గోదావరిలో ఇద్దరి గల్లంతు | Two missing in Godavari | Sakshi

గోదావరిలో ఇద్దరి గల్లంతు

Published Mon, Mar 7 2016 2:37 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

శివరాత్రి సందర్భంగా స్నానమాచరించడానికి గోదవరి నదిలో దిగిన ఇద్దరు యువకులు నదిలో పడి గల్లంతయ్యారు.

శివరాత్రి సందర్భంగా స్నానమాచరించడానికి గోదవరి నదిలో దిగిన ఇద్దరు యువకులు నదిలో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మణుగూరు మండలం మల్లెపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన ప్రదీప్, నాగరాజు అనే ఇద్దరు యువకులు శివరాత్రి సందర్భంగా పుణ్య స్నానం ఆచరించడానికి గోదావరి నదిలో దిగారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లే సరికి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఇది గుర్తించిన పోలీసులు వారి ఆచూకి కోసం గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement