గడుపుతోంది. ఇలాంటి దుర్భర జీవితం గడుపుగున్న రుక్మిణమ్మకు ఆదివారం ఆకలిబాధ ఎక్కువై మంచం మీదే తుదిశ్వాస విడిచింది.(తిరువూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement