ఒంగోలు సృష్టి ఆర్ట్స్ అకాడమీ చిత్రలేఖనంలో ప్రపంచ రికార్డు కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఒంగోలు: ఒంగోలు సృష్టి ఆర్ట్స్ అకాడమీ చిత్రలేఖనంలో ప్రపంచ రికార్డు కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక హైదరీ క్లబ్ వేదికగా 100 మంది కళాకారులతో 100 గంటలు నిర్విరామంగా చేసేందుకు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా సందర్శకులు తరలి వస్తున్నారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం ముగిస్తుందని నిర్వాహకులు తెలిపారు.