Painting Exhibition
-
ఆ చిత్రాలు జ్ఞాపకాల చీరలు..!
చిత్రకారులు కుంచెలతో చిత్రాలు గీస్తారు. సుచిత్రా మట్టాయ్ మాత్రం పాతకాలపు చీరలను ఉపయోగిస్తూ అందమైన చిత్రాలను రూపొందిస్తుంది. వాషింగ్టన్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఆర్ట్స్లో పాతకాలపు చీరల నుంచి అల్లిన ప్రకృతి దృశ్యం ‘త్రూ ది ఫారెస్ట్, అక్రాస్ ది సీ, బ్యాక్ హోమ్ ఎగైన్‘... వంటి చిత్రాలను ప్రదర్శించింది. ఎరుపు, గులాబీ, నారింజ, గోధుమ రంగులు.. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా రూపొందించింది.ఇండో–కరేబియన్ సంతతికి చెందిన ఆర్టిస్ట్ సుచిత్రకు తమ చీరలను పంపేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వారిలో విదేశాలలో నివసిస్తున్న ఇండియన్స్ కూడా ఉన్నారు. ఆమె తల్లి, సెకండ్హ్యాండ్ షాపుల నుండి చీరలను సేకరించి, లాస్ ఏంజిల్స్లో నివసిస్తున్న తన కుతురుకి పంపిస్తుంది. వాటిలో తమ స్నేహితులు, బంధువుల నుంచి సేకరించినవి కూడా ఉంటాయి. సుచిత్ర అభిమానులు కొందరు విలువైన, సున్నితమైన దారాలతో నేచిన వారి స్వంత వస్త్రాలను కూడా పంపుతారు. ‘సైలెంట్ రిట్రీట్‘ (2023) కోసం సుచిత్ర తన చీరలలో ఒకదానిని – క్లిష్టమైన నమూనాలతో, మిరుమిట్లు గొలిపే ఎంబ్రాయిడరీ టేప్స్ట్రీలో చేర్చింది.ఎంబ్రాయిడరీతో జత కలిపి51 ఏళ్ల సుచిత్రా మట్టాయ్ ఈ డిజైన్స్ రూపకల్పన గురించి మరింతగా వివరిస్తూ – ‘మా అమ్మ సుభద్ర మట్టాయ్ పూర్వీకులు ఒప్పంద కార్మికులుగా ఉత్తరప్రదేశ్ను విడిచిపెట్టి, దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న గయానాలో చెరకు తోటలలో పనిచేసేవారు. ఆ కుటుంబ కథలను పెయింటింగ్లో వచ్చేలా ఫ్యాబ్రిక్ పీసెస్ను కలిపి డిజైన్ చేశాను. ‘సైలెంట్ రిట్రీట్‘తోపాటు ఇతర చిత్రాలలో టేప్స్ట్రీలలోని బొమ్మలలో రంగు వేయడానికి ఎంబ్రాయిడరీ ఫ్లాస్ను ఉపయోగించాను. పోస్టోరల్ యూరోపియన్ దృశ్యాలను పరిచయం చేసే ఈ ప్రక్రియను ‘బ్రౌన్ రీక్రియెట్‘గా చూశాను’ అని తెలియజేస్తుంది.అలంకారిక అంశాలుజనవరి 12 వరకు ప్రదర్శించే ఈ కళారూపాలలో చరిత్రాకాంశాలను కూడా పరిచయం చేస్తుంది. దొరికిన వస్త్రాలు సుచిత్ర చిత్రాలకు పునాదిగా పనిచేస్తాయి. తరచుగా అవి భారీ–ఉత్పత్తి కిట్లు లేదా ఇతర వాణిజ్య నమూనాల ఆధారంగా సూది, దారాలతో అలంకారిక అంశాలను చేతితో జోడిస్తుంది. ‘టైమ్ ట్రావెలర్స్‘లో పూసల అంచు, బంగారు తాడు వంటి కొన్ని అలంకార అంశాలను జోడించింది. మట్టై చిత్రకారిణిగా శిక్షణ పొదింది. అమ్మ, అమ్మమ్మల కథలను అర్ధమయ్యే విధంగా తెలియజేయడానికి వస్త్రాల వైపు మొగ్గు చూపింది. యునైటెడ్ స్టేట్స్లో సుచిత్ర మొట్టమొదటి సోలో మ్యూజియం ప్రదర్శనలలో ‘మిత్ ఫ్రమ్ మేటర్‘ ఒకటి. (చదవండి: 'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..) -
Hyderabad: ముక్కువోని దీక్షతో..ముక్కే.. కుంచై..
⇒కొనతేలిన ముక్కునే కుంచెగా.. అబ్బురపరుస్తున్న చిత్రకారుడు⇒ఆకర్షించే వందలాది నాసిక చిత్రాలు..⇒అబ్దుల్కలాం ప్రశంసలు.. మరెన్నో అవార్డులు, బిరుదులు..⇒సత్యవోలు రాంబాబు అసాధారణ ప్రతిభ.. ఇప్పటి వరకూ పెన్సిల్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, నెయిల్ ఆర్ట్, బ్రష్ ఆర్ట్, నైఫ్ ఆర్ట్, ఆఖరికి కాళ్లతోనూ బొమ్మలు వేసేవాళ్లను.. ఇలా.. అనేక రకాల పెయింటింగ్స్ వినుంటాం... కానీ అతను ముక్కునే కుంచెగా ఎంచుకున్నాడు.. ముక్కుతో ఆర్ట్ ఎలా వేస్తారండీ బాబూ అనొచ్చు... అదే ఇందులో ఉన్న గొప్పతనం.. పూర్తిగా చూస్తూ వేస్తేనే చాలా కష్టమనిపించే ఆర్ట్ని ముక్కుతో వేయడమంటే.. ఎంతో టాలెంట్, కృషి, పట్టుదల ఉండాలి.. ఎందరో ప్రముఖుల చిత్రాలను సైతం తన ముక్కుతో గీసి వారికి అభిమానాన్ని చూరగొన్నాడు. అతడే నిజాంపేటకు చెందిన సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ సత్యవోలు రాంబాబు. తన చిత్రకళా ప్రస్థానంలో ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.. ఆయన గురించి మరిన్ని వివరాలు మీ కోసం... డాక్టరో..యాక్టరో..సాఫ్ట్వేరో..ఇలా తాము ఎంచుకున్న రంగాన్ని ఏలేసేయాలన్న కసితో నగరానికి వచ్చేవారెందరో..వారందరి లాగే ఓ యువకుడు చిత్ర కళను తన ఊపిరిగా చేసుకుని, భుజాన ఓ సంచి..అందులో కొన్ని ఖాళీ పేపర్లు.. నాలుగైదు పెన్సిళ్లు.. చాలన్నట్లు హైదరాబాద్లో అడుగుపెట్టాడు. చిత్రకళ కడుపు నింపుతుందా ‘భాయ్’.. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా.. అన్నవాళ్లు నోరెళ్లబెట్టేలా చేశాడు.. ఎంచుకున్న కళే జీవితంగా బతికాడు.. రాణించాడు.. మరెందరికో ఆదర్శంగా నిలిచాడు.. అయితే అందరిలా గుర్తింపు తెచ్చుకుంటే మజా ఏంటి అనుకున్నాడో ఏమో.. కొనదేలిన నాసికాన్నే తన కుంచెగా ఎంచుకున్నాడు. క్షణాల్లో ఔరా.. అనే చిత్రాలను సాక్షాత్కరింపజేస్తున్నాడు.ముక్కుతో ఏడేళ్ల సాధన తన కెరీర్లో మామూలు చిత్రకారుడిగా మిగిలిపోకూడదని తన మస్తిష్కంలో మెదిలిన ఆలోచనే నాసికా చిత్రకారుడిగా మలిచింది. ఏడేళ్ల పాటు సాధన చేసి ముక్కును కుంచెగా చేసుకుని వందలాది బొమ్మలను గీసి ఎందరో మన్ననలను పొందారు. ముక్కుతో బొమ్మలు గీసే అరుదైన చిత్రకారుడంటూ అతని ప్రతిభను గుర్తించిన బీబీసీ వార్తా సంస్థ సైతం ప్రశంసించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజల సమక్షంలో నాసికా చిత్రాలు గీశారు. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ సమక్షంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్కలాం బొమ్మను చిత్రించి శభాష్ అనిపించుకున్నారు. అబ్దుల్కలాం సైతం అబ్బురపడి ప్రశంసిస్తూ రాంబాబుకు లేఖ రాశారు.లైవ్లోనూ మేటిగా.. ఒకవైపు నృత్య విన్యాసాలు.. వాటిని అనుకరిస్తూ మరోవైపు ముక్కుతో చిత్రాలు గీయడమంటే ఆషామాషీ కాదు. సంగీత, నృత్య, చిత్ర సంగమంగా గతంలో డిజైర్స్ పేరిట రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాంబాబు అసాధారణ ప్రతిభను కనబరిచారు. వేదికపై నృత్యకారిణులు లయబద్ధంగా నృత్యాలు చేస్తుంటే రాంబాబు నాట్యభంగిమలు, హావభావాలను, ముఖ కవళికలను చకచకా చిత్రించి ఔరా అనిపించారు. రెండు నిమిషాలకో చిత్రం చొప్పున కేవలం పది నిమిషాల్లో ఐదు నృత్య భంగిమలకు ప్రాణం పోసి చూపరులను ఆకట్టుకున్నారు.ఎన్నో అవార్డులు.. ప్రశంసలు..👉 ఏషియా వేదిక్ రీసెర్చ్ యూనివర్శిటీ నాసికా చిత్రలేఖనం, సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్.👉 మానవతా స్వచ్ఛంద సంస్థ అమలాపురం వారిచే చిత్రకళా రత్న అవార్డు.👉 లంక ఆర్ట్స్థియేటర్ వారిచే నాసిక చిత్రకళా రత్న.👉 యువ కళావాహిని వారిచే స్వామి వివేకానంద అఛీవ్మెంట్ అవార్డు.👉 లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిచే బెస్ట్ టీచర్ అవార్డు.👉 ఇన్నర్ వీల్ క్లబ్ వారిచే బెస్ట్ ఆరి్టస్ట్ అవార్డు. 👉 సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ వారిచే గురుబ్రహ్మ అవార్డు.👉 లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి బెస్ట్ సరీ్వసు అవార్డు.👉 సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ నుంచి బెస్ట్ హ్యూమానిటీ అవార్డు.👉 ఏపీ స్టేట్ కల్చరల్ సొసైటీ నుంచి స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు. 👉 కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ నుంచి కళాప్రతిభ అవార్డు. 👉 సుధా ఆర్ట్స్ అకాడమీ నుంచి కళానిధి అవార్డు. 👉 జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నుంచి కళాభిషేకం అవార్డు. 👉 మెగా రికార్డ్స్ సంస్థ నుంచి కళా ప్రతిభ మూర్తి, ఏఎన్ఆర్ అచీవ్మెంట్ అవార్డు. 👉 యశోద ఫౌండేషన్ నుంచి కళారత్న అవార్డు.విశ్వగురు అవార్డ్స్ను స్థాపించి..విభిన్న రంగాల్లో మేటిగా సేవలందించే వారిని గుర్తించి వారిలో నూతనోత్తేజాన్ని కలిగించాలన్న ఉద్దేశ్యంతో విశ్వగురు అవార్డ్స్ను నెలకొల్పి ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఏటేటా ఎంపిక చేసిన వారికి ఈ అవార్డులను అందించి సన్మానించడం ఆనవాయితీ. అలాగే నిజాంపేటలో సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ద్వారా చిత్రకళ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శిక్షణ అందిస్తున్నారు.రెండు దశాబ్దాల క్రితం..ఓ 20 ఏళ్ల క్రితం..అసలు చిత్రకళ అంటే అంతగా పట్టించుకోని రోజులు.. పశి్చమ గోదావరి జిల్లా వేగివాడకు చెందిన సత్యవోలు రాంబాబు పాఠశాల స్థాయిలో చిత్రకళపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. తన గురువు ఇజ్రాయిల్ ప్రేరణతో పాఠశాల స్థాయిలోనే లోయర్, హయ్యర్ పూర్తి చేశారు. 20 ఏళ్ల ప్రాయంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుని చిత్రకళపై తనకున్న అభీష్టాన్ని చాటిచెప్పాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. చదివింది ఇంటరీ్మడియెట్ అయినా కళలో తనకున్న ప్రావీణ్యాన్నే నమ్ముకుని హైదరాబాద్ వచ్చేశాడు. అడపాదడపా జరిగే పోటీల్లో పాల్గొనడం, అక్కడ ఇచ్చే పారితోíÙకంతో జీవితాన్ని నెట్టుకురావడం చేశాడు. ఇంటర్తో ఆగిపోయిన చదువును కొనగించాలని డిగ్రీలో చేరి మరోవైపు చిత్రకళను కొనసాగించారు. అలా తన ప్రస్థానం మొదలై ఎందరికో ఆ కళను పంచే స్థాయికి ఎదిగారు. -
ప్రఖ్యాత కళాకారులతో హైదరాబాద్లో తొలిసారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్
కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7నుం చి మూడు రోజుల పాటు జరగనుంది. ఇండియా ఆర్ట్ ఫెస్టిల్ను తొలిసారి హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నా యి. ఇప్పటివరకూ ప్రతి ఏటా ఢిల్లీ, బెంగళూరు , ముంబై తదితర నగరాల్లో ఈ ఫెస్టివల్ నిర్వహించగా ఇపుడు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొం టున్నా రు. జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుందని ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. విశేష చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్న హైదరాబాద్లో మొదటిసారి ఇం డియా ఆర్ట్ ఫెస్టివల్ ఏర్పా టు చేస్తున్నామని ఆయన తెలిపారు. అర్ట్ ఫెస్టివల్ విశేషాలు దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మందికళాకారులు , గ్యా లరీ ఎగ్జిబిట్ లు, ఇండిపెండెంట్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. జోగెన్ చౌదరి, మను పరేఖ్, కిషన్ ఖన్నా , శక్తి బర్మ న్, సీమా కోహ్లీ, పరేష్ మైతీ, యూసుఫ్ అరక్కల్, S G వాసుదేవ్, అం జోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టీ.వైకుంఠం , లక్ష్మ ణ్ ఏలే , అశోక్ భౌమిక్, లాలూ ప్రసాద్ షా, గురుదాస్ షెనాయ్, వినీతా కరీం , జతిన్ దాస్, పి. జ్ఞాన, రమేష్ గోర్జాల, ప్రసన్న ఎం నారాయణ్ తదితరుల కళాఖండాలు కొలువుదీరతాయి.ప్రముఖ కళాకారులు గుర్మీత్ మార్వా, లాల్ బహదూర్ సింగ్, రాయ్ కె జాన్, ఎం.వీ రమణా రెడ్డి, పిజెస్టాలిన్, ఆసిఫ్ హుస్సేన్, వివేక్ కుమావత్, భాస్కర్ రావు, యూసుఫ్, అమిత్ భర్, సుజాతా అచ్రేకర్, సుప్రియ అంబర్, తౌసిఫ్ ఖాన్, కప్పరి కిషన్, జి. ప్రమోద్ రెడ్డి, రమణారెడ్డి, కాంత ప్రసాద్, ఔత్సాహిక కళాకారులు ప్రవీణ పారేపల్లి, ఓం తాడ్కర్, పంకజ్ బావ్డేకర్, దేవ్ మెహతా, ప్రవీణ్ కుమార్, సత్య గౌతమ్ తదితరుల కళాఖండాలను ప్రదర్శనకు ఉంచుతారు. హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ బ్రీజ్ ఆర్ట్ గ్యా లరీ, స్నే హ ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, బెంగళూరు నుంచి చార్వి ఆర్ట్ గ్యా లరీ, సారా అరక్కల్ గ్యాలరీ, న్యూ ఢిల్లీ నుంచి ఆర్ట్ హట్, గ్యా లరీ పయనీర్, ఎమినెంట్ ఆర్ట్ గ్యాలరీ, పాస్టెల్ టేల్స్ , స్టూడియో 3 ఆర్ట్ గ్యాలరీ, ఉచాన్, ముంబై నుంచి బియాండ్ ది కాన్వా స్, బొకే ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ, హౌస్ ఆఫ్ ఎనర్జీ, దేవ్ మెహతా ఆర్ట్ గ్యా లరీ, మ్రియా ఆర్ట్స్ , ట్రెడిషన్స్ ఆర్ట్ గ్యా లరీ, కలాస్ట్రో ట్, రిగ్వే ద ఆర్ట్ గ్యా లరీ, స్టూడియో పం కజ్ బావ్డేకర్, ది బాం బే ఆర్ట్ సొసైటీ, తేలా ఆర్ట్ గ్యాలరీ పాల్గొంటాయి. అలాగే జ్ఞాని ఆర్ట్స్ (సిం గపూర్), ఎక్స్ క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ (బరోడా), ది ఇండియన్ ఆర్ట్ కాటేజ్ (కోల్ కతా), కాన్వా స్ డ్రీమ్స్ ఆర్ట్ గ్యా లరీ (నాగ్ పూర్), ఎం నారాయణ్ స్టూడియో (పుణె) తదితర ఆర్ట్ గ్యాలరీలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటాయి. కళాఖండాల ప్రదర్శనతో పాటు వివిధ రకాల ఫ్యూజన్ షోలు, సంగీత కచేరీలు, లైవ్ పెయింటింగ్ ప్రదర్శన కూడా ఉంటుంది.భారతదేశ గొప్ప కళాత్మక వారసత్వాన్ని అన్వేషించే చలన చిత్రం "ది ఎటర్నల్ కాన్వాస్ - 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్", హైలైట్గా నిలవనున్నాయి. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2024 వైవిధ్యం, సృజనాత్మక , కళాత్మక వ్యక్తీకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. కళాభిమానులు, ఆర్ట్ కలెక్టర్స్ ఈ ప్రత్యేక సాంస్కృ తిక కార్యక్రమాన్ని చూసేందుకు బుక్ మై షోలో టికెట్స్ (299 రూపాయలు) అందుబాటులో ఉన్నాయి.ఈవెంట్ వివరాలు:ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ : జూన్ 7-9వ తేదీ వరకువేదిక: కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్, పిల్లర్ 68, పివి నర్సిం హారావు ఎక్స్ ప్రెస్ వే, రేతిబౌలి, హైదరాబాద్సమయం : ఉదయం 11:00 నుం డి రాత్రి 8:00 వరకుమరింత సమాచారం కోసం IAF డైరెక్టర్ రాజేంద్ర : 7400009978, 9820737692 -
పూల కళాతోరణం షర్మిల నిలయం
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, షర్మిలా అగర్వాల్ ఇంట్లోకి అడుగుపెడితే మ్యూజియంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన రెండు గదుల గోడల నిండా ఆమె వేసిన చిత్రలేఖనాలు, ఆమె సేకరించిన అరుదైన కళారూపాలు ఉన్నాయి. సెంటర్ టేబుళ్లు, కార్నర్ స్టాండుల్లో ఇకేబానా (జపాన్ పుష్పాలంకరణ కళ) ఫ్లవర్ అరేంజ్మెంట్ అలరిస్తుంది. మరోవైపు ర్యాక్లలో ఆమె ఆవిష్కరించిన పుస్తకాల ప్రతులు కొలువుదీరి ఉన్నాయి. షర్మిలా అగర్వాల్ స్వయంగా రచయిత్రి, చిత్రకారిణి, ఇకేబానా పుష్పాలంకరణలో నిష్ణాతురాలు. ఈ మూడు కళలూ ఒకరిలో రాశిపోసి ఉండడంతో కావచ్చు ఆమె చిత్రాల్లో... ఆమె కవిత్వంలో కనిపించే భావుకత ద్యోతకమవుతుంది, అలాగే అదే చిత్రాల్లో ఆమె అలంకరించే ఇకేబానా కూడా కనిపిస్తుంది. రచయిత కావడంతో ఇకేబానా పుష్పాలంకరణను అక్షరబద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారామె. గడచిన గురువారం (నాలుగవ తేదీన) ‘ఇకేబానా సులభం’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు ప్రాక్టీస్ వర్క్బుక్స్ పోలిన పది పుస్తకాల సెట్ను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ ‘గురువు పర్యవేక్షణలో నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి ఈ పుస్తకాల సహాయంతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇకేబానా పుష్పాలంకరణ కళ ప్రతి తెలుగింటికీ చేరాలనేది నా కల. పుస్తకాన్ని ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవడానికి అనువుగా రూపొందించాను’ అన్నారామె. పువ్వు మాట్లాడుతుంది! ‘‘పూలు మన మనసుకు అద్దం పడతాయి. పుష్పాలంకరణ మన ఇంటికి వచ్చిన అతిథులకు మన మాటగా మౌనంగా స్వాగతం పలుకుతుంది, మనసును ఆహ్లాదపరుస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో తాజా పువ్వు కనిపించాలి. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక నా వివరాలకు వస్తే... నేను పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్లోని బరేలిలో. రాసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. నా కవితలు స్థానిక హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పెయింటింగ్స్ కూడా ఇష్టంగా వేసేదాన్ని. ఇక చదువు కూడా అదే బాటలో సాగింది. లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫైన్ ఆర్ట్స్లో కోర్సు చేశాను. మీనియేచర్ పెయింటింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటాను. పెళ్లి తర్వాత హైదరాబాద్ రావడం నాకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. హైదరాబాద్ నగరం చిత్రకారిణిగా నాకు గుర్తింపునిచ్చింది. సోలో ఎగ్జిబిషన్లు పెట్టాను, వేరే ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. నా స్టూడియోలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని ప్రదేశాల ప్రత్యేకతలనూ చూడవచ్చు. హిందీలో చంద్ లమ్హే,, కహా అన్ కహా రాశాను. పెయింటింగ్ గురించి మెళకువలు నేర్పించడానికి ‘ఇన్నర్ రిఫ్లెక్షన్స్’ పేరుతో రచనను సిద్ధం చేస్తున్నాను. ఇకేబానా గురించి చెప్పాలంటే ఇది నిరంతరనం సాధన చేయాల్సిన కళ. ఈ ఆర్ట్లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి జపాన్కి ఆరుసార్లు వెళ్లాను. గతంలో ‘ఇకేబానిస్ట్స్ అరౌండ్ ద వరల్డ్, ఇకేబానా ఫర్ బిగినర్స్, ఇకేబానా జపానీ పుష్పకళ’ ప్రచురించాను. ‘ఇకేబానా మనదేశానికి వచ్చి అరవై ఏళ్లు దాటింది. ముంబయికి చెందిన నిర్మలా లుక్మాణి 1961లో జపాన్కెళ్లి ఒహారా స్కూల్లో డిగ్రీ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే విద్యార్థులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు...’ వంటి చారిత్రక వివరాలందించాను. తెలుగు స్నేహితుల సహాయంతో ‘ఇకేబానా సులభం’ పుస్తకంలో... ఇకేబానా కళను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, స్వయంగా క్లాసులకు హాజరు కాలేని వాళ్లకు పూసగుచ్చినట్లు వివరించాను. ఫ్లవర్పాట్ కొలతలు, కొమ్మలు, పూల పరిమాణాలతో సహా కచ్చితంగా రేఖాచిత్రాలతో పుస్తకం రాశాను. జపాన్లో ఉపయోగించే పూలతో అలంకరణను చూపిస్తూనే మనకు లభించే పూలు, ఆకులతో అలంకరించడం కూడా ఫొటోలతో చూపించాను. ఫ్లవర్వాజ్లుగా ఉపయోగించే పాత్రలు, పిన్హోల్డర్లు, పూలు... ఎందులోనూ కృత్రిమత్వం ఉండదు. నురుగులాంటి వాటికి నిషేధం. శ్వాసకు హాని కలగరాదు, మట్టిలో కరిగే క్రమంలో నేలకు హాని కలిగించరాదు. ఇది నియమం. చిత్ర వైవిధ్య లేఖనం నేను పుట్టిపెరిగిన ఉత్తరాది జీవనశైలిని నా చిత్రాలు ప్రతిబింబిస్తుంటాయి. అక్కడి జీవనశైలిలో టెర్రస్కు ప్రాధాన్యం ఎక్కువ. ఉష్ణోగ్రతలు గరిష్టం, కనిష్టం రెండూ తీవ్రంగా ఉంటాయి. వేసవిలో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు డాబా మీద గడుపుతారు. శీతాకాలంలో మధ్యాహ్నపు ఎండ కోసం డాబా మీద ఉంటారు. దైనందిన జీవితంలో సగభాగం డాబా మీద గడుస్తుంది. కాబట్టి డాబా అన్ని ఏర్పాట్లతో ఉంటుంది. నా చిత్రాలు ఉత్తరాది జీవితాన్ని కళ్లకు కడతాయి. ఇకేబానా పరిణామక్రమం కూడా చిత్రాల్లో మిళితమై ఉంటుంది. ఈ కళ జపాన్ స్కూళ్ల నుంచి మన దేశానికి థియరిటికల్గా వచ్చి అరవై ఏళ్లు దాటినప్పటికీ సంపన్న, ఎగువ మధ్యతరగతి దగ్గరే ఆగి పోయింది. సామాన్యులకు చేరాలంటే నేను ఊరూరా స్కూళ్లను పెట్టలేను, కాబట్టి అక్షరం అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తెలుగు నేల నాకు చాలా ఇచ్చింది. తెలుగు నేలకు నేను తిరిగి ఇవ్వడం ద్వారా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ పుష్పాలంకరణ కళను తెలుగు రాష్ట్రాల్లో కుగ్రామాలకు కూడా చేర్చాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు షర్మిలా అగర్వాల్. ఈ పెయింటింగ్ను పరిశీలించండి. ఇందులో అజంతా గుహలున్నాయి. బౌద్ధ భిక్షువులు, రికా (ఇకేబానాలో ఓ శైలి) పుష్పాలంకరణ ఒక భాగంలో కనిపిస్తాయి. మరొక భాగంలో అంతఃపుర స్త్రీలు పుష్పాలంకరణ చేస్తున్నారు, కిందవైపు సామాన్య మహిళలు ఫ్లవర్ అరేంజ్మెంట్లో సంతోషిస్తున్నారు. జపాన్ నుంచి ఈ కళ బౌద్ధ భిక్షువుల ద్వారా ఇండియాకి వచ్చినప్పుడు రాజకుటుంబాల మహిళలకు చేరింది. ఆ తర్వాత సామాన్యులకు పరిచయమైంది. ఇది ప్రాచీన చారిత్రక నేపథ్యం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Kovilpatti: కళాపూర్ణోదయం
తమిళనాడులోని కోవిల్పట్టి అనే చిన్న పట్టణం అద్భుత చిత్రకారులకు నెలవు. క్యాలెండర్లు, మ్యాగజైన్లు, బుక్ కవర్లు, ఇన్విటేషన్లు, గ్రీటింగ్కార్డ్స్... మొదలైన వాటికి వేసిన అద్భుత పెయింటింగ్లు గత కాల జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఆ చిత్రకారుల గురించి నామమాత్రంగా కూడా తెలియకుండా పోయింది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘కోవిల్పట్టి: ది టౌన్ దట్ పేపర్డ్ ఇండియా’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన అద్భుత పెయింటింగ్లు నెట్లో చక్కర్లు కొడుతూ ‘ఆహా’ అనిపిస్తున్నాయి. -
బతుకు చిత్రాలకు ఉత్తమ స్థానాలు
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రాకళా పోటీలు, ప్రదర్శన ఆదివారంతో ముగిశాయి. పోటీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, బిహార్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల చిత్రకారులు వేసిన 189 పెద్దచిత్రాలను ప్రదర్శించారు. గుంటూరు చిత్రకారుడు వస్తగిరి జస్టిస్ వేసిన సజీవ చిత్రానికి మొదటి బహుమతి దక్కింది. కోల్కతాకు చెందిన రాజేష్ వేసిన స్వీయ జీవన చిత్రం ద్వితీయ బహుమతిని, చెన్నైకి చెందిన చిత్రకారుడు గణేషన్ జీవితంలో సొంతవారి కోసం నిరీక్షిస్తున్నట్టు వేసిన సజీవ చిత్రం తృతీయ బహుమతిని పొందాయి. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు వేసిన బెంగళూరు చిత్రకారుడు దేవీప్రసాద్కు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. మెగా అవార్డును రాజు (రాజమండ్రి), ప్రత్యేక బహుమతులను చక్రపాణి (హైదరాబాద్), కె.భాస్కరావు (పాలకొల్లు), అన్నామలై (చెన్నై), కరుణాకర్ (విజయనగరం), విజయ్ (హైదరాబాద్) పొందారు. ఈ పోటీలకు ప్రముఖ చిత్రాకారులు ఎం.సుబ్రహ్మణ్యం, కె.రామ్మోహన్రావు, వీవీ కోటేశ్వరరావు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ప్రదర్శన నిర్వాహకుడు, చిత్రకళా నిలయం చిత్రకారుడు బొడ్డేడ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి.రామనరేష్ పాల్గొని బహుమతులు అందజేశారు. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న దేవీప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. -
డైరెక్టర్ మారుతి కూతురు ఆర్ట్ గ్యాలరీ.. సందడి చేసిన సినీతారలు (ఫొటోలు)
-
కాదేదీ బిజినెస్కు అనర్హం.. రెంజిని కళాహృదయం నిద్రలేచిన వేళ
‘కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ల...కావేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. కుక్కపిల్ల, అగ్గిపుల్లల సంగతేమిటోగానీ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు మాత్రం తమ విలువ తెలుసుకోమన్నాయ్! మరి రెంజిని కళాహృదయం ఊరుకుంటుందా! ఎన్నెన్నో కళాకృతులను సృష్టించి పాత వస్తువులకు కొత్త శోభను తీసుకువచ్చింది. తన అభిరుచిని వ్యాపారంగా మలిచి విజయం సాధించింది 35 సంవత్సరాల రెంజిని థామస్....దుబాయ్లో ఎం.బి.ఎ. ఫైనాన్స్ చదువుకున్న రెంజిని ఆ రంగంలో కాకుండా మీడియా ఫీల్డ్లో పనిచేసింది. 2015లో స్వరాష్ట్రం కేరళకు వచ్చిన రెంజినికి వివాహం అయింది. ‘9 టు 5’ షెడ్యూల్ బోర్ కొట్టడం వల్ల మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు. ఖాళీ సమయాన్ని తన ఇష్టమైన పెయింటింగ్తో గడిపేది.స్వస్థలం కొచ్చిలో తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆర్ట్ లవర్స్తో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. భర్త కూడా ఆర్టిస్ట్ కావడం వల్ల ఇంటినిండా ఆర్ట్ ముచ్చట్లే! బయటకు వెళ్లినప్పుడు రెంజినికి ఎక్కడ పడితే అక్కడ వృథాగా పడి ఉన్న గాజు సీసాలు కనిపించేవి. భర్త నిర్వహించే ‘సౌండ్ స్టూడియో’కు పాత సంగీత పరికరాలను కొనుగోలు చేయడానికి పాత వస్తువులు అమ్మే ఒక దుకాణానికి వెళ్లింది. అక్కడ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు కనిపించాయి. ఆ సమయంలో తనలోని కళాహృదయం నిద్రలేచింది! సీసాలతో పాటు పాత టైర్ రిమ్స్. బకెట్లు, గ్లాసులు.. మొదలైనవి సేకరించడం ప్రారంభించింది రెంజిని. ఒక ఫైన్ మార్నింగ్ వాటితో ఆర్ట్ మొదలుపెట్టింది. వృథా వస్తువులతో కొన్ని హోమ్డేకర్ ఐటమ్స్ తయారుచేసి ఫ్రెండ్స్కు బహుమతిగా ఇచ్చింది.‘అద్భుతం’ అనడమేకాదు ‘వీటితో వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. వారి సలహాతో ఆన్–డిమాండ్ ఆర్డర్స్ కోసం డెకరేషన్ ఐటమ్స్ తయారీ మొదలుపెట్టింది. వివిధ రూపాల్లో ఆర్ట్ కోసం ఖర్చుపెట్టడం తప్ప ఆర్ట్ ద్వారా డబ్బు సంపాదించడం తనకు ఇదే తొలిసారి! పర్యావరణం కోసం పనిచేస్తున్న ‘క్లైమెట్ కలెక్టివ్’ అనే స్వచ్ఛందసంస్థ మహిళా వ్యాపారుల కోసం ‘క్లైమెట్ ఛేంజింగ్ కాంపిటీషన్’ నిర్వహించింది. రెంజిని తయారుచేసిన కళాకృతులను చూసి ‘క్లైమెట్ కలెక్టివ్’ నిర్వాహకులు ప్రశంసించారు. మరిన్ని కళాకృతులు తయారు చేయాల్సిందిగా కోరారు. రెంజిని ఈ పోటీలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లింది. ఐఐఎం–బెంగళూరు స్టార్టప్ ప్రోగ్రామ్కు ఎంపికైన రెంజిని అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంది. అప్ సైకిల్డ్ ప్రాడక్ట్స్కు మంచి డిమాండ్ ఉన్న విషయం తనకు అర్థమైంది. ఈ ఉత్సాహంతో ‘వాపసీ’ పేరుతో ఆన్లైన్లో డెకరేషన్ స్టోర్ ప్రారంభించింది. ఇందులో గ్లాస్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రకరకాల పాతవస్తువులతో తయారు చేసిన 21,000 హోమ్డెకరేషన్ ఐటమ్స్ కనువిందు చేస్తాయి. గ్లాస్ వర్క్ అనేది కత్తి మీద సాములాంటిది. బోలెడు ఓపిక ఉండాలి. చిన్న తప్పు దొర్లినా గ్లాస్ పాడై పోతుంది. తాను చేసిన తప్పులతోనే ఎన్నో పాఠాలు నేర్చుకుంది రెంజిని. ‘మొదట్లో నా వర్క్స్పై నాకు అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. అయితే ఐఐఎం–బెంగళూరు పాఠాలతో నాపై నాకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది’ అంటున్న రెంజిని థామస్ భవిష్యత్లో మరిన్ని పర్యావరణ హిత కళాకృతులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
అంతర్జాతీయ వేదికపై అద్భుత ‘కళ’
సాక్షి, హైదరాబాద్: హృదయంలో కళాత్మకత, చేసే పనిలో అంకితభావం ఉంటే ఏ కళకైనా, కళాకారునికైనా కీర్తి, ఖ్యాతి దరి చేరతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని నగరానికి చెందిన దివ్యాంగ కళాకారిణి షేక్ నఫీస్ మరోసారి నిరూపించింది. ప్రతిష్టాత్మక వరల్డ్ ఆర్ట్ దుబాయ్ వేదికగా హైదరాబాదీ కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. మాస్కులర్ డిస్ట్రోఫీ(కండర క్షీణత) వ్యాధితో బాధ పడుతూ ముప్పై ఏళ్లుగా చీకటి గదికే పరిమితమైన షేక్ నఫీస్ నిబద్దతతో తాను ప్రాణం పోస్తున్న కళ తనను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. కండరాల క్షీణతతో బాధపడుతున్న నఫీస్ ప్రతిభ 2018లో వెలుగులోకి వచ్చింది. మొదటగా రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్లో తన ప్రతిభను చాటింది. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018లో రవీంద్రభారతిలో, 2021లో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నఫీస్ చిత్రాలను ప్రదర్శించి వైకల్యం దేహానికే తప్ప ఎంచుకున్న లక్ష్యానికి కాదని నిరూపించింది. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన.. ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్ వేదికగా గత నాలుగు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్న వరల్డ్ ఆర్ట్ దుబాయ్ ఎగ్జిబిషన్లో నఫీస్ చిత్రాలను ప్రదర్శించే అవకాశం లభించింది. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో సారంగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. తన కృషిని ప్రపంచానికి చాటేందుకు మొదటి నుంచి కృషి చేస్తున్న సామాజికవేత్త ఖాజా ఆఫ్రిది ఆమె చిత్రాలను వరల్డ్ ఆర్ట్ దుబాయ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆఫ్రిది మాట్లాడుతూ.. నాలుగు గోడలకే పరిమితమైన నఫీస్ కళను నలుగురికి చూపించాలనే తన సంకల్పం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేదికపై లక్షలాది మంది అంతర్జాతీయ స్థాయి కళా ప్రేమికులు నఫీస్ చిత్రాలను ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఈ ప్రదర్శనను షేక్ నఫీస్ నగరం నుంచి వర్చువల్గా తిలకించి తన కళకు, కృషికి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి సంబరపడుతుందని పేర్కొన్నారు. -
ప్రియాంక.. పెయింటింగ్... రూ.2 కోట్లు
ముంబై: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ను యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్తో బలవంతంగా రూ.2 కోట్లకు కొనిపించారన్న వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మీడియాతో అన్నారు. ‘‘ఆర్థిక కుంభకోణంలో చిక్కిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అలాంటి వ్యక్తి ఆరోపణలను కూడా కేంద్రం ఉత్సాహంగా ప్రోత్సహిస్తోందంటే కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇది రాజకీయ కక్షపూరిత చర్యే’’ అంటూ ధ్వజమెత్తారు. ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు జీవించి లేని అహ్మద్ పటేల్, మురళీ దేవరా పేర్లను తెలివిగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈడీకి రాణా చెప్పింది ఇదీ... రూ.5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రాణాకపూర్ సంచలన ఆరోపణలే చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ను రూ.2 కోట్లకు కొనాలంటూ కాంగ్రెస్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. ‘‘నాకస్సలు ఇష్టం లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి మురళీ దేవరా తదితరుల ఒత్తడి వల్ల కొనక తప్పలేదు. పెయింటింగ్ కొనకుంటే కాంగ్రెస్తో సంబంధాలు బాగుండబోవని దేవరా నన్ను పిలిచి మరీ హెచ్చరించారు. నాకు పద్మభూషణ్ అవార్డు కూడా రాదన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే రూ.2 కోట్లకు పెయింటింగ్ను కొన్నా. ఆ డబ్బుల్ని కాంగ్రెస్ చీఫ్సోనియాగాంధీకి న్యూయార్క్లో జరిగిన చికిత్స కోసం వాడినట్టు సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తర్వాత నాకు స్వయంగా చెప్పారు’’ అని వెల్లడించారు. ప్రియాంకకు రాణా చెల్లించిన రూ.2 కోట్లు కూడా కుంభకోణం తాలూకు మొత్తమేనని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో రాణాకపూర్ తదితరులను 2020లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం దోపిడి దారులు. వారి హయాంలో చివరికి పద్మ పురస్కారాలను కూడా అమ్ముకున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. -
అన్వి... అన్నీ విశేషాలే!
ఏడాదిలోపు పిల్లలు పాకుతూ, పడుతూ లేస్తూ నడవడానికి ప్రయత్నిస్తూ పసి నవ్వులు నవ్వుతారు. వచ్చీరాని మాటలను పలుకుతూ ముద్దు లొలికిస్తుంటారు. ‘‘దాదాపు ఈ వయసువారంతా ఇలానే ఉంటారనుకుంటే మీరు పొరపడినట్లే. ప్రతిభకు వయసుతో సంబంధంలేదు. మాలాంటి చిచ్చర పిడుగులు బరిలో దిగితే అచ్చెరువు చెందాల్సిందే’’ అంటోంది అన్వి విశేష్ అగర్వాల్. రెండున్నరేళ్ల వయసున్న అన్వి తన పెయింటింగ్స్తో ఏకంగా గిన్నిస్బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. రెండేళ్లకే ఈ రికార్డు సాధిస్తే ఇక పెద్దయ్యాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తోందో అని అవాక్కయ్యేలా చేస్తోంది చిన్నారి అన్వి. భువనేశ్వర్కు చెందిన అన్వి విశేష్ అగర్వాల్ 72 చిత్రాలను గీసి అతి చిన్నవయసులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఎక్కువ సంఖ్యలో పెయింటింగ్స్ వేసిన అతిపిన్న వయస్కురాలుగా నిలిచి లండన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. రెండున్నరేళ్ల పాప ఇన్ని రికార్డులు సాధించిందంటే చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. అన్వి పెయింటింగ్ జర్నీ కేవలం తొమ్మిది నెలల వయసులోనే జరగడం విశేషం. అప్పటినుంచి పెయింటింగ్స్ వేస్తూనే ఉంది. ‘‘మ్యాగ్నెంట్, పెండులమ్, కలర్స్ ఆన్ వీల్స్, రిఫ్లెక్షన్ ఆర్ట్, హెయిర్ కాంబ్ టెక్చర్, రీ సైక్లింగ్ ఓల్డ్ టాయిస్, హ్యూమన్ స్పైరోగ్రఫీ, దియా స్ప్రే పెయింటింగ్, బబుల్ పెయింటింగ్’’ వంటి 37 రకాల పెయింటింగ్ టెక్నిక్స్ను ఆపోశన పట్టింది. పెయింటింగేగాక పంతొమ్మిది నెలల వయసు నుంచే స్పానిష్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. 42 అక్షర మాల శబ్దాలను స్పష్టంగా పలుకుతూ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అత్యంత అరుదైన చిన్నారులు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు.అన్నట్లు అన్వి అందర్నీ అబ్బురపరుస్తోంది. ‘‘కోవిడ్ సమయంలో కుటుంబం మొత్తం ఇంటికే పరిమితమయ్యాం. ఈ సమయంలో పిల్లల్ని బిజీగా ఉంచడం చాలా పెద్ద టాస్క్. ఎప్పుడూ వారికి ఏదోఒకటి నేర్పించాలనుకున్నా ఆ సమయంలో అన్నీ లభ్యమయ్యేవి కావు. ఈ క్రమంలో అన్వికి పెయింటింగ్స్ వేయడం నేర్పించాం. మేము చేప్పే ప్రతి విషయాన్నీ లటుక్కున పట్టేసుకునేది. దీంతో ఆమెకు ఆసక్తి ఉందని గ్రహించి పెయింటింగ్స్ మెలుకువలను నేర్పించగా కొద్ది నెలల్లోనే నేర్చేసుకుంది. ఆ స్పీడు చూసి ప్రోత్సహించడంతో ఈ రోజు మా పాప ఈ రికార్డుల్లో తన పేరును చేర్చింది. రెండున్నరేళ్ల అన్వి ఈ రికార్డులు సాధించి మరెంతోమంది చిన్నారులకు ఆదర్శంగా నిలవడం మాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్వి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
Cheriyal Painting: నేర్చిన కళే నడిపిస్తోంది.. నకాశి
గృహిణి అనగానే ఇంటిని చక్కదిద్దుకుంటూ, వంట చేస్తున్న మహిళలే మనకు గుర్తుకు వస్తారు. ఇల్లు, వంట పనితో పాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే చేర్యాల చిత్రకళను ఔపోసన పట్టారు వనజ. ఆరుపదులకు చేరవవుతున్న వనజ హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబకళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి, పొందిన సత్కారాల గురించి ఆనందంగా వివరిస్తారు వనజ. తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. రామాయణ, మహాభారత, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తారు. ఈ పెయింటింగ్స్తో పాటు రాజా రాణి, సీతారామ.. పోతరాజు, వెల్కమ్ మాస్క్లను తయారు చేస్తుంటారు వనజ. పెయింటింగ్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు. వర్క్షాప్స్ నిర్వహిస్తుంటారు. 37 ఏళ్ల క్రితం ‘‘చదువుకున్నది ఏడవ తరగతి వరకే. పెళ్లయ్యాక ముగ్గురు పిల్లలు. నా భర్త వైకుంఠం ఈ చిత్రకళలో రోజంతా ఉండేవారు. ఓ వైపు ఇంటిపని, పిల్లల పని.. అంతా పూర్తయ్యాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెయింటింగ్ నేర్చుకోవడానికి కూర్చునేదాన్ని. అంతకుముందు ఈ కళ మా కుటుంబానికి మా మామగారి ద్వారా ఏ విధంగా వచ్చిందో, ఎంత ప్రాచీనమైనదో తెలుసుకున్నాను. ప్రాణం పెట్టే ఈ కళ సహజత్వం గురించి అర్ధమవుతున్న కొద్దీ నాకు ఎంతో ఇష్టం పెరిగింది. కళ నేర్పిన చదువు వందల ఏళ్ల క్రితం నిరక్షరాస్యులకు ఈ బొమ్మల ద్వారా కథ తెలియజేసే విధానం ఉండేది. ఆ విధంగా సమాజానికి మంచి నేర్పే కళగానూ పేరుంది. దేవతా వర్ణనలతో, ఇతిహాసాలను, పురాణాలను, స్థానిక కుల కథలను కూడా ఈ కళద్వారా చిత్రిస్తాం. ఖాదీ వస్త్రం లేదా కాన్వాస్పై ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చింత గింజల గుజ్జు, కొన్ని చెట్ల జిగురు, సహజ రంగులతో చిత్రిస్తాం. ఎరుపురంగు ప్రధాన భూమికగా ఉంటుంది. నీలం, పసుపు రంగులో దేవతల చిత్రాలు, బ్రౌన్ లేదా డార్క్ షేడ్స్ రాక్షసులకు, పింక్ స్కిన్ టోన్లు మనుషులకు ఉంటాయి. వందల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న కళ ఇది. 3 అడుగుల వెడల్పుతో 60 అడుగులకు పైగా పొడవుతో ఈ బొమ్మలను చిత్రించవచ్చు. స్క్రోల్లో దాదాపు 40 నుంచి 50 ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్యానెల్ కథలోని కొంత భాగాన్ని వర్ణిస్తుంది. ఏడాదికి పైగా... రోజూ కనీసం 5–6 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతోపాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు. దేశమంతా ప్రయాణించాను ఎక్కడ మా ప్రోగ్రామ్ ఉన్నా నేనూ మెల్ల మెల్లగా వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఢిల్లీ, కలకత్తా, ముంబాయ్.. దేశమంతా తిరిగాను. ఎగ్జిబిషన్స్లో పెట్టే స్టాల్స్ చూసుకోవడంతో పాటు, ఇంటి వద్దకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కాలేజీ అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. కాలేజీల్లో వర్క్షాప్స్ పెట్టేవాళ్లం. ఇప్పుడు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా పెయింటింగ్ పూర్తయ్యేవరకు వర్క్ చేస్తూనే ఉంటాను. మా వారికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే, నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. జంట మాస్క్లు చిత్రకళతో పాటు వినాయకుడు, రాజూరాణి, సీతారాములు, పోతరాజు, బోణాల పండగ సమయంలో అమర్చే అమ్మవార్ల రూపు మాస్క్లను చేస్తున్నాం. అలాగే, ఇంట్లోకి ఆహ్వానించడానికి అలంకరణగా, ఇంటి లోపలి అలంకరణగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడెన్ బాక్స్లు, ట్రేలు, జ్యువెలరీ బాక్స్లను కూడా పెయింటింగ్ తీర్చిదిద్దుతు న్నాం. వీటిని కానుకలుగా ఇవ్వడానికి వీటిని ఎంచుకుంటు న్నారు. మాస్క్ల తయారీలో చింతగింజల పొడి, కర్ర పొట్టు రెండూ కలిపి, తయారుచేసి, పెయింటింగ్ చేస్తాం. అలాగే, మెటల్ ప్లేట్కి ఖాదీ క్లాత్ ని పేస్ట్ చేసి, నేచురల్ కలర్స్తో పెయింటింగ్ చేసి, వార్నిష్ చేస్తాం. ఇవన్నీ ఇంటి అలంకరణలో అందంగా అమరిపోతాయి. ఈ చిత్రకళ అన్నింటికీ ప్రధాన ఆకర్షణగా తయారయ్యింది. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్ల మెల్లగా ఈ కళను నేర్చుకుంటోంది. కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దానిని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాతి తరం దానిని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇదే నేను నమ్మాను. నాలాంటి మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఎంతో గుర్తింపుతో పాటు, ప్రపంచాన్ని కొత్తగా చూశానన్న సంతృప్తితో పెయింటింగ్స్ను చిత్రిస్తున్నాను. దీని వల్ల నా కుటుంబ ఆదాయమూ పెరిగింది’’ ఆని ఆనందంగా వివరించారు వనజ. – నిర్మలారెడ్డి -
బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం..!
-
రష్యాలో సెక్యూరిటీ గార్డు చేసిన పనిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్టు..!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆనంద్ మహీంద్రా పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు. అయితే, తాజాగా మరో ఆసక్తికర పోస్టుపై మహీంద్రా స్పందించారు. రష్యాలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్కొట్టి ఏం చేయాలో తోచక కొన్ని కోట్లు విలువైన పేయింటింగ్లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. అయితే, ఈ వార్తాపై స్పందించిన ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా.." ఎందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త కళాఖండాన్ని ఎన్ఎఫ్టిగా మార్చండి" అని సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. 1932-1934 నాటి త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్ సెంటర్లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. Why worry? Just convert the new ‘creation’ into an NFT! https://t.co/I7F3wbIxWH — anand mahindra (@anandmahindra) February 10, 2022 ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన వేశారు. అయితే ఈ పేయింటింగ్ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ, ఈ పెయింటింగ్ని దాదాపు రూ.7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్ కంపెనీ ఆ పేయింటింగ్ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న 10 నగరాల్లో 2 మనవే..!) -
బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం
Bored Security Guard Drew Eyes On Painting of Faceless Figures: కొంతమంది సరదాగానో లేక బోరుకొడుతుందనో చేసిన పనులు వికటించి పెను ప్రమాదాలుగా మారిని సందర్భాలు కోకొల్లలు. ఐతే అవి ఒక్కోసారి మనకు నష్టం వాటిల్లకపోయిన లక్ని తీసుకువచ్చిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఒక్కోసారి ఆ పనులు మనం కలలో కూడా ఊహించనంత నష్టాన్ని చవిచూసేలా చేస్తాయి. అచ్చం అలాంటి సంఘటనే రష్యాలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...1932-1934 నాటి త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్ సెంటర్లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్ పెన్తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన వేశారు. అయితే ఈ పేయింటింగ్ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ ఈ పెయింటింగ్ని దాదాపు రూ. 7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్ కంపెనీ ఆ పేయింటింగ్ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు కూడా. (చదవండి: వెన్నుముక మార్పిడి..వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..) -
రిపబ్లిక్ వేడుకల్లో తెలుగు కళారూపం
సాక్షి, హైదరాబాద్: తెలుగు కలంకారీ కళాకారుడు సుధీర్కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ వేడుకల్లో సుధీర్ కలంకారీ కళారూపానికి చోటు దక్కింది. పంజాబ్లోని రాజ్పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్లో స్క్రోల్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న కొన్ని సంప్రదాయ రీతులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్ పథ్లో ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా రాజ్పథ్లోని ఓపెన్ గ్యాలరీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఎ) భారీ స్క్రోల్స్ను ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా కళాకారులు (వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు) దీనిని చిత్రించారు. కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కళారూపం కూడా ఉండటం విశేషం. సుధీర్ అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు, పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్పై చేసే చేతి పెయింటింగ్ పురాతన శైలి. ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలుంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్లు, పువ్వులు, నెమలి, పైస్లీలు మొదలు మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి. -
డబ్బే డబ్బు!: జంతువు వేసిన పెయింటింగ్కు రికార్డు ధర
మాస్టారి టాలెంట్ ఏమిటో ఫొటో చూడగానే మీరో అంచనాకు వచ్చేసుంటారు.. ఇది ఉత్త పిగ్ కాదు.. దీని పేరు పిగ్కాసో.. అంటే.. పందుల్లో పికాసో టైపు అన్నమాట. నిజానికి బిర్యానీలో లెగ్పీసు కింద మారాల్సిన ఈ వరాహం.. జువానే లెఫ్సన్ అనే ఆవిడ పుణ్యాన రోజుకో ఆర్టు పీసును సృష్టించేస్తోంది.. ఇంతకీ ఏమైందంటే.. చిన్నప్పుడు దీన్ని ఓ మటన్ షాపుకు అమ్మేశారట.. కీమా కొట్టేయడానికి.. అయితే జువానే రక్షించి.. పెంచుకున్నారు.. అదే సమయంలో తన షాపులోపడి ఉన్న పెయింట్ బ్రష్షు పట్టుకుని.. విన్యాసాలు చేస్తుంటే చూసి.. ఆ దిశగా ప్రోత్సహించారు.. అంతే... అప్పట్నుంచి పిగ్ కాసో తనదైన రంగుల ప్రపంచాన్ని సృష్టించేసుకుంది.. తాజాగా వారాల తరబడి కష్టపడి.. ఇదిగో ఈ పెయింటింగ్ను వేసే సింది. తన కష్టం వృథా పోలేదు.. ఈ వరాహం వేసిన పెయింటింగ్కు అచ్చంగా వరహాల మూటే దక్కింది. జర్మనీకి చెందిన పీటర్ ఎసర్ అనే వ్యక్తి రూ.20 లక్షలకు పైగా చెల్లించి.. వేలంలో ఈ పెయింటింగ్ను దక్కించు కున్నారు. దాంతో పిగ్కాసో యజమాని జువానే ఆనందానికి అంతులేదనుకోండి.. మరో విషయం.. ఓ జంతువు వేసిన చిత్రానికి ఇంత ధర పలకడం కూడా ఇదే తొలిసారి.. గతంలో కాంగో అనే చింపాజీ వేసిన చిత్రానికి రూ.14 లక్షల ధర పలికింది. -
అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!!
German Renaissance Artist Albrecht Dürer Painting: ఐదేళ్ల క్రితం అమెరికాలో హౌస్ క్లియరెన్స్ సేల్లో కేవలం 30 డాలర్ల (రూ. 2,250)కు కొన్న ఓ పెయింటింగ్ ఇప్పుడు వేల కోట్ల ధర పలుకుతోంది. ఈ పెయింటింగ్ 500 ఏళ్ల నాటి అద్భుత కళాఖండం మరి! దీనిని గీసిన చిత్రకారుడెవరో.. ఎందుకంత ధర పలుకుతోందో ఆ విశేషాలు మీ కోసం.. ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ ఒక జర్మన్ చిత్రకారుడు. జర్మనీ పునరుజ్జీవనోద్యమ సమయంలో అతను ఐరోపా అంతటా బాగా పేరు పొందాడు. ముఖ్యంగా వుడ్కట్ ప్రింట్లకు ప్రసిద్ధి చెందిన ఆల్బ్రెచ్ట్ డ్యూరర్.. రాఫెల్, గియోవన్నీ బెల్లిని, లియోనార్డో డావిన్సీ వంటి కళాకారులతో సన్నిహితంగా ఉండేవాడు. అతని ‘ఫోర్ హార్స్మెన్ ఆఫ్ ది అపోకలిప్స్’ అనే పెయింటింగ్ ఆర్ట్ హిస్టరీలోనే గొప్పదిగా పేరుగాంచింది. ముఖ్యంగా ఇతను ఒక తల్లి, బిడ్డలను పసుపు నారపై వేసిన ఆర్ట్వర్క్.. ఆర్ట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోనోగ్రామ్లలో ఒకటిగా ఎంచబడుతోంది. మొత్తం మోనోగ్రామ్ డ్రాయింగ్ను ఒకేరకమైన సిరాతో వేయబడింది. కనీసం 200 షీట్లపై వాటర్మార్క్ కనిపించే కాగితంపై ఈ పెయింటింగ్ వేశాడా జర్మన్ చిత్రకారుడు. ఈ అరుదైన కళాఖండాన్ని ఇప్పుడు లండన్లోని ఆగ్న్యూస్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. స్మిత్సోనియన్ మ్యాగజైన్ కథనాల ప్రకారం.. ఈ చిత్రాన్ని అగ్న్యూస్ గ్యాలరీ విక్రయించాలని యోచిస్తోంది. అయితే స్థిరమైన ధర ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర 374 కోట్ల 33 లక్షలు పలకవచ్చని నిపుణుల అంచనా. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: పర్యాటక మంత్రి -
మా దారి రంగుల దారి
పెయింటర్ వచ్చాడా అని గతంలో అడిగేవారు. ఇకపై పెయింటరమ్మ వచ్చిందా అని అడగాలి. గ్రామీణ తమిళనాడులో స్త్రీ ఉపాధికి కొత్త మార్గం తెరుచుకుంది. మగవారికే పరిమితమైన వాల్ పెయింటింగ్లో జపాన్ పెయింట్ సంస్థ ‘నిప్పన్’ అక్కడ 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వారు నిచ్చెనలు ఎక్కి బ్రష్ పట్టుకుంటున్నారు గోడలకే కాదు బతుకు దారికీ రంగు వేస్తున్నారు. ‘గ్రామీణ స్త్రీలకు ఉపాధి చూపించాలి. శ్రమ జీవనంలో ఉండే ఆ స్త్రీలు శ్రమతో నిండిన వాల్ పెయింటింగ్లో రాణించగలరని భావించాం. అదే ఇప్పుడు నిజమైంది’ అంటారు నిప్పన్ పెయింట్స్ (ఆసియా) విభాగం ప్రతినిధి మహేష్ ఆనంద్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ‘ఎన్శక్తి’లో భాగంగా ఆ దిగ్గజ సంస్థ తమిళనాడులోని కోయంబత్తూరు, వెల్లూరు, రామనాథపురం... వంటి జిల్లాల్లో చిన్న ఊళ్ల నుంచి 1000 మంది స్త్రీలకు వాల్ పెయింటింగ్లో శిక్షణ ఇవ్వాలని రెండేళ్ల క్రితం నిశ్చయించుకుంది. ఇప్పటికి ఐదువందల మంది స్త్రీలు శిక్షణ పొంది వాల్ పెయింటింగ్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు కాంట్రాక్టర్ మైలాదుతురై అనే ఊరికి చెందిన దుర్గ మొదటిసారి పెయింటింగ్ బ్రష్ పట్టుకున్నప్పుడు ఈ పనిలో రాణించగలనా అనుకుంది. కాని ఇప్పుడు ఆమె పెయింటింగ్ కాంట్రాక్టర్గా తన జీవితాన్నే మార్చుకుంది. ‘వాల్ పెయింటింగ్లో శిక్షణ తీసుకున్నాక పెయింటింగ్ మొదలెట్టాను. నా చురుకుదనం చూసి నన్నే కాంట్రాక్ట్లు తెచ్చుకోమని నా తోటి మహిళా పెయింటర్లు సూచించారు. ఇప్పుడు నేనే కాంట్రాక్ట్ తెచ్చి పని చేయిస్తున్నాను’ అంటుంది దుర్గ. అయితే ఆ పని అంత సులువు కాలేదు. ఇంట్లో వాళ్లు ఆమెను ఆ పనికి పంపడానికి అంగీకరించలేదు. ‘నేను వాల్పెయింటింగ్ చేస్తున్న దృశ్యాన్ని ఫోన్లో వీడియోగా షూట్ చేసి ఇంట్లో చూపిస్తే వాళ్లు ఆ పని నేను బాగా చేస్తున్నానని అంగీకరించారు’ అని దుర్గ అంది. ‘ఆ వీడియో నా ప్రచారం కోసం కూడా వాడుతున్నాను. అది చూసి నాకు పని ఇస్తున్నారు’ అని అంది దుర్గ. వాల్ పెయింటింగ్లో ఆసక్తి ఉన్న గ్రామీణ స్త్రీలను వెతికి నిప్పన్ సంస్థతో అనుసంధానం చేసే పని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ట్రయినింగ్ 12 రోజులు ఉంటుంది. ఆ 12 రోజుల్లో పెయింటింగ్కు సంబంధించిన మెళకువలు, జాగ్రత్తలు నేర్పిస్తారు. ‘మేమందరం చీరలు కట్టుకుని ఊళ్లల్లో ఉండేవాళ్లం. ప్యాంటు షర్టు వేసుకుని ఈ పని చేయాలంటే కొంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అలవాటైపోయింది’ అని వెన్మతి అనే పెయింటర్ నవ్వుతూ అంది. అయితే సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఈ మహిళా పెయింటర్లు బృందాలుగా ఏర్పడి బయటి నగరాలకు వెళ్లి పని చేస్తామంటే ఇళ్లల్లో పంపిస్తున్నారు. ‘మేము రెండేసి నెలలు కోయంబత్తూరు, చిదంబరం వంటి నగరాలకు వెళ్లి పెయింట్ చేసి వస్తున్నాం’ అని ఈ పెయింటర్లు చెప్పారు. వీరికి ఒక్కొక్కరికి 650 రూపాయల కూలీ ఆ పైన దొరుకుతోంది. చెన్నైలో 2000 మంది నిప్పన్ సంస్థ ఒక్క చెన్నైలోనే రెండు వేల మంది మహిళా పెయింటర్లను తయారు చేయాలని తాజాగా నిశ్చయించుకుంది. ఇందుకు చెన్నై రోటరీ క్లబ్తో ఒక ఒడంబడిక చేసుకుంది. వాల్ పెయింటింగ్లో ఆసక్తి ఉన్న మహిళలను రోటరీ క్లబ్ నిప్పన్తో అనుసంధానం చేస్తుంది. ‘వాల్ పెయింటింగ్ ఇవాళ్టికి మగవారి పనిగా ఉంది. కాని ఈ పనిలో స్త్రీలు బాగా రాణిస్తారు’ అని రోటరీ క్లబ్ ప్రతినిధి అన్నారు. పెయింటింగ్లో సురక్షితంగా ఎలా ఉండాలో కూడా వీరికి తెలుసు. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే పని చేస్తున్నారు. ‘వీరు పెయింటింగ్లో శిక్షణ పొందాక ఇంటీరియర్ డిజైన్ సంస్థలకు, కన్స్ట్రక్షన్ సంస్థలకు మేము వారిని అనుసంధానం చేస్తాం. పని దొరికేలా కూడా చూస్తాం’ అని నిప్పన్ సంస్థ ప్రతినిధి చెప్పారు. స్త్రీలకు కొత్త బతుకుదారి తెరుచుకోవడం... అది రంగుల దారికావడం మంచి విషయం. -
డబ్బులు లేక ఆ రోజు చేసిన పని.. నేడు ట్రెండ్గా మారింది
జూలియా సయూద్ సిరియాకు చెందిన యువతి. ఆమెకు పెయింటింగ్స్ అంటే ప్రాణం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జూలియా తన ఇంటిని వదిలి బయటకు రావల్సివచ్చింది. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ కిట్ను అక్కడే వదిలేసింది. ఆ సమయంలో తన పరిస్థితి ఎలా ఉందంటే.. తనకు నచ్చిన పెయింటింగ్ వేయడం కోసం కలర్స్ కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. తనకు నచ్చిన పెయింటింగ్స్ను ఆపడం ఇష్టం లేని ఆ యువతి.. కలర్స్ లేకపోయనా తన కళను కొనసాగించాలనుకుంది. అందుకోసం ఆమె ఓ కొత్త ఐడియా ఆలోచించింది. అదే.. కలర్స్ బదులుగా మట్టిని ఉపయోగించి పెయింటింగ్స్ను వేయాలని నిర్ణయించుకుంది. అలా మొదలు పెట్టిన జూలియా ప్రస్తుతం ఆ మట్టి పెయింటింగ్స్ నెట్టింట సెన్సేషన్గా మారాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. అప్పుడు మట్టితో పెయింటింగ్స్ వేయడం వల్ల డబ్బు ఆదా అవుతుందనుకున్నా. మొదట, నేను నా కలను కొనసాగించాలని ఆలోచనతో అలా మట్టితో మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు అప్పుడు వేరే మార్గం లేదు .. కానీ ఇప్పుడు కలర్స్ ఉన్నా కూడా మట్టితో పెయింటింగ్ వేయడమే నాకు నచ్చుతోందని తెలిపింది. మట్టితో అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన జూలియా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు తన వేసిన సాయిల్ పెయింటింగ్స్ ఆ ప్రాంతంలో ట్రెండ్గా మారడంతో పాటు ఆ పరిసరాల్లోని పిల్లలకు కూడా ఈ మట్టితో పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుంటున్నారు. WATCH: Syrian artist Julia Saeed started painting with soil after she fled her home in Raqqa and could not afford to buy paint. Now she has made painting with soil her unique style pic.twitter.com/JsE64Imai5 — Reuters (@Reuters) October 10, 2021 -
రూ. 300 కోట్లకు అమ్ముడైన పెయింటింగ్.. స్పెషల్ ఏంటి?
ఊపిరి సినిమా చూశారా! అందులో హీరో కార్తీ టాయిలెట్ క్లీనింగ్ బ్రష్తో ఓ చిత్రమైన పెయింటింగ్ వేస్తాడు. దానిని రూ. 2 లక్షలు పెట్టి కొనటమే కాకుండా.. లేని ఓ అర్థాన్ని వివరిస్తూ హాస్యం పండిస్తాడు ప్రకాశ్రాజ్. అలా వచ్చిన డబ్బుతో కార్తీ తన చెల్లి పెళ్లి చేస్తే.. నిజ జీవితంలో బ్రిటన్కు చెందిన ‘సచా జాఫ్రీ’ ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తున్నాడు. అయితే, ఇతను కార్తీలా కాదు.. ప్రసిద్ధ కళాకారుడు. ఇతను వేసిన పెయింటింగ్ కూడా అర్థవంతమైందే. ఆ బొమ్మను గీసే ముందు ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ కరోనా కాలంలో వాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఒంటరిగా అయిపోయినట్టు ఫీలవుతున్నారా? ఇలా వాళ్ల అనుభవంలోకి వచ్చిన భావాలతో స్కెచెస్ వేసి వాటిని తనకు పంపాలని కోరాడు. ఆ తర్వాత దుబాయ్లోని అట్లాంటిస్ హోటల్లో సుమారు ఏడు నెలల పాటు రోజుకు 20 గంటల సమయాన్ని వెచ్చించి ఆ పెయింటింగ్ వేశాడు. దీనికోసం 1,065 పెయింట్ బ్రష్లు, 6,300 లీటర్ల పెయింట్స్ను ఉపయోగించాడు. 70 విభాగాలుగా చిత్రించి తర్వాత ఒక్కటిగా కలిపి పదిహేడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద కాన్వాస్ పెయింటింగ్గా తయారు చేశాడు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో పేరు కూడా సంపాదించుకుంది. పైగా ఇందులో ‘జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే అర్థం దాగి ఉంది. దుబాయ్లోని ‘ది పామ్’ హోటల్లో నిర్వహించిన వేలంలో దీన్ని ఫ్రాన్స్కు చెందిన ‘ఆండ్రీ అబ్దున్’ రూ.300 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఆ డబ్బును పేద పిల్లల సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. #HappeningNow the #OpeningAuction of @SachaJafri' record breaking #artwork #TheJourneyOfHumanity is achieved great interest! It actually has enough interest to be sold entirely to one bidder! pic.twitter.com/e2E4EcGg1z — Mazdak (@MazRaf75) March 22, 2021 చదవండి: రూ.2,000 నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన -
బాబ్రే.. నీ పెయింటింగ్స్ అద్భుతం!
అర్ధ శతాబ్దం పాటు.. అమెరికా మేధావుల్ని అదిలించి, కదిలించిన జానపదబాణి.. వాణి బాబ్ డిలాన్. సంగీత ప్రపంచాన్ని ఏలిన ఈ అమెరికా దిగ్గజం, నోబెల్ బహుమతి పొందిన తొలి పాటల రచయితగా రికార్డు సృష్టించిన బాబ్ డిలాన్ అద్భుతమైన చిత్రకారుడు కూడా. ఆశ్చర్యపోవడం అందరి వంతు. 2007లో ఒకసారి జర్మనీలో ‘ద డ్రాన్ బ్లాంక్ సిరీస్’ పేరిట బాబ్ డిలాన్ పెయింటింగ్స్ను ప్రదర్శిచడంతో ఆయనలోని మరో కళాత్మక కోణం అబ్బురపరిచింది. ఆ పెయింటింగ్స్ను చూసిన వారంతా..‘‘బాబ్ డిలాన్ పాటలు ఎంత మధురమో.. ఆయన చిత్రాలూ అంతే రమణీయం’ అని అభినందించారు. ఆతరువాత లండన్లోని నేషనల్ పోర్టరేట్, డెన్మార్క్లోని ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ డెన్మార్క్, మిలాన్, షాంఘైలలో డిలాన్ పెయింటింగ్లను ప్రదర్శించారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని బాబ్ పెయింటింగ్స్ను తొలిసారి అమెరికాలో ప్రదర్శించనున్నారు. తన అరవైఏళ్లు్లలో డిలాన్ వేసిన చిత్రాలు అధికారికంగా ప్రదర్శనకు రానున్నాయి. ఫ్లోరిడాలోని మియామి నగరంలో ‘ప్యాట్రీషియా అండ్ ఫిలిప్ ఫ్రాస్ట్ ఆర్ట్ మ్యూజియం’ ఇందుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 30న ‘రెట్రోస్పెక్ట్రమ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బాబ్ డిలాన్ వేసిన 120కి పైగా పెయింటింగ్స్, డ్రాయింగ్స్, శిల్పాలను ఉంచుతారు. అయితే ‘రెట్రోస్పెక్ట్రమ్’ ఎగ్జిబిషన్ను 2019లో చైనాలోని షాంఘైలోనూ ఏర్పాటు చేశారు. దాన్నే ఇప్పుడు అమెరికాలో పెట్టబోతున్నారు. ‘ఇప్పటిదాక ఎవ్వరూ చూడని కొత్త వస్తువులను ప్రదర్శించడం అనే సరికొత్త వెర్షన్తో ఈసారి రెట్రోస్పెక్ట్రమ్ను ఏర్పాటు చేయనున్నాం. దీనిలో వివిధ రకాల కొత్త బ్రాండ్లు, వాటి సిరీస్లను ‘అమెరికన్ పాస్టోరల్స్’ పేరుతో ప్రదర్శిస్తారు. ఇది 2021 నవంబర్ 30న మొదలై 2022 ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. బాబ్ డిలాన్.. అమెరికాలోని వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయన చూసిన ప్రాంతాలు, ఎదురైన సన్నివేశాలు, సంఘటనలు పెయింటింగ్స్గా ప్రతిబింబిస్తాయ’ని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్పారు. ఈ ఏడాది మే 24న బాబ్ డిలాన్ 80వ జయంతి. ఆ సందర్భంగా ఆయన పెయింటింగ్స్ ప్రదర్శనకు రావడం విశేషం. డిలాన్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని బీబీసీ రేడియో–4, ఇంకా అమెరికాలో వివిధ రేడియోల్లో ఆయనపై ప్రత్యేక కార్యక్రామలను ప్రసారం చేయనున్నాయి. – పి. విజయా దిలీప్ చదవండి: ద బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం! -
ఆ రూ.450 కోట్లు వాళ్ల కోసమే!
ప్రార్థించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న అనే వాక్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు 44 ఏళ్ల బ్రిటీష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ. కరోనా వైరస్ ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్న చిన్నారులకు ఏదోరకంగా సాయం చేయాలనుకున్న జాఫ్రీ తనకు తెలిసిన విద్యతో కోట్లు సంపాదించి సామాజిక సేవచేస్తున్నాడు. గత ఏడాది కరోనా కాలంలో జాఫ్రీ వేసిన ‘జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పెయింటింగ్ తాజాగా దుబాయ్లో జరిగిన వేలంలో ఏకంగా 62 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. మన రూపాయలలో దీని విలువ రూ.450 కోట్లకుపై మాటే. జాఫ్రీ ఈ మొత్తాన్నీ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు.జాఫ్రీ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ను 70 భాగాలుగా వేసాడు. ఈ భాగాలను విడివిడిగా విక్రయించి 30 మిలియన్ డాలర్లను కూడబెట్టి చిన్నారులకు సాయం చేయాలనుకున్నాడు. కానీ ఫ్రెంచ్ క్రిఫ్టో కరెన్సీ వ్యాపారవేత్త ఆండ్రీ అబ్దున్ మొత్తం పెయింటింగ్కు రెట్టింపు డబ్బులు ఇస్తాననడంతో పెయింటింగ్ రూ.450 కోట్లకు విక్రయించాడు. జాఫ్రీ ఈ మొత్తాన్నీ దుబాయ్ కేర్స్, యూనిసెఫ్, యునెస్కో, గ్లోబల్ గిఫ్ట్ట్ ఫౌండేషన్ వంటి సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు. కరోనా కాలంలో ఎంతోమంది రోడ్డున పడ్డారు. తినడానకి తిండిలేక, ఉండడానికి ఇల్లు లేక ఎంతో మంది చిన్నారులు నానా అవస్థలు పడడం చూసి చలించిన జాఫ్రీ వారికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే పెద్ద పెయింటింగ్ వేసి కనీసం 30 మిలియన్ డాలర్లు సంపాదించి చిన్నారులకు విరాళంగా ఇవ్వాలనుకున్నాడు. అతిపెద్ద పెయింటింగ్ వేసేందుకు చిన్నారుల నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుని..‘‘కరోనా కాలంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తెలిపే విధంగా ఆర్ట్ వర్క్స్ను నాకు పంపండి’’ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులను జాఫ్రీ కోరాడు. జాఫ్రీ సందేశానికి స్పందించిన 140 దేశాల్లోని చిన్నారులు ఆన్లైన్ ద్వారా తమ ఆర్ట్వర్క్ను పంపించారు. అప్పుడు దుబాయ్లోని అట్లాంటిస్ హోమ్ హోటల్లో జాఫ్రీ సుమారు ఏడు నెలలపాటు రోజుకు 20గంటలపాటు కష్టపడి చిన్నారులు పంపిన చిత్రాలను జతచేస్తూ గతేడాది సెప్టెంబరులో పెయింటింగ్ను పూర్తిచేశాడు. 17 వేల చదరపు అడుగుల ‘జర్నీ ఆఫ్ హ్యూమానిటీ’ పెయింటింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించడం తో ఈపెయింటింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్గా నిలిచింది. ఇది నాలుగు ఎన్బీఏ బాస్కెట్ బాల్ కోర్టుల పరిమాణానికి సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ను దక్కించుకున్న అబ్దున్ మాట్లాడుతూ..‘‘నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. తినడానికి తిండిలేనప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఎన్నోసార్లు ఆ పరిస్థితులను నేను ప్రత్యక్షంగా అనుభవించాను. పెయింటింగ్ విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులు ఎంతో మంది చిన్నారుల ఆకలి తీరుస్తాయి. అందుకే రెట్టింపు ధరతో పెయింటింగ్ను సొంతం చేసుకున్నాను’’ అని ఆయన చెప్పారు. -
ఒక్క పెయింటింగ్ ధర రూ. 450 కోట్లు.. ప్రత్యేకత ఇదే!
అబుదాబి: ప్రపంచవ్యాప్తంగా పెయింటింగ్లకు ఎంతో విలువ ఉంటుంది. పెయింటింగ్ అంటే పడిచచ్చే వాళ్లు వాటి కోసం ఎంత డబ్బైయిన వెచ్చించి తమ సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలో వాటి ధర కోట్లలో పలికి.. అమ్ముడు పోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా వేలంలో ఓ పెయింట్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయింది. ఏకంగా రూ. 62 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 450 కోట్లు) అమ్ముడు పోయి ప్రపంచలోనే అత్యంత వీలువైన పెయింటింగ్గా గుర్తింపు పొంది గిన్నిస్ రికార్టుకెక్కింది. ఈ పెయింటింగ్ను బ్రిటిష్ చిత్రకారుడు సచా జాఫ్రీ వేశాడు. అయితే అతడు వేసిన ఈ పెయింటింగ్ విశేషం ఏంటో ఓ సారి చుద్దాం. ప్రముఖ బ్రిటిష్ పెయింటరైన సచా జాఫ్రీ దీనిని దుబాయ్లో రూపొందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్యాస్ పెయింటింగ్గా పెరొందిన దీనిని 17, 176 చదరపు అడుగుల మేర వేశాడట. అంటే ఇది 6 టెన్నిస్ కోర్టులతో సమానం. దీంతో ఈ పెయింటింగ్ను మొత్తం 70 భాగాలు విభజించి దుబాయ్లో వేలం వేయగా 450 రూపాలయ కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. మనుషుల జీవన మనుగడను ప్రతిబించే ఈ పెయింటింగ్ను ‘జర్నీ ఆఫ్ హుమానిటీ’ పేరుతో జాఫ్రీ దీనిని రూపొందించాడు. అయితే దీనిని గీసేందుకు అతడికి 1065 పెయింటింగ్ బ్రష్లు, 6,300 లీటర్ల పెయింటింగ్ పట్టిందట. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్గా గిన్నిస్బుక్ నిర్వాహక అధికారులు ధృవీకరించారు. అంతేగాక రికార్డుకు సంబంధించిన పత్రాన్ని ఆర్టిస్ట్ జాఫ్రీకి నిర్వాహకులు అందిచారు. ఈ పెయింటింగ్ను ఫ్రెంచ్కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యాపార వేత్త వేలం పాటలో రూ.450 కోట్లకు దక్కించుకోవడం విశేషం. చదవండి: చైతో ఇదే సమస్య.. దాని కోసం తరచూ వాదన: సామ్ వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్ వేసిన సైంటిస్టులు -
ఆర్ట్ ఎగ్జిబిషన్: సల్మాన్కు అరుదైన గౌరవం
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు పెయింటింగ్ అంటే ఆసక్తి అన్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఖాళీ సమయం దొరికనప్పుల్లా తన పెయింట్ బ్రష్కు పని చేప్తుంటాడు భాయిజాన్. అలా లాక్డౌన్లో ఆయన వేసిన కొన్ని పెయింటింగ్స్ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో సల్మాన్కు ఓ అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో బెంగళూరులో జరిగే ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్లో సల్మాన్ పెయింటింగ్లను ప్రదర్శించనున్నారు. అది కూడా ప్రముఖ భారత చిత్రకారుడైన రాజా రవి వర్మ పెయింటింగ్ చిత్రాలతో పాటు ఆయన పెయింటింగ్ను కూడా ప్రదర్శించనున్నారు. దీనిపై భాయిజాన్ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో శుక్రవారం పంచుకున్నాడు. ‘రాజా రవి వర్మ, అబనీంద్రనాథ్ ఠాగూర్, వీఎస్ గైతోండే వంటి గొప్ప కళాకారుల మధ్య నా పెయింటింగ్ ప్రదర్శించబోతుండటం నిజంగా విశేషం. ఈ విషయాన్ని గ్రహించడం కాస్తా ఇబ్బందిగా ఉంది. నిజంగా ఇది అరుదైన గౌరవం. అందరికి ధన్యవాదాలు’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. సల్మాన్ సంతకం చేసిన మదర్ థెరిస్సా పెయింటింగ్ను ఈ ఇమ్మోర్టల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. కాగా సల్మాన్ హీరోగా ప్రభుదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది రంజాన్కు విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో సల్మాన్కు జోడిగా దిశా పటాని నటిస్తుంది. ‘రాధే’తో పాటు మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ’ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) చదవండి: షారుక్ ఖాన్ సినిమాలో సల్మాన్! హీరో సల్మాన్ఖాన్ గుర్రం పేరిట మోసం -
ఎంఎఫ్ హుస్సేన్ ‘సినిమా ఘర్’.. ఇక ఫొటోలోనే..
సాక్షి, బంజారాహిల్స్: సినిమాలు, కళలను అనుసంధానిస్తూ ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్.హుస్సేన్ బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రధాన రహదారిలో తన కలల సౌధంగా నిర్మించుకున్న సినిమా ఘర్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఒక వైపు సినిమాలను, ఇంకోవైపు పెయింటింగ్స్ను తిలకిస్తూ కళాకారులు మురిసిపోయే విధంగా 1994లో ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడ సినిమా ఘర్ పేరుతో తన సొంత ఆలోచనతో దీన్ని నిర్మించారు. అప్పటి బాలీవుడ్ అగ్రనటి మాధురి దీక్షిత్ చేతులమీదుగా ప్రారంభించారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు దీని నిర్వహణ వదిలేశారు. కోట్ల విలువ చేసే పెయింటింగ్స్ను ముంబైకి తరలించారు. పది సంవత్సరాల నుంచి ఈ భవనం శిథిలావస్థలోనే ఉంది. పదేళ్ల క్రితమే మళ్లీ తెరుస్తామని ప్రకటనలు వచ్చినప్పటికీ ఆ లోపే ఆయన 2011 జూన్ 9న మరణించడంతో మళ్లీ తెరుచుకోలేదు. ఎంఎఫ్ హుస్సేన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ సినిమా పేరుతో కనువిందుగా ఈ మ్యూజియంను తీర్చిదిద్దారు. 50 మంది కూర్చొని సినిమా తిలకించే విధంగా సౌందర్య టాకీస్ పేరుతో ఇందులో మినీ థియేటర్ కూడా ఉండేది. ఇక పెయింటింగ్స్, బుక్స్, పోస్ట్కార్డుల ప్రదర్శన కోసం ప్యారిస్ సూట్ పేరుతో మరో హాల్ ఉండేది. తరచూ ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడికి వచ్చి తన సన్నిహితులతో, కళాకారులతో సంభాషిస్తూ ఉండేవారు. ఆయన మరణం సినిమా ఘర్ పాలిట శాపంగా మారింది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చివేస్తుంటే కళాభిమానులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఎంఎఫ్ హుస్సేన్ జ్ఞాపకాలు కళ్లముందే కూలిపోతుంటే ప్రతిఒక్కరూ చలించిపోతున్నారు. కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఈ భవనాన్ని తీసుకొని కళాకారుల సందర్శనార్థం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. -
శశి సమయం
కవి సమయం అనే మాట ఉంది. సృజనాత్మకత జనియించే క్షణాలవి! అతిరా శశికి లాక్డౌన్ కాలమంతా ‘కళా సమయం’ అయింది. ఆ తీరిక వేళ ప్రాచీన మండల కళతో ఆమె తన భావాలకు రూపం ఇచ్చి రికార్డులు నెలకొల్పారు. అందుకే లాక్డౌన్లో ఆమె సద్వినియోగం చేసుకున్న సమయాన్ని శశి సమయం అనాలి. కరోనా మహమ్మారి కొన్నాళ్లపాటు అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఇంటి గడప దాటి బయటకు రావడానికి వీల్లేని పరిస్థితుల్లో కొందరు విసుగ్గా రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపేస్తే, మరికొందరు తమలోని కళానైపుణ్యాలను వెలికితీసే పనిలో పడ్డారు. రెండవ కోవలోకి వస్తారు కేరళలోని మున్నార్లో ఉంటున్న అతిరా శశి. లాక్డౌన్ టైమ్లో ఆమె ఓ కొత్త ఆర్ట్ నేర్చుకోవడమే కాకుండా ఆ కళలో రాణించి ఏకంగా రికార్డులే తన ఖాతాలో వేసుకున్నారు! మండల ఆర్ట్ అనేది మన భారతీయ ప్రాచీన కళ. మండలం అంటే సంస్కృతంలో ‘వలయం’ అని అర్థం. వలయాకారంలోఉండే జామెట్రీ డిజైన్ ఈ ‘మండల ఆర్ట్’. మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర రాష్ట్రాలలో వస్త్ర ముద్రణలో ఈ మండల కళను ఉపయోగిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలోనూ ఈ కళ ప్రాచుర్యంలో ఉంది. ఇందులో శశి రికార్డులు నెలకొల్పారు. మండల ఆర్ట్ ఆధారంగా అతిరా శశి పెయింట్స్ వేయడం సాధన చేశారు. భారతీయ రాష్ట్రాలు, వాటి రాజధానులు, వర్ణమాల, పర్యావరణం, రాశీచక్ర గుర్తులు సహా వంద రకాల పెయింట్స్ వేసినందుకు 21 ఏళ్ల శశి పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్లలో నమోదయ్యింది. ఆమె వేసిన పెయింటింగ్స్లో గౌతమ బుద్ధ సంస్కృతి మూలాలు లోతుగా పాతుకుపోయిన టిబెట్, భూటాన్, మయన్మార్ వంటి ప్రదేశాలు సైతం ఉండటం విశేషం. అతిరా శశి ఈ కళను ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ‘నా చిన్నతనంలో నాన్న ఉద్యోగరీత్యా మేము గుజరాత్లో ఉండేవాళ్లం. మొదట అక్కడే ఈ ఆర్ట్ను చూశాను. వాటిని పరిశీలించినప్పుడు దుపట్టా, చీరలపై ఈ ఆర్ట్ను అక్కడి కళాకారులు ఎంతో శ్రద్ధగా వేసినట్లుగా అనిపించింది. గుజరాత్ నుంచి మున్నార్ తిరిగి వచ్చాక కాలేజీ చదువులో పడిపోయాను. ఎప్పుడైనా రిలాక్స్ అవడానికి మాత్రం మండల ఆర్ట్ని వేయడానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. లాక్డౌన్ సమయంలో వంద రకాల భిన్నమైన మండల ఆర్ట్ను పెయింటింగ్గా రూపుకట్టడంతో అవార్డులు వరించాయి’’ అని శశి చెప్పారు. బిబిఎలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అతిరా శశిని చూస్తే ఒక విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ‘అందరికీ సమయం ఒకటే. దానిని సరిగ్గా ఉపయోగించుకున్నవారినే విజయం వరిస్తుంది’ అని.. -
ఎలుక పెయింటింగ్కు అన్ని వేలా?
-
ఎలుక పెయింటింగ్కు ఎంత డిమాండో..
లండన్ : పెయింటింగ్.. సహజంగా వివిధ రంగులతో ఉండి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి కళా రూపాన్ని కొన్ని లక్షలు పోసి కొంటారు. అయితే కళకు మనుషులు, జంతువులు అన్న భేదం లేదని నిరూపించింది ఓ ఎలుక. తన చిట్టి పొట్టి పాదాలతో ఓ కళాఖండాన్ని రూపొందించింది. ఈ చిట్టెలుక గీసిన బొమ్మను వేలు పెట్టి కొంటారని మీకు తెలుసా. అవునండి.. ఎలుక గీసిన చిత్రం ఏకంగా 1000 పౌండ్లు (అక్షరాల 92 వేలు) సంపాందించింది. (బుడ్డోడి వలకు చిక్కిన ఖజానా; కానీ) వివరాళ్లోకి వెళితే.. మాంచెస్టర్కు చెందిన జెస్ అనే మహిళ కొన్ని ఎలుకలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో గుస్ అనే ఎలుకతో ఓ పెయింటింగ్ వేసింది. డ్రాయింగ్ రూమ్లో ఎలుక పాదాలను పెయింట్లో ముంచి కొన్ని కాగితాలపై ఉంచారు. అది అటు ఇటు తిరుగుతుంటే పేపర్పై ఎలుక అడుగులు కలర్ఫుల్గా ఏర్పడ్డాయి. అలా కొన్ని పేపర్లపై వేసిన ఎలుక పాదాల పేయింటింగ్లన్నింటినీ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. అలా పెయింటింగ్లు అన్ని అమ్ముడుపోగా జెస్ మొత్తం 1000 పౌండ్లను రాబట్టింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'ఎలుక చిత్రాలకు ఇంత మార్కెట్ ఉందా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుస్ ప్రస్తుతం మినీ ‘హెన్రీ మాటిస్సే’ అయ్యిందని ఆమె అన్నారు. (నేను మాస్కు ధరించా.. మరి మీరు: మహేశ్) -
ఫ్రెంచ్ వాల్పై.. సిటీ చిత్రం
తొలిసారి సిటీ స్ట్రీట్ ఆర్ట్కు విదేశీ ఆతిథ్యం లభించింది. ఫ్రెంచి గోడలపై నగర‘వాసి’ కాంతులీనింది. పారిస్ నగరం కారణంగా అంతర్జాతీయంగా ఫ్యాషన్లకూ పెయింటింగ్స్కూ..అంతెందుకు సకల కళలకూ రాజధానిగా మారిన ఫ్రాన్స్ దేశంలో మన నగరానికి చెందిన చిత్రకారుడు..అదీ స్ట్రీట్ ఆర్టిస్ట్ కుంచె కదిలించారు. ప్రస్తుతం ఆ చిత్రం భాగ్యనగర కళా ప్రతిభకు సాక్షిగా స్థానికుల అభినందనలు అందుకుంటోంది. -సాక్షి, సిటీ బ్యూరో సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆర్టిస్టులెందరో ఉన్నారు. దేశ విదేశాల్లో తమదైన ముద్ర వేసిన గొప్ప గొప్ప చిత్రకారులు ఉన్నారు. అయితే సిటీలో స్ట్రీట్ ఆర్టిస్టులు తక్కువే. అందులోనూ సిటీని గ్లోబల్ చిత్ర పటంలో పెట్టే స్ట్రీట్ ఆర్టిస్టులు దాదాపు లేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ఆర్టిస్ట్స్ జంట స్వాతి, విజయ్లు ఈ ఘనత సాధించి భాగ్యనగర యువ చిత్రకారుల ప్రతిభను అంతర్జాతీయం చేశారు. ఫ్రాన్స్లో పర్యటన ముగించుకుని వచ్చిన ఈ యువ చిత్రకారులు, దంపతులు అయిన స్వాతి, విజయ్ తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారిలా... వసతులు అదరహో... మేం చేసిన ఆర్ట్వర్క్ 45 నుంచి 50 అడుగుల ఎత్తు, వెడల్పు కూడా దాదాపు అంతే ఉంటుంది. అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. మాకు వాలంటీర్గా వర్క్ చేయడానికి అసిస్టెంట్ని ఇచ్చారు. ఇద్దరికీ అన్నీ వసతులూ కల్పించి మాకు పేమెంట్ కూడా ఇచ్చారు. మా ఆర్ట్ వర్క్కి కూడా ఇండియన్ ట్రెడిషన్ మేళవించాం. బొమ్మ గీసేటప్పుడు కింద పడతామేమో లాంటి కించిత్తు భయాలు కూడా లేకుండా మాతో పాటు సరంజామా పెట్టుకోవడానికి చక్కని స్టాక్ హోల్డింగ్ ఇచ్చారు. మా పరికరాలు వీధిలో వెళ్లేవారి మీద పడే అవకాశం లేకుండా నెట్ ఏర్పాటు చేశారు. మా జీవితంలో ఇంత హాయిగా, ఇబ్బంది లేకుండా స్ట్రీట్ ఆర్ట్ వేసిన సందర్భం లేదని చెప్పాలి. ఆశ్చర్యానుభూతులు పంచిన అవకాశం.. మేమిద్దరం కళాభిరుచితో పాటూ జీవితాన్నీ పంచుకున్నాం. విడివిడిగా కాకుండా స్వాతి విజయ్ పేరుతో ఒకే ఆర్టిస్టుగా కొనసాగుతున్నాం. నగరంలో చాలా గోడలపై మేం విభిన్న సమస్యలపై గీసిన చిత్రాలు నగరవాసులు చూసే ఉంటారు. దాదాపు ఆరేడేళ్లుగా రాత్రి పగలూ తేడా లేకుండా స్ట్రీట్ ఆర్ట్కి అంకితమయ్యాం. హైదరాబాద్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్, అలాగే మన దేశంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్స్లో పాల్గొన్నాం. ఈ నేపథ్యంలో రెణ్నెళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్ట్కి మాకు పిలుపొచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే విదేశాల్లో నిర్వహించే అంతపెద్ద ఆర్ట్ ఫెస్టివల్కి అదీ ఇంత త్వరగా మాకు అవకాశం ఊహించలేదు. నెల రోజుల తర్వాత అధికారికంగా ఆహ్వానంతో పాటు వీసా, ఫ్లైట్ టిక్కెట్స్ కన్ఫర్మ్ అయ్యేదాకా మాకు నమ్మకం చిక్కలేదు. మ్యుజీషియన్ గోడపై మన సంగీత చిత్రం ఆ ఊరిలో అక్కడి మన ఇంటి గోడలు, కిటికీలు సహా అన్ని ఇళ్లూ ఒకే డిజైనింగ్లో ఉంటాయి. ఇంటిలో ఇంటర్నల్గా మార్పు చేర్పులు మన ఇష్టం కానీ బయట చేసే మార్పులకు మాత్రం ప్రభుత్వ అనుమతి అవసరం. మాకు ఒక ప్రైవేట్ భవనాన్ని ఇచ్చారు. అది ఒక మ్యుజీషియన్ది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేం కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నాం. మేం గీసిన చిత్రంలో ఒక మోడ్రన్ మ్యూజిక్ని తన్మయత్వంతో హెడ్ఫోన్స్ పెట్టుకుని వింటున్న ఒక అమ్మాయి చిత్రం. దీనిలో భారతీయతను మేళవిస్తూ...ఆ అమ్మాయి వీణ మోస్తూ ఉన్నట్టు గీశాం. అంటే ఎంత మోడ్రౖనైజ్ అయినా కూడా సంప్రదాయాన్ని వదలం అని చెప్పకనే చెప్పాం. ఆర్ట్ హబ్ చేయడం మంచి ఆలోచన మొత్తం మీద స్వంతంగా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా విదేశీ ఆతిథ్యం తీసుకుని, రెమ్యునరేషన్ సహా అందుకుని ఈ నెల 18న తిరిగి వచ్చాం. ఆ ఊరిలో ఈ 150 చిత్రాలు అయ్యేటప్పటికి మరో సంవత్సరం..రెండు సంవత్సరాలు పడుతుంది. ఒక ఊరు మొత్తం 150 పెయింటింగ్స్తో ఆర్ట్ హబ్గా మార్చాలనే వారి ఆలోచన నాకు బాగా నచ్చింది. మన రాష్ట్రంలో కూడా ఏదైనా ఒక ఊరు తీసుకుని ఇలా చేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. స్వాగతించిన కళా నగరం ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్ట్ ఫ్రాన్స్లోని బోర్డోలో ఉన్న డ్యాక్స్ సిటీలో నిర్వహిస్తున్నారు. విభిన్న దేశాల నుంచి 150 మంది స్ట్రీట్ ఆర్టిస్ట్స్ పాల్గొంటున్న ఈ ఈవెంట్లో మన దేశం తరపున గత నెల 28న ఫ్రాన్స్లో అడుగుపెట్టాం. ఒక్కోక్కరికి ఒక్కో ఆర్ట్ వర్క్ వేసే అవకాశం అందించారు. అయితే ఒకేసారి అన్ని ఆర్ట్ వర్క్స్ మేనేజ్ చేయలేరు కాబట్టి ఫేజ్ల వారీగా చేస్తున్నారు. మేం మూడవ ఫేజ్లో పాల్గొన్నాం. అది బాగా రిచ్ పీపుల్ ఉండే ప్రాంతం. ఆర్ట్కి చాలా గౌరవం లభిస్తుంది. మాకిచ్చిన వర్క్ పూర్తి చేయడం కోసం 8 రోజులు పట్టింది మాకు. -
గోరునే కుంచెగా మలిచి..
సాక్షి, నంగునూరు(సిద్దిపేట) : సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు పల్లె కళాకారుడు. గోరును కుంచెగా మలిచి అద్భుత చిత్రాలను ఆవిష్కరిస్తున్నాడు బస్వరాజ్ రాజమౌళి. పోస్ట్ కార్డులపై భారీ భరతమాత చిత్రాన్ని గీయడంతో లిమ్కా బుక్ఆఫ్ రికార్డుతో పాటు ఇండియన్ వరల్ట్ రికార్డు సొంతమైంది. నంగునూరు మండలం పాలమాకులకు చెందిన రాజమౌళి చిన్నప్పటి నుంచి గోర్లతో చిత్రాలు వేయడం అలవాటుగా మారింది. పోస్టు కార్డును కాన్వాస్గా, గోరును కుంచెగా మలిచి అద్భుత చిత్రాలు గీస్తున్నాడు. కళ్ల ముందు కదలాడిన చిత్రాన్ని అట్టపై చేతి గోటితో ఏకాగ్రతతో గీసి మిగతా ప్రాంతాన్ని తొలగిస్తాడు. కార్డుపై కార్బన్ పేపర్తో రుద్దడంతో చిత్రం స్పష్టమవుతుంది. ఉపాధి కోసం మెకానిక్గా పనులు చేస్తూనే ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తాడు. అద్భుత చిత్రంతో రికార్డులు సొంతం.. బసవరాజ్ గోటితో తెలంగాణ తల్లి చిత్రాన్ని గీశాడు. దీనికి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్రావు మన్ననలు పొందాడు. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన స్ఫూర్తితో వరల్ట్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో పదివేల పోస్టుకార్డులతో 34 ఫీట్ల పొడవు, 16 ఫీట్ల వెడల్పుతో భరతమాత చిత్రాన్ని 45 రోజుల పాటు శ్రమించి అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించాడు. దీంతో 2012 ఆగస్టు 15న ఇండియన్ వరల్డ్ రికార్డుగా గుర్తించడంతో అప్పటి ఎమ్మెల్యే హరీశ్రావు తోపాటు అధికారులు ధ్రువపత్రాన్ని అందజేశారు. అలాగే రాజమౌళి గీసిన చిత్రాన్ని ప్రగతి భవన్లో ప్రదర్శించడంతో లిమ్కా రికార్డు అధికారులు గుర్తించారు. దీంతో 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లిమ్కా అవార్డు అందుకున్నాడు. విజయనగరంకు చెందిన నఖ చిత్రకారుడు సత్యనారాయణ గీసిన చిత్రం లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెక్కిన విషయాన్ని గ్రహించి అంతకన్నా భారీగా భరతమాత చిత్రాన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చి రూపొందిచడంతో అవార్డు సొంతమైందని చెబుతున్నాడు రాజమౌళి. తనకు తగిన ప్రోత్సాహం లభిస్తే మరిన్ని నఖ చిత్రాలను గీస్తానని చెబుతున్నారు. -
అద్భుత కళాఖండం.. ధరెంతో తెలిస్తే!!
ప్రఖ్యాత ఫ్రెంచ్ చిత్రకారుడు క్లాడ్ మోనెట్ కుంచె నుంచి జాలువారిన ఓ కళాఖండం వేలంలో రికార్డు ధర పలికింది. మ్యూల్స్గా నామకరణం చేసిన ఈ పెయింటింగ్ మంగళవారం 110.7 మిలియన్ డాలర్ల(దాదాపు 778 కోట్ల రూపాయలు)కు అమ్ముడు పోయింది. తద్వారా అత్యధిక ధరక పలికిన ఇమ్ప్రెసినిస్ట్ పెయింటింగ్గా చరిత్ర సృష్టించింది. హేస్టాక్ కలెక్షన్లో భాగంగా ఓ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన వేలంలో మ్యూల్స్ సహా కేవలం మూడు పెయింటింగులు మాత్రమే అమ్ముడుపోయాయి. కాగా ఫ్రాన్స్లో రూపుదిద్దుకున్న ఫ్రెంచ్ ఇమ్ప్రెనిజమ్(సంప్రదాయేతర పద్ధతిలో, విభిన్న కోణాల్లో పెయింటింగ్లు వేయడం)కు క్లాడ్ మోనెట్ను ఆద్యుడిగా పేర్కొంటారు. ఆయన పెటియింగ్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన 86 ఏళ్ల వయస్సులో 1926లో మరణించారు. ఇక తన పొరుగింటి వ్యక్తికి చెందిన కోతకొచ్చిన గోధుమ పంటను 25 రకాల పెయిటింగ్లలో మోనెట్ అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సిరీస్లో భాగమైన ఓ పెయింటింగ్కు మ్యూల్స్ అని పేరు పెట్టారు. మోనెట్ కుంచె నుంచి జాలువారిన అద్భుత కళాఖండాలను హేస్టాక్ కలెక్షన్ అని పిలుస్తారు. కాగా మంగళవారం నాటి వేలంలో భాగంగా కేవలం 8 నిమిషాల్లోనే మ్యూల్స్ అమ్ముడుపోయింది. అయితే మ్యూల్స్ను సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘పెయింటింగ్కు ఇంత ధరా. నమ్మలేకపోతున్నాం రా బాబూ’ అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. -
ఆన్లైన్లో ఆదివాసీ పెయింటింగ్లు
సాక్షి, ఏటూరు నాగారం: ఆదివాసీల పెయింటింగ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. గతంలో పెయింటింగ్లు వేసి కావాల్సిన వారికి విక్రయించే వారు. ఇప్పుడు ఆన్లైన్ సదుపాయం పెరగడంతో ఆదివాసీ కళాకారులు వేసిన పెయింటింగ్లను ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ట్రైబల్ పెయింటింగ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఇప్పటి వరకు పది చిత్రాలను అమెజాన్లో విక్రయానికి పెట్టగా ఆరు అమ్ముడుపోయాయి. హైదరాబాద్ ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ సారథ్యంలో ఆదివాసీ కళాకారులు వేసిన పెయింటింగ్లను విక్రయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా మేడారం మ్యూజియంలో కొంత మంది ఆదివాసీ కళాకారులకు పెయింటింగ్లు వేసేందుకు నిధులను సమకూర్చారు. దీంతో కొంత మంది కళాకారులు చిత్రాలు వేసి అమెజాన్లో విక్రయానికి పెట్టారు. ఒక్కో చిత్రానికి రూ.6,500 ధర నిర్ణయించారు. ఇలా వచ్చిన డబ్బును ఆదివాసీ కళాకారులకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరికొంత పెట్టుబడికి సహకరిస్తే మరిన్ని చిత్రాలు తయారు చేసి విక్రయిస్తామని కళాకారులు పేర్కొంటున్నారు. స్టాల్ ఏర్పాటుకు చర్యలు.. ఆదివాసీ, గిరిజన కళాకారులు రూపొందించిన చిత్రా లను వారే స్వయంగా విక్రయించేందుకు ప్రత్యేక సంతలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు జిల్లా, మండల, రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో సంత (స్టాల్స్) వంటివి ఏర్పాటు చేసి వారే స్వయంగా వాటిని విక్రయించి వచ్చిన డబ్బును సమానంగా పంచుకు నేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మదిలో నిలిచే మగువల చిత్రాలు
రాయచూరు రూరల్: కుంచెతో కళా నైపుణ్యం ఉట్టి పడేలా, జీవకళ ఉట్టిపడేలా పెయింటింగ్స్ వేయడంలో శశికాంత్ దోత్రేది అందె వేసిన చేయి. ఆయన గీసిన చిత్రాలను చూస్తే ఇది చిత్రమా, ఫోటోనా అనే భ్రమ కలగకమానదు. ఆ స్థాయిలో కుంచె సామర్థ్యాన్ని దోత్రే సొంతం. ఫొటోగ్రఫీని మించి కుంచె ద్వారా చిత్రాలు వేసిన దోత్రేకు ఏ బొమ్మనైనా అదే సర్వస్వమనే తపనతో లీనమై గీస్తారు. శశికాంత్ దోత్రే తండ్రి ఒక చిరుద్యోగి. శశికాంత్ పుట్టి, పెరిగింది, టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది రాయచూరు పట్టణంలోనే. తరువాత బదిలీపై మహారాష్ట్రలోని షోలాపూర్కు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నా చిత్ర కళను జీవితాశయంగా ఎంచుకున్నారు. మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పి ముంబాయి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబం, ఫీజులు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో మధ్యలో కళాభ్యాసాన్ని ఆపిన దోత్రే ఇంటిలోనే తన కుంచెకు పదును పెట్టారు. వివిధ రకాలైన కాగితాలలో రంగు రంగుల పెన్సిళ్లతో చిత్రాలు వేయడం ప్రారంభించాడు. చిత్రకళకు జీవకళ ఉట్టి పడేలా చేశాడు. జాగర్ పేరుతో దేశ వ్యాప్తంగా 40 నగరాలలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇటీవల రాయచూరులోని ఉపాధ్యాయుడు వెంకటేష్ నవలి నివాసంలో తన ప్రతిభను వివరించారు. బల్లపై కూర్చొని పూసలు అల్లుతున్న యువతులు, పూలు కుడుతున్న మహిళ, తిరగలితో ధాన్యం విసరడం, పాతకాలంలో గోళీలు ఆడుతున్న పిల్లలు, వంట చేస్తుంటే తల్లి వెనుక కొడుకు ఉండటం, దుప్పట్లు కుట్టడం, తులసి మొక్కకు నీరు పోస్తున్న మహిళ దృశ్యం సంభ్రమానికి గురిచేస్తాయి. దైనందిన జీవితమే చిత్రం తల్లి కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి, కూతురిని ముస్తాబు చేస్తున్న తల్లి, వంట కోసం కాయగూరలు తరుముతున్న దృశ్యం, అల్లికలు వేస్తున్న యువతి, ధాన్యం చెరుగుతున్న స్త్రీ.. ఇలా ఎన్నో పెయింటింగ్స్ కళ ఉట్టి పడుతూ మరులు గొలుపుతాయి. గోరింట పెట్టుకుంటున్న యువతులు, ఇంటివద్ద కట్టపై కూర్చుని మాట్లాడే మహిళలు.. ఇలా పేద, మధ్య తరగతి మానవ జీవితపు పార్శా్వలు చూపరులను ముగ్ధుల్ని చేస్తాయనడంలో సందేహం లేదు. -
కృషితో నాస్తి దుర్భిక్షం
అది ఆరవ తరగతి గది.‘‘ఏం అవినాష్ నిన్న నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు?’’ అడిగాడు సైన్స్ టీచర్ సుధాకర్ అవినాష్ వంక చూస్తూ.‘‘సార్..! మరి మన ఊర్లోకి ‘ఆనంద బాబా’ వచ్చారు కదా! ఆయన్ని చూడ్డానికి మా గల్లీలో వాళ్లంతా వెళ్తుంటే... మా అమ్మానాన్నా నన్ను కూడా తీసుకెళ్లారు సార్!’’ అన్నాడు అవినాష్.‘‘అవునా! అయితే నీకు పనేముంది ఆ బాబాతో’’ అడిగాడు సుధాకర్ సార్!‘‘సార్ మరేమో ‘ఆనంద బాబా’ చాలా మహిమలు కలిగినవాడట. ఆయన మంత్రం చదివి తాయత్తు కడితే... ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుందట. అందుకే నేను కూడా తాయత్తు కట్టించుకోవడానికి వెళ్లాను’’ అంటూ తనచేతికున్న తాయత్తు చూపించాడు అవినాష్.‘‘ఏం లాభమటా ఈ తాయత్తుతో?’’ వెటకారంగా అడిగాడు సుధాకర్‘‘మరి ఈ తాయత్తు కట్టుకుంటే పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు వస్తాయట సార్!’’ఎంతో అమాయకంగా చెప్పాడు అవినాష్.వాళ్లిద్దరి సంభాషణ క్లాస్లోని మిగతా పిల్లలంతా వింటున్నారు. ‘‘అరే మనం కూడా ఆ తాయత్తు కట్టించుకుంటే ర్యాంకులు తెచ్చుకోవచ్చు కదరా’’అనుకుంటున్నారంతా.సుధాకర్ సార్ పిల్లల మనసులోని ఆలోచనలను ఇట్టే పట్టేశాడు. ‘‘అయితే పిల్లలు మీరు కూడా అవినాష్లాగే తాయత్తు కట్టించుకోవాలనుకుంటున్నారా?’ అన్నాడు.‘‘అవును సార్!’’ అన్నారు పిల్లలంతా ముక్తకంఠంతో..‘అయ్యో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధించాలి కానీ ఇలా మాయలు, మంత్రాలు, తాయత్తులను నమ్మి పిల్లలు కృషిచేయకుండా సోమరిపోతుల్లా తయారవుతారని, ఇది వారి భవిష్యత్త్కు ఎంతో ప్రమాదమ’ని మనసులోనే అనుకున్నాడు సుధాకర్.అంతే కాకుండా ఆ ‘ఆనంద బాబా’ జనాలకు కష్టాలు తీరుతాయి. అనుకున్నవి జరుగుతాయని తాయత్తులిచ్చి వారి దగ్గర నుంచి పెద్దమొత్తంలో పైసలు గుంజే విధానం అప్పటికే తను విని ఉన్నాడు కనుకఎలాగైనా పిల్లల మనస్సులోని ఆ ఆలోచనలను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ‘ఆనంద బాబా’ చేసే మోసాలను పిల్లలకు ప్రత్యక్షంగా చూపించాలనుకున్నాడు. ఆ వెంటనే సుధాకర్ సార్.. స్కూల్లోని మిగతా టీచర్లతో ఈ విషయం గురించి చర్చించి చివరికి అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.పిల్లల దగ్గరి కొచ్చి ‘‘చూడండి పిల్లలు..! ఇప్పుడు మనమంతా ఆ ఆనంద బాబా దగ్గరకెళ్దాం. మన నాగరాజు సార్కి అమ్మాయి వేషం వేసి తీసుకెళ్దాం. అక్కడ బాబాను కొన్ని ప్రశ్నలు వేసి మనం పరీక్షిద్దాం.అతను కరెక్ట్గా సమాధానం చెబితే మీరంతా తాయత్తు కట్టుకోండి. లేదంటే ఆ బాబాకు ఏం తెలియదని, అతను చెప్పేదంతా బూటకమని తేలితే మీరు ఆయన చెప్పేది నమ్మకుండా కష్టపడి చదువుకోవాలి సరేనా?’’ అన్నాడు సుధాకర్ సార్. పిల్లలకు ఇందంతా తామాషాగా అనిపించింది. ‘‘అలాగే సార్!’’ అంటూ పిల్లలంతా గట్టిగా అరిచారు.సోషల్ టీచర్ నాగరాజు సార్కి అచ్చం అమ్మాయిలా ఉండేటట్లు చీర కట్టి, విగ్గు పెట్టి అమ్మాయిలా వేషం వేసి, పొట్టదగ్గర కనిపించకుండా బట్టలు చుట్టి.. కడుపు ఎత్తుగా వచ్చేటట్లు చేశారు.అవినాష్ని ఇంకా మిగిలిన పిల్లలను తీసుకుని ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఆనంద బాబా ఉండే చోటుకు వెళ్లారు.పువ్వులతో అలంకరించిన ఆసనంమీద ఆనంద బాబా కూర్చోని ఉన్నాడు.భక్తులంతా తన్మయత్వంతో అతను చెప్పే మాటలు వింటున్నారు.కాసేపటి తర్వాత భక్తులు ఒక్కొక్కరిగా వెళ్లి ఆయన కాళ్లకు మొక్కి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఆయన వాళ్లకి విభూతి, తాయత్తులు ఇస్తున్నాడు.సుధాకర్ సార్ కూడా ఆడవేషంలో ఉన్న నాగరాజు సార్ని తీసుకుని ‘ఆనందబాబా’ దగ్గరకు వెళ్లాడు. అనుమానం రాకుండా ఆనందబాబా కాళ్లను మొక్కారు.అప్పుడు సుధాకర్ సార్... ‘‘బాబా ఈమె నా భార్యకమల. మాకు పెళ్లై పదేళ్ల తర్వాత ఇప్పుడు తను గర్భం దాల్చింది. బాబా మీ మహిమలతో నా భార్య గర్భంలో ఉండేది ఏ బిడ్డో చెప్పండి’’ అన్నాడు.ఆనంద బాబా ఆడవేషంలో ఉన్న నాగరాజు సార్ని చూసి, అతని తలమీద చెయ్యి పెట్టి కళ్లు మూసుకుని ఏవో మంత్రాలు ఉచ్ఛరించాడు. తర్వాత కళ్లు తెరచి నవ్వుతూ ‘‘నాయనా..! నీ భార్యకు పండంటి మగబిడ్డ పుడతాడు. ఈ తాయత్తు ఆమె చేతికి కట్టునాయనా!’’ అన్నాడు. అంతే అక్కడ కూర్చున్న పిల్లలంతా పెద్దపెద్దగా నవ్వారు. వెంటనే పిల్లలవైపు తిరిగి.. ‘‘ఇప్పుడు చూశారు కదా పిల్లలూ..! ఈ బాబాకి ఎంత మహిమ ఉందో.. మన నాగరాజు సార్కి మగబిడ్డ పుడతాడట. ఇప్పుడు తెలిసింది కదా ఈ బాబా దగ్గర ఏ మాయలు, మహిమలు లేవని. ఇకనైనా మీరు ఇటువంటి దొంగబాబాల మాయమాటలు నమ్మడం మానేసి కష్టపడి చదువుకోవాలి. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు పెద్దలు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు ఈ లోకంలో. అలా కాకుండా ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మీరు సోమరిపోతులుగా తయారుకాకూడదు. మీ శ్రమనే మీరు నమ్ముకోవాలని మీకు తెలియజెప్పడానికే నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది’’ అన్నాడు.అర్థమైనట్లుగా పిల్లలంతా తలలు ఊపారు. ఆ తర్వాత బాబా మోసాలని గ్రహించిన గ్రామస్తులు ఆ బాబాని తరిమితరిమి కొట్టారు. - వి. రోహిణి -
పవిత్ర ఓటును తాకట్టు పెట్టకు..!
సాక్షి, జనగామ అర్బన్: ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దని రాజకీయ నాయకులు చేసే ఆచరణసాధ్యం కాని హామీలకు పవిత్ర ఓటును తాకట్టు పెట్టొద్దని, ప్రజాసేవ చేసే నాయకుడికే ఓటు వేయాలని ప్రజల్లో ఆలోచన రేకెత్తించే విధంగా జనగామ ప్రభుత్వ పాఠశాల (రైల్వేస్టేషన్ రోడ్డు) డ్రాయింగ్ మాస్టర్ సయ్యద్ హాష్మతుల్లా గీసిన ఈ చిత్రం పలువురిని ఆలోచింపజేస్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుడి భాధ్యతే కాకుండా దానిని సరిగ్గా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. -
గుడ్డును గుర్తు పట్టండి చూద్దాం!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రెండు ఎగ్స్ను చూస్తే మీకేమనిపిస్తోంది? వెంటనే ఆమ్లెట్ వేసుకుని లాగించేయాలని నోరూరుతోంది కదూ? అయితే వాటిలో ఒకటి మాత్రమే రియల్ ఎగ్! నమ్మరు కదా? అందులో ఒకటి పేయింటింగ్. అయితే ఏది రియల్ ఎగ్గో గుర్తు పట్టండి చూద్దాం.. ఈ ఫొటోను జపాన్ పెయింటర్ యాస్ తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసి ‘గుర్తుపట్టండి చూద్దాం’అని పోస్టు చేశాడు. అయితే చాలా మంది రియల్ ఎగ్ను గుర్తు పట్టలేకపోయారు. దీన్ని హైపర్ రియలిస్టిక్ పెయింటింగ్ అంటారు. పండ్లు, కూరగాయల క్రాస్ సెక్షన్ ఫొటోలను సైతం నిజమైనదేదో గుర్తు పట్టలేనంతగా యాస్ గీస్తాడు. తాను గీసిన హైపర్రియలిస్టిక్ పెయింటింగ్స్లో ఇదే అత్యుత్తమమైనదని యాస్ చెప్పారు. దీనికి ట్విట్టర్లో 63 వేల లైక్లు వచ్చాయి. ఈ పెయింటింగ్స్కి కొన్ని గంటల సమయం వెచ్చిస్తానని, కొన్ని సార్లు వీటికి రోజులు కూడా పడుతుందన్నారు. అయితే ఫ్యాన్స్ నుంచి వచ్చే స్పందన తన కష్టం మరిచిపోయేలా చేస్తుందని యాస్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏది నిజమైన ఎగ్గో గుర్తుపట్టారా? కుడివైపు ఉన్నది రియల్ ఎగ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే! -
పగలు పెయింటింగ్...రాత్రిళ్లు చోరీలు
సాక్షి, సిటీబ్యూరో: పెయింటర్లుగా ఇంటికి రంగులు వేస్తూ రెక్కీలు నిర్వహిస్తూ రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యులతో కూడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ సీసీఎస్, ఆర్జీఐఏ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన 15 తులాల బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లా గద్వాచౌరకు చెందిన మహమ్మద్ అబేద్ ఆలీ కూరగాయల వ్యాపారం చేసే తండ్రికి చేదోడు వాదోడుగాఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన మోహన్ యాదవ్తో కలిసి కిరాణా దుకాణం లో రూ.50 వేలు దొంగిలించిన కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 జనవరిలో జైలు నుంచి విడుదైన తర్వాత మోహన్ బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వలస వచ్చి గొల్కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం అబేద్ ఆలీ, తన స్నేహితుడు షేక్ ఫరూక్ హుస్సేన్తో కలిసి నగరానికి వచ్చి మోహన్యాదవ్తో కలిసి ఉంటున్నారు. పెయింటర్లుగా పని చేసే వీరు జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్హౌస్కు రంగులు వేసేందుకు వెళ్లిన వారు ఇంట్లో వృద్ధ దంపతులు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి చోరీకి పథకం పన్నారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి ఫామ్హౌస్కు చేరుకున్న వీరిలో మోహన్ యాదవ్ బయట కాపలా ఉండగా అబేద్ ఆలీ, ఫరూక్ హుస్సేన్ ఇంటి గ్రిల్స్ తొలగించి కిటికీ ద్వారా లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకొని పారిపోయారు. పోలీసులు ఘటనాస్థలిలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా యూపీకి చెందిన పాతనేరగాళ్ల పనిగా గుర్తించారు. వృద్ధ దంపతులను విచారించగా ఇంటికి రంగులు వేసేందుకు యూపీకి చెందిన వారు వచ్చినట్లు చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. గోల్కొండలో అద్దె గదిలో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన వజ్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రత్యేకంగా కృషి చేసిన శంషాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్లతో పాటు ఇతర సిబ్బందిని సీపీ సన్మానించారు. -
బార్లో గాంధీ వాల్పెయింటింగ్.. ఆగ్రహం!
దుబాయ్ : భారత జాతిపిత మహాత్మా గాంధీకి దుబాయ్లో తీవ్ర అవమానం జరిగింది. గాంధీ ఫోటోను పోలివుండే పెయింటింగ్ను బార్ యాజమాన్యం మద్యంసేవించే ప్రాంతంలో వేసింది. దీనిపై భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. గాంధీ పెయింటింగ్ కలిగి ఉన్న ఫోటోను యాజమాన్యం ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో ఈ విషయం భారతీయుల దృష్టికి వచ్చింది. ఆ ఫోటోలో మహిళలు, పురుషులు మద్యం సేవిస్తూ వెనుక గాంధీ పెయింటింగ్ కనిపిస్తూ ఉంటుంది. దీనిని దుబాయ్లోని భారత ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లగా బార్ యాజమాన్యంపై న్యాయ బద్దంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సెప్టెంబర్ 28న దుబాయ్లోని అల్ మన్ఖుల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటనపై దుబాయ్లోని భారత న్యాయవాది అంజనా భాటియా మాట్లాడుతూ.. భారతీయూల మనోభావాలు దెబ్బతినేలా జాతిపిత గాంధీ పెయింటింగ్ను బార్లో వేశారని, పెయింటింగ్ ముందు మహిళలు అసభ్యకరంగా మద్యం తాగుతూ డ్యాన్స్ చేస్తున్నారని విమర్శించారు. భారత్లో ఇలాంటి చర్యలు శిక్షించ తగ్గ నేరంగా భావిస్తారని.. యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకునేలా పోరాడతామన్నారు. భారతీయుల ఎక్కువగా ఉపాధి పొందే దుబాయ్లో గాంధీని ఇలా అవమానించడం తమకు ఎంతో నిరశ కలిగిందని న్యాయవాది అన్నారు. -
హైపర్ రియలిస్టిక్ ‘బ్రహ్మ’
హైపర్ రియలిజం.. హై రిజల్యూషన్ చిత్రాలను పోలి ఉండే చిత్రలేఖనం లేదా శిల్పశైలి. ఇది అంత తేలికైన కళేం కాదు. 1970లో యూరోప్, అమెరికాలో అభివృద్ధి చెందిన ఈ కళ..ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. హైపర్ రియలిజం ఆర్ట్లో చేయితిరిగిన కళాకారులు ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ కొద్ది మంది కళాకారుల సరసన తానూ నిలవాలని తపించాడో వ్యక్తి. లక్ష్యం దిశగా అడుగులేసే క్రమంలో చిత్రకళాప్రపంచంలో అతిరథ మహారథులను కలిశాడు. పెయింటింగ్లో మెళకువలను అవపోసన పట్టాడు. తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. హైపర్ రియలిస్టిక్ ‘బ్రహ్మ’గా పేరు సంపాదించిన కళాకారుడు యేలూరి శేషబ్రహ్మం విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా కవులకు, కళాకారులకు పట్టుకొమ్మ అని అనేక సందర్భాల్లో నిరూపితమవుతూనే ఉంది. మన జిల్లాకు రెండు వేల సంవత్సరాల కళావారసత్వం ఉంది. బౌద్ధులు, ఇక్ష్వాకులు, చాళుక్యుల కాలం నుంచి ఇప్పటి ఆధునిక కాలం వరకు ఈ గడ్డ అబ్బురపడే కళాకారులని ప్రపంచానికి అందిస్తూనే ఉంది. ఈ నేల అస్తిత్వం కలిగిన ఈ తరం చిత్రకారుడు యేలూరి శేషబ్రహ్మం. చిత్రకళా ప్రపంచంలో బ్రహ్మగా పిలువబడే శేషబ్రహ్మం 1976లో వెంకటసుబ్బారావు, వరలక్ష్మి దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. వీరి పూర్వీకుల నుంచి కళాకారుల నేపథ్యం ఉండటంతో బ్రహ్మం చిన్నతనం నుంచే చిత్రకళపై అమితాసక్తి చూపుతూ అదే రంగంలో రాటుదేలాడు. చిన్న వయసులో చిత్రలేఖనం సాధన ప్రారంభించి ఒంగోలులో కొంతకాలం డ్రాయింగ్ మాస్టర్ రామకృష్ణ, సూర్య ఆర్ట్స్ జె.వెంకటేశ్వర్లు వద్ద శిష్యరికం చేశాడు. పదో తరగతి వరకు ఒంగోలులో విద్యనభ్యసించిన బ్రహ్మం.. చిత్రకళనే జీవితంగా మలుచుకోవాలని భావించాడు. ఒంగోలుకు చెందిన ఆధునిక చిత్రకారుడు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు సలహా మేరకు హైదరబాద్లోని జేఎన్టీయూలో సీటు సాధించి బ్యాచ్లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్ఏ) పూర్తి చేశాడు. యూనివర్శిటీలో బీఎఫ్ఏ చేసే రోజుల్లో బ్రహ్మం ఆసక్తిని గమనించిన గురువులు, సీనియర్లు చిత్రలేఖనం, పెయింటింగ్తోపాటు పలు అంశాల్లో మెళకువలు నేర్పారు. వాటిని అందిపుచ్చుకున్న బ్రహ్మం తనకంటూ ఒక శైలిని ఎంచుకోవడంలో అడుగు ముందుకు వేశాడు. అబ్బురపరిచే చిత్రాలను వేసి ఔరా అనిపించాడు. యూనివర్శిటీలో తరగతులు ముగియగానే ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం, చిత్రకారులు, శిల్పకారులు, ఫోటోగ్రాఫర్ల జీవితాలను, కళలను అధ్యయనం చేసేవాడు. పెన్సిల్, క్రేయాన్స్, ఆయిల్ కలర్స్, వాటర్ కలర్స్ ఇలా అన్ని రకాల మీడియంలలో చిత్రాలను సాధన చేసి వందలాది చిత్రాలను మలిచాడు. హైపర్ రియలిజం వైపు అడుగులు బ్రహ్మం ప్రపంచంలోనే అతి తక్కువ మంది చెయ్యగలిగే శైలి అయినటువంటి ‘హైపర్ రియలిజం’ శైలిని ఎంచుకుని అనేక చిత్రాలను గీశాడు. రాష్ట్రీ, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ అందుకోవడమే కాకుండా ఒక సందర్భంలో ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ నుంచి ప్రశంస పత్రం అందుకున్నాడు. కాలేజీ విద్య అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా తన కళా సాధనను ఇంకా వృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. పదేళ్లపాటు దేశంలోని అనేక చారిత్రక, గ్రామీణ, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు తిరుగుతూ ప్రకృతిలోని రంగుల మేళవింపును ఆకళింపు చేసుకున్నాడు. ఒక కళాకారునికి ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధం కొన్ని వందల పెయింటింగ్లు వేసేందుకు పురిగొల్పింది. తాను కళా సాధన చేస్తూనే వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు వారంతా చిత్రకళా రంగంలో స్థిరపడి ఉండటం విశేషం. శిల్పకళలోనూ ప్రావీణ్యం కేవలం చిత్రకళలోనే కాకుండా శిల్పకళలోనూ తర్ఫీదు పొంది మోల్డింగ్ క్లే, ఫైబర్, గ్రానైట్ స్టోన్పై శిల్పాలు మలచడంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం పొందారు. శిల్పకళా ప్రావీణ్యం గమనించిన హైదరబాద్లోని జనహర్ష కంపెనీ నిర్మించ తలపెట్టిన వందకోట్ల ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్ ఇన్చార్జిగా బ్రహ్మాన్ని నియమించారు. జనహర్ష చేపట్టిన ప్రాజెక్టులోని రిసార్టుల్లో కళాకౌశలం దేశంలో అత్యంత అందమైనదిగా రూపుదిద్దుకుంటోంది. గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్లో స్వయంగా కంపెనీ ప్రారంభించి అందమైన శిల్పాలు తయారు చేస్తున్నారు. తన స్నేహితులు బాలసుబ్రహ్మణ్యం, చిన్నమస్తాన్తో కలిసి స్వయంగా కటింగ్ మిషన్ తయారు చేసుకోవడం విశేషం. కళలతో పాటు సామాజిక బాధ్యతను మరువకుండా గతంలో ఒంగోలులో ‘ఒపాక్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి భూగోళాన్ని కభళిస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలపై యుద్ధం ప్రకటించారు. నో ప్లాస్టిక్ నినాదంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సామాజిక బాధ్యతను గుర్తుచేశారు. తిరుమల సన్నిధిలో వెంకన్న నేత్రదర్శనం పెయింటింగ్ తిరుమల వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం పెయింటింగ్ వేసేందుకు దేశంలో పేరుగాంచిన చిత్రకారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. బ్రహ్మంలోని రియలిస్టిక్ ఆర్టిస్ట్ను గుర్తించి ఎంపిక చేశారు. నాలుగు గురువారాలు స్వామివారి సన్నిధిలో గడిపి వేంకటేశ్వరుని నేత్రదర్శనం పెయింటింగ్ వేశారు బ్రహ్మం. ఆ పెయింటింగ్ ఎంతో ప్రాచుర్యం పొంది ఇప్పుడు వాడవాడలా దర్శనమిస్తోంది. ఇప్పటికీ ఆ ఒరిజినల్ పెయింటింగ్ పద్మావతి అమ్మవారి దేవస్థానంలో గర్భగుడి ఎదురుగా అలకరించి ఉంది. ఆ పెయింటింగ్ వేసే సమయానికి బ్రహ్మం వయసు కేవలం 21 సంవత్సరాలు. విస్తరించిన కళ బ్రహ్మం నెమ్మదిగా తన కళను అనేక రంగాలకు విస్తరించాడు. ఇంటీరీయర్, ఎక్స్టీరియర్, డిజైనింగ్, ఫ్యాబ్రిక్ డిజైనింగ్, డిజిటల్ పెయింటింగ్స్, మెషిన్ మేకింగ్ ఇలా పలు రకాలుగా ప్రయోగాలు చేస్తూ.. విజయం సాధిస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంతోమంది కవులు రాసిన పుస్తకాల కవర్ పేజీలు బ్రహ్మం కుంచె నుంచి జాలువారినవే. నాన్నకు ప్రేమతో, భాగమతి, మహానుభావుడు, లై తదితర చలనచిత్రాల్లో తను వేసిన పెయింటింగ్లు ప్రముఖంగా కనిపిస్తాయి. ముంబయిలోని పలు ఫైన్ఆర్ట్స్ కాలేజీల్లో బ్రహ్మం చిత్రాల డెమోనిస్ట్రేషన్ జరిగిందంటే ఆయన ప్రతిభ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలో ఎంఎఫ్ హుస్సేన్ చిత్రం చదువుకునే రోజుల్లో ఒకసారి ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ హైదరాబాద్ రావడంతో ఆయనను కలిశాడు. ఆయనతో మాట్లాడుతూ కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే చార్కోల్తో ఎంఎఫ్ హుస్సేన్ స్కెచ్ వేసి ఆశీస్సులు పొందాడు. ప్రఖ్యాత వ్యంగ్య చిత్రకారుడు మోహన్.. బ్రహ్మం గీసిన చిత్రాలను మెచ్చుకుని ఆయన వద్దే కొంత కాలం ఉంచుకుని రొమాంటిసిజం, ఇంప్రెషనిజం, క్యూబిజం, మోడరన్ ఆర్ట్స్ తదితర చిత్రకళా రీతులను, జపనీస్, చైనీస్ వాటర్ కలర్, ఇండియన్ మినీయేచర్ చిత్రాల గొప్పదనాన్ని వివరించి శిక్షణ ఇచ్చారు. శ్రీమతి సహకారం.. స్నేహ బంధం బ్రమ్మం శ్రీమతి వాణి కూడా కళాకారిణి కావడంతో తన సాధనకు చేయూత లభించిందని ఆయన చెబుతుంటారు. అంతేకాకుండా కాలేజీ రోజుల నుంచి తన సహ విద్యార్థి అయిన ప్రముఖ చిత్రకారుడు ఆంజనేయులు, బ్రహ్మంది విడదీయరాని స్నేహబంధం. ఎవరి సాధన వారు చేస్తున్నా ఒకే రూమ్లో ఉండటం, వివాహాలైన తర్వాత కూడా ఒకే నివాసంలో పక్కపకనే ఉండటంతోపాటు ఒకే స్టూడియోలో ఇప్పటికీ పెయింటింగ్ వేసుకుంటూ స్నేహానికి నిర్వచనంగా నిలుస్తున్నారు. టార్గెట్ 2020 రెండేళ్ల క్రితం ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ బ్రహ్మం డ్రాయింగ్ కొనుగోలు చేసి తన నివాసంలోని హాల్లో అలంకరించుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మం దృష్టి 2020లో ఢిల్లీలో నిర్వహించనున్న పెయింటింగ్ ఎగ్జిబిషన్పైనే ఉంది. పదహారు కళాకండాలతో పద్రర్శించబోయే ఈ సోలో ప్రదర్శనలో శేషబ్రహ్మం విజేతగా నిలవాలని ఆశిద్దాం. -
బొమ్మ కూచి
రేఖలలో మనోధర్మం. లేఖనంలో కీర్తనల సారం. విద్వాంసుల అంతర్ముఖం. ముఖచిత్ర ప్రబంధనం. గాత్రచిత్రాల ఖండాతరయానం. ఇదీ కూచి సాయిశంకర్ పరిచయం! చిత్రకళావధానం చేయడానికి సన్నద్ధులవుతున్న సందర్భంగా ఈ గాత్రచిత్రకళామతల్లి ‘కూచి’తో ఇది సాక్షి సంభాషణం. ‘‘నా ఐదో ఏట నాన్న ఒడిలో కూర్చుని వేసిన వంకాయ బొమ్మ నన్ను చిత్రకారుడిని చేసింది’’ అంటున్న ‘కూచి’ స్వస్థలం అమలాపురం. తండ్రి.. కూచి వీరభద్ర శర్మ హరికథలలో కనకాభిషేకం చేయించుకున్న కళాకారుడు! ‘‘కాలేజీ తరఫున చిత్రలేఖనం పోటీలకు వెళ్లి బహుమతులు అందుకున్నాను. కళ వైపు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించమని, సాహిత్యం బాగా చదవమని అన్నయ్యలు ప్రోత్సహించి, నాతో పుస్తకాలు చదివించారు. తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ నా బొమ్మలకు భగవద్గీత లాంటిది. పెయింటర్గా అది నాకు ప్రేరణ’’ అంటారు కూచి. ‘‘బాపు గారి గీత, వడ్డాది పాపయ్య కలరింగ్ నాకు ఇష్టం. వీరిద్దరినీ కలిపితే కూచి’’ అంటున్న కూచి... వడ్డాది పాపయ్యకు ఏకలవ్య శిష్యుడు. లైన్ డ్రాయింగ్ నేరుగా బాపు దగ్గర నేర్చుకున్నారు. ఇప్పటివారిలో కవి భావాన్ని చిత్రీకరిస్తున్న ఏకైక ఆర్టిస్ట్. అన్నయ్యల తర్వాత నన్నయ్య అన్నయ్యల ప్రోద్బలంతో.. కాకి, కూజా, అరటిచెట్టు, కుండ.. వీటిని దాటి ఇంకా తెలుసుకోడానికి, ఇంకా నేర్చుకోడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ చేశారు కూచి. నన్నయ్య సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇంట్లోని పూజా పీఠాన్ని స్టాండుగా అమర్చుకుని నన్నయ్య పెయింటింగ్ వేశారు. అది ఆయనకు మంచి పేరు తెచ్చింది. ‘‘చిత్రకళ అంటే సర్వకళల సమాహారం’’ అంటున్న కూచి, సంగీతంలో సప్తస్వరాలు ఉంటే, చిత్ర లేఖనంలో ఏడు గీతలు ఉంటాయంటారు. బీచ్లో ‘బతుకు’ చిత్రాలు సాయంత్రం ఐదు గంటలకు క్లాసు అయిపోగానే, ఎనిమిదిన్నర వరకు బీచ్ దగ్గర కూర్చుని 200 పేజీల పుస్తకాన్ని లైవ్ స్కెచెస్ నింపేసేవారు కూచి. బుట్టలు అల్లేవారు, గుడికి వచ్చేవారు, బీచ్లో ఉన్నవారు... ఇలా అందరినీ పరిశీలిస్తూ రోజుకి కనీసం నాలుగైదు వందల స్కెచెస్ వేసిన కూచి, ‘‘వెళ్లండి.. చూడండి.. వేయండి’ అని మా మాస్టారు చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటించాను. స్పానిస్ చిత్రకారుడు సలోడా దాలి నాకు ప్రేరణ’’ అంటారు. తొలి గాత్రచిత్రం.. ‘కోనేటి రాయడు’ 2002లో విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్లో జరిగిన రెండున్నర గంటల షోలో 18 సంకీర్తనలకు బొమ్మలు, లైఫ్ సైజులో ఒక బొమ్మ వేసి గుర్తింపు తెచ్చుకున్నారు కూచి. ‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు’ ఆయన మొట్టమొదటి గాత్ర చిత్రం. అప్పుడే ఆయనకు ‘కూచి గీత.. సంగీతం’ అని అనే ప్రశంస లభించింది. ఇప్పటికీ ఆయన గాత్రచిత్రాలు వేస్తూనే ఉన్నారు. వేలి మీద కోయిలమ్మ ‘‘త్యాగరాజు వాగ్గేయకారుడు మాత్రమే కాదు చిత్రకారుడు కూడా. ఆయన తంబుర చివరన కుంచె ఉందేమో అనిపిస్తుంది’’ అంటుండే కూచి. త్యాగరాజ విరచిత 108 కీర్తనలకు తనవైన తెలుగు గీతలతో చిత్రాలు వేశారు. వీణ చిట్టిబాబు తప్పనిసరిగా వాయించే ‘కొమ్మలో కోయిల’ పాటకు.. వీణ దండె మీద చిట్టిబాబు చేయి వేసి పంచమ వేలి మీద కోయిల బొమ్మ వేసి ఆయనకు ఇచ్చారు! ‘‘మనదైన మనోధర్మాన్ని నలుగురికీ పంచాలనేదే నా తపన. వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పట్టుకుంటాను. ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు రామాయణ భారత భాగవతాలు వేయనివారు చిత్రకారులే కాదు. చిత్ర కళావధానం చేయాలని ఉంది. నన్ను సరస్వతి కటాక్షిస్తోంది కాని ఇంకా లక్ష్మీదేవి కటాక్షం లేదు. చిత్రం, చిత్రకళ అని జ్ఞాపకం రాగానే అందరికీ ‘కూచి’ పేరు గుర్తుకు రావాలి’’ అని ఆకాంక్షిస్తున్నారు కూచి సాయిశంకర్. కుంచె ఉల్లాసంగా ఉంటే.. బొమ్మకు ప్రాణం వస్తుంది ప్రముఖులను తన ఆలోచనకు అనుగుణంగా బొమ్మ వేయడం కూచికి సరదా. ‘‘సరస్వతి చేతిలో వీణ లేకపోవడం చూసి, బ్రహ్మ, ‘వీణ ఎక్కడ?’ అని ప్రశ్నిస్తుంటే, ‘భూలోకంలో చిన్న నిక్కరు వేసుకున్న చిట్టిబాబు చేతిలో ఉంది’ అంటున్నట్లు బొమ్మ వేసి ఆయన చేతికి ఇచ్చాను. చిట్టిబాబుగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయనను ఉల్లాసపరచడం కోసం, ‘బొమ్మ చూసి కంటతడి పెట్టుకున్నారా, నా బొమ్మ చూడలేక కన్నీటి పర్యంతమయ్యారా’ అనడంతో ఆయన నవ్వేసి, ‘నువ్వంటే నాకు జెలసీ. నేను వాయిస్తే ధ్వని రూపంలో గాలిలోకి Ðð ళ్లిపోతుంది, నువ్వు రాసింది కనిపిస్తుంది’ అన్నారు. కొన్ని వందల నిద్ర లేని రాత్రుల తరవాత ఇంత సాధించగలిగాను. మనం ఎంత ఉల్లాసంగా ఉంటే బొమ్మ అంత చక్కగా వస్తుందనేది నా అభిప్రాయం. – వైజయంతి పురాణపండ -
ఆదివాసీల చిత్రకళకు ఊపిరి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళను పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా ఆదివాసీ తెగల్లోని ఔత్సాహిక చిత్రకారులను ప్రోత్సహిస్తోంది. గత ఆర్నెళ్లుగా ఆదివాసీ తెగలకు చెందిన గోండు, కొలామీ, బంజార, కోయ వర్గాలకు చెందిన యువతను ఎంపిక చేసి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా ఈ చిత్రకారులు వేసిన చిత్రాలతో గురువారం మాసబ్ట్యాంక్లోని సెంటినరీ మ్యూజియం ఆవరణలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇందు లో దాదాపు 50కి పైగా చిత్రాలను ఔత్సాహిక చిత్రకారులు ప్రదర్శించారు. ప్రతి ఆదివాసీ తెగకున్న ప్రత్యేకతను వెలుగులోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళ పునరుద్ధరణకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ని గిరిజనులు, ఆదివాసీల సంస్కృతికి సంబంధించి చిత్రకళ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదివాసీ, గిరిజనుల సంస్కృతిని చిత్రాల రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి కార్యాలయంలో పెయింటింగ్స్ ఆదివాసీ చిత్రకారుల చిత్రాలను ప్రతి ప్రభు త్వ కార్యాలయంలో ఉండేలా గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో చిత్రకారులకు మంచి ఉపాధి లభించనుంది. ఇకపై రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో ఆదివాసీ చిత్రాలు కనిపించనున్నాయి. ప్రైవేటువ్యక్తులు సైతం వీటిని కొనేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్కు తగినట్లు ఔత్సాహిక చిత్రకారులకు సామగ్రిని యంత్రాంగం సరఫరా చేస్తోంది. -
రైలు బోగీల్లా తరగతి గదులు
-
నాకు అందులో ఆసక్తి అధికం..
తమిళసినిమా: ప్రస్తుతం కోలీవుడ్లో కథానాయకిగా ఎదుగుతున్న నటీమణుల్లో నివేదాపేతురాజ్ ఒకరు. ఒరు నాళ్కూత్తు చిత్రంతో రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు తొలి చిత్రంతోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్తో జత కట్టిన పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా నివేదాపేతురాజ్కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. తాజాగా జయంరవితో అంతరిక్షంలో సాహసోపేతంగా రొమాన్స్ చేసిన టిక్ టిక్ టిక్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపై నివేదాపేతురాజ్ చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సందర్భంగా నివేదాపేతురాజ్ చెబుతున్న సంగతులేంటో చూద్దాం. ప్ర: మీ సినీ పయనం గురించి? జ: నేను పుట్టింది మదురైలోనే. అయితే పెరిగింది దుబాయ్లో. అక్కడ నా అనుభవం 14 ఏళ్లు. అందాల పోటీల్లో పాల్గొన్నాను. అవే తనను కోలీవుడ్లో కథానాయకిని చేశాయి. వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అలా ఇప్పుడు 8వ చిత్రంలో నటిస్తున్నాను. ప్ర: తెలుగులోనూ కాలిడినట్లున్నారే? జ: పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం చూసి తెలుగులో నటించే అవకాశం కల్పించారు. అక్కడ కొన్ని చిత్రాలు చేస్తున్నాను. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా జూనియర్ ఎన్టీఆర్తో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. ప్ర: సరే నటిగా మీ ప్రణాళిక ఏమిటి? జ: నిజం చెప్పాలంటే నటిగా నాకు ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. వచ్చిన అవకాశాల్లో నచ్చిన చిత్రాలను చేసుకుంటూపోతున్నాను. యోగాపై ఆసక్తి ఉంది. దర్శకత్వం చేయాలన్న ఆశ ఉంది. అందుకోసమే చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ప్ర: టిక్ టిక్ టిక్ చిత్రం గురించి? జ: ఇందులో స్వాతి అనే పాత్రలో నటించాను. షూటింగ్కు సెట్లోకి వెళుతున్నప్పుడే హాలీవుడ్ సెట్లోకి వెళుతున్న భావన కలిగేది. చాలా వినూత్న అనుభవం. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను.ఈ చిత్రంలో నేను పోరాటాలు కూడా చేశాను. ప్ర: సినిమా రంగంలో గట్టి పోటీ నెలకొంటుందిగా? జ: నేను అవకాశాల కోసం అంటూ నేనెవరి వద్దకూ వెళ్లి అడిగిందిలేదు. దీన్ని ఘనతగానే భావిస్తాను. ఇక్కడ పని లేకపోతే దుబాయ్ వెళ్లిపోతాను. నా పని నేను చేసుకుపోతున్నాను. అందుకే వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్ర: మీలో ఇతర ప్రత్యేకతలు? జ: పెయింటింగ్స్ బాగా వేస్తాను. అందులో ఆసక్తి అధికం. పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని స్నేహితులు అంటున్నారు. అయితే అందుకు ఇంకా చాలా శ్రమించాల్సి ఉంది. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కార్ రేస్లో పాల్గొని గెలుపోటములు పొందిన అనుభవం ఉంది. ఇలాంటి సాహసాలు చేయపోతే జీవితంలో మజా ఏం ఉంటుంది. ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం. అదే సమయంలో భయం ఉంది. -
కుట్టు చిత్రం భళారే విచిత్రం.!
పెయింటింగ్ ఎలా వేస్తారు? అదేం ప్రశ్న చేతితోనే కదా వేస్తాం అనుకుంటున్నారా? అయితే ఈ చిత్రం చూడండి. అచ్చం పెయింటింగ్ లాగే ఉంది కదూ! అయితే ఇది కలర్స్తో వేసిన పెయింటింగ్ కాదు. కుట్టు మిషన్తో వేసిన ఎంబ్రాయిడరీ..! చేతితోనే కాదు.. కుట్టు మిషన్తో కూడా అందమైన పెయింటింగ్స్ లాగా ఉండే చిత్రాలను వేయొచ్చని నిరూపించాడు హరియాణాలోని పాటియాలాకు చెందిన అరుణ్ కుమార్ బజాజ్.. చిత్రలేఖనం అంటే చాలా ఇష్టపడే అరుణ్ బాగా పెయింటింగ్స్ వేసి పెద్ద చిత్రకారుడు అవుదామనుకున్నాడట. కానీ చిన్నతనం లోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేయాల్సివచ్చింది. కుటుంబ భారం తన పైనే పడింది. తన తండ్రి దర్జీ కావడంతో 16వ ఏటనే అరుణ్ దర్జీ వృత్తిలోకి అడుగుపెట్టాడు. కానీ చిత్రలేఖనంపై ఉన్న ఇష్టాన్ని వదలకుండా తను పనిచేసే కుట్టు మిషన్తోనే అందమైన చిత్రాలను వేయడం ప్రారంభించాడు. ఇలా ఎంబ్రాయిడరీ ద్వారా పెయింటింగ్స్ వేసిన మొదటి వ్యక్తిగా అరుణ్ నిలిచాడు. -
రైల్వే బుక్లెట్పై ప్యూన్ పెయింటింగ్
రైల్వే శాఖలో అతను ఒక ప్యూన్. కానీ అతని చేతిలో ఉన్న అద్భుతమైన కళ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అతను వేసిన ఒక పెయింటింగ్ ఏకంగా రైల్వేశాఖ ప్రచురించనున్న బుక్లెట్కు కవర్పేజీగా ఎంపికైంది. భువనేశ్వర్లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంలో శ్యామ్ సుందర్ ప్యూన్గా పనిచేస్తున్నాడు. పెయింటింగ్లు వేయడం అతని హాబీ. ఇంటర్ రైల్వే పెయింటింగ్ పోటీల్లో శ్యామ్ సుందర్ చాలా సార్లు విజేతగా కూడా నిలిచాడు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని రైల్వే శాఖ మోదీ హయాంలో తాము సాధించిన విజయాలపై ఒక బుక్లెట్ తీసుకురానుంది. ఈ బుక్లెట్కు కవర్పేజీగా శ్యామ్ సుందర్ వేసిన ఆర్ట్ వర్క్ని రైల్వే శాఖ ఎంపిక చేసింది. మహాత్మాగాంధీ రైలు బోగీ దిగుతూ ఉంటే, ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు ప్లాట్ఫామ్పై గుమిగూడి ఉన్న దృశ్యాన్ని శ్యామ్ సుందర్ పెయింటింగ్గా వేశారు. కవర్ పేజీ కోసం ఎన్నో చిత్రాలను పరిశీలించిన రైల్వేశాఖ చివరికి ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. అంత అద్భుతమైన చిత్రాన్ని వేసినందుకు శ్యామ్ సుందర్ని ఢిల్లీకి రప్పించి సన్మానించింది. ‘నేను గత పదేళ్లుగా రైల్వే శాఖలో పనిచేస్తున్నాను. ఈ చిత్రం గీయడానికి శ్రమపడ్డాను. మొదటి రెండు సార్లు చిత్రాన్ని తిరస్కరించారు. మొదటిసారి గాంధీ కెమెరా వైపు చూస్తున్నట్టు ఉండడంతో వద్దన్నారు. ఆ తర్వాత గీసిన దాంట్లో గాంధీ ముఖం సరిగా రాలేదు. ఇక మూడోసారి గీసిన ఈ పెయింటింగ్ ఎంపికైంది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పెయింటింగ్ చాలా బాగుందని ప్రశంసించడం మరచిపోలేని అనుభూతి‘ అని శ్యామ్ సుందర్ అన్నాడు. రైల్వే శాఖ నుంచి ఇంతటి అపూర్వమైన గౌరవం దక్కినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. -
మిథిలానగరి మైథిలమ్మలు
మిథియాంచల్! పెద్దగా వినని పేరు. కొద్దిగా మార్చి మిథిల అంటే.. అది మనకు బాగా పరిచయమున్న పేరే. ఈ మిథియాంచల్లో ‘మైథిలమ్మలు’ అడుగడుగునా కనిపిస్తారు. అందరూ సీతమ్మకు చెల్లెమ్మలే. మిథియాంచల్ మహిళల చేతి కుంచె నుంచి సీతమ్మవారు, ఆమె పాణిగ్రహీత రాముని రూపం రంగుల్లో మధుబని కళగా జాలువారుతుంటాయి. రామాయణ ఘట్టాలు అలవోకగా కాన్వాసుపై పరచుకుంటాయి. కళకు ప్రాణం గౌరీ మిశ్రా ఎంత గొప్ప కళ అయినా.. ఆ కళకు రాజపోషణ ఉన్నంత కాలమే మన్నుతుంది. ఆ కళాకారులకు అన్నం దొరికినంత కాలం బతికి బట్టకడుతుంది. మిథియాంచల్లో చేతిలో కళ ఉన్న కళాకారులున్నారు, వారసత్వంగా వస్తున్న కళను బతికించుకోవాలనే తపన ఉన్న వాళ్లూ ఉన్నారు. అయితే తమ చేతిలో ఉన్న కళ గొప్పదనం తెలియని తనం కూడా వారిలో ఎక్కువే. అలాంటి పరిస్థితిలో మధుబని పెయింటింగ్స్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు గౌరీ మిశ్రా. ఆమె 1993లో ‘సేవ’ పేరుతో సంస్థను స్థాపించి మైథిలి మహిళలను ఒక గొడుగు కిందకు చేర్చారు. ‘‘మీ కళకు సమాజంలో గౌరవం ఉంది, ధైర్యంగా పని చేయండి’’ అని ఆ గ్రామీణ మహిళా హస్తకళాకారులకు ఇరవై ఏళ్ల పాటు భరోసా ఇచ్చారు. గౌరీ మిశ్రాకు వార్ధక్యం వచ్చేసింది. ఆ మధుబని మైథిలులకు అండగా నిలిచే వాళ్లు లేరు. వారికి మార్కెట్ నైపుణ్యాలు తెలియచేసి ఆ ఆర్ట్ను మోడరన్ సొసైటీకి దగ్గర చేసే ఓ మనిషి కావాలి. ఆ మనిషి మహిళ అయితే మంచిదనుకున్నారు గౌరీ మిశ్రా. మనవరాలికి వారసత్వం 2010 సంవత్సరం. ఓ రోజు మనవరాలు ఐహితశ్రీ శాండిల్యను మిథియాంచల్కు తీసుకెళ్లారు గౌరీమిశ్రా. ఐహిత కురుక్షేత్ర ఎన్ఐటిలో చదివింది. అప్పటికి ఐబిఎమ్లో ఉద్యోగం చేస్తోంది. తన మనసులో మాట ఏమీ చెప్పకుండా తనకు తోడుగా రమ్మని తీసుకెళ్లారు గౌరీమిశ్రా. ఆ అమ్మాయికి మధుబని కళ లోతుల్ని చూపించారు. కళాకారుల చేతిలోని గొప్పతనం గురించి చెప్పారు. మధుబని చిత్రలేఖనంలో బొమ్మ గీయడం, రంగులు వేయడం అంతా కుంచెతోనే. స్కేలు, పెన్సిల్ వంటివి వాడరు. వలయాకారాన్ని గీయడానికి కనీసం చేతి గాజునైనా ఆసరాగా తీసుకుంటారేమోనని చూసింది ఐహిత. అలాంటిది కూడా లేదు! కుంచెతోనే వలయాకారాన్ని గీసేస్తున్నారు. దాని వెనుక ఎన్నేళ్ల సాధన దాగి ఉందోనని ఆశ్చర్యపోవడం ఐహిత వంతయింది. ఇరవై ఏళ్లు శ్రమించి పదిహేను వేల మందిని ఒక చోటుకు తెచ్చి, ఉపాధికి నమ్మకం కల్పించిన విషయాన్ని మనవరాలికి గుర్తు చేశారు గౌరీమిశ్రా. తన తర్వాత వాళ్లకు ఒక ఆలంబన కోసం ఎదురు చూస్తున్నానని కూడా ఆ సందర్భంలోనే చెప్పారు. ఆ వచ్చే వ్యక్తి.. మధుబని కళ గొప్పతనాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉండాలి. మహిళల నైపుణ్యానికి పదును పెడుతూ, మార్కెట్ కోరుకునే డిజైన్లను ఈ ప్రక్రియలో మేళవించగలిగిన ఆసక్తి కూడా ఉన్న వ్యక్తి అయితేనే ఈ సామ్రాజ్యం నిలుస్తుందని చెప్పారు. తాను రంగంలోకి దిగినప్పటి పరిస్థితిని, ఆ తర్వాత వచ్చిన మార్పులను కూడా వివరించారు. కాలం వెనుక మధుబని మధుబని ఆర్ట్ గురించి ప్రపంచానికి తెలియని రోజుల్లో తొలి ఎన్జివోను స్థాపించారు గౌరీమిశ్రా. దళారులను తప్పించి ప్రభుత్వ సంస్థలతో కలిసి హస్తకళాకారుల చేత ఎగ్జిబిషన్లలో స్టాళ్లు పెట్టించారు. అనేక మంది ఈ కళను నేర్చుకోవడానికి వేదిక కల్పించారు. ఆ కళకు తగినంత ఆదరణ వచ్చిన తర్వాత, మార్కెట్లో గిరాకీ పెరగడంతోపాటు నకిలీ కళాకృతుల తయారీ కూడా మొదలైంది. చేత్తో వేసే మధుబని డిజైన్ని డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో ప్రింట్ చేస్తున్నారు. అవి తక్కువ ధరకు దొరుకుతాయి. కళను ఈ కష్టం నుంచి గట్టెక్కించాలంటే, టెక్నాలజీ తెలిసిన కొత్త తరంతోనే సాధ్యమని కూడా గౌరీ మిశ్రా తన మనవరాలికి చెప్పారు. ‘అస్మిత’తో కొత్త కళ! 2012లో ఐహిత ఐబిఎమ్లో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చింది. ‘మధుబని అస్మిత’ పేరుతో మైథిలి మహిళలకు అండగా నిలుస్తానని నానమ్మతో చెప్పింది. ఈ ఐదేళ్లలో ఐహిత మధుబని కళను విదేశాలకు పరిచయం చేసింది. మ్యూజియం పార్ట్నర్షిప్లో భాగంగా న్యూయార్క్లోని రుబిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, ముంబయిలోని జీవీకే జయహే మ్యూజియం స్టోర్, బెంగళూరు ఫోక్ఆర్ట్ గ్యాలరీలలో ఈ మైథిలీ కళను ప్రదర్శించింది. ఇప్పుడు నెలలో పది రోజులు ఢిల్లీ, చెన్నై, ముంబయి, కోల్కతా, హైదరాబాద్లలో ప్రదర్శనల కోసం పర్యటిస్తోంది. టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, ఎమ్ఎస్ఎమ్ఈ వంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి పని చేస్తోంది. అలాగే స్టాల్లో అడిగిన వారికి, అడగని వారికి కూడా అసలైన మధుబని హస్తకళాఖండానికి, నకిలీ ప్రింట్కి తేడాను వివరించగలుగుతోంది.మధుబని మన సంస్కృతిలో భాగం. సంస్కృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనడానికి ఈ మైథిలమ్మలే ఉదాహరణ అంటోంది ఐహిత. మైథిలమ్మలు బిహార్ రాష్ట్రంలో ఉత్తర భాగాన ఓ మారుమూల ప్రదేశం మిథియాంచల్. ఇక్కడి మహిళలను మైథిలి అంటారు. మనకు తెలిసిన మైథిలి సీతమ్మ ఒక్కటే. ఇక్కడి మైథిలమ్మలంతా తప్పనిసరిగా సీతారాముల కల్యాణం ఘట్టాన్ని చిత్రించడం నేర్చుకుంటారు. ఈ చిత్రలేఖన ప్రక్రియను మధుబని అని పిలుస్తారు. -
డల్లాస్లో అటా వేడుకలకు రంగం సిద్ధం
-
ఆటా-టాటా ఆధ్వర్యంలో పెయింటింగ్ పోటీలు
డల్లాస్ : అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలను మే 31, జూన్ 1, 2 తేదీల్లో డల్లాస్ లో నిర్వహించడానికి అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)లు సంయుక్తంగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. మన కళలు, సంస్కృతిని పరిరక్షిస్తూ యువతలో నైపుణ్యాన్ని, సమాజ సేవని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆటా, టాటాలు కృషి చేస్తున్నాయి. ఆటా, టాటా ఆధ్వర్యంలో డల్లాస్లో కొపెల్లోని ఫోర్ పాయింట్స్ షేరాటన్లో చిన్నారులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించాయి. ఈ పోటీల్లో100 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కమిటీ ఛైర్ మధుమతి వ్యాసరాజు, కో ఛైర్ జ్యోత్స్నవుండవల్లి, సభ్యులు చైతన్యల పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. స్థానిక పెయింటింగ్ స్కూల్ టీచర్స్ బ్రిందా నవీన్, సవిత నల్లాలు పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. మూడు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో రోషిని బుద్దా, అదితి ఆవుల, క్యాతి గొవకనపల్లిలు తొలిస్థానంలో నిలవగా, శ్రీశ్మ పసుపులేటి, చందన పగడాల, అవనీష్ బుద్దాలు రెండో స్థానంలో నిలిచారు. జాయింట్ ఎగ్జిగ్యూటివ్ కమిటీ సభ్యులు అజయ్ రెడ్డి, రఘువీరా బండారు, విక్రమ్ జనగాం, సతీష్ రెడ్డి, మహేష్ ఆదిభట్లలు విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. మధుమతి వ్యాసరాజు, జ్యోత్స్న వుండవల్లిలు పోటీల్లో పాల్గొన్నచిన్నారులు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటీసీ వాలంటీర్లు దీప్తి సూర్యదేవర, మాధవి లోకిరెడ్డి, సునిత త్రిపురలు ఈ పోటీల నిర్వహనలో తమవంతు కృషి చేశారు. -
ఖైదీ..కళ
జైల్లోని ఖైదీలు.. కుంచెతో అద్భుతాలుచేస్తున్నారు. జీవితసారాన్ని తెలుసుకుంటూ కళాత్మక రంగంలో రాణిస్తున్నారు. నగరానికి చెందిన కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, జైళ్ల శాఖ సంయుక్తాధ్వర్యంలో చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమంతో ఇది సాధ్యమవుతోంది. ఖైదీల జీవితాల్లోసరికొత్త మార్పుకు కారణమవుతోంది. కారాగారాల్లో కటకటాలను తడుముతూ గడిపే చేతులు... కుంచెను పట్టాయి. కుటుంబానికి, సమాజానికి దూరంగా భారంగా నడుస్తున్న బతుకులకు కళ జీవం పోస్తోంది. బాహ్య ప్రపంచంతో వారిని అనుసంధానిస్తోంది. 2016లో నగరానికి చెందిన కళాకృతి ఆర్ట్ గ్యాలరీప్రారంభించిన ఓ వైవిధ్యభరితమైన కార్యక్రమం... ఖైదీల ‘కల’లకు సరికొత్త ‘కళ’ను అద్దుతోంది. సాక్షి, సిటీబ్యూరో : బంజారాహిల్స్లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలోకి అడుగిడితే మనల్ని ఆకట్టుకునేవి చిత్రాలు మాత్రమే కాదు... అవి గీసిన చేతుల కథలు కూడా. నగరంలోని చంచల్గూడ, చర్లపల్లి కారాగారాలకు చెందిన 21 మంది ఖైదీలకు ఇప్పుడు చిత్రలేఖనం అనేది జీవితాల్లో చిత్రమైన మార్పుకు కారణంగా మారింది. ప్రస్తుతం ఖైదీలు గీసిన చిత్రాలను బంజారాహిల్స్లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన మే 7 వరకు కొనసాగుతుంది. అమ్మకంతో ఆదాయం.. జైళ్లలోని ఖైదీల్లో మార్పు కోసం కళాకృతి ఆర్ట్ గ్యాలరీతో కలిసి తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆధ్వర్యంలో 2016లో ‘జైల్లో ఆర్ట్ క్లాసెస్’కు నాంది పలికారు. అప్పటి నుంచి ఇది బలోపేతమవుతూ వచ్చింది. ఈ చిత్రాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖైదీల కుటుంబాలకు అందజేస్తున్నారు. వారానికి రెండుసార్లు చిత్రకారుడు సయ్యద్ షేక్ ఈ రెండు జైళ్లను సందర్శిస్తారు. ఖైదీలకు చిత్రాలు గీయడం నేర్పిస్తారు. ‘ఈ కాన్సెప్ట్ గురించి తొలుత రేఖా లహోటి (కళాకృతి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలు) నన్ను సంప్రదించినప్పుడు చాలా భయపడ్డాను. చేయనని చెప్పేశాను. అయితే ఆమె నాకు విడమరిచి చెప్పారు. ఇది కేవలం శిక్షణ ఇవ్వడం కాదని, జీవితాలను మలచడమని ఆమె వివరించారు. మొత్తానికి నన్ను ఒప్పించారు. తొలి దశలో ఖైదీలు దగ్గరకు వస్తుంటే నేనంత దూరం జరిగిపోయేవాణ్ని. అయితే ఆ తర్వాత్తర్వాత ఈ అవకాశం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. ఇది నాకు ఒక జీవిత కాలంలోనే అత్యంత సంతృప్తిని అందించిన అనుభవం’ అని చెప్పారు సయ్యద్ షేక్. కళాఖండాలు...కారాగారాలు ఆ చిత్రాలను చూస్తే... ఎలాంటి ముందస్తు అనుభవం లేకుండా గీసిన చిత్రాలంటే అసలు నమ్మలేం. చేయి తిరిగిన చిత్రకారుడి ప్రతిభ అంత చక్కగా ఉంటాయవి. ‘వాళ్లు గతంలో ఎప్పుడూ కాన్వాస్ మీద చిత్రాలు గీసిన వారు కానప్పటికీ... వాళ్లలో కొంత మందికి జైలుకి రాకముందు కార్పెంటర్స్గా, సైన్బోర్డ్ వర్కర్స్గా, వాల్ పెయింటర్స్గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయా వృత్తుల వ్యాపకాల పరంగా కొంత సృజనాత్మక సామర్థ్యాలు ఎలాగూ అవసరం. కాబట్టి.. అలా కొందరు తేలికగానే చిత్రకారులైపోయారు. మరోవైపు సహజంగానే కొందరు ఏక సంథాగ్రాహులుగా ఉన్నారు. వీరంతా అద్భుతాలు చిత్రించగలిగారు’ అని వివరించారు సయ్యద్. కళాత్మక దృక్పథం...మార్చింది జీవితం ‘ఖైదీలతో ఎక్కువ సమయం గడపిన క్రమంలోనే వారి జీవితాలను, నేపథ్యాలను తెలుసుకునేందుకు అవకాశం వచ్చింది. చాలా మంది నన్ను కేవలం ఆర్ట్ టీచర్గా మాత్రమే కాకుండా... మరింత దగ్గరగా చూశారు. ఒకసారి పెయింటింగ్ ప్రారంభించగానే దానిపై నిమగ్నమయేవారు. అంతగా వారు ఈ కళపై ఆసక్తి పెంచుకున్నారు. ఎప్పుడైన వాళ్లు అలసటగా ఫీలైతే... ఆ విరామంలో తమ వ్యక్తిగత జీవిత విషయాలను, కథలు, వ్యథలను నాతో పంచుకునేవారు. తాము జైలుపాలు కావడానికి కారణాలు చెప్పేవారు. జేబులు కొట్టడం లాంటి నేరాల దగ్గర్నుంచి స్నాచింగ్లకు పాల్పడ్డవారు, హత్యలు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే వారితో అంతకాలం గడిపాక, వారి చిత్రలేఖనం చూశాక వాళ్లు అలాంటి క్రూరమైన నేరాలు చేశారంటే నమ్మడం కష్టంగా అనిపించేది. ముఖ్యంగా పెయింట్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా, నిశబ్దంగా ఉండేవారు. ఒకసారి ల్యాండ్ స్కేప్స్, ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, పంట పొలాలను గీస్తున్నప్పుడు వాళ్లలో ఒకరు ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే.. తాను వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చాడు. ఆ చిత్రాలు అతనికి తన పొలాన్ని గుర్తు చేశాయి. తాము చేసిన పనులకు పశ్చాత్తాపం పడుతున్నట్టు వాళ్లు నాకు చెప్పేవారు’ అన్నారు సయ్యద్. తాము పెయింటింగ్స్ వేయగలగమని ఎప్పుడూ అనుకోలేదని, పెయింటింగ్స్ వేస్తూ కూడా హాయిగా బతకొచ్చునని అనుకొని ఉంటే తమ జీవితాలు వేరేగా ఉండేవని వారు భావిస్తున్నారని సయ్యద్ చెబుతున్నారు. వీరిలో కొందరు తాము విడుదలయ్యాక దీనినే ప్రొఫెషన్గా ఎంచుకోవాలనుకుంటున్నారట. అందుకే యానిమేషన్, ఫైన్ఆర్ట్స్ రంగాల్లోకి వెళ్లడానికి సలహా చెప్పమని అడిగేవారట. ‘కళాత్మక దృక్పథం వీరిలో ఎంత మార్పు తెచ్చింది.. వీరు ఇప్పుడు మరింత వినయంగా మారారు. ఇంటికి డబ్బులు పంపించడం వారికి చాలా ఆనందాన్ని ఇస్తోంది’ అంటూ జైళ్ల శాఖ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ బుడ్డోడు పెయింటింగ్ వేస్తే.. కాసుల వర్షమే!
ఆర్ట్ అంటే హార్ట్తో చూడాలి. అప్పుడే దానిలో నిగూఢంగా దాగి ఉన్నది అర్థమవుతుంది. నాలుగేళ్ల ప్రవాస భారతీయ బుడతడు పెయింటింగ్లు వేస్తుంటే లక్షలు కురుస్తున్నాయి. అద్వైత్ అనే బుడతడు వేసే పెయింటింగ్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అద్వైత్ కొలార్కర్ పుణేలో జన్మించాడు. ప్రస్తుతం అతడి కుటుంబం కెనడాలో స్థిరపడింది. తల్లి శ్రుతి కొలార్కర్, అద్వైత్కు సంబంధించిన విషయాలను చెబుతూ... ఏడాది వయసు ఉన్నప్పుడే అద్వైత్ పెయింటింగ్ బ్రష్లను పట్టుకునే వాడనీ, పుణెలో ఒక ఆర్ట్ గ్యాలరీ యజమాని, రెండేళ్ల వయసులోనే అద్వైత్ ప్రతిభను గుర్తించాడని తెలిపారు. ప్రస్తుతం ఈ బుడతడికి సొంతంగా ఆర్ట్2డే గ్యాలరీ ఉంది.. కెనడాలోనే పెయింటింగ్లను ప్రదర్శించే అతి పిన్న వయస్కుడు అద్వైత్ మాత్రమేనని కెనడా సాంస్కృతిక శాఖ అధికారి బెర్నార్డ్ కార్మియర్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని ఆర్ట్ ఎక్స్పోలో ఏప్రిల్ 19-22 మధ్య జరిగిన ప్రదర్శనలో అద్వైత్ పెయింటింగ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘అద్వైత్ పెయింటింగ్లు వేసేటప్పుడు ఎవరి సలహాలు, సూచనలు, అవసరం ఉండదు. వాడికి నచ్చినట్లు వేస్తాడు. వాడి సంతోషమే మాకు కావాలి. వాడు ప్రస్తుతం ఎలా ఉన్నాడో జీవితాంతం అలానే ఉండాలని కోరుకుంటున్నామ’ని అతడి తల్లి శ్రుతి తెలిపారు. -
నాలుగేళ్ల బుడతడు వేసే పెయింటింగ్కు లక్షలు..
-
పైపై పూత..నిధుల మేత!
పాఠశాలలను సరస్వతీ నిలయాలు అంటారు. మరికొందరు దేవాలయాలతో సమానంగా భావిస్తారు. అలాంటి వాటి అభివృద్ధి పనుల విషయంలో కాసులకు కక్కుర్తి పడుతున్నారు అధికార పార్టీ నాయకులు. తూతూ మంత్రంగా పనులు చేపట్టి నిధులు మింగేస్తున్నారు. బనగానపల్లె :జిల్లాలోని కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉండగా, మరికొన్నింటి గోడలు బీటలు వారి, బండపరుపు, మెట్లు దెబ్బతిని, రంగులు మసకబారి ఉన్నాయి. ఇలాంటి వాటిని పూర్తిగా మరమ్మతులు చేసి గోడలకు రంగులు వేసేందుకు సర్వశిక్ష అభియాన్ శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 377 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిలో చేపట్టాల్సిన పనులను బట్టి ఒక్కోస్కూల్కు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మరమ్మతులు పూర్తి చేశాక గోడలకు రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి చదరపు మీటరుకు పెయింటింగ్ వేసేందుకు రూ.124.45, గోడను నునుపు చేసేందుకు రూ. 6.82 చొప్పున కాంట్రాక్టర్కు ఇస్తుంది. అయితే, ఆయా పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లుల మంజూరుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సంతకం అవసరం. అయితే, ఈనిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఈ పనులను రాష్ట్రమంత్రికి చెందిన సమీప బంధువు దక్కించుకోవడంతో ప్రధానోపాధ్యాయులు ప్రశ్నించలేకపోతున్నారు. చాలా స్కూళ్లలో పగుళ్లిచ్చిన చోట మాత్రమే సిమెంట్ పూసి వదిలేస్తుండటంతో అవి కొద్దిరోజులకే ఊడిపోతున్నాయి. పెయింటింగ్ కూడా తూతూమంత్రంగా వేస్తున్నారు. దీనిపై కొందరు నిలదీసినా కాంట్రాక్టర్లు లెక్క చేయడం లేదని హెచ్ఎంలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అభివృద్ధి పనుల తీరుపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. పనులు సరిగ్గా చేయడం లేదు ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పెయింటింగ్, ఇతర అభివృద్ధి పనులు నిబంధనల మేర జరగడం లేదు. చేసిన పనులు కొద్ది కాలమైనా గుర్తుండాలి. ఈ విషయాన్ని సంబంధిత కాంట్రాక్టర్లు గుర్తించాలి. – గుండం నాగేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నేత,బనగానపల్లె మండలం. -
మౌనంగానే ఎదగమని..
అడగకముందే మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు. అప్పుడప్పుడూ పొరపాటుపడి ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా.. ఇచ్చి తీసేసుకున్నా మనం ఏం చేయగలం! ప్చ్.. మన రాత ఇంతేనని నిట్టూర్చి మిన్నకుండిపోతాం. కానీ మన ‘కౌసర్భాను’ అలా ఊరికే ఉండిపోలేదు. దేవుడి నుంచి మరోటి లాగేసుకుంది. ‘గీత’ నేర్చుకుంది.. రాత మార్చుకుంది. వైకల్యాన్ని అధిగమించేందుకు కాస్తంత ప్రోత్సాహం ఉంటే చాలుననీ, ఆ ఆసరాతో పోగొట్టుకున్న దాని కంటే ఎక్కువ సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఆమెనే కౌసర్బాను. కడప కల్చరల్ : కడప నగరానికి చెందిన కౌసర్బానుది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ముర్తుజాకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కౌసర్ చిన్న కుమార్తె. అందరిలాగానే ఆడుతూ, పాడుతూ ఎంతో సరదాగా ఉండేది. అందరితో వస పిట్టలా మాట్లాడుతూ ఉండేది. సరిగ్గా అక్కడే ఆమె జీవితం పెద్ద మలుపు తిరిగింది. నాలుగున్నరేళ్ల చిన్నారి కౌసర్కు జ్వరం. తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. ఒకచోట వైద్యం వికటించింది. గలగలా మాట్లాడుతూ తిరిగే తమ చిన్నారి ఉన్నట్లుండి ‘మౌనమే నా భాష’ అన్నట్లుగా ఉండిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పాడుజ్వరం తన మాటను తీసుకెళ్లిందని, తను మాట్లాడలేకపోతోందని ఆ చిట్టి మనసు అర్థం చేసుకుంది. తనకు ప్రాణప్రదమైన అమ్మానాన్నల కళ్లల్లో నీటితడికి బదులుగా ఆనందం చూడాలని గట్టిగా నిర్ణయించుకుంది. రంగుల లోకంలో... కౌసర్కు బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. నచ్చిన ప్రతి బొమ్మను గీసేది. మూడున్నరేళ్ల వయసులోనే చక్కని చిత్రాలు గీస్తున్న కుమార్తెను చూసి అమ్మానాన్న ప్రోత్సహించారు. చెప్పదలుచుకున్న విషయాన్ని బొమ్మల ద్వారా చెప్పడం గమనించారు. ప్రోత్సాహాన్ని కొనసాగించారు. అక్క అర్షియ ఏదైనా పోటీలకు వెళ్లేటపుడు తానూ వస్తానని కౌసర్ మారాం చేసేది. కాస్త మార్పుగా ఉంటుందని తీసుకెళ్లేది. పోటీల్లో పాల్గొని చెల్లి బహుమతులు సాధిస్తుండడంతో అక్క ఆమెకు తన డ్రాయింగ్ సామగ్రి ఇచ్చి ప్రోత్సహించేది. ఈ ప్రత్యేకతను గమనించిన తల్లిదండ్రులు రషీదా, ముర్తుజా, అన్న అసదుల్లా కౌసర్కు అవసరమైన డ్రాయింగ్ సామగ్రిని సమకూరుస్తూ ఉత్సాహ పరిచారు. పర్యాటకం సీతారామయ్య, అక్క స్నేహితులు నాగవేణి, అఖిల ఆమె గీసిన చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహింపజేశారు. ఆలోచనాత్మకం కౌసర్ సమకాలీన సమస్యలపై పలు పెయింటింగ్లు గీశారు. ముఖ్యంగా మహిళా సాధికారత, భ్రూణహత్యలు, మసిబారుతున్న పసితనం ప్రధాన అంశాలుగా ప్రతిభావంతమైన చిత్రాలు గీశారు. ఎందరో ప్రముఖ వ్యక్తులు, దేశభక్తుల చిత్రాలు కూడా గీశారు. ముఖ్యంగా సింహం చిత్రంలో సూక్ష్మ మైన అంశాలను కూడా వదలకుండా గీసిన తీరు ఆమె సునిశిత పరిశీలనాశక్తికి నిదర్శంగా నిలుస్తోంది. పలు చిత్రాలు విమర్శకులను సైతం మెప్పించాయి. కౌసర్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. పనికిరాని వస్తువులతో కళ్లు చెదిరే ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తుంది. కోడిగుడ్ల డొల్లలు, పాత సీసాలు, ఐస్క్రీమ్ కప్లు, స్ట్రాలు ఇలా అన్నింటినీ కళాత్మకంగా రూపొం దిస్తోంది. ముఖ్యంగా ఆమె తయారు చేసిన కాగితం నగలు అందరినీ ఆకర్శిస్తున్నాయి. అంతర్జాతీయ అవార్డులు కౌసర్ స్థానికంగా వందలాది పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. గండికోట ఉత్సవంలో స్పాట్ పెయింటింగ్ చేసి బహుమతి సాధించి సత్తా చాటారు. పికాసో ఆర్ట్ సంస్థ వారు ఆన్లైన్ ద్వారా నిర్వహించే పోటీల్లో ఆమెకు రెండు మార్లు వరుసగా బహుమతులు లభించాయి. 2016లో ఆమె ఈ పోటీల్లో ద్వితీయ బహుమతి, 2017లో ప్రథమ బహుమతి సాధించారు. కంగ్రాట్స్.. అంటూ అభినందిస్తే కౌసర్ మెత్తగా నవ్వేస్తుంది.. ప్రస్తుతం స్పీచ్ థెరఫీ తీసుకుంటున్న కౌసర్భాను త్వరలో ‘సాక్షి’కి స్వయంగా ధన్యవాదాలు చెప్పగలదని ఆశిద్దాం! -
‘ఆఫ్రికా మోనాలిసా’కు కళ్లు చెదిరే ధర..
లండన్: ఫేమస్ పెయింటింగ్ ‘ఆఫ్రికా మోనాలిసా’ రికార్డు ధర పలికింది. లండన్లో ఫిబ్రవరి 28 రాత్రి జరిగిన వేలంలో ఏకంగా 16 లక్షల అమెరికన్ డాలర్ల (12 లక్షల యూరోలు)కు అమ్ముడైంది. చిత్రకారుడు బెన్ ఎన్వోను గీసీన అడెటుటు అదేమిల్యుయ్ అనే రాకుమారి పెయింటింగ్ ఆఫ్రికా మోనాలిసాకు అందరికీ సుపరిచితమే. దీన్ని అందరూ టుటుగా పిలుచుకుంటారు. అయితే 1974లో పెయింటింగ్ వేసిన కొన్ని రోజులకే మాయమైంది. నాలుగు దశాబ్దాల అనంతరం గతేడాది లండన్లో ఓ అపార్ట్మెంట్లో టుటు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. తాజా వేలంలో ఆఫ్రికా మోనాలిసా పెయింటింగ్ 2.75 లక్షల డాలర్ల నుంచి 4.13 లక్షల డాలర్ల వరకు ధర పలుకవచ్చునని నిర్వాహకులు భావించారు. కానీ నిర్వాహకులు ఊహించిన దానికంటే దాదాపు నాలుగురెట్లు అధిక ధరకు టుటు పెయింటింగ్ అమ్ముడుపోవడం గమనార్హం. రాకుమారిపై వేసిన మరో రెండు పెయింటింగ్స్ ఇప్పటికీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ఐదు శతాబ్దాల కిందట ప్రముఖ చిత్రకారుడు లియనార్డో డావిన్సీ కుంచె నుంచి జాలువారిన మోనాలిసా. ఎక్కడైనా అందమైన పెయింటింగ్ కనిపిస్తే మోనాలిసాతో పోల్చుతుంటారు. అదే విధంగా నైజీరియా యువరాణి టుటు పెయింటింగ్ను ఆఫ్రికా మోనాలిసాగా గుర్తింపు పొందింది. -
శ్రీదేవిలో మనకి తెలియని మరో టాలెంట్..
-
శ్రీదేవిలో మనకి తెలియని మరో కోణం ..
సినీ ప్రపంచాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచుతూ అతిలోక సుందరి శ్రీదేవి నింగికేగారు. మొన్నటి వరకు శ్రీదేవి ఓ గొప్పనటిగా మాత్రమే మనందరికి తెలుసు. దాదాపు మూడు తరాల అభిమానులకు తనవైపుకు తిప్పుకున్న శ్రీదేవిలో మనకి తెలియని మరో టాలెంట్ ఉంది. పెయింటింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టమట. గత ఐదేళ్ళుగా ఎవరికి తెలియకుండా పెయింటింగ్స్ వేస్తుందట. సినీ కేరీర్ వల్ల ఆ టాలెంట్ను శ్రీదేవి ఎప్పుడూ బయపెట్టలేదు. తీరిక దొరికినప్పుడల్లా శ్రీదేవి పెయింటింగ్లు వేసి నచ్చిన వాళ్ళకి బహుమతిగా ఇస్తారట. ఇటీవల తన మరిది కూతురు సోనమ్ కపూర్కి అద్భుతమైన పెయింటింగ్ వేసి ఇచ్చిందట శ్రీదేవి. ఆ పెయింటింగ్ ను చూసి ఫుల్ ఖుష్ అయిన సోనమ్ ఆ మరుపురాని జ్ఞపకాన్ని తన రూమ్లో దాచుకుందట. మరోవైపు సల్మాన్ ఖాన్, డిజైనర్ మనీష్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలకు కూడా తన పెయింటింగ్స్ బహుమతులుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీదేవికి తన ఇద్దరు కుమార్తెలు అంటే ప్రాణం..అందుకేనేమో ఆమె పెయింటింగ్స్లో జాన్వి, ఖుషీలవి కూడా ఉన్నాయట. అదేవిదంగా మైకేల్ జాక్సన్ను ఎంతో ఇష్టపడే శ్రీదేవి ఆయన పెయింటింగ్ను గీశారు. కాగా, శ్రీదేవి పెయింటిగ్స్తో ఓ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సంస్థ ఛారిటి నిమిత్తం దుబాయ్లో ఓ షో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసిందని కూడా వార్తలు వెలువడ్డాయి. శ్రీదేవి గీసిన సోనమ్ పెయింటింగ్ ప్రయాణాలంటే ఇష్టం శ్రీదేవికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. తీరిక దొరికనప్పుడల్లా భర్త బోనీ, పిల్లలతో కలిసి తరచూ విదేశీ పర్యటనకు వెళతామని ఆమె ఓ ఇంటర్వూలో తెలిపారు. రోమ్, ఇటలీ నగరాలు బాగా నచ్చుతాయని తెలిపింది. లేతరంగు చీరలను ఇష్టపడే శ్రీదేవి.. చీర ఎలా కట్టుకోవాలో వాళ్ల అమ్మ దగ్గర నేర్చుకుందట. సంగీతం వింటూ పనులు చేసుకునే శ్రీదేవి తెలుగు, హిందీ, తమిళ పాటను ఎక్కువగా వింటుంది. అదే విధంగా దేవుడిపైనా శ్రీదేవికి నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని ప్రారంభించే ముందు పూజ చేయడం అమెకు అలవాటు. మైకేల్ జాక్సన్ పెయింటింగ్ -
చిత్రాలతో మహిళా శక్తిని చాటుతున్న లలితాదాస్
-
నోటి గీత..మార్చింది రాత
ఆడపిల్ల అంటే ఆధారపడేదని ఎందుకు అనుకోవాలి? వైకల్యం ఉన్నంత మాత్రాన ఎవరో ఒకరి ఆసరా తీసుకోవాల్సిందేనని ఎందుకు భావించాలి? అని ప్రశ్నిస్తుంది శ్రీలేఖ. తన ప్రశ్నలకు తానే సమాధానం.. అంతేనా? మరెందరినో లక్ష్యం వైపు నడిపించే మోటివేషనల్ స్పీకర్. వైకల్యాన్ని జయించి, వైవిధ్యభరితమైన కళలకు ప్రాణం పోస్తున్న ఈ అమ్మాయి ‘అందరితో ఉందాం.. ఆధారపడకుండా ఉందాం’ అంటోంది. సాక్షి, సిటీబ్యూరో: కుంచె నోటితో పట్టుకొని కాన్వాస్పై చిత్రాలు గీస్తున్న చందానగర్ నివాసి మందలపల్లి శ్రీలేఖను చూస్తే మన కళ్లు ఆశ్చర్యంతో ఆమెనే చూస్తాయి. పుట్టుకతోనే కాళ్లు, చేతులు పనిచేయకపోయినా తనలోని ప్రతిభ, ఆత్మవిశ్వాసాలనే అవయవాలుగా మలచుకొని... తాను కదలలేకపోయినా ఎందరినో కదిలించే చిత్రాలు గీస్తోంది. ‘మనిషి తలచుకుంటే ఏమైనా సాధించొచ్చు. జీవితమంటే ఎంతో ఉందని తెలుసుకున్నాను. తెలుసుకున్నది నలుగురికి తెలియజేయడమే ఇప్పుడు నా పని’ అంటున్న ఈ యువతి నోటితో కళాత్మక అపురూపాలు ఆవిష్కరిస్తున్న తీరు... విధిపై ఆమె సాధించిన విజయాల ‘చిత్రం’. ‘సాక్షి.. నేను శక్తి’ శీర్షికతో శ్రీలేఖ పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... పుట్టుకతోనేపరీక్ష... పాకడం, తప్పటడుగులు వేయడం, పరుగెత్తడం ఇలాంటివేవీ చిన్నప్పుడు నాకు తెలీదు. నాకు కండరాల క్షీణత వ్యాధి. శరీరం పెరుగుదల, కండరాల్లో పట్టుండదు. కీళ్లు పనిచేయవు. దేహం గాలి ఊదిన బెలూన్లా ఉంటుందని... పుట్టుకతోనే నేను జీవితకాల వైకల్య బాధితురాలని వైద్యులు తేల్చారు. అయితే ‘ఇలాంటి జబ్బున్న పిల్లల్లో మెదడు ఎదుగుదల ఉండదు. కానీ అదృష్టవశాత్తు మీ అమ్మాయికి మెదడు బాగానే పనిచేస్తుంద’ని మా అమ్మానాన్నకు చెప్పారు. ఇక నా తల్లిదండ్రులు చేతనైన చికిత్సలన్నీ చేయించినా ఎలాంటి మార్పు రాలేదు. కూర్చోవడం, పడుకోవడం, తినిపిస్తే తినడం తప్ప మరేమీ చేయలేని నన్ను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. మిగతా ఇద్దరు పిల్లల్లానే చదివించారు. నన్ను ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్లి బెంచిమీద కూర్చోబెట్టి వెళ్లేది అమ్మ. మళ్లీ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించి, టాయ్లెట్కి తీసుకెళ్లి బట్టలు శుభ్రం చేసి, స్కూల్ టైమ్ అయ్యేంత వరకు ఉండి... తిరిగి ఇంటికి తీసుకెళ్లేది. ఇలాగే నానాయాతన పడుతూ డిగ్రీ వరకు చదివించారు. పట్టుదలతో ఫస్ట్క్లాస్... ‘చలనం లేని శరీరానికి చదువులెందుకని’ కొందరు... ‘ఏం సాధించాలని?’ అని మరికొందరు ఎద్దేవా చేశారు. ఆ మాటలు నాలో మరింత పట్టుదలను పెంచాయి. కుడి చెయ్యి ఒక్కటి లేపి పుస్తకం మీద పెడితే రెండువేళ్లతో అతి కష్టంగా, చాలా మెల్లగా రాసేదాన్ని. ఆ రాత కోసం రాత్రి పగళ్లు సాధన చేసి నేర్చుకున్నాను. పరీక్ష మూడు గంటల సమయముంటే.. టీచర్లు, లెక్చరర్లు నాకోసం మరో అరగంట అదనంగా కేటాయించేవారు. ప్రతి తరగతిలోనూ ఫస్ట్ క్లాస్లో పాసయ్యాను. డిగ్రీలో 70శాతం మార్కులు సాధించాను. ఉపాధి సృష్టి బీకామ్ పూర్తయ్యాక ఉద్యోగం చేద్దామంటే.. ‘95 శాతం వైకల్యం. ఒకరి అండ లేకుండా కదలలేని వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తాం?’ అని ప్రశ్నించారు. ఉద్యోగం పేరుతో ఒకరిని అడిగే కన్నా.. ప్రతిభకు సానబెట్టి మనమే ఏదో ఉద్యోగం ఎందుకు సృష్టించుకోకూడదు? అని ఆలోచించాను. చిన్నప్పటి నుంచి అమ్మ చీరల మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తుంటే... చూస్తూ కొంచెం నేర్చుకున్నాను. దాన్నే ఆధారం చేసుకోవాలనుకున్నాను. అయితే బరువైన బ్రష్లు చెయ్యితో పట్టుకోవడం కుదిరేది కాదు. బ్రష్ తీసి చేతిలో పెట్టినా జారిపోయేది. దీంతో నోటితో పట్టుకున్నాను. ‘నువ్వేం వేయగలవు. చాలా కష్టం’ అని నా పంతం తెలిసిన అన్నయ్య నన్ను మరింత రెచ్చగొట్టేవాడు. నోటితో అన్ని రకాల స్ట్రోక్స్ ఇవ్వడం అసాధ్యమని, క్లాస్ తీసుకోలేనని చెప్పారు టీచర్. ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకున్నాను. సార్ చెప్పినట్టు పెయింటింగ్ వేసి చూపించాను. అలా రోజు ఐదారు గంటలు పెయింటింగ్ ఎగ్జిబిషన్స్లో పాల్గొంటున్నాను. అంతర్జాతీయ ఫుట్ అండ్ మౌత్ ఆర్టిస్ట్ల కాంటెస్ట్కి పెయింటింగ్స్ పంపాను. ఈ మధ్యే ఇంటి దగ్గర చిన్నపిల్లలకు పెయింటింగ్ క్లాస్లు కూడా తీసుకుంటున్నాను. అయితే ఇది ఆదాయం కోసం కాదు... నాకు వచ్చిన కళ మరికొందరికి నేర్పడానికి మాత్రమే. వీల్చైర్ మీద కూర్చున్నా.. వీలైనంత మందిని మార్చాలని ఉంది. అందుకే మోటివేషన్ క్లాసెస్. -
పికాసో కాదు.. పిగ్కాసో!
చిత్ర కళలో పేరొందిన కళాకారుడు పికాసో.. ఆయన తర్వాత నేనేనంటూ చిటికెలో చిత్రాలు గీస్తోంది ఈ పిగ్కాసో. ఎవరీ పిగ్కాసో అనుకుంటున్నారా! పక్క చిత్రంలో కనిపిస్తున్న పందిగారే.. దక్షిణాఫ్రికాలో ఓ కబేళాకు తరలిస్తున్న నాలుగు వారాల పందిపిల్లను కాపాడి దత్తత తీసుకుంది జంతు హక్కుల సామాజిక కార్యకర్త జొన్నె లెఫ్సోన్. అప్పటి నుంచి దాన్ని వ్యవసాయ క్షేత్రానికి తరలించి పెంచుకోసాగింది. ఓ రోజు పంది ఆడుకోవడానికి వెరైటీ బొమ్మలను దాని ముందు పడవేసింది. అది మాత్రం తనకు నచ్చిన పెయింటింగ్ బ్రష్ను ఎంచుకుంది. ఇది గమనించిన లెఫ్సోన్ దాని ముందు కెన్వాస్ అమర్చి రంగుల్ని అందుబాటులో ఉంచింది. ఇంకేముంది నోట్లో బ్రష్ పట్టుకొని రంగుల్లో ముంచుతూ బొమ్మలు గీయడం ప్రారంభించింది. అప్పటినుంచి పిగ్ కాస్తా పిగ్కాసోగా మారింది. ఇప్పటికే ఎన్నో చిత్రాలను గీసింది. అన్నట్టు చెప్పడం మరిచానండోయ్.. పిగ్కాసో కళాఖండాలకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఒక్కో చిత్రం దాదాపు 2 వేల డాలర్లకు అమ్ముడవుతోంది. పిగ్కాసో గురించి లెఫ్సోన్ను ప్రశ్నిస్తే.. అది చాలా తెలివైందని, అసాధారణ ప్రతిభ గలదని ప్రశంసించింది. చిత్రాలు గీయాలనుకున్నప్పుడే గీస్తుందని.. బొమ్మలు గీయాలని ఏనాడూ బలవంతపెట్టలేదని చెప్పింది. -
దేవుళ్లు చూస్తుండటంతో...
లక్నో : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వస్థలం గోరఖ్పూర్. జిల్లా న్యాయస్థానం, ఐజీ కార్యాలయాలు ఉన్న రోడ్లు ఎప్పుడూ జనసందోహంతో బిజీగా ఉంటాయి. కాస్త దూరంలో టాయ్లెట్లు ఉన్నా.. దారినపోయే కొందరు మాత్రం అదే పనిగా ఆ గోడలకే మూత్ర విసర్జన చేస్తుండేవారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, చివరకు పోలీస్ కాపలాను ఉంచిన నివారించలేకపోయారు. తరచూ ఈ గోడల వద్ద కొందరు చెత్త చెదారం వేయటం.. మూత్ర విసర్జన చేసేవారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు లేడీకానిస్టేబుళ్లను మోహరించినా ప్రయత్నం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆలోచన చేశారు. వెంటనే ముంబైకి చెందిన బత్వల్ అనే చిత్రకారుడికి కబురు పెట్టారు. మూత్ర విసర్జన నివారణకు కోసం ఆ గోడలపై దేవుడి బొమ్మలను చిత్రీకరించాలని అతన్ని కోరారు. దేవుళ్లు, ఇతర మతాలకు సంబంధించిన చిత్రాలు, రామాయంలోని ఘట్టాలు, ప్రముఖుల ఫోటోలతో బత్వల్ గోడలపై అందమైన పెయింటింగ్లు వేశాడు. ‘‘దేవుళ్లు చూస్తున్నారు.. మీ చెండాలం ఆపండి’’... అంటూ కొటేషన్లు రాసేశారు. ఈ ఆలోచన బాగా పని చేసింది. ప్రస్తుతం వాటి చుట్టు పక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటంతోపాటు ఆయా గోడల వద్ద సెల్ఫీల కోసం జనాలు ఎగబడిపోతున్నారని గోరఖ్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెబుతున్నారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నివారించటం కోసం చేసే యత్నం సాధారణమైన అంశమే. కానీ, యూపీ సీఎం స్వస్థలంలోనే స్వచ్ఛ భారత్ విఫలం అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తగా.. స్వయంగా యోగి ఆదిత్యానాథ్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. గత ఆరు నెలలుగా మున్సిపల్ అధికారులకు ఆయన అదే పనిగా ఆదేశాలు జారీ చేస్తుండటంతో.. ఏం చేయాలో తెలీక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఓ సామాజిక వేత్త సాయంతో ఐజీ మోహిత్ ఈ సమస్యకు పుల్స్టాప్ పెట్టారు. -
బొమ్మ బొమ్మకో సొగసోయి..
సాక్షి, అమలాపురం టౌన్:‘కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి..’ అన్నాడు ఓ సినీ గేయ రచయిత. ‘బొమ్మ బొమ్మకో సొగసోయి.. కనులకు దక్కిన విందోయి..’ అన్నట్లుగా చిత్రకారుల కుంచెలు రంగులు పూసుకుని ఆవిష్కరించే ప్రతి చిత్రం ఓ భావ గర్భిత రంగుల లోకమే. ఓ సృజనాత్మక సందేశమే. ఇలాంటి అపురూప చిత్రాలెన్నో అమలాపురంలోని కోనసీమ చిత్ర కళా పరిషత్ ఏటా నిర్వహించే జాతీయ స్థాయి చిత్ర కళా పోటీలు, ప్రదర్శనల్లో కనువిందు చేస్తాయి. పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి, ప్రముఖ చిత్రకారుడు కురసాల సీతారామస్వామి ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో అమలాపురంలోని సత్యసాయి కళ్యాణ మండపం జాతీయ స్థాయి చిత్ర కళా పోటీలకు, ప్రదర్శనలకు వేదికవుతోంది. గత 28 ఏళ్లుగా కోనసీమ చిత్ర కళాపరిషత్ క్రమం తప్పకుండా ఏటా జాతీయ స్థాయిలో చిత్రకారుల్లో పెద్దలు, పిల్లలకు పోటీలు నిర్వహిస్తూ వారిలోని చిత్ర కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే కాక ఆ కళకు తన వంతు ఊతం ఇస్తోంది. 28వ జాతీయ స్థాయి చిత్ర కళాపోటీలకు, ప్రదర్శనలకు పెద్దల విభాగంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 150 మంది అద్భుత చిత్రాలను గీసి పంపించారు. ఆగాచార్యకు‘భారత చిత్రకళా రత్న’ పోటీల్లో ప్రథమ స్థాయి విజేతను చిత్ర కళా పరిషత్ రూ.31 వేల నగదుతో పాటు ‘భారత చిత్రకళా రత్న’ అవార్డుతో సత్కరిస్తుంది. ఈ బహుమతిని, అవార్డును హైదరాబాద్కు చెందిన చిత్రకారుడు ఆగాచార్య గెలుచుకున్నారని సీతారామస్వామి ప్రకటించారు. రూ.10 వేల నగదు బహుమతితో ‘అమరావతి చిత్ర కళా రత్న’ అవార్డులకు నలు గురిని, రూ.5 వేల నగ దు బహుమతితో పాటు ‘చిత్ర మయూరి’ అవార్డులకు ముగ్గురిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అమరావతి చిత్ర కళా అవార్డుకు రాజేశ్వర్, ఎన్. (సికింద్రాబాద్), కొండా శ్రీనివాసరావు (హైదరాబాద్), కిరణ్కుమార్ తాదోజు (రాజమహేంద్రవరం), గొర్తి రవి సీతారామశాస్త్రి (ఇందుపల్లి, అమలాపురం రూరల్), చిత్ర మయూరి అవార్డులకు జింకా రామారావు (సత్తెనపల్లి), ఆకాష్ ఎస్.అలి (బీదర్, కర్ణాటక), జి.మధు (మోరి, సఖినేటిపల్లి మండలం) ఎంపికయ్యారు. వారికి అవార్డులను, బహుమతులను 20న అందజేయనున్నారు. 21న 30 మంది ప్రముఖ చిత్రకారులతో ఆర్ట్ క్యాంప్ నిర్వహించనున్నారు. అనంతరం ‘చిత్రకళ–భవిష్యత్ పరిణామాల’పై ప్రముఖ చిత్రకారులతో ఇష్టాగోష్టి జరుగుతుంది. అ మలాపురం రూరల్ మండలం ఇందుపల్లి ని వాసి, కోనసీమ ఆర్ట్ లెజెండ్ ఎర్రమిల్లి రోహిణీకుమార్కు జీవన సాఫల్య పురస్కారం ప్ర దా నం చేస్తారు. పోటీకి వచ్చిన చిత్రాలను రెండు రోజుల పాటు ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి ని మ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. -
పెయింటర్ శ్రీదేవి!
యాక్టర్–డైరెక్టర్, యాక్టర్– ప్రొడ్యూజర్.. ఎప్పుడూ వినిపించేమాట. తక్కువగా వినిపించే మాట యాక్టర్– పెయింటర్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సల్మాన్ఖాన్ అందరికీ తెలిసిన యాక్టర్– పెయింటర్. టైమ్ దొరికినప్పుడు ఆయన పెయింటింగ్ వేస్తారు. ఫ్రెండ్స్కి గిఫ్టుగా ఇస్తారు. ఛారిటీ కోసం కొన్నిటిని అమ్మేస్తారు. ఆయన ఒక్కరేనా ఇలా యాక్టర్–పెయింటర్? ఇంతవరకు ఒక్కరే అనుకున్నాం. ఇక ముందు అలా అనుకోడానికి లేదు. సీనియర్ నటి శ్రీదేవి వచ్చే నెల దుబాయ్లో జరుగుతున్న వేలానికి తన పెయింటింగ్లను పంపుతున్నారు. అరే! ఎప్పుడు వేశారు? వారానికి 5 నుంచి పది గంటలకు పెయింటింగ్లోనే ఉంటున్నారట శ్రీదేవి. ‘సావారియా’లో సోనమ్ కపూర్ పోర్ట్రైట్ని, మైఖేల్ జాన్సన్నీ కంప్లీట్ చేసి ప్లయిట్కి కూడా సిద్ధం చేస్తున్నారు. మిగతావి కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఈ రెండు పెయింటింగ్లనే శ్రీదేవి ఎంపిక చేసుకున్నారు. వేలంలో ఒక్కో పెయింటింగ్ ప్రారంభ ధర 8 లక్షల రూపాయలట. వచ్చిన డబ్బుని సేవా సంస్థలకు విరాళంగా ఇవ్వాలని శ్రీదేవి ముందే నిర్ణయించుకున్నారు. -
షీ ఈజ్ సమ్థింగ్!
ఆమెకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఇష్టం. అమ్మ చీరలపై ఆర్ట్ వేస్తుంటే చూసి ఆశ్చర్యపోయేది. తానూ పెయింటింగ్ నేర్చుకొని ‘ది బెస్ట్’ అనిపించుకోవాలనుకుంది. అమ్మ స్ఫూర్తిగా మొదలైన ఆమె ప్రస్థానం.. నేడు గిన్నిస్ బుక్కి ఎక్కింది. ఆమే నగర యువతి జాహ్నవి మాగంటి. హిమాయత్నగర్: మొదట నోట్ పుస్తకాలు, బ్లాక్ బోర్డులపై కొన్ని కాన్సెప్ట్లకు సంబంధించిన పెయింటింగ్స్ వేయడం అలవర్చుకుంది జాహ్నవి. అలా వేస్తూ వేస్తూ ఇప్పుడు ఏకంగా కాలితో పెయింటింగ్ వేసి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించింది. మణికొండలోని ల్యాంకోహిల్స్లో నివసించే జాహ్నవి ప్రస్తుతం యూకేలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఆమె తల్లి జయశ్రీ డ్రెస్ మెటీరియల్స్పై డిజైన్స్ వేసేది. చీరలపై వేసిన పెయింటింగ్స్ చూసిన వారంతా జయశ్రీని కొనియాడేవారు. అదిచూసిన జాహ్నవి అమ్మలా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంది. అలా పెయింటింగ్స్ వేయాలనే ఆలోచన ఆరేళ్ల ప్రాయంలోనే ఆమె మదిలో మెదిలింది. ‘గ్లోబల్ ఆర్ట్ ఎక్స్పో’లో తొలి ప్రదర్శన జాహ్నవి వేసే పెయింటింగ్స్కు స్కూల్లో మంచి ప్రశంసలు దక్కేవి. ఈ క్రమంలో 2014లో 9 దేశాలు ప్రాతినిధ్యం వహించే ‘గ్లోబల్ ఆర్ట్ ఎక్స్పో’లో ఆమెకు అవకాశం వచ్చింది. ఇందులో దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం చిత్రాన్ని ప్రదర్శించింది. దీనికి ప్రశంసలు రావడంతో పాటు పదుల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇక అప్పటి నుంచి దేశవిదేశాల్లో నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొని మన్ననలు అందుకుంది. ఆర్ట్ విత్ డ్యాన్స్ ఎప్పుడూ చేతితో పెయింటింగ్ వేయడమేనా? కాలితో వేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన జాహ్నవి... ఓ నెల రోజులు అలా ప్రయత్నించింది. తర్వాత ‘లోటస్’ అనే ఒక కాన్సెప్ట్తో డ్యాన్స్ చేస్తూ పాదాలు, కాళ్ల వేళ్లతో పెయింటింగ్ వేసింది. ఈ వీడియోను తన ఫేస్బుక్ (స్ట్రోక్) పేజ్, యూట్యూబ్లలో అప్లోడ్ చేసింది. అదే విధంగా దీనిని గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పంపగా, వారు అంగీకరించి తాము చెప్పిన విధంగా చేయాలని సూచించారు. 9 గంటలు.. 141 చదరపు మీటర్లు అయితే పాదాలు, కాళ్ల వేళ్లతో కాకుండా కాలితో బ్రష్ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ పెయింటింగ్ వేయాలని గిన్నిస్ బుక్ ప్రతినిధులు సూచించారు. దీనికి జాహ్నవి అంగీకరించింది. డిసెంబర్ 29న ల్యాంకోహిల్స్లోని క్లబ్హౌస్లో గిన్నిస్ బుక్ అధికారుల సమక్షంలో జాహ్నవి తన ప్రతిభను చాటింది. ‘అక్రిలిక్’ పెయింటింగ్ను 9 గంటల్లో 141.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వేసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. అద్భుతమైన ఆర్టిస్ట్ అయిన జాహ్నవి సేవాహృదయురాలు. తన పెయింటింగ్స్ను ఎగ్జిబిషన్లలో ప్రదర్శించగా వస్తున్న డబ్బులను ఆమె సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇవి ఏడాదికి రూ.50–60 వేలు అవుతుండగా, వాటిని నగరంలోని విజయనగర్ కాలనీలోని ‘గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం’, విజయవాడలోని ‘చిన్మయి విజయ’ బాలికల అనాథాశ్రమాలకు నాలుగేళ్లుగా అందజేస్తున్నారు. వృత్తిని సేవగా ఎంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు జాహ్నవి. కాలుతో పెయింటింగ్ వేస్తున్న జాహ్నవి తల్లి జయశ్రీతో -
ఇదిగో పాము... వచ్చారో జాగ్రత్త
తూర్పుగోదావరి, అమలాపురం: కొబ్బరిచెట్టుపై పాము బొమ్మలు చూశారా? తోటలకు దిష్టి తగలకుండా వేసిన బొమ్మకాదు ఇది. కొబ్బరి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసే ఉడతలు. ఎలుకలు దాడి నుంచి కొబ్బరి చెట్టును..దిగుబడిని రక్షించుకునేందుకు రైతులు ఇలా పాము బొమ్మలను గీస్తున్నారు. సాధారణంగా ఎలుకలు, ఉడతలు కొట్టడంతో చెట్టు పలురకాలుగా ధ్వంసమవుతోంది. కొబ్బరి పిందెలను, చిన్నపాటి కాయలను సైతం ఇవి కొట్టేస్తుంటాయి. అలాగే డొలకలు, కొబ్బరి ఆకులు మొత్తాల్లో చేరి మొవ్వును తినేస్తాయి. ఇలా చేయడం వల్ల కొబ్బరి చెట్టు కూడా దెబ్బతిన చనిపోయే ప్రమాదముంది. రైతులు వీటిని సకాలంలో గుర్తించకుంటే కొబ్బరితోట నాశనమవుతోంది. కొబ్బరితోట ఒక్కటే కాదు.. దాని అంతర పంటగా సాగు చేసే కోకో ఎలుక, ఉడతల దాడివల్ల ఎక్కువగా నష్టపోతోంది. దీంతో పాటు ఇతర అంతర పంటలకు కూడా నష్టం వాటిల్లితోంది. వీటిని నిర్మూలించాలంటే మట్టుబెట్టడం మిన హా మరో మార్గం లేదు. కానీ కొంతమందికి ఉడతను చంపడానికి సెంటిమెంట్ అడ్డువస్తోంది. ఇటువంటి రైతులు వాటిని భయపెట్టేందుకు, చెట్టు ఎక్కకుండా చేసేందుకు ఇలా పాము బొమ్మలను వేస్తున్నారు. ఎలుక నివారణకు ఆల్యూమినియం రేకు మంచిది... ఎలుకలు, ఉడతల నివారణకు పాము బొమ్మలు వేయడం మంచిదే. కానీ ఇది అన్నిసార్లు మంచి ఫలితాన్నివ్వదని అమలాపురానికి చెందిన ఆదర్శ రైతు అబ్బిరెడ్డి రంగబాబు తెలిపారు. కొబ్బరి, కోకో, ఇతర అంతర పంటపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఎలుకల నివారణ ‘సాక్షి’కి ఆయన తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ♦ ఎలుకలు చాలా తెలివైనవి. ముఖ్యంగా చెట్లు ఎక్కే ఎలుకల జాతి రకాన్ని రేటస్..రేటస్ అంటారు. కొబ్బరి చెట్లపై పాము బొమ్మలుంన్నా ఎలుకలు చెట్టు ఎక్కడం మానవు. పాము బొమ్మలను ఒకటి, రెండుసార్లు చూపి భయపడి చెట్టు ఎక్కకున్నా, తరువాత అవి బొమ్మలని ఎలుకలు పసిగట్టగలవు. చెట్టు ఎక్కి యథావిధిగా ధ్వంసం చేస్తాయి. వీటి నిర్మూలనకు పలు పద్ధతులున్నాయి. ♦ పుస్తకాలకు వేసే అట్టలు (ట్రాన్స్ప్లంట్ పేపర్)ని చెట్టుకు చుట్టాలి. కొబ్బరి చెట్టు కాండం గరుకుగా ఉండడం వల్ల ఎలుక ఎక్కేందుకు సలువుగా ఉంటుంది. కాబట్టి అట్ట పుస్తకాలకు వేసే అట్టలాంటి ట్రాన్స్పెంట్ పేపరును చుట్టడం మంచి ఫలితానిస్తోంది. దీనివల్ల ఎలుక, ఉడతలు కాళ్లు జారి కింద పడిపోతాయి. ♦ ఆట్టలకు వేసే పేపరుకన్నా ఉత్తమమైన పద్ధతి అల్యూమినియం రేకులను తొడగడం. ఇలా చేయడం వల్ల కూడా ఎలుకలు జారిపడతాయి. ♦ అల్యూమినయం రేకు, ప్లాస్టిక్ రేకుతో గరాటా ఆకారంలో చెట్టు మధ్యలో ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడకు వెళ్లే ఎలుకలు, ఉడతలుపైకి వెళ్లేందుకు అవకాశముండదు. ♦ గ్రీజులో మోనోక్రోటోఫాస్ మందును రాస్తే ఎలుక కాళ్లకు గ్రీజు అంటుకుంటుంది. దీన్ని నోటితో శుభ్రపరుచుకుంటాయి. అప్పుడు విషం నోటిలోకి వెళ్లి ఎలుక చనిపోతోంది. ♦ చెట్టు దిగువ భాగంలో కొబ్బరి డొక్కల మధ్యలో ఎలుకల నివారణ ముందు ఉంచాలి. (ఫెర్మనెంట్ బైట్ స్టేషన్) ఎలుకలు చెట్టుమీదకు దిగినప్పుడు ఈ మందు తిని చనిపోతాయి.) -
అమరావతిలో అలజడి
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కొలనుకొండలో ఆదివారం ఉదయం నివాసాల మధ్య పెద్ద పేలుడు శబ్దం రావడంతో రాజధాని ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పెయింట్ డబ్బాలో తెల్లని రాళ్లు ఉండడం వల్ల పేలుడు సంభవించిందని ఆ ఇంటి యజమానులు చెబుతున్నప్పటికీ స్థానికులు, పోలీసులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలో నిజంగా కార్బైడ్ను అమరిస్తే దాని నుంచి వెలువడిన గ్యాస్కు అంత పేలుడు సంభవిస్తుందా? అయినా కార్బైడ్కు నీళ్లు తగలకపోతే దాని నుంచి ఎటువంటి రియాక్షన్ రాదు. నాగరాజు ఇంట్లో పేలిన ప్లాస్టిక్ డబ్బా ఆరు నెలల క్రితం పని వద్ద నుంచి తీసుకొచ్చి ఇంట్లో బయట పెట్టాడని పోలీసుల విచారణలో తెలిపారు. అయితే ప్లాస్టిక్ డబ్బాలో తెల్లని పదార్థం ముందుగా నాగరాజు గమనించలేదా? ఆ పెయింట్ డబ్బా మూత ౖఒక్కసారి తీసి పెట్టింది కాబట్టి లూజుగానే ఉంటుంది. నిజంగా గ్యాస్ ఫామ్ అయితే ఆ మూత ఎప్పుడో పైకి లేచిపోయేదని పోలీసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు తాపీ పనితోపాటు అప్పుడప్పుడు చేపలు కూడా పడుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చేపలు వేటాడేవారు గతంలో డిటనేటర్స్ను వాడి నీటిలో పేల్చి చనిపోయిన చేపలను పట్టుకునే వారు. దాని కోసం తీసుకొచ్చి ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ డబ్బాలో దాచి పెట్టాడా? ప్రమాదవశాత్తూ ఒత్తిడి తగిలి బ్లాస్టింగ్ అయిందా? చుట్టుపక్కల కొండ తొలిచే వారు నాగరాజుకు ఇచ్చి దాచిపెట్టమన్నారా ? అనే విషయాలు తేలాల్సి ఉంది. నాగరాజు భార్య భవానీ మాత్రం ఆ బకెట్లో తెల్లని వస్తువులు ఉన్నాయని మాత్రమే చెబుతుంది. ఏమైనా నాగరాజు స్పృహలోకి వస్తేగాని నిజానిజాలు బయటకు రావు. మొన్న హత్య... నేడు పేలుడు... ఒక్కసారిగా జరిగిన పేలుడుకు రాజధానిలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మొన్న విజయవాడలో రౌడీషీటర్ను తెనాలికి చెందిన వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఆ సంఘటన మరువక ముందే కొలనుకొండ ప్రాంతంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం, నాగరాజుది కూడా తెనాలి ప్రాంతం కావడం, వారితో ఏమన్నా సంబంధాలున్నాయా ? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ హత్య నేపథ్యంలోనే విజయవాడకు అతి సమీపంలో ఉన్న కొలనుకొండ ప్రాంతంలో పేలుడు పదార్థాలను దాచిపెట్టారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పేలుడు సంభవించిన ప్రాంతంలో శకలాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో జరిగిన పేలుడు కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం సీరిసయ్గా దృష్టి సారించారు. ఆ కత్తేమైంది? నాగరాజు ప్లాస్టిక్ డబ్బాను తెరవడానికి ఉపయోగించిన కత్తి ఏమైంది? పెయింట్ డబ్బాకు వాస్తవానికి కోయాల్సిన అవసరం లేదు. పెయింట్ ఉపయోగించడానికి దానికున్న సీల్ తీసి.. పెయింట్ను వాడతారు. నాగరాజు తాపీ పని చేసి దగ్గర్నుండి ఆ డబ్బా తీసుకొచ్చాడని ఆయన భార్య చెబుతుంది. డబ్బా మూత గట్టిగా పట్టుకొని చేత్తో లాగితే వచ్చేస్తుంది. కానీ నాగరాజు కత్తితో కోయడానికి ఎందుకు ప్రయత్నించాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నాగరాజు పని చేసే దగ్గర డబ్బా తీసుకొచ్చినట్లయితే ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకొస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాగరాజు పరిస్థితి విషమం లబ్బీపేట(విజయవాడతూర్పు): పేలుడు ఘటనలో గాయపడి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిలో కార్పెంటర్ నాగరాజు శ్వాసతీసుకోవడం కష్టతరంగా మారడంతో అత్యవసర వైద్య విభాగంలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. పేలుడులో కుడికాలు మోకాలు కింద వరకూ తెగిపోవడం, ఎడమ కాలు సైతం నుజ్జు నుజ్జు కావడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా శరీరం సైతం 80 శాతం గాయాలు కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలిపారు. ఇదే ఘటనలో గాయపడిన మణిమ్మ కాళ్ల ఎముకలు, తుంటె, పక్కటెముకలు విరిగిపోయాయి. మరో మహిళ భవానీ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఈమెను సర్జరీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
పోర్ట్రేట్ పెయింటింగ్.. ఒక సవాల్
చిత్రం గీయడం చిన్న విషయమేమీ కాదు. ఆలోచనకు తగ్గట్టు కుంచెను కదిలించి.. అద్భుతాలను ఆవిష్కరించాలి. ఇలాంటి చిత్రకారులు చాలామందే ఉంటారు. కానీ ఒక బొమ్మను చూస్తూ ఉన్నది ఉన్నట్టు గీయడం (పోర్ట్రేట్ పెయింటింగ్) ఒక సవాల్. అంతటి కష్టమైన పనిని కృషి, పట్టుదలతో సునాయాసంగా చేసేస్తున్నాడు హైదరాబాద్ చిత్రకారుడు ముక్కపల్లి లక్ష్మీనారాయణ. పోర్ట్రేట్ పెయింటింగ్తో అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. నగరంలోని అత్తాపుర్ సమీపంలో నివసించే లక్ష్మీనారాయణ ఆవిష్కరించిన అద్భుతాలకు బంగారు పతకాలు వరుసకట్టాయి. 2003లో పోర్చుగల్లో జరిగిన అండ్ర్ 19 ప్రపంచ పెయింటింగ్ పోటీలకు తాను గీసిన చిత్రాలను పంపగా గోల్డ్ మెడల్ వరించింది. అదే ఏడాది బంగ్లాదేశ్లో జరిగిన వరల్డ్ పెయింటింగ్ కాంపిటీషన్స్లోనూ, 2004లో జపాన్లో నిర్వహించిన పోటీల్లోనూ బంగారు పతకం కొల్లగొట్టాడు. అంతేకాకుండా మరెన్నో పోటీల్లో అవార్డులు అందుకున్నాడు. ఐదేళ్ల నుంచే ఆసక్తి.. మామ కుమారుడు రమేష్ గీసిన చిత్రాలను చూసి ఐదేళ్ల వయసులోనే ఆర్ట్పై ఆసక్తి పెంచుకున్న లక్ష్మీనారాయణ... అప్పటి నుంచి తన ముందు కనిపించే వ్యక్తులు, వివిధ వస్తువుల బొమ్మలు వేయడం ప్రారంభించాడు. అలా చిత్రాలు గీస్తూ ఇంటర్ పూర్తి చేసిన లక్ష్మీనారాయణ... జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో పెయింటింగ్లో డిగ్రీ చేశాడు. ఆర్ట్ అదరహో.. జీహెచ్ఎంసీ నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా చందానగర్, పరేడ్గ్రౌండ్ ఎదురుగా మెట్రో పిల్లర్స్పై, జలగం వెంగళరావు పార్క్ తదితర ప్రాంతాల్లో అద్భుతమైన చిత్రాలు గీశాడు లక్ష్మీనారాయణ. సినీరంగంలోనూ తనదైన ప్రతిభ చూపి ప్రముఖుల మన్ననలు అందుకున్నాడు. ‘కంట్రోల్ సీ’ సినిమా పూర్తిగా ఆర్ట్పై ఆధారపడి ఉంటుంది. అందులో హీరోయిన్ కలలో కనిపించే వాటిని బొమ్మలుగా వేయడం ఇందులో ప్రత్యేకత. ఈ సినిమాకు లక్ష్మీనారాయణే చిత్రాలు గీశారు. ఇక ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా కోసం అమితాబచ్చన్, ఎన్టీఆర్ తదితర ప్రముఖుల పోర్ట్రేట్ పెయింటింగ్స్ను భారీ టీన్స్పై వేసి అందరి అభినందనలు పొందాడు. ‘సార్ ప్రోత్సాహంతోనే’... ఇంటర్లో నేను గీసిన బొమ్మను చూసిన మా శ్రీధర్ సార్.. నన్ను ప్రోత్సహించి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరమని సూచించారు. ఆయన సలహాతోనే నేనిప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి ఉచితంగా శిక్షణనిచ్చాను. సర్కార్ సహకారం అందిస్తే ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు ఉచితంగా శిక్షణనివ్వాలని అనుకుంటున్నాను. - లక్ష్మీనారాయణ -
స్ట్రీట్ ఆర్ట్స్తో ప్రతిభ చాటుతున్న జంట
-
పెయింటింగ్పై స్క్రూడ్రైవర్తో దాడి
రోమ్ : ఇటలీలోని గోయా నుంచి బెకాన్ మధ్య కొనసాగుతున్న మొబైల్ మ్యూజియంలో ఇటీవల ఓ 40 ఏళ్ల యువకుడు నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వేసిన ఆయిల్ పెయింటింగ్పై దాడి జరిపారు. ఈ పెయింటింగ్ను హిట్లర్ వేశాడని తెలియగానే సదరు వ్యక్తి ఆవేశంతో ఊగిపోతూ ఒక్కసారిగా స్క్రూడ్రైవర్తో దాడి చేశాడని ఈ మొబైల్ మ్యూజియంను నిర్వహిస్తున్న చిత్ర విమర్శకుడు, క్యూరేటర్ విక్టోరియో స్కార్బీ మీడియాకు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకోబోతే పారిపోయాడని, పెయింటంగ్కు పెద్దగా నష్టం ఏమీ సంభవించలేదుకనుక, నిందితుడిపై కేసు పెట్టాలనుకోవడం లేదని కూడా ఆయన తెలిపారు. ఇలాంటి చిత్రాలు భావోద్వేగాలను కలిపించే మాట వాస్తవమేనైనా, సంయమనం పాటించడం మానవుడి విధిగా ఆయన మాట్లాడారు. వియన్నా ఆర్ట్స్ కళాశాలలో అడ్మిషన్ కోసం హిట్లర్ దరఖాస్తు చేసుకున్నప్పుడు పంపించిన చిత్రాల్లో ఒకటి ఈ పెయింటింగ్ అని తెలిపారు. ‘వియన్నా అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ కాలేజీలో అడ్మిషన్ కోసం హిట్లర్ రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఆయనకు అడ్మిషన్ లభించలేదు. -
ఈ పెయింటింగ్ చూస్తే ఆశ్చర్యపోతారు
-
మీనాకుమారికి హుసేన్ ఫిదా!
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్కి అలనాటి బాలీవుడ్ అందాల తార మీనాకుమారిని కలుసుకున్నపుడు మాట పెగల్లేదట. ఆమె అందాన్ని చూడగానే హుసేన్ నిశ్చలంగా మారిపోయాడని ఆయన శిష్యురాలు, చిత్రకారిణి ఇలా పాల్ తన తాజా పుస్తకంలో వెల్లడించారు. 1967లో పాల్కు జన్మించిన బిడ్డను చూడటానికి ఆసుపత్రికి వెళ్లినపుడు హుసేన్.. మీనాకుమారిని కలిశారు. ఆమె కూడా ఆ సమయంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘తన అందమైన రూపం, ప్రత్యేకమైన గొంతుతో ప్రేక్షకులను కట్టిపడేసిన మీనాకుమారి, హుసేన్ను కలుసుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపింది. ఆమెను చూడగానే హుసేన్ నోటి నుంచి మాటలు రాలేదు’ అని ‘హుసేన్: పొర్ట్రయిట్ ఆఫ్ ఆర్టిస్ట్’ పుస్తకంలో పాల్ పేర్కొన్నారు. అలా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆ తరువాత అడిగితే..‘ నేనేం చేయను? పెదవులు కదల్చే లోగా ఆమె నావైపు చూసిన తీరుతో మాట ఆగిపోయింది’ అని హుసేన్ బదులిచ్చినట్లు తెలిపారు. -
కరెంట్ స్తంభాన్ని బైక్ ఢీకొని పెయింటర్..
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డులో ఆదివారం ద్విచక్రవాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పట్టణంలోని అంబేద్కర్నగర్కు చెందిన పెయింటర్ శ్రీనివాసులు(35) మృతి చెందగా అనంతపురానికి చెందిన మురళి(25) తీవ్రంగా గాయపడ్డాడు. రూరల్ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మురళిని అనంతపురం ఆస్పత్రికి పంపించారు. మృతుని తండ్రి నాగన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతునికి భార్య ఉంది. పిల్లలు లేరు. -
సిరంజీలతో పెయింటింగ్...
కింబర్లి జాయ్ మగ్బాను ఫిలిప్పీన్స్కు చెందిన ఈ మహిళ నర్స్గా పనిచేస్తోంది. ఆమె పెయింటింగ్లో ఎప్పుడూ శిక్షణ తీసుకోనప్పటికీ అందులో మంచి ప్రావీణ్యం సంపాదించింది. తన వృత్తిలో బిజీగా గడపడంవల్ల తన ప్రవృత్తికి సమయం కేటాయించలేకపోయింది. అయితే తనకెంతో ఇష్టమైన ప్రవృత్తిని వదులుకోలేక గతేడాది సిరంజీలతో పెయింటింగ్ చేయడం అలవర్చుకుంది. రోగులకు ఒకసారి ఇంజెక్షన్ చేసిన తర్వాత సిరంజీలను పక్కన పడేయాలి. అలాంటి వాటిని వేస్ట్గా పడేయడం కంటే పెయింటింగ్ బ్రష్గా ఉపయోగిస్తే బాగుంటుందనిపించింది. అనుకున్నదే తడవుగా ఆ పనిని ప్రారంభించేసింది. తొలుత సిరంజీలతో చిత్రాలు సరిగా రాకున్నప్పటికీ మళ్లీమళ్లీ ప్రయత్నించింది. రానురాను పెయింటింగ్స్ అద్భుతంగా రావడం మొదలుపెట్టా యి. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాలు వేసింది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్లో కింబర్లీ సెలబ్రిటీ ఆర్టిస్ట్గా మారిపోయింది. తొలుత కాన్వాస్పై బొమ్మ అవుట్లైన్ను పెన్సిల్తో గీస్తుంది. చక్కని విజువల్ ఎఫెక్ట్ కోసం బ్యాక్గ్రౌండ్ మొత్తానికీ నల్లటి రంగు పూస్తుంది. ఆ తర్వాత వివిధ రంగులతో నిండిన సిరంజీలను ఉపయోగించి బొమ్మను పూర్తి చేస్తుంది. అలా ఒక బొమ్మను గీయడానికి తనకి మూడు నుంచి ఐదు గంటలు పడుతుందని చెబుతోంది. -
ఆకట్టుకుంటున్న రొసాటోమ్ ఆర్ట్ ఎక్స్పో..
–పెయింటింగ్ల్లో ఇండియా–రష్యా స్నేహ సంబంధాలు కొరుక్కుపేట: రష్యన్ స్టేట్ ఆటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ (రోసాటోమ్), రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ సంయుక్త ఆధ్వర్యంలో 70 సంవత్సరాల ఇండియా –రష్యా స్నేహ సంబంధాలను గుర్తుకు తెచ్చేలా రొసాటోమ్ ఆర్ట్ ఎక్స్పోను శుక్రవారం నుంచి ప్రారంభించారు. స్థానిక ఆల్వార్ పేటలోని రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ కల్చర్ వేదికగా రొసాటోమ్ –సౌత్ ఆసియా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ అలెక్సీ పిమేనోవ్, రష్యన్ ఫెడరేషన్ – సౌత్ ఇండియా కాన్సులేట్ జనరల్ వైస్ ప్రెసిడెంట్ మైఖిల్ గోర్బాటోవ్ పాల్గొని లాంచనంగా ప్రారంభించారు.‘ఎనర్జీ ఫ్రెండ్షిప్– బ్రష్ స్ట్రోక్స్ ’ అ«ంశంతో చెన్నై , ఢిల్లీకి చెందిన 10మంది చిత్రకారులు బలమైన ఇండియా – రష్య స్నేహబంధం ను తెలియజేస్తూ పెయింటింగ్లను వేశారు. ఒక్కో పెయింటింగ్ ఆకట్టుకోవడమే కాకుండా ఏడు దశాబ్దాల కాలంలో రెండు దేశాల మద్య అణువిద్యు త్, విద్య, వ్యాపార సంబంధాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగాగా పెయింటింగ్లు వేసిన ఆర్టిస్టులు పద్మనాభన్. వి. కృష్ణ. పిఎన్వి హరి , సుంఘవి, యూకే.నారెన్ నో, విద్యా సుందర్, ప్రవీణ్ చ్రిస్పగ్, సుమిత సుందరం, మురుగేశన్, ఢిల్లీకి చెందిన ఆర్టిస్టు ఆక్షత్ సిన్హాలను ఘనంగా సత్కరించుకున్నారు. అనంతరం మైఖిల్ మాట్లాడుతూ విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆర్ట్ ఎక్స్పోను సెప్టెంబర్ 1వ తేదీ వరకు సందర్శకులకు వీక్షించవచ్చునని తెలియజేశారు. -
హైదరాబాద్లో నాలుగు రోజుల ఆర్ట్ క్యాంప్
-
మన ఊరే...! మన వాళ్లే...!!
-
ఇంజినీరింగ్ చదివినా, గ్రామాలపై ఇష్టంతో..
-
ఇంజినీరింగ్ చదివినా, గ్రామాలపై ఇష్టంతో..
చదివింది ఇంజినీరింగ్..తర్వాత క్రియేటివిటీకి దగ్గరగా ఉంటుందని ఇంటీరియర్ డెకరేటర్గా పని చేసినా ఏదో అసంతృప్తి. ఎందుకో యాంత్రిక జీవితానికి అలవాటుపడటం అమెకు నచ్చలేదు. తన చిన్నతనంలో పల్లెల్లో జీవనశైలిపై తల్లిదండ్రులు, పెద్దలు చెప్పే కథలు ఆమెకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి. ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లోని సంప్రదాయాలు, అక్కడి జీవన విధానం అంటే అమెకు అమితమైన ఆసక్తి. పేయింటింగ్స్ పై ప్రత్యేక శిక్షణ తీసుకోకపోయినా, మంచి పేయింటింగ్ వేయాలన్న ఆసక్తి మాత్రం ఆమెకు ఎక్కువగా ఉండేది. దీంతో ఎంతగానో ఇష్టపడే పెయింటింగ్నే తన ప్రొఫెషన్గా మలుచుకుంది. అందులోనూ పల్లెల్లో జీవన విధానంపై ఆమె గీసిన చిత్రాలు ప్రతి ఒక్కరిని చిన్నతనంలోకి తీసుకువెళతాయి. ఆవిడే.. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఇంటీరియర్ డిజైనింగ్లలో డిగ్రీలు చేసినా, ప్రొఫెషనల్ పేయింటర్గా మారి పల్లెల్లోని వాతావరణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న నైషితారెడ్డి కాసర్ల. 'పల్లెకు పోదాం' పేరిట ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో తను వేసిన చిత్రాలను ప్రదర్శించింది. తన పేయింటింగ్స్పై అమె మాటల్లోనే... మనం నగర జీవితానికి అలవాటుపడిపోయి బీజీ జీవతంతో కుస్తీ పడుతుంటాం. మన ముందు తరం వాళ్లు ఆస్వాదించిన ఆనందాన్ని మనం మిస్ అవుతున్నాం. పల్లెలు, అక్కడ వారి రోజువారి జీవన విధానం గురించి ఎవరైనా చెబుతుంటే ఎంతగానో ప్రేరణపొందేదాన్ని. నా పెయింట్లలో అక్కడి వాతావరణాన్ని చూపించాలనుకున్నాను. గొర్రెల కాపరి, బర్రెలు కాసేవారిజీవితాన్ని చూస్తే... వాటిని తీసుకొని వెళ్లి రావడం గమనిస్తే వారికున్న వనరులతో ఓ మంచి వాతారణంలో జీవితాన్ని గడుపుతారు. వాళ్లకు ఉన్నదాంట్లోనే ఎంతోగానో సంతృప్తిగా జీవిస్తారు. ఇబ్బందులు వాళ్లకు కూడా ఉంటాయి. రోజువారి జీవితంతో కుస్తీ పడుతూ ఉంటారు. అయినా వాళ్లు ఎంతో ఆనందంగా ఉంటారు. పాటలు పాడుతూ, సరదాగా కబుర్లు చెబుతూ, చిన్న చిన్న పనులతో కష్టాలను మరిచిపోతారు. బోనాలు అనేది మనకు చాలా పెద్ద పండగ. ఊళ్లోని అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో బోనాలు పండగ జరుపుకుంటారు. కొత్తగా వచ్చిన మెషిన్లను(గ్రాండర్లను) చూసినప్పుడు, పెద్దలు పల్లెల్లో వారు వాడిన ఇసురు రాయి గురించి చెప్పేవారు. పల్లెల్లో కష్టపడి తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తారు. అదెంతో కష్టతరమైంది. ఆ పని చేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. భవిష్యత్తులో ఈ పని చేయడానికి కూడా ఏవైనా మిషిన్లు కనిపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. కష్టపడి పని చేసి వచ్చిన రైతు తాటికల్లు తాగి సేదతీరే దృశ్యమే ఈ పెయింటింగ్. లేబర్ అనగానే మగవారు మాత్రమే అనే భావన సాధారణంగా అందరిలో ఉంటుంది. కానీ ఎలాంటి గుర్తింపులేకుండానే పల్లెల్లో మహిళలు కూడా ఎన్నో పనుల్లో నిమగ్నమవుతుంటారు. చాట చెరగడం, బుర్రకథ చెప్పడం, వాగుదగ్గరికి వెళ్లి నీరు తీసుకురావడం, నెత్తిపై గడ్డి కట్ట మోయడం, నాటువేయడంలాంటి వాటిలో తెలియకుండానే నా పెయింటింగ్స్లలో మహిళవి ఎక్కువగా ఉన్నాయి. మనం చిన్నప్పుడు గ్రామాల్లో చూసిన ఎన్నో నేడు కనిపించడం లేదు. ఇక తర్వాత తరం వారికి వాటి ఆనవాలు కూడా లేకుండా పోతాయేమో అనిపిస్తుంది. ఇలా ఆర్ట్ రూపంలో వేసి ఉంచితే అయినా వాటిని తర్వాత తరాల వారికి చూపించవచ్చు అని ఆలోచన. ఇక చిన్నప్పటి నుంచి ఇష్టమైన పల్లెటూరి వాతావరణాన్ని ఇలా చిత్రాల్లోకి మలచడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది. ఇంజినీరింగ్ చేసి ఇలా ఆర్టిస్ట్గా మారుతాను అనుకున్నప్పుడు అందరికంటే ఎక్కువ ఇంట్లో వాళ్లే సపోర్ట్ చెయ్యడం నా అదృష్టం. -
ఇక ‘జిందాల్’ పెయింట్స్
♦ రెండు ప్లాంట్ల పనులు ప్రారంభం ♦ వచ్చే ఏడాది ఏప్రిల్లో మార్కెట్లోకి.. ముంబై: సజ్జన్ జిందాల్ కుటుంబం పెయింట్ల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. రెండు ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి. ఒక ప్లాంట్ను(డెకరేటివ్ పెయింట్స్) కర్ణాటకలోని విజయ్నగర్లో, మరో ప్లాంట్(ఇండస్ట్రియల్ సెగ్మెంట్)ను మహారాష్ట్రలోని వసింధ్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఈ వ్యాపారాన్ని చూస్తున్న పార్థు జిందాల్ తెలియజేశారు. ఈ రెండు ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, రెండేళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్లోనూ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారాయన. ఈ కుటుంబం జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్ కంపెనీలను నిర్వహిస్తోంది. వన్ స్టాప్ సొల్యూషన్ పెయింట్ల పరిశ్రమ ప్రతి ఏటా 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోందని, ఈ రంగంలో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా ప్రతి ఏడాదీ పెరుగుతోందని పార్థు జిందాల్ చెప్పారు. ఇప్పటికే స్టీల్, సిమెంట్ రంగాల్లో ఉన్నామని, పెయింట్ల రంగంలో ప్రవేశించడం ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ (అన్ని ఉత్పత్తులు ఒకే చోట అందించే) అవకాశం లభించనున్నదని వివరించారు. బీ2బీ (బిజినెస్ టు బిజినెస్), బీ2సీ (బిజినెస్ టు కన్సూమర్) సెగ్మెంట్లలో ఉత్పత్తులను అందిస్తామని పేర్కొన్నారు. భారత్లో మొత్తం పెయింట్ల మార్కెట్ ఏడాదికి 25 లక్షల కిలో లీటర్లని, దీంట్లో ఏషియన్ పెయింట్స్ వాటా 10 లక్షల కిలోలీటర్లని తెలిపారు. 2025 కల్లా 10 లక్షల కిలోలీటర్ల మార్కెట్ను సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. మొదట్లో దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలపై దృష్టి పెడతామని ఆయన వివరించారు. -
ఈ రోల్స్ రాయస్ వెరీ వెరీ స్పెషల్...