world record
-
డిస్కస్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డు
రామోనా (అమెరికా): పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో క్రీడాంశంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఒక్లాహోమా త్రోస్ సిరీస్ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ మీట్లో లిథువేనియాకు చెందిన మికోలస్ అలెక్నా (Mykolas Alekna- 75.56 మీటర్లు) ఈ ఘనత సాధించాడు. స్వర్ణ పతకం గెలిచే క్రమంలో 22 ఏళ్ల అలెక్నా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును రెండుసార్లు తిరగ రాయడం విశేషం. గత ఏడాది ఇదే మీట్లో అలెక్నా డిస్క్ను 74.35 మీటర్ల దూరం విసిరి... 1986 నుంచి జుర్గెన్ షుల్ట్ (జర్మనీ; 74.08 మీటర్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో మికోలస్ రజత పతకం గెలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఒక్లాహోమో మీట్లో అలెక్నా తొలి ప్రయత్నంలో డిస్క్ను 74.89 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డును సవరించాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో డిస్క్ను 75.56 మీటర్ల దూరం విసిరి మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా డిస్క్ను 75 మీటర్ల దూరం విసిరిన తొలి అథ్లెట్గా గుర్తింపు పొందాడు. తండ్రి బాటలోమికోలస్కు ఘనమైన క్రీడా కుటుంబ నేపథ్యం ఉంది. మికోలస్ తండ్రి వర్జిలియస్ అలెక్నా కూడా విఖ్యాత డిస్కస్ త్రోయర్ కావడం విశేషం. 6 అడుగుల 7 అంగుళాల ఎత్తు, 130 కేజీల బరువున్న వర్జిలియస్ 2000 సిడ్నీ ఒలింపిక్స్లో స్వర్ణం, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో సర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించాడు. 2003 పారిస్ ప్రపంచ చాంపియన్షిప్లో, 2005 హెల్సింకి ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకాలు నెగ్గిన వర్జిలియస్... 1997 ఏథెన్స్ ప్రపంచ చాంపియన్షిప్లో, 2001 ఎడ్మంటన్ ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్గా తన కెరీర్లో వర్జిలియస్ 12 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు గెలిచాడు. 2014లో రిటైర్మెంట్ ప్రకటించిన 53 ఏళ్ల వర్జిలియస్ రాజకీయాల్లో ప్రవేశించి లిథువేనియా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
16 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
స్టాక్హోమ్ (స్వీడన్): పురుషుల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. స్విమ్ ఓపెన్ స్టాక్హోమ్ టోర్నీలో జర్మనీకి చెందిన లుకాస్ మార్టిన్ ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన లుకాస్ మార్టిన్ 400 మీటర్లను 3 నిమిషాల 39.96 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2009 నుంచి పాల్ బీడెర్మన్ (3ని:40.07 సెకన్లు; జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మార్టిన్ బద్దలు కొట్టాడు. 2009లో రోమ్లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్లో ‘సూపర్ సూట్స్’ ధరించి బీడెర్మన్ ఈ రికార్డు నెలకొల్పాడు. 2010లో ప్రపంచ స్విమ్మింగ్ సమాఖ్య ‘సూపర్ సూట్స్’ను నిషేధించింది. -
అరకు లోయలో అద్భుతం.. ప్రపంచ రికార్డు
సాక్షి, పాడేరు: అందాల అరకులోయలో అద్భుతం ఆవిష్కృతమయింది. మహా సూర్యవందనాల్లో స్థానిక గిరిజన విద్యార్థులు సత్తాచాటారు. ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్నారు. అరకు లోయ డిగ్రీ కళాశాల మైదానం ఈ ఘట్టానికి వేదికగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju district) అధికారులు, శిక్షకుల మూడు నెలల కష్టానికి ఫలితం లభించింది. ఐదు మండలాల పరిధిలోని గిరిజన విద్యాలయాలకు చెందిన 21,850 మంది విద్యార్థులు ఉత్సాహంగా 108 సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పతంజలి శ్రీనివాస్ శంఖం పూరించి యోగాసనాలను (Yoga Asanas) ప్రారంభించారు. ఒకే వేదికపై విద్యార్థులు 2 గంటల పాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో మైదానంలో ఆధ్యాత్మిక వాతావరణం శోభిల్లింది. ఈ యోగాసనాలను 200 మంది పీడీలు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.లండన్కు చెందిన ప్రపంచ రికార్డుల యూనియన్ మేనేజర్ అలిస్ రేనాడ్, ఇతర ప్రతినిధులంతా 108 సూర్య నమస్కారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దృశ్యాలను తమ కెమెరాలలో బంధించారు. ఫ్లడ్లైట్ల వెలుగులో రాత్రి వరకు సూర్య నమస్కారాలు (surya namaskars) విజయవంతంగా కొనసాగాయి. అలిస్ రేనాడ్ సూర్య నమస్కారాల ప్రక్రియకు వరల్డ్ రికార్డును ప్రకటించారు. ఈ మేరకు ధ్రువపత్రాన్ని కలెక్టర్, జేసీలకు అందించారు. చదవండి: ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి లవ్స్టోరీ -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
పాకిస్తాన్తో మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్పై 73 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ మహ్మద్ అబ్బాస్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అరంగేట్ర మ్యాచ్లోనే అబ్బాస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు.తొలుత బ్యాటింగ్లో దుమ్ములేపిన అబ్బాస్.. అనంతరం బౌలింగ్లో ఓ కీలక వికెట్ కూడా పడగొట్టాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన అబ్బాస్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అబ్బాస్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.వన్డే అరంగేట్రంలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అబ్బాస్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా అల్రౌండర్ కృనాల్ పాండ్యా పేరిట ఉండేది. కృనాల్ పాండ్యా 2021లో ఇంగ్లండ్పై తన వన్డే అరంగేట్రంలో 26 బంతుల్లో ఆర్ధశతకం సాధించాడు. తాజా మ్యాచ్లో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అబ్బాస్.. పాండ్యా ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా కివీస్ తరుపన డెబ్యూచేసిన అబ్బాస్.. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆటగాడు కావడం గమనార్హం.చాప్మన్ సూపర్ సెంచరీ..ఇక ఈమ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్మన్ (111 బంతుల్లో 132; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. అతడితో నపా డారిల్ మిచెల్ (84 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు.పాక్ బౌలర్లలో ఇర్ఫాన్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రౌఫ్, జావిద్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 44.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజం(76) టాప్ స్కోరర్గా నిలవగా.. మొహమ్మద్ రిజ్వాన్ (30), సల్మాన్ అఘా (58) పర్వాలేదన్పించారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. డఫీ రెండు, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు.చదవండి: MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి! -
టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డు.. పాక్పై చితక్కొట్టి అరుదైన ఘనత
న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్తో ఐదో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రపంచ రికార్డు సాధించాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక స్ట్రైక్ రేటుతో.. తొంభై పరుగుల మార్కు చేరుకున్న తొలి క్రికెటర్గా నిలిచాడు.ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ (Liam Livingstone) పేరిట ఉన్న రికార్డును సీఫర్ట్ బద్దలు కొట్టి సీఫర్ట్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి, రెండు టీ20లలో కివీస్ గెలవగా.. మూడో మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ పైచేయి సాధించిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఇరుజట్ల (New Zealand Vs Pakistan) మధ్య బుధవారం నామమాత్రపు ఐదో టీ20 జరిగింది. వెల్లింగ్టన్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (39 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా... షాదాబ్ ఖాన్ (28; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హరీస్ (11), నవాజ్ (0), యూసుఫ్ (7), ఉస్మాన్ ఖాన్ (7), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 5 వికెట్లతో విజృంభించగా... జాకబ్ డఫీ 2 వికెట్లు తీశాడు.బాదుడే బాదుడు... స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్ నుంచే పాక్ బౌలర్లపై ప్రతాపం చూపింది. తొలి ఓవర్లో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 4, 6, 6 కొడితే... రెండో ఓవర్లో అలెన్ 4, 4, 6 బాదాడు. మూడో ఓవర్లో సీఫర్ట్ 4, 6... నాలుగో ఓవర్లో ఇద్దరు కలిసి 3 ఫోర్లు కొట్టడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. జహాందాద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో సీఫెర్ట్ 6, 4, 6, 2, 6, 1 కొట్టడంతో 23 బంతుల్లోనే అతడి హాఫ్సెంచరీ పూర్తయింది. పాక్ యువ బౌలర్ ముఖీమ్ రెండు ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసినప్పటికీ... సీఫెర్ట్ జోరును మాత్రం అడ్డుకోలేకపోయాడు. షాదాబ్ వేసిన పదో ఓవర్లో 6, 6, 6, 6 కొట్టిన సీఫర్ట్ మ్యాచ్ను ముగించాడు. ఫలితంగా న్యూజిలాండ్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. తొలి బంతి నుంచే సీఫర్ట్ వీరవిహారం చేయగా... ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27; 5 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు ధాటిగా ఆడటం కలిసివచ్చింది. పాక్ బౌలర్లలో ముఖీమ్ 2 వికెట్లు తీశాడు. నీషమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సీఫర్ట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డుఇక ఈ మ్యాచ్లో టిమ్ సీఫర్ట్ మొత్తంగా 38 బంతుల్లో 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్రేటు 255.26గా నమోదైంది.ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగి.. అత్యధిక స్ట్రైక్రేటుతో తొంభైకి పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా సీఫర్ట్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ పేరిట ఉండేది. లివింగ్స్టోన్ 2021లో పాకిస్తాన్పై నాటింగ్హామ్ వేదికగా 239.53 స్ట్రైక్రేటుతో 103 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ టీ20లలో 250కి పైగా స్ట్రైక్రేటుతో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగానూ సీఫర్ట్ చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకోవడం మరో విశేషం.చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’ -
లండన్ మారథాన్లో ప్రపంచ రికార్డు!
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ పరుగు ప్రపంచ రికార్డు కొల్లగొట్టనుంది. రికార్డు స్థాయిలో అథ్లెట్లు లండన్ మారథాన్ రేసును పూర్తి చేస్తారనే అంచనాలు అమాంతం పెరిగాయి. వచ్చే నెల 27న లండన్ నగరంలో జరిగే ఈ మారథాన్ (42.195 కిలోమీటర్లు) పరుగులో పోటీపడేందుకు ఇప్పటికే 8 లక్షల 40 వేల మందికిపైగా ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గతేడాది ఈ ఈవెంట్లో 5,78,304 రన్నర్లకంటే ఇది చాలా అధికం. పురుషులతో దీటుగా మహిళా రన్నర్లు ఆసక్తి చూపడం విశేషం. 8 లక్షల 40 వేల ఔత్సాహికుల్లో 49 శాతం మహిళలు ఉన్నారు. మరీ ముఖ్యంగా యువతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పేర్లు నమోదు చేసుకున్న వారిలో 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సున్న యువతులు ఏకంగా 105 శాతం పెరగడం విశేషం! ఇప్పటివరకు పూర్తి మారథాన్ పరుగు దూరాన్ని 55,646 మంది పూర్తి చేశారు. గత నవంబర్లో న్యూయార్క్ మారథాన్లో ఈ రికార్డు నమోదైంది. అయితే ఈసారి సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది బరిలో దిగడానికి ఆసక్తి చూపడంతో పూర్తి చేసేవారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే పెరుగుతుందని నిర్వాహకులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఏప్రిల్ 27న జరిగే 45వ లండన్ మారథాన్ కొత్త మైలురాయికి చేరుకోబోతోంది. అత్యధిక సంఖ్యలో పరుగును పూర్తిచేసే రికార్డు సాకారం కానుంది. ఇదే జరిగితే ముమ్మాటికి మా మారథాన్ చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది’ అని లండన్ మారథాన్ ఈవెంట్స్ సీఈఓ హ్యూజ్ బ్రాషెర్ తెలిపారు. నగరంలోని గ్రీన్విచ్ నుంచి ద మాల్ వరకు సాగే 42.195 కిలోమీటర్ల దూరాన్ని ఈసారి 56 వేల పైచిలుకు మంది పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. 1981లో లండన్ మారథాన్ మొదలైంది. ఆ ఏడాది తొలి మారథాన్లో ఏకంగా 13 లక్షల మంది బరిలోకి దిగారు. -
చరిత్ర సృష్టించిన శివమ్ దూబే.. వరల్డ్లోనే తొలి ప్లేయర్గా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్లో అభిషేక్ శర్మతో పాటు శివమ్ దూబే(Shivam Dube) కూడా ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్లో మెరుపు ఇన్నింగ్స్ (13 బంతుల్లో 30 పరుగులు) ఆడిన దూబే.. అనంతరం బౌలింగ్లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్, జాకబ్ బెతల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దూబే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దూబే వరల్డ్ రికార్డు..అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 30 విజయాలు సాధించిన జట్టులో భాగమైన తొలి క్రికెటర్గా దూబే వరల్డ్ రికార్డు సృష్టించాడు. దూబేకు భారత్ తరపున ఇది వరుసగా 30వ టీ20 విజయం కావడం గమనార్హం. దూబే తన కెరీర్లో టీమిండియా తరపున ఇప్పటివరకు 35 టీ20లు ఆడాడు. 2019లో ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20తో దూబే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత అతడి ఐదో టీ20లో సైతం బంగ్లాదేశ్లో భారత్ ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి దూబే ఆడిన ఏ టీ20 మ్యాచ్లోనూ టీమిండియా పరాజయం పాలవ్వలేదు. వరుసగా భారత్ 30 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది.ఈ అరుదైన ఫీట్ సాధించిన దూబేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ అభినందనలు తెలిపింది. "దూబే ఆడితే భారత్ గెలవాల్సిందే. దూబే ఆడిన 30 మ్యాచ్ల్లోనూ భారత్ వరుసగా విజయం సాధిచిందని సీఎస్కే ఎక్స్లో రాసుకొచ్చింది.కాగా ఇంగ్లండ్తో టీ20లకు దూబేకు తొలుత భారత జట్టులో చోటు దక్కలేదు. నితీశ్ కుమార్ రెడ్డి గాయపడడంతో దూబే జట్టులోకి వచ్చాడు. పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20తో తుది జట్టులోకి వచ్చిన దూబే.. అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆ మ్యాచ్లో కంకషన్కు గురికావడంతో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.ఆఖరి టీ20లో మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ముంబై ఆటగాడు అందిపుచ్చుకున్నాడు. కాగా టీ20 సిరీస్ ముగియడంతో దూబే ముంబై తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది.జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.చదవండి: ఇంగ్లండ్తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
కళ్లు చెదిరే ఇన్స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
సోషల్ మీడియాలో ఒక పోస్ట్కు, లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం సాధారణంగా. క్రియేట్ చేసినవాళ్లే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్తో ప్రజాదరణ పొంది, రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. రండి.. ఆ రికార్డ్ స్టంట్ రీల్ కథాకమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఒకటీ రెండూ ఏకంగా 55.4 కోట్ల (554 మిలియన్ల) మంది ఆ రీల్ను వీక్షించారంటే మరి ప్రపంచ రికార్డు కాక మరేమిటి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీస్టైల్ ఫుట్బాల్ ఆటగాడు 21 ఏళ్ల ముహమ్మద్ రిజ్వాన్. ఈ స్టార్ ప్లేయర్ కంటెంట్ క్రియేటర్గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబరులో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్ను పోస్ట్ చేశాడు. ఈ రీల్లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరి పడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాదిమంది నెటిజనులను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి, రీల్ ప్రజాదరణ పొందింది, 92 లక్షలకు పైగా (9.2 మిలియన్లు) లైక్లు మరియు 42,000 కంటే ఎక్కు లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీల్తో అవార్డు కూడా పొందాడు. ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలువిశేషం ఏమిటంటేఅతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే మరి. జర్మనీ, ఫ్రాన్స్ స్పెయిన్ల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్ను పొగడ్తలతో ముంచెత్తారు.రిజ్వాన్ స్పందన“నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే, దీనికి 2లక్షలవీక్షణలు వచ్చాయి . నేను ఇంటికి చేరుకునే సమయానికి, అది మిలియన్కు చేరుకుంది.” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపురిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద, ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను, మరో చేతిలో ఫుట్బాల్ను పట్టుకుని, తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. (బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్) View this post on Instagram A post shared by muhammed riswan (@riswan_freestyle) కేవలం 21 సంవత్సరాల వయస్సులో, రిజ్వాన్ తన వైరల్ రీల్కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఆటలోని విన్యాసాలకు పరిమితం కాలేదు రిజ్వాన్ పర్వత శిఖరాలపై, కారు పైకప్పులపై మకా, నీటి అడుగున కూడా విన్యాసాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫుట్బాల్తో పాటు, రిజ్వాన్ రోజువారీ వస్తువులతో కూడా సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆరో ఇన్నింగ్స్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత మహిళా క్రికెట్ జట్టులోకి దూసుకువచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు.. ప్రతీకా రావల్(Pratika Rawal).యువ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు ప్రతీకా రావల్కు పిలుపునిచ్చారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధ శతకాలతో మెరిసింది.వరల్డ్ రికార్డు బద్దలుతాజాగా ఐర్లాండ్తో వన్డే సిరీస్(India Women Vs Ireland Women) జట్టులోనూ చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్.. మూడు మ్యాచ్లలోనూ అదరగొట్టింది. తొలి వన్డేలో 89, రెండో వన్డేలో 67 పరుగులు సాధించిన ప్రతీకా.. బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 154 పరుగులు సాధించింది.ఈ క్రమంలో ప్రతీకా రావల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. ప్రతీకా రావల్ భారత్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188), హర్మన్ప్రీత్ (171 నాటౌట్) ఆమెకంటే ముందున్నారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు👉ప్రతీకా రావల్(ఇండియా)- 444 పరుగులు👉చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్)- 434 పరుగులు👉నథాకన్ చాంథమ్(థాయ్లాండ్)- 322 పరుగులు👉ఎనిడ్ బేక్వెల్(ఇంగ్లండ్)- 316 పరుగులు👉నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)- 307 పరుగులు.అతిపెద్ద వన్డే విజయంరాజ్కోట్ వేదికగా ఐర్లాండ్తో మూడో వన్డేలో భారత ఓపెనర్లు ప్రతీక రావల్(154), స్మృతి మంధాన(135) శతకాలతో చెలరేగారు. వీరిద్దరికి తోడు రిచా ఘోష్ హాఫ్ సెంచరీ(59)తో రాణించింది. ఈ క్రమంలో భారత జట్టు 435 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది. పురుషులు, మహిళల వన్డే క్రికెట్లో భారత్కు ఇదే అతిపెద్ద స్కోరు. ఓవరాల్గా మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్–3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ (491/4; 2018లో ఐర్లాండ్పై; 455/5; 1997లో పాక్పై; 440/3; 2018లో ఐర్లాండ్పై) పేరిటే ఉండటం విశేషం.ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 304 పరుగులతో ఐర్లాండ్పై టీమిండియా జయభేరి మోగించింది. పరుగుల తేడా పరంగా భారత మహిళా జట్టుకిదే అతిపెద్ద విజయం. 2017లో భారత్ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్నే ఓడించింది. ఇక ఈ గెలుపుతో 3–0తో వన్డే సిరీస్ను స్మృతి బృందం క్లీన్స్వీప్ చేసింది. అదే విధంగా.. భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్స్వీప్ చేయడం ఇది 13వసారి. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. ఇక.. ఐర్లాండ్తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం.చదవండి: ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్A post-series chat with the record-breaking opening duo! 😎From Maiden ODI century to Fastest ODI Hundred for India in women's cricket 💯Captain Smriti Mandhana and Pratika Rawal 𝙚𝙡𝙖𝙗𝙤𝙧𝙖𝙩𝙚 it all 😃👌 - By @mihirlee_58 #TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/7c0xsYGaIo— BCCI Women (@BCCIWomen) January 16, 2025 -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన షమీ.. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు తీశాడంటే..
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఇంగ్లండ్తో తొలి వన్డేలో గనుక అతడు రాణిస్తే.. మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.కాస్త ఆలస్యంగా ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చినా.. వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోయాడు షమీ. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే, వరల్డ్కప్ మధ్యలోనే చీలమండ నొప్పి వేధించినా లెక్కచేయని షమీ.. టోర్నీ ముగిసిన తర్వాత మాత్రం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. అయితే, ఇప్పటి వరకు అతడు టీమిండియాలో పునరాగమనం చేయలేకపోయాడు. తొలుత దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలర్.. పదకొండు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో షమీ స్థానం దక్కించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇంగ్లండ్తో వన్డేల్లోనూ షమీ చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది.ఈ నేపథ్యంలో షమీని ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో అతడు ఐదు వికెట్లు తీస్తే చాలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన మొదటి క్రికెటర్గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది.షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లోస్టార్క్ 102 ఇన్నింగ్స్లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే, షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లో 195 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి తదుపరి ఆడబోయే వన్డేలో షమీ ఐదు వికెట్లు తీశాడంటే.. స్టార్క్ వరల్డ్ రికార్డును అతడు బద్దలుకొడతాడు. ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్గా.. టీమిండియా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కొనసాగుతున్నాడు. అతడు 133 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ అందుకున్నాడు.కాగా టీమిండియా ఇంగ్లండ్తో జనవరి 22- ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20లు ఆడనుంది. అనంతరం.. ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఫిబ్రవరి 6న నాగ్పూర్లో తొలి వన్డే, ఫిబ్రవరి 9న కటక్లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న మూడో అహ్మదాబాద్లో మూడో వన్డే జరుగనున్నాయి.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే1. మిచెల్ స్టార్క్- 102 మ్యాచ్లలో2. సక్లెయిన్ ముస్తాక్- 104 మ్యాచ్లలో3. ట్రెంట్ బౌల్ట్- 107 మ్యాచ్లలో4. బ్రెట్ లీ- 112 మ్యాచ్లలో5. అలెన్ డొనాల్డ్- 117 మ్యాచ్లలో.చదవండి: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్స్టార్పై వేటు! -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. 122 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. పాకిస్తాన్ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఛేదించింది.దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 194 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. ఫాలో ఆన్(రెండో ఇన్నింగ్స్)లో మాత్రం అద్బుతమైన పోరాటం కనబరిచింది.421 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన పాకిస్తాన్ 478 పరుగుల భారీ స్కోర్ సాధించింది. షాన్ మసూద్ (145) సెంచరీ చేయగా.. బాబర్ ఆజాం (81) హాఫ్ సెంచరీతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోర్కే పరిమితం కావడంతో పాక్ జట్టు సఫారీల ముందు మెరుగైన టార్గెట్ను ఉంచలేకపోయింది.దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 615 పరుగులు చేసింది. ప్రోటీస్ తొలి ఇన్నింగ్స్లో ర్యాన్ రికెల్టన్ (259) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా (106), కైల్ వెర్రెన్న్ (100) శతకాలతో మెరిశారు. పాక్ బౌలర్లు అబ్బాస్, సల్మాన్ అఘా మూడేసి వికెట్లు పడగొట్టారు.చరిత్ర సృష్టించిన పాక్..కాగా ఫాలో ఆన్లో ధీటుగా ఆడిన పాకిస్తాన్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఫాల్ ఆన్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1902లో జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడి 372/7 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్తో 122 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియా (372/7) తర్వాత వెస్టిండీస్ (348/10), న్యూజిలాండ్ (342/10), శ్రీలంక (342/10) జట్లు ఉన్నాయి.చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్తో సిరీస్లలోనైనా ఆడిస్తారా? -
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్.. ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్, విదర్భ జట్టు సారధి కరుణ్ నాయర్ (Karun Nair) విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఉత్తర్ప్రదేశ్తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్లో మరో సెంచరీ చేసిన కరుణ్ (101 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) లిస్ట్-ఏ (50 ఓవర్ల ఫార్మాట్) క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. కరుణ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా 541 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ పేరిట ఉండేది. ఫ్రాంక్లిన్ లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా 527 పరుగులు చేశాడు. కరుణ్, ఫ్రాంక్లిన్ తర్వాత ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వాన్ హీర్డెన్ (512) ఉన్నాడు.ఐదు ఇన్నింగ్స్ల్లో నాలుగు సెంచరీలు..యూపీతో మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన కరుణ్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు ఇన్నింగ్స్ల్లో నాలుగు సెంచరీలు చేశాడు. జమ్మూ కశ్మీర్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో అజేయ సెంచరీ (112) చేసిన కరుణ్.. ఆతర్వాత చత్తీస్ఘడ్తో జరిగిన మ్యాచ్లో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఆతర్వాత కరుణ్ వరుసగా చంఢీఘడ్ (163 నాటౌట్), తమిళనాడు (111 నాటౌట్), ఉత్తర్ప్రదేశ్లపై (112) హ్యాట్రిక్ సెంచరీలు చేశాడు. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కరుణ్ 5 ఇన్నింగ్స్ల్లో 542 సగటున 542 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్ 115.07 స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు.కరుణ్ సూపర్ సెంచరీతో మెరవడంతో యూపీపై విదర్భ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్లో విదర్భకు ఇది వరుసగా ఐదో విజయం. విదర్భతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. సమీర్ రిజ్వి (82 బంతుల్లో 105; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు శతకం బాదాడు. కెప్టెన్ రింకూ సింగ్ (6) విఫలమయ్యాడు. విదర్భ బౌలర్లలో నచికేత్ భూటే నాలుగు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బరిలోకి దిగిన విదర్భ 47.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరుణ్ నాయర్తో పాటు యశ్ రాథోడ్ సెంచరీ చేశాడు. యశ్ 140 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 138 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యూపీ బౌలర్లలో రింకూ సింగ్, బిహారీ రాయ్ తలో వికెట్ పడగొట్టారు. -
ఒళ్లు గగుర్పొడిచే తెలుగోడి విన్యాసం : శిక్షణ లేకుండా, ఎవరూ ట్రై చేయొద్దు!
సామాన్య వ్యక్తినుంచి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన 'డ్రిల్ మ్యాన్' గుర్తు ఉన్నాడా? అబ్బరపరిచే సాహస విన్యాసాలకు మారుపేరు ఈ డ్రిల్ మ్యాన్. తాజాగా మరో ఒళ్లు గుగుర్పొడిచే సాహసంతో గిన్నిస్బుక్ రికార్డు సాధించాడు. ఆ సాహసం పేరే తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అలియాస్ డ్రిల్మ్యాన్.57 విద్యుత్ ఫ్యాన్ బ్లేడ్ల నాలుకతో ఆపి, ఇన్క్రెడిబుల్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. కేవలం ఒకే ఒక్క నిమిషాంలో ఈ ఫీట్ సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అసాధారణమైన టైటిల్ కోసం అద్భుతమైన ప్రయత్నం డ్రిల్మ్యాన్ సాహసం ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపివేసి దృశ్యం ప్రేక్షకులను అబ్బురపర్చింది. ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూడటం అక్కడున్న ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల వంతైంది. 60 సెకన్లు గడిచిన తర్వాత, లో షో డీ రికార్డ్ అనౌన్సర్ "ఆపు" అనేంత వరకు ఆయన ప్రయత్నం కొనసాగింది. ఈ విషయంలో గతంలో తాను సృష్టించిన రికార్డును తానే అధిగమించాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ ఫీట్ను మరోసారి నిర్ధారించుకున్న న్యాయనిర్ణేతలు డ్రిల్మాన్కు సర్టిఫికేట్ అందించారు. ఈ టైటిల్ను సాధించిన తర్వాత డ్రిల్మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు.2024లో అరవై సెకన్లలో ఎన్ని ఫ్యాన్లు నాలుకతో ఆపగలరు అన్న టాస్క్లో నాలుకతో ఏకంగా 52 ఫ్యాన్లను ఆపి రికార్డు సాధించాడు. అంతేనా రెండడుగుల కత్తిని గొంతు లోకి దింపాడు. ఇదే కత్తికి కట్టిన తాడు సాయంతో 1944 కిలోలుండే వోక్స్ వ్యాగన్ వాహనాన్ని ఐదు మీటర్లు లాగాడు. ఇందులో ఎనిమిది మంది ఉండటం విశేషం. ఆ తర్వాత అరవై సెకన్లలో నాలుగు అంగుళాల 22 మేకులను ముక్కులోకి సుత్తితో కొట్టి మళ్లీ బయటకు తీశాడు. ఇతగాడి జైత్రయాత్ర ఇంకా ఉంది. సలసల కాగే వేడి నూనెలో చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం అనేఫీట్లో. కేవలం 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను తీసి గిన్నిస్ రికార్డులను సృష్టించాడు . ఇలా గతంలోనే నాలుగు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఇలాంటి రికార్డులు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచాడు క్రాంతి కుమార్. తాజా ఫీట్తో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.Most electric fan blades stopped using the tongue in one minute 👅 57 by Kranthi Drillman 🇮🇳 pic.twitter.com/dsH8FULHxW— Guinness World Records (@GWR) January 2, 2025 -
ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సర్ చిప్. అమెరికన్ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సర్ చిప్ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.‘చిప్ ఆన్ టిప్’ అనే ప్రచారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ చిప్ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్ సెన్సర్ చిప్గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 0.65 మి.మీ., వెడల్పు 0.65 మి.మీ., మందం 1.158 మి.మీ. అంటే, దాదాపు ఒక పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది.ఇది 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎండోస్కోప్ సహా వివిధ వైద్య పరికరాల కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. ఇది సెకనుకు 30 ఫ్రేముల సామర్థ్యంతో వీడియోలు కూడా తీయగలదు. -
షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు..
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో పాక్ ఓడినప్పటకి ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ పీటర్ను ఔట్ చేయడంతో అఫ్రిది వందో టీ20 వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఈ పాకిస్తానీ స్పీడ్ స్టార్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆల్ ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాలుగో ప్లేయర్గా అఫ్రిది రికార్డులకెక్కాడు. అఫ్రిది ఇప్పటివరకు టెస్టుల్లో 116 వికెట్లు పడగొట్టగా.. వన్డేల్లో 112, టీ20ల్లో 100 వికెట్లు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ అగ్రస్ధానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ కూడా అఫ్రిదినే కావడం గమనార్హం.👉మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్లు వీరేబౌలర్టెస్టు వికెట్లువన్డే వికెట్లుటీ20 వికెట్లుటిమ్ సౌథీ(న్యూజిలాండ్)389221164షకీబ్ అల్హసన్(బంగ్లాదేశ్)246317149లసిత్ మలింగ(శ్రీలంక)101338107షాహీన్ అఫ్రిది(పాక్)116112100 -
ఎనిమిది శాస్త్రీయ నృత్య రూపాలు ఒకేసారి..!
ఎవరైనా ఒకటో రెండో శాస్త్రీయ నృత్య కళలను ప్రదర్శించడం చూస్తుంటాం. వారి కళకు అభివాదం తెలియజేస్తుంటాం. కేరళలోని ఇరింజలకుడకు చెందిన అనఘశ్రీ సజీవనాథ్ భారతీయ శాస్త్రీయ నృత్య కళారూపాలైన కథాకళి, కూచిపూడి, సత్రియా, మణిపురి, ఒడిస్సీ, మోహినియాట్టం, భరతనాట్యం, కథక్లను ఒక గంటా 30 నిమిషాల్లో ప్రదర్శించి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ను నెలకొల్పారు. అన్ని భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలను అత్యధిక కాలం పాటు ప్రదర్శించి, రికార్డు సాధించిన ఘనత అనఘశ్రీ సొంతం చేసుకుంది. 27 ఏళ్ల అనఘ చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్య సాధనలో తనైదన మార్క్ చూపిస్తూ ఉండేది. తమ స్థానిక కళ మోహినియాట్టం నేర్చుకోవడంలో చూపే ఆసక్తి, ఆ తర్వాత తర్వాత ఇతర నృత్య సాధనలవైపు మల్లేలా చేసిందని చెబుతుంది అనఘ. (చదవండి: బ్రెస్ట్ కేన్సర్ ఉంటే భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చా..?) -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచ క్రికెట్లో తొలి జట్టుగా
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది.టెస్టుల్లో 5 లక్షలు పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఈ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లండ్ జట్టు తమ తొలి టెస్టు మ్యాచ్ 1877లో ఆస్ట్రేలియాతో ఆడింది. అప్పటినుంచి ఇప్పటివరకు 1082 టెస్టులు ఆడిన ఇంగ్లీష్ జట్టు 5 లక్షలకు పైగా పరుగులు చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా(4,28,794 ప్లస్ రన్స్), భారత్( 2,78,700 ప్లస్ రన్స్) వరుసగా ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ బ్యాటర్లు 929 సెంచరీలు చేశారు.పట్టు బిగించిన ఇంగ్లండ్..ఇక కివీస్తో రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 378/5 స్కోరుతో ఉంది. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.క్రీజులో జో రూట్(73 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(35 బ్యాటింగ్) ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 280 పరుగులు చేసింది. ఇక ఇప్పటికే తొలి టెస్టులో కివీస్ను ఇంగ్లండ్ చిత్తు చేసింది.చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్లో చిక్కుకున్న స్మిత్! వీడియో -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ సెంచూరియన్గా!
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం బాది.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్లో భాగంగా జింబాబ్వే బుధవారం గాంబియాతో మ్యాచ్ ఆడింది.ఫాస్టెస్ట్ సెంచరీనైరోబీలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్( 26 బంతుల్లో 50), తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani- 19 బంతుల్లోనే 62) దుమ్ములేపగా.. సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు.ఈ క్రమంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా సికందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడు.టెస్టులు ఆడే దేశాలకు చెందిన ఆటగాళ్లలో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసింది వీరే1. సికందర్ రజా(జింబాబ్వే)- గాంబియాపై 33 బంతుల్లో శతకం2. డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా)- బంగ్లాదేశ్పై 35 బంతుల్లో సెంచరీ3. రోహిత్ శర్మ(ఇండియా)- శ్రీలంకపై 35 బంతుల్లో శతకం4. జాన్సన్ చార్ల్స్(వెస్టిండీస్)- సౌతాఫ్రికాపై 39 బంతుల్లో శతకం5. సంజూ శాంసన్(ఇండియా)- బంగ్లాదేశ్పై 40 బంతుల్లో శతకంఏకంగా 15 సిక్సర్లతో మరో రికార్డుఇక గాంబియాతో మ్యాచ్లో మొత్తంగా 3 బంతులు ఎదుర్కొన్న సికందర్ రజా.. ఏడు బౌండరీలు, పదిహేను సిక్స్ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మరో రికార్డును కూడా సికందర్ రజా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. ఈ లిస్టులో సాహిల్ చౌహాన్, హజ్రతుల్లా జజాయ్, ఫిన్ అలెన్ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. సికందర్ రజా, జీషన్ కుకిఖెల్ 15 సిక్స్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులుస్కోరు చేసి ప్రపంచ రికార్డు సాధించింది.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్తో పాటు సెమీస్లో! -
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్లో జింబాబ్వే పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 రన్స్ స్కోరు చేసింది. తద్వారా ఇంటర్నేషనల్ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.గాంబియా బౌలింగ్ ఊచకోతనైరోబిలోని రౌరాక స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జింబాబ్వే గాంబియా(Gambia) జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సికందర్ రజా బృందం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్, తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani) గాంబియా బౌలింగ్ను ఊచకోత కోశారు. బ్రియాన్ 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్తో 50 పరుగులు రాబట్టగా.. మరుమణి కేవలం 19 బంతుల్లోనే 62 రన్స్ సాధించాడు.సికందర్ రజా ఒక్కడే 133 రన్స్వన్డౌన్ బ్యాటర్ డియాన్ మైర్స్(12) విఫలం కాగా.. కెప్టెన్ సికందర్ రజా పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 133 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. మిగతావాళ్లలో రియాన్ బర్ల్ 11 బంతుల్లో 25, క్లైవ్ మడాండే కేవలం 17 బంతుల్లోనే 53(నాటౌట్) పరుగులు సాధించారు. చరిత్ర పుటల్లోకి జింబాబ్వే జట్టుఫలితంగా కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు స్కోరు చేసింది. తద్వారా నేపాల్ పేరిట ఉన్న టీ20 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్ మంగోలియాపై 314 పరుగులు స్కోరు చేసింది. తాజాగా జింబాబ్వే ఆ రికార్డును బ్రేక్ చేసి అత్యధిక పరుగుల జట్టుగా తమ పేరును చరిత్రపుటల్లో లిఖించుకుంది. 290 పరుగుల భారీ తేడాతో విజయంజింబాబ్వే విధించిన కొండంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిన గాంబియా.. 54 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాళ్ల స్కోర్లు వరుస(బ్యాటింగ్ ఆర్డర్)గా 5,0,7,4,7,1,2,2,0,12*,0. దీంతో జింబాబ్వే ఏకంగా 290 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రాండన్ మవుతా మూడేసి వికెట్ల తీయగా.. వెస్లీ మధెవెరె రెండు, ర్యాన్ బర్ల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్తో పాటు సెమీస్లో! -
అతి చిన్న వాషింగ్ మెషీన్తో ప్రపంచ రికార్డు
-
అతి చిన్న వాషింగ్ మెషీన్తో ప్రపంచ రికార్డు..!
ఊహకే అందని విధంగా అత్యంత మైక్రో వాషింగ్ మెషిన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు భారతీయ ఇంజనీర్ సెబిన్ సాజీ. ఇదే ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్. దీని వైశాల్యం, పొడవు, వెడల్పలు వరుసగా 1.28 అంగుళాలు, 1.32 అంగుళాలు, 1.52 అంగుళాలే కావడం విశేషం. ఇది ఇది 1990ల నాటి ప్రసిద్ధ హ్యాండ్హెల్డ్ బొమ్మ అయిన డిజిటల్ పెంపుడు జంతువు సైజు కంటే కూడా చిన్నది. అయితే ఇది సాధారణ వాషింగ్ మెషీన్లానే పనిచేస్తుండటం మరింత విశేషం. ఇది చిన్న లోడ్ల కోసం రూపొందించడం జరిగింది. ఇంజీనీరింగ్ నైపుణ్యంతో సూక్ష్మీకరణ అనే హస్తకళకు సాజీ రూపొందించిన ఈ గాడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. వర్కింగ్ పరంగా అసెంబుల్ చేసి చూస్తే..అది పూర్తిగా వర్క్ అవ్వడమే కాక, వాష్ , రిన్ , స్పిన్, వంటి వాటిని కొలిచేందుకు డిజిటల్ కాలిపర్లను ఉపయోగించారు. సాజీ వాషింగ్ మెషీన్ ఎలా వర్క్చేస్తుందో వివరిస్తున్న వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వాషింగ్ మెషీన్లో చిన్న క్లాత్, చిటికెడు వాషింగ్ పౌడర్ వేయగానే ఎలా వాష్ చేస్తుందో క్లియర్గా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటివరకు తయారైన మైక్రో వాషింగ్ మెషీన్లలో ఇదే అత్యంత చిన్నదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. (చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!) -
ప్రపంచ రికార్డు కోసం 1,121కిలోల గుమ్మడికాయ (ఫొటోలు)
-
అశ్విన్కే సాధ్యం.. ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ రికార్డు సమం
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఎడిషన్లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా బంగ్లాదేశ్తో సిరీస్లోనూ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సత్తా చాటాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న వేళ సెంచరీతో ఆదుకున్నాడు.సొంత మైదానం చెపాక్లో నిలకడగా ఆడి 113 పరుగులు సాధించాడు. అంతేకాదు.. అదే మ్యాచ్లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు. ఇలా ఆల్రౌండ్ ప్రతిభతో రాణించి.. బంగ్లాదేశ్పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి అశూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.రెండో టెస్టులోనూ అదరగొట్టిఇక కాన్పూర్లో జరిగిన రెండో టెస్టులోనూ అశ్విన్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను తిప్పలుపెట్టి కీలక వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(31), షకీబ్ అల్ హసన్(9) వికెట్లు తీసిన అశూ.. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ జకీర్ హసన్(10), మొమినుల్ హక్(2), హసన్ మహమూద్(4)లను పెవిలియన్కు పంపాడు. అలా మొత్తంగా రెండో టెస్టులో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సమంఈ మ్యాచ్లోనూ భారత్ బంగ్లాపై గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన అశ్విన్ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. అశూ టెస్టుల్లో ఈ పురస్కారం అందుకోవడం ఇది పదకొండోసారి కావడం విశేషం. తద్వారా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ చెన్నై బౌలర్ సమం చేశాడు. మురళీధరన్ కూడా సంప్రదాయ క్రికెట్లో 11 సార్లు ఈ అవార్డు గెలిచాడు. కాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్తో చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన రోహిత్ సేన.. కాన్పూర్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.టెస్టుల్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన క్రికెటర్లుముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 11 సార్లురవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 11 సార్లుజాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా)- 9 సార్లుసర్ రిచర్డ్ హాడ్లీ(న్యూజిలాండ్)- 8 సార్లుఇమ్రాన్ ఖాన్(పాకిస్తాన్)- 8 సార్లుషేన్ వార్న్(ఆస్ట్రేలియా)- 8 సార్లు.చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డు -
అబ్బా ఇదేం రికార్డు.. చాప్స్టిక్స్తో జస్ట్ ఒక్క నిమిషంలో..!
వరల్ రికార్డ్సు సృష్టించడం కోసం చాలా మంది విభిన్న రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది భారీగా టాస్క్లు పెట్టుకుని ఆశ్చర్యం కలిగిస్తే..కొందరూ భలే ఈజీగా మనం రోజూ చూసే వాటితో క్లిష్టమైన టాస్క్లను చేసి రికార్డులు సృష్టిస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే బంగ్లాదేశ్కు చెందిన ఈ మహిళ. ఏం చేసి రికార్డు సృష్టించిందో వింటే ఆశ్చర్యపోతారు. చైనా వాళ్లు ఆహారం తినేందుకు ఉపయోగించే చాప్స్టిక్స్తో బియ్యం గింజలు తిని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఫిబ్రవరి 17, 2024న బంగ్లాదేశ్ మహిళ సుమైయా ఖాన్ బియ్యం గింజలను చాప్స్టిక్స్తో తినడం అనే ఛాలెంజ్ని స్వీకరించింది. అయితే సుమైయా చాప్స్టిక్లతో జస్ట్ ఒక నిమిషంలో దాదాపు 37 గింజలు తిని టాస్క్ని పూర్తి చేసింది. టాస్క్ పూర్తి అయ్యిన వెంటనే ఆనందంగా సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రపంచ గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ఇన్స్టాగ్రామ్ వేదికగా నెట్టింట షేర్ చేసింది. గతంలో ఈ రికార్డు కాలిఫోర్నియాకు చెందిన టెలాండ్ లా అనే వ్యక్తి పేరిట ఉంది. అప్పడు టెలాండ్ ఒక నిమిషంలో 27 బియ్యం గింజలు తిని రికార్డు సృష్టించగా..దాన్ని సుమైయా బ్రేక్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: అధునాత రాతి కోట..! దేనిపై నిర్మిస్తున్నారో తెలుసా..?) -
లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గా
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో వన్డేలో ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు ఆసీస్ జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది.హెడ్ విధ్వంసకర శతకం.. లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీఇందులో భాగంగా మూడు టీ20ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న కంగారూ టీమ్.. గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నాటింగ్హామ్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (129 బంతుల్లో 154 నాటౌట్) విధ్వంసకర శతకంతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఇంగ్లండ్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సైతం రాణించాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆసీస్ను విజయతీరాలకు చేర్చడంలో హెడ్కు సహకరించాడు.మూడు వికెట్లు తీసిన లబుషేన్ఇక అంతకు ముందు.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లతో చెలరేగగా.. రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల లబుషేన్ సైతం మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ రెండు, డ్వార్షుయిస్, మాథ్యూ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు క్యాచ్లతో మెరిసిన లబుషేన్ఇక ఈ మ్యాచ్లో బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు), కెప్టెన్ హ్యారీ బ్రూక్(31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రూపంలో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బకొట్టిన లబుషేన్.. జోఫ్రా ఆర్చర్(4) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. డకెట్, బ్రూక్, జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్(0) క్యాచ్లు కూడా తానే అందుకున్నాడు.𝐃𝐮𝐜𝐤𝐞𝐭𝐭 𝐦𝐮𝐬𝐭 𝐛𝐞 𝐠𝐮𝐭𝐭𝐞𝐝 😤Catching practice for Labuschagne off his own bowling 😎Watch #ENGvAUS LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/p0IxZKhQZY— Sony LIV (@SonyLIV) September 19, 2024 వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గాఅలా మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు నాలుగు క్యాచ్లు అందుకుని.. లక్ష్య ఛేదనలో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు లబుషేన్. తద్వారా ఈ కుడిచేతి వాటం ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక వన్డే మ్యాచ్లో అర్ధ శతకం బాదడంతో పాటు.. మూడు వికెట్లు తీసి.. మూడు కంటే ఎక్కువ క్యాచ్లు అందుకున్న తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇదీ 30 ఏళ్ల లబుషేన్ సాధించిన అత్యంత అరుదైన ఘనత!!.. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే లీడ్స్ వేదికగా శనివారం జరుగనుంది. చదవండి: IND vs BAN: బుమ్రా సూపర్ బాల్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో -
లక్ష్యం వైపు.. లాక్షనాయుడు
సాక్షి, హైదబారాద్: ఏదైనా రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమించాలి.. అలాంటిది అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబర్చాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చాలి? ఏదైనా పని మొదలు పెట్టాలన్నా.. కొత్త రంగంలోకి వెళ్లాలన్నా ఇంటి నుంచే సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొంటుంటాం. మనకు అవసరమా..? చక్కగా ఉన్న పని చేసుకుని హాయిగా ఉండొచ్చుగా అని సలహాలు ఇస్తుంటారు. మరికొందరేమో రెండు, మూడు పడవలపై ప్రయాణం చేయడం మంచిది కాదంటూ హితవు పలుకుతారు. ఇంకొందరు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వైఫల్యం గురించి బాధపడుతూ ఒకే దగ్గర కూర్చుంటే అంతకన్నా వైఫల్యం మరొకటి ఉండదని నిరూపిస్తున్నారు డాక్టర్ లాక్షనాయుడు. డాక్టర్గా, సింగర్గా, శాస్త్రీయ నృత్యకారిణిగా, రాజకీయవేత్తగా చిన్న వయసులోనే రాణిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. -
144 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి: నిసాంక ప్రపంచ రికార్డు
శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిసాంక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగి.. వీరోచిత ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 144 ఏళ్ల చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఏ క్రికెటర్కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అదేమిటంటే...!!లంక అనూహ్య విజయంప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా మూడు మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టు గెలుపొంది సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. అయితే, నామమాత్రపు మూడో టెస్టులో శ్రీలంక అనూహ్య రీతిలో విజయం సాధించింది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది.వైట్వాష్ గండం నుంచి తప్పించుకునితద్వారా వైట్వాష్ గండం నుంచి తప్పించుకుని ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. అయితే, ఇంగ్లండ్లో మూడో టెస్టులో శ్రీలంక గెలుపొందడంలో ఓపెనర్ పాతుమ్ నిసాంకదే కీలక పాత్ర. తొలి ఇన్నింగ్స్లో 51 బంతుల్లో 64 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 124 బంతుల్లోనే 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.1880 నుంచి ఇదే మొదటిసారిఅయితే, నిసాంక సెంచరీ మార్కు అందుకునే కంటే ముందే అత్యంత అరుదైన ఘనత ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 41 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న నిసాంక.. రెండో ఇన్నింగ్స్లో 42 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా 26 ఏళ్ల నిసాంక చరిత్రకెక్కాడు.ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వీరులు వీరేకాగా 1880లో ఇంగ్లండ్తో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 559 మ్యాచ్లకు ఈ దేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా నిసాంక మాదిరి ఇలా రెండు ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన దాఖలాలు లేవు.ఇదిలా ఉంటే.. టెస్టు రెండు ఇన్నింగ్స్లో అత్యంత వేగంగా యాభై పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్ల జాబితాలో మాత్రం నిసాంక తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ముందున్నది ఎవరంటే..👉మార్క్ గ్రేట్బచ్(న్యూజిలాండ్)- జింబాబ్వే మీద- 1992లో👉నాథన్ ఆస్ట్లే(న్యూజిలాండ్)- వెస్టిండీస్ మీద- 1996లో👉తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- న్యూజిలాండ్ మీద- 2009లో👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- న్యూజిలాండ్ మీద- 2012లో👉జెర్మానే బ్లాక్వుడ్(వెస్టిండీస్)- టీమిండియా మీద- 2916లో👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- పాకిస్తాన్ మీద- 2017లో👉జాక్ క్రాలే(ఇంగ్లండ్)- పాకిస్తాన్ మీద- 2022లో👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- న్యూజిలాండ్ మీద- 2023లో👉పాతుమ్ నిసాంక(శ్రీలంక)- ఇంగ్లండ్ మీద- 2024లోచదవండి: Afg vs NZ: నోయిడాలో తొలి రోజు ఆట రద్దు.. కారణం ఇదే! -
ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ..గిన్నిస్ రికార్డు!
అమెరికాకు చెందిన డేవ్ బెన్నెట్ అతి పెద్ద వంకాయను పండించి గిన్ని స్ వర్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ వంకాయ ఆశ్చర్యపరిచే విధంగా ఏకంగా 3.778 కేజీల బరువు ఉంది. సుమారు 16 అడుగుల పొడవు, 35 సెంటిమీటలర్ల చుట్టుకొలతతో ఉంది. జూలై 31న అయోవాలోని బ్లూమఫీల్డ్లో ఇంత పెద్ద భారీ వంకాయ కాసినట్లు గుర్తించాడు. ఇది సాధారణ మార్కెట్లలో పండించే వంకాయ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంది. ఈ వంకాయకి సంబంధించిన విత్తనాలను ఏప్రిల్లో నాటినట్లు తెలిపాడు. జూలై నాటికి కాయడం ప్రారంభించిందని వివరించాడు. అంతేగాదు ఇదే ప్రపంచంలోనే అత్యంత భారీ వంకాయ అని గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకటించింది. ఈ అద్భుతమైన వంకాయను ప్రపంచ రికార్డుల జాబితాలో చేర్చుతున్నందుకు సంతోషంగా ఉందని అధికారులు తెలిపారు. అందుకు సంబంధంచిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: ఆ దేశంలో జీన్స్ బ్యాన్..పొరపాటున ధరిస్తే అంతే సంగతులు..!) -
ఒకే ఓవర్లో 39 పరుగులు
అపియా (సమోవా): అంతర్జాతీయ టి20 క్రికెట్లో మంగళవారం అద్భుతం చోటు చేసుకుంది. టి20 ప్రపంచకప్ ఈస్ట్ ఆసియా–పసిఫిక్ రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా వనువాటు, సమోవా మధ్య జరిగిన పోరులో ఒకే ఓవర్లో 39 పరుగులు నమోదయ్యాయి. ఈ ఫార్మాట్లో గతంలో ఐదుసార్లు ఒకే ఓవర్లో 36 పరుగులు నమోదు కాగా... సమోవా దాన్ని అధిగమిస్తూ మొత్తం 39 పరుగులు రాబట్టింది. మిడిలార్డర్ బ్యాటర్ డారియస్ విసెర్ ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు. క్వాలిఫయర్స్లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో వనువాటుపై సమోవా 10 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. విసెర్ (62 బంతుల్లో 132; 5 ఫోర్లు, 14 సిక్సర్లు) శతక్కొట్టగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో వనువాటు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. నళిన్ నిపికో (52 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆ ఓవర్ సాగిందిలా.. వనువాటు బౌలర్ నళిన్ నిపికో వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డారియస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 6, 1నోబాల్, 6, 0, 1 నోబాల్, 6+1నోబాల్, 6 పరుగులు సాధించి ఒకే ఓవర్లో 39 పరుగులు పిండుకున్నాడు. గతంలో యువరాజ్ సింగ్ (భారత్; 2007లో ఇంగ్లండ్పై; స్టువర్ట్ బ్రాడ్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్; 2021లో శ్రీలంకపై; అఖిల ధనంజయ), నికోలస్ పూరన్ (వెస్టిండీస్; 2024లో అఫ్గానిస్తాన్పై; అజ్మతుల్లా ఓమర్జాయ్), దీపేంద్ర సింగ్ (నేపాల్;2024లో ఖతర్పై; కమ్రాన్ ఖాన్), రోహిత్ శర్మ–రింకూ సింగ్ (భారత్; 2024లో అఫ్గానిస్తాన్పై; కరీమ్ జన్నత్) కూడా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించారు. అయితే తాజా మ్యాచ్లో వనువాటు బౌలర్ అదనంగా మూడు నోబాల్స్ వేయడంతో... మొత్తం 39 పరుగులు వచ్చాయి. ఒక టి20 ఇన్నింగ్స్ జట్టు స్కోరులో అత్యధిక శాతం పరుగులు చేసిన ప్లేయర్గా విసెర్ రికార్డుల్లోకెక్కాడు. సమోవా జట్టు 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా.. అందులో విసెర్ ఒక్కడే 132 పరుగులు సాధించాడు. అంటే జట్టు మొత్తం స్కోరులో 75.86 శాతం విసెర్ బ్యాట్ నుంచే వచ్చాయి. గతంలో ఆ్రస్టేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్ జట్టు స్కోరులో 75.01 శాతం పరుగులు సాధించాడు. -
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్-ఏ పోటీల్లో భాగంగా సమోవా దేశంతో జరిగిన మ్యాచ్లో వనుఅటు దేశ సీమర్ నలిన్ నిపికో ఒకే ఓవర్లో 39 పరుగులు సమర్పించుకున్నాడు. నిపికో బౌలింగ్లో సమోవా దేశ బ్యాటర్ డేరియస్ విస్సర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. నిపికో మూడు నో బాల్స్ వేశాడు. ఫలితంగా ఓ ఓవర్లో 39 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఇది సరికొత్త ప్రపంచ రికార్డు.2007 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, 2021లో శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ, 2024 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ టీ20 టోర్నీలో ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ ఒకే ఓవర్లో 36 పరుగులు (6 సిక్సర్లు) సమర్పించుకున్నారు. బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్, ధనంజయ బౌలింగ్లో కీరన్ పోలార్డ్, కమ్రాన్ ఖాన్ బౌలింగ్లో దీపేంద్ర సింగ్ ఎయిరీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల ఘనత సాధించారు.మొత్తం 14 సిక్సర్లు..నిపికో బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన డేరియస్ విస్సర్.. ఇన్నింగ్స్ మొత్తంలో ఏకంగా 14 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో 62 బంతుల్లో 132 పరుగులు చేసిన విస్సర్.. సమోవా దేశం తరఫున శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. -
ఆర్చరీలో కొత్త ప్రపంచ రికార్డు
పారిస్ ఒలింపిక్స్ క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్నా... గురువారం ఈ క్రీడల్లో తొలి ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో దక్షిణ కొరియా అమ్మాయి లిమ్ సిహైన్ కొత్త ప్రపంచ రికార్డుతోపాటు ఒలింపిక్ రికార్డును కూడా నెలకొల్పింది. లిమ్ సిహైన్ 694 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 692 పాయింట్లతో కాంగ్ చాయెంగ్ (దక్షిణ కొరియా; 2019లో) సాధించిన ప్రపంచ రికార్డును లిమ్ బద్దలు కొట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కొరియాకే చెందిన ఆన్ సాన్ 680 పాయింట్లతో నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును కూడా లిమ్ సిహైన్ తిరగరాసింది. -
వామ్మో ఎంత పొడుగు జుట్టు!..గిన్నిస్ రికార్డులకెక్కింది!
టీవీల్లోనూ, అడ్వర్టైస్మెంట్ల్లోనూ భారీ కురులను చూసుంటాం. రియల్ లైఫ్లోఎక్కువగా సన్యాసుల్లో చూస్తుంటాం. ఒక వేళ ఉన్నా ఇక్కడున్న మహిళకు ఉన్నంత భారీ కురులను చూసి ఉండే అవకాశమే లేదు. ఎవరామె? ఆమె చుట్టు సంరక్షణ రహస్యం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీ వాస్తవ అత్యంత పొడవాటి జుట్టుని కలిగి ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఆమె జుట్టు ఏకంగా తొమ్మిది అంగుళాల పొడవుతో ఉంది. ఆమె 14 ఏళ్ల ప్రాయం నుంచి కత్తిరించడం మానేసింది. అంతేగాదు చుట్టును కడగడానికే దాదాపు 45 నిమిషాలు పడుతుందట. తనకు తన జుట్టు అంటే మహా ఇష్టమని, దీనికి గుర్తిపు రావాలని ఎంతగానో కోరుకున్నాని చెప్పుకొచ్చింది. చివరికి దేవుడు తన ప్రార్థనలు ఆలకించి ప్రపంచ రికార్డులో చోటు దక్కేలా చేశాడని అంటోంది శ్రీ వాస్తవ. ప్రస్తుతం ఆమెకు 46 ఏళ్లు వారానికి రెండు సార్లు జుట్టును కడుగుతుందట. అయితే వాషింగ్, డ్రైయింగ్, డిటాంగ్లింగ్, స్టైలింగ్తో సహా మొత్తం ప్రక్రియకు ప్రతిసారీ మూడు గంటల వరకు పడుతుందట. తనకు జుట్టుని సంరక్షించుకోవాలనే విషయంలో ప్రేరణ తన అమ్మేనని చెబుతోంది. తన కుటుంబంలోని ప్రతిఒక్కరికి అందమైన జుట్టు ఉంది. అదీగాక 80ల టైంలోని హిందీ సినిమాల్లో నటీమణులు చాలా అందంగా ఉండేవారు. ఆ కాలల్లోని వాళ్లందరికీ జుట్టు చాలా పొడవుగా ఉండేది. అదే తనను బగా ప్రేరేపించిందని చెబుతోంది శ్రీ వాస్తవ. మన సమాజంలో పొడవాటి జుట్టు మహిళల అందాన్ని తెలియజేస్తుంది. ఇక శ్రీ వాస్తవ గత 20 ఏళ్లలో వెంట్రుకలను కత్తిరించలేదు. అయితే ఒకనొక సమయంలో కాస్త ఎక్కువగా జుట్టురాలిందని, అందుకోసం శ్రద్ధ తీసుకోవడంతో ఆ సమస్యను నివారించగలిగానని చెప్పింది శ్రీ వాస్తవ. అలాగే ఆమె తన జుట్టు సంరక్షణ కోసం కృత్రిమ షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉంటానని అంటోంది. ఎక్కువగా గుడ్డు, ఉల్లిపాయ రసం, అలోవెరా వంటి సహజమైన పదార్థాలతో జుట్టును సంరక్షించుకుంటానని అదే తన కేశసంపద రహస్యమని చెబుతోంది శ్రీ వాస్తవ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెమిడీలను తప్పకు ప్రయత్నించండి.(చదవండి: స్లిమ్గా మారిన భూమి పడ్నేకర్!.. జస్ట్ నాలుగు నెలల్లో ఏకంగా..!) -
ఒకేరోజు 85 వేల పండ్ల మొక్కలు! ప్రపంచ రికార్డు
ఛత్తీస్ఘడ్లోని గరియాబంద్ జిల్లాలో 17వేల మంది మహిళలు ఒకేరోజులో 85వేల పండ్ల మొక్కలను నాటడం ద్వారా రికార్డ్ సృష్టించారు. ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లాకేంద్రం వరకు కొత్తగా పెళ్లయిన వారు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు. మామిడి, జామ, నిమ్మ, పనస... మొదలైన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు, పౌష్టికాహార మెరుగుదలకు దోహదపడే ఈ మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించారు. వీరి ఘనతను ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. ‘మొక్క నాటాను. ఇక నా పని పూర్తయిపోయింది అనుకోడం లేదు. నేను నాటిన మొక్క మా అమ్మ, నా బిడ్డతో సమానం. కంటికి రెప్పలా చూసుకుంటాను’ అంటుంది దస్పూర్ గ్రామానికి చెందిన సునీత అనే గృహిణి. ఇది ఆమె మాటే కాదు ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో పాల్గొన్న పదిహేడు వేల మంది మహిళలది. -
శెభాష్ ఆండర్సన్.. వీడ్కోలు మ్యాచ్లో వరల్డ్ రికార్డు
తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చేరుగుతున్నాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆండర్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి ఇన్నింగ్స్లో ఓ కీలక వికెట్ పడగొట్టిన ఆండర్సన్.. రెండో ఇన్నింగ్స్లో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బతీశాడు. అయితే తన విడ్కోలు టెస్టులో ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్గా ఆండర్సన్ రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్లో తన 10వ ఓవర్ వేసిన అనంతరం ఆండర్సన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 188 టెస్టులు ఆడిన ఆండర్సన్.. 6666. 5(40000 బంతులు) ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆండర్సన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్లు ఆండర్సన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(44039), షేన్ వార్న్(40850), ముత్తయ్య మురళీధరన్(40705) ఉన్నారు.అదేవిధంగా ఆండర్సన్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో విండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా ఆండర్సన్ నిలిచాడు. ఆండర్సన్ ఇప్పటివరకు వెస్టిండీస్పై 90 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(89) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కపిల్ దేవ్ రికార్డును ఆండర్సన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్లెన్ మెక్గ్రాత్(110) తొలి స్ధానంలో ఉన్నాడు. Jimmy Anderson, there are no words 🤯 pic.twitter.com/bBRCS1uykD— England Cricket (@englandcricket) July 11, 2024 -
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. లూకీ ఫెర్గూసన్ సరికొత్త చరిత్ర
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా పాపువా న్యూగినీతో మ్యాచ్లో ఫెర్గూసన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.ఈ మ్యాచ్లో ఫెర్గుసన్ ఎవరూ ఊహించని విధంగా తన 4 ఓవర్ల కోటాను మెయిడిన్లుగా ముగించాడు. ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా 3 వికెట్లు కూడా పడగొట్టాడు.పసికూన పాపువా న్యూగినీ బ్యాటర్లకు ఈ కివీస్పీడ్ స్టార్ చుక్కలు చూపించాడు. అతడిని ఎదుర్కొనేందుకు న్యూగినీ బ్యాటర్లు గజగజ వణికిపోయారు. పపువా న్యూ గినియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బంతిని అందుకున్న ఫెర్గూసన్ తొలి బంతికే వికెట్ తీసాడు. ఆ ఓవర్ను మెయిడిన్గా ముగించిన లాకీ.. ఏడో ఓవర్లో మరోసారి బంతిని అందుకుని రెండోసారి మెయిడిన్ చేశాడు.మళ్లీ 12వ ఓవర్ బౌలింగ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి వికెట్ తీసి మూడో ఓవర్ను మెయిడిన్ చేశాడు. 14వ ఓవర్లో రెండో బంతికి మరో వికెట్ తీసి మరోసారి మెయిడిన్ చేశాడు.ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఫెర్గూసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఫెర్గూసన్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా ఫెర్గూసన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ పేరిట ఉండేది.పనామాపై సాద్ బిన్ జఫర్ 4 మెయిడిన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. అయితే తాజా మ్యాచ్లో 4 మెయిడిన్ ఓవర్లతో పాటు 3 వికెట్లు పడగొట్టిన ఫెర్గూసన్.. సాద్ బిన్ జఫర్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో 4 ఓవర్లు మెయిడిన్ వేసిన తొలి బౌలర్గా కూడా ఫెర్గూసన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.అదేవిధంగా ఓవరాల్గా టీ20ల్లో 4కి 4 ఓవర్లు మెయిడిన్ వేసిన రెండో బౌలర్గా ఫెర్గూసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2021లో పనమాతో జరిగిన టీ20 మ్యాచ్లో సాద్ బిన్ జఫర్ 4 ఓవర్లు మెయిడిన్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. -
T20 World Cup 2024: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్
ఆసీస్ వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ను అధిగమించాడు. ఒమన్పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. గేల్ పేరిట 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్ల మార్కు తాకగా.. గేల్కు 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. -
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్లో జరిగిన పారా ఒలింపిక్లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
ఐర్లాండ్తో తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్ బదలు తీర్చుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే 16.5 ఓవర్లలో చేధించింది.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(75), ఫఖార్ జమాన్(78) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.ఐరీష్ బ్యాటర్లలో లారెన్ టక్కర్(51), టాక్టెర్(32) పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. అమీర్, నసీం షా తలా వికెట్ సాధించారు.బాబర్ ఆజం వరల్డ్ రికార్డు..ఇక మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్ల్లో విజయం సాధించిన కెప్టెన్గా బాబర్ రికార్డులకెక్కాడు. బాబర్ సారథ్యంలో ఇప్పటివరకు పాకిస్తాన్ 45 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా పేరిట ఉండేది. బ్రియాన్ మసాబా కెప్టెన్గా ఉగాండాకు 44 టీ20లు విజయాలు అందించాడు. తాజా విజయంతో మసాబా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (42), మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ సారథి అస్గర్ ఆఫ్ఘన్ (42), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (41), రోహిత్ శర్మ (41) ఉన్నారు. -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్లో ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు.పురుషుల క్రికెట్లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్డిక్ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బౌలర్ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్లో రెండో టీ20 మ్యాచ్లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. బాలీ బాష్గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్ 4 వికెట్లు పడగొట్టింది. View this post on Instagram A post shared by Persatuan Cricket Indonesia (@cricket_ina) 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల మార్కు తాకలేకపోగా.. ఎక్స్ట్రాలు టాప్ స్కోర్ (10) కావడం విశేషం. మంగోలియా ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్.. క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా..!
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఎంఐ టీమ్... పొట్టి క్రికెట్లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృస్టించింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకెక్కింది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ జట్టు ఇప్పటివరకు 150 విజయాల మార్కును తాకలేదు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్, ప్రస్తుతం కనుమరుగైన ఛాంపియన్స్ టీ20 లీగ్లో కలిపి 273 మ్యాచ్లు ఆడి 150 విజయాలు సాధించింది. 117 మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొంది. రెండు మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిసాయి. టీ20ల్లో ముంబై సాధించిన 150 విజయాలు సూపర్ ఓవర్ ఫలితాలు కలుపుకోకుండా సాధించినవి. సూపర్ ఓవర్లో ముంబై రెండు విజయాలు సాధించి, రెండు అపజయాలు ఎదుర్కొంది. WANKHEDE CROWD GETS A SUPERB MATCH. ⭐ pic.twitter.com/HOEAsTTFkH — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 టీ20ల్లో ముంబై తర్వాత అత్యధిక విజయాలు సాధించిన ఘనత చెన్నై సూపర్ కింగ్స్కు దక్కుతుంది. పొట్టి ఫార్మాట్లో సీఎస్కే 253 మ్యాచ్లు ఆడి 148 విజయాలు నమోదు చేసింది. 101 మ్యాచ్ల్లో పరాజయాలు ఎదర్కొంది. రెండు మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగియగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన రెండు మ్యాచ్ల్లో చెన్నై అపజయాలను ఎదుర్కొంది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో టీమిండియా మూడో స్థానంలో ఉంది. భారత్ అన్ని జాతీయ జట్ల కంటే ఎక్కువగా 219 మ్యాచ్ల్లో 140 విజయాలు సాధించి, 68 మ్యాచ్ల్లో ఓడింది. 6 మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగియగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన నాలుగు మ్యాచ్ల్లో భారత్ విజయఢంకా మోగించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. 235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. టీమిండియా రికార్డు బద్దలు
టెస్ట్ల్లో టీమిండియా పేరిట ఉండిన ఓ భారీ రికార్డును శ్రీలంక బద్దలు కొట్టింది. ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండింది. 1976లో టీమిండియా ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 529 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగా.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక శతకం లేకుండా 531 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేసి భారత్ రికార్డును బద్దలు కొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన నాటి మ్యాచ్లో ఆరుగురు భారత ఆటగాళ్లు అర్ద సెంచరీలు సాధించగా.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లోనూ ఆరుగురు లంక ఆటగాళ్లు అర్ద శతకాలు బాదారు. లంక ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్ (93), కమిందు మెండిస్ (92 నాటౌట్) సెంచరీలకు చేరువగా వచ్చారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో పర్యాటక శ్రీలంక పటిష్ట స్థితిలో ఉంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు ఆరుగురు అర్దశతకాలు సాధించడంతో 531 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటయ్యారు. నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ 92 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ 21 పరుగులు చేసి లహీరు కుమార బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా.. జకీర్ హసన్ (28), తైజుల్ ఇస్లాం (0) క్రీజ్లో ఉన్నారు. బంగ్లాదేశ్.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 476 పరుగులు వెనుకంజలో ఉంది. కాగా, ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్లో గెలిచి శ్రీలంక 1-0 కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
శభాష్ హిట్మ్యాన్.. క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి ప్లేయర్గా రికార్డు
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అద్భుత రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో (ఇంగ్లండ్) మార్క్ వుడ్ క్యాచ్ పట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్లు అందుకున్న తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో ఏ ఇతర ఆటగాడు మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్లు అందుకోలేదు. డబుల్ సెంచరీలు, సిక్సర్ల రికార్డులు ఎక్కువగా నెలకొల్పే రోహిత్కు క్యాచ్ల పరంగా ఇది అతి పెద్ద రికార్డని చెప్పవచ్చు. WHAT A CATCH BY CAPTAIN ROHIT SHARMA...!!!! 🔥 - The Magician Ravi Ashwin picked 2 wickets in an over on his 100th Test Match. pic.twitter.com/WawmeAxQ1H — CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024 కాగా, ధర్మశాల టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ మూవీ.. ఏకంగా ప్రపంచ రికార్డ్ సొంతం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పటీ నుంచి ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కాగా.. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్ పేరుతో రిలీజ్ చేశారు. సౌత్ డబ్బింగ్ మూవీస్లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలోనే హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 772 మిలియన్ల వ్యూస్తో రెండోస్థానంలో కొనసాగుతోంది. కాగా.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #JayaJanakiNayaka 800M+ Views 💥👌@BSaiSreenivas @Rakulpreet #BellamkondaSrinivas #RakulPreetSingh #PenMovies pic.twitter.com/eC5M6cml89 — South Hindi Dubbed Movies (@SHDMOVIES) February 20, 2024 -
ISSF World Cup 2024: ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
భారత షూటర్ దివ్యాంశ్ సింగ్ పన్వర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. కైరోలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోరీ్నలో ఆదివారం జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల దివ్యాంశ్ 253.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకం నెగ్గాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో చైనా షూటర్ షెంగ్ లిహాయో 253.3 పాయింట్ల తో నెలకొల్పిన ప్రపంచ రికార్డును దివ్యాంశ్ బద్దలు కొట్టాడు. -
రికార్డులను చుట్టూ తిప్పుకుంటున్న గాయని.. మూడేళ్లకే!
మనసుంటే మార్గముంటుంది. ప్రతిభ ఉండాలేగానీ అవార్డులు, రివార్డులు, ప్రపంచ రికార్డులు మనకోసం వెదుక్కుంటూ వస్తాయి. ఇదే విషయాన్ని ఒక యువతి నిరూపించింది. తన పాటలతో రికార్డులను తన వెంట తిప్పుకుంటోంది. ఒక కాన్సర్ట్లో ఏకంగా 140 భాషల్లో పాటలు పాడి సరికొత్త ప్రపంచ రికార్డును సాధించింది కేరళ కుట్టి. గత ఏడాది నవంబర్ 24న దుబాయ్, యుఎఇలో జరిగిన కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ సందర్భంగా కేరళకు చెందిన సుచేత సతీష్ తన గాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. తన అద్భుత ఘనతను చాటుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను నెలకొల్పింది. దీనికిసంబంధించిన వీడియో ఇన్స్టాలో షేర్ అవుతోంది. ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేజీ ప్రకారం , దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి సుచేత 140 భాషలలో ప్రదర్శనలిచ్చి రికార్డును బద్దలు కొట్టారు. దుబాయ్లో జరిగిన COP 28 సమ్మిట్కు హాజరైన 140 దేశాల ప్రాతినిధ్యానికి గుర్తుగా 140 నంబర్ ఎంపిక చేసినట్టు వివరించింది. సుచేత సతీష్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన విజయాన్ని షేర్ చేసింది. దీంతో నెటిజనులు అభినందనలు కురిపించారు. ఇన్క్రెడిబుల్! వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంటూ కామెంట్ చేశారు. 2018 జనవరిలో లాంగెస్ట్ లైవ్ సింగింగ్ కన్సర్డ్ పెట్టిన అమ్మాయిగా రికార్డు. అలాగే అత్యధిక భాషల్లో పాడిన ప్రపంచ రికార్డుకూడా సొంతం చేసుకుంది. 2021 మ్యూజిక్ బియాండ్ బోర్డర్స్ గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ ప్రోగ్రామ్లో సుచేత సతీష్ 6 గంటల 15 నిమిషాల పాటు 102 భాషల్లో పాడి రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఈ రికార్డులను అమెరికా, మయామి వరల్డ్ రికార్డ్ అకాడెమీ నిర్ధారించింది. 2005 ఆగస్టు17న కన్నూర్లో అయిలియాత్ సుమిత, డాక్టర్ టీసీ సతీష్ దంపతులకు జన్మించింది. అన్నయ్య సుశాంత్ సతీష్ ఉన్నారు. 2 నెలల వయస్సులో దుబాయ్కి షిప్ట్. మూడేళ్ల వయస్సు నుంచే పాడటం మొదలు పెట్టింది. నాలుగేళ్లనుంచే కర్ణాటక సంగీతం నేర్చుకుంటోంది. చాలా చిన్న వయసులోనే ప్రముఖ గాయనీ గాయకులందరికీతోనూ పరిచయాటుండటం తన అదృష్టమనీ, ప్రముఖ గాయని శ్రీమతి పి.సుశీలను తన గాడ్ మదర్గా భావిస్తుందిసుచేత సతీష్. -
పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడం ద్వారా హిట్మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్ల్లోనే అందుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ ఖాతా తెరవకుండానే ఔటైనా అతని ఖాతాలో ప్రపంచ రికార్డు చేరడం విశేషం. Players to be part of most wins in T20I history: 1) Rohit Sharma - 100* 2) Shoaib Malik - 86 Hitman created history in Mohali. pic.twitter.com/x7UkiRwMUv — Johns. (@CricCrazyJohns) January 11, 2024 ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ (111) పేరిట ఉండగా.. పురుషుల క్రికెట్లో రోహిత్ తర్వాత ఈ రికార్డు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ (124 మ్యాచ్ల్లో 86 విజయాలు) పేరిట ఉంది. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన ఘనత విరాట్ కోహ్లి (115 మ్యాచ్ల్లో 73 విజయాలు) సొంతం చేసుకున్నాడు. ఆఫ్ఘన్తో తొలి టీ20లో విజయం సాధించడం ద్వారా హిట్మ్యాన్ కెప్టెన్గానూ అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. హిట్మ్యాన్ సారథ్యంలో టీమిండియా కేవలం 52 మ్యాచ్ల్లోనే 40 విజయాలు సాధించింది. Rohit Sharma has 40 wins from just 52 games in T20I as a captain 🇮🇳 - One of the most successful captains in T20I history. pic.twitter.com/Tpas68JN4M — Johns. (@CricCrazyJohns) January 12, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. శివమ్ దూబే ఆల్రౌండ్ ప్రదర్శనతో (1/9, 60 నాటౌట్) చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (42) మెరుపు ఇన్నింగ్స్తో రాణించగా.. గుర్బాజ్ (23), కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (25), అజ్మతుల్లా (29), నజీబుల్లా (19 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఛేదనలో భారత్ ఖాతా తెరవకుండానే రోహిత్ (0) వికెట్ కోల్పోయినా కుర్రాళ్లు జట్టును గెలిపించారు. శుభ్మన్ గిల్ (23), తిలక్ వర్మ (26), శివమ్ దూబే (60 నాటౌట్), జితేశ్ శర్మ (31 ), రింకూ సింగ్ (16 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 2, ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
నీరు.. బేజారు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కళాఖండమేమీ కాదు, ఇది మంచినీటి సీసా మాత్రమే! దీని ధర తెలుసుకుంటే మాత్రం గుండె బేజారవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసా. ‘అక్వా డి క్రిస్టాలో ట్రిబ్యూటో ఎ మోదిగ్లియానీ’ పేరుతో ఈ మంచినీటి సీసాను దివంగత ఇటాలియన్ కళాకారుడు అమేదియో క్లెమెంటె మోదిగ్లియానీకి నివాళిగా మెక్సికన్ కళాకారుడు ఫెర్నాండో ఆల్టమిరానో ప్రాచీన ఈజిప్షియన్ శిల్ప శైలిలో రూపొందించాడు. దీని తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్, 23 కేరట్ల బంగారం ఉపయోగించి, యంత్రాలతో పనిలేకుండా పూర్తిగా హస్తకళా నైపుణ్యంతోనే ఈ నీటిసీసాలను తయారు చేశాడు. వీటిలో జలపాతాల నుంచి జాలువారిన నీటిని నింపి, విక్రయానికి సిద్ధం చేశాడు. ఈ నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. మెక్సికో సిటీలో 2010లో జరిగిన వేలంలో ఈ లీటరు నీటి సీసా ఒకటి 60 వేల డాలర్లకు (రూ.49.89 లక్షలు) అమ్ముడుపోయి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీటి సీసాగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు దీని రికార్డు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. -
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
పిజ్జాతో రికార్డ్ బ్రేక్, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..
పిజ్జా.. చాలామంది యంగ్స్టర్స్కి ఫేవరెట్ రెసిపి. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, చీజ్తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్ రికార్డ్ కోసం ఇద్దరు ఫ్రెంచ్ చెఫ్లు చీజీ మాస్టర్ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్ను సృష్టించారు. వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్ఎయిర్లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్ను బ్రేక్ చేస్తూ వెయ్యి చీజ్లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు. ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్ను పిజ్జాపై టోపింగ్ చేసి ఈ వెరైటీ డిష్ను అందించారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారీ విజయం నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఈ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డు శ్రీలంక మహిళల జట్టు పేరిట ఉండేది. 1997లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ను 309 పరుగుల తేడాతో ఓడించింది. తాజా మ్యాచ్తో 26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్ మూడు , గైక్వాడ్ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్(21) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో కూడా దీప్తి శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్ రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు పడగొట్టంది. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన 9⃣.3⃣ - Sophia Dunkley 9⃣.4⃣ - Nat Sciver-Brunt Relive how Pooja Vastrakar 2⃣ wickets in an over 🎥 🔽 Follow the Match ▶️ https://t.co/UB89NFaqaJ #TeamIndia | #INDvENG | @Vastrakarp25 | @IDFCFIRSTBank pic.twitter.com/EAUF8WPwMF — BCCI Women (@BCCIWomen) December 16, 2023 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు బద్దలు
రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 20 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా ప్రపంచరికార్డును టీమిండియా తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా భారత్ అవతరించింది. టీమిండియా ఇప్పటివరకు 213 మ్యాచ్ల్లో 136 విజయాలను అందుకుంది. కాగా ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. పాకిస్తాన్ 226 మ్యాచ్ల్లో 135 విజయాలు సాధించింది. తాజా మ్యాచ్తో పాక్ వరల్డ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46 పరుగులు చేశాడు. రింకూతో పాటు జితేష్ శర్మ(35), యశస్వీ జైశ్వాల్(37), రుతురాజ్ గైక్వాడ్(32) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. జాసన్ బెహ్రెన్డార్ఫ్, సంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ వేడ్(36) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ఆస్ట్రేలియాతో మూడో టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా
గౌహతి వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి రెండు మ్యాచ్ల్లో అసీస్ను చిత్తు చేసిన టీమిండియా.. మూడో టీ20లో కూడా కూడా అదే జోరును కనబరిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా పాకిస్తాన్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తోంది. తిరువనంతపురం వేదికగా ఆసీస్తో జరిగిన రెండో టీ20లో గెలుపొందిన టీమిండియా.. పాకిస్తాన్ పేరిట ఉన్న ఈ అరుదైన ఫీట్ను సమం చేసింది. రిటీమిండియా ఇప్పటివరకు 211 మ్యాచ్ల్లో 135 విజయాలను అందుకుంది. పాకిస్తాన్ కూడా పాక్ 226 మ్యాచ్ల్లో 135 విజయాలు సాధించింది. ఈ క్రమంలో గౌహతి మ్యాచ్లో విజయం సాధిస్తే పాకిస్తాన్ వరల్డ్ రికార్డును భారత్ బద్దలు కొడుతోంది. చదవండి: క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్ -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్లో ఇంజినీర్గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్పోల్లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్పోల్కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్పోల్కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్పోల్లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్కు సర్టిఫికెట్ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
ఏడాది ప్రాయంలోనే అద్భుత గ్రాహకశక్తి
అనకాపల్లి: ఉగ్గినపాలెం గ్రామానికి చెందిన గాలి దృశ్యంత్కుమార్ బుడి బుడి అడుగుల నాడే అద్భుతమైన గ్రాహక శక్తితో నోబెల్ ప్రపంచ రికార్డు సాధించి అందరిని అబ్బుర పరిచాడు. తమిళనాడుకు చెందిన నోబెల్ వరల్డ్ రికార్ుడ్స ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తండ్రి గాలి నాగేశ్వరరావు ఇక్కడ బుధవారం విలేకరులకు తెలిపారు. నాగేశ్వరరావు, శ్రీదేవి దంపతుల కుమారుడైన దృశ్యంత్ కుమార్ పుట్టినప్పటి నుంచి చురుగ్గా ఉండడమే కాకుండా అపరిమితమైన గ్రాహక శక్తి ఉన్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. పది నెలల వయస్సు నుంచి కుమార్కు అనేక రకాల వస్తువులు, ఫొటోలు, వివిధ దేశాల జెండాలను చూపిస్తూ అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దృశ్యంత్ ఏడాది వయసులోనే 300 రకాల ఫొటోలను గుర్తించడమే కాకుండా వస్తువులు, పూలు, పండ్లు, కూరగాయలను సునాయాసంగా గుర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుని గ్రాహక శక్తిని వీడియో ద్వారా రికార్డు చేసి తమిళనాడులో ఉన్న నోబుల్ వరల్డ్ రికార్ుడ్స ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు ఇటీవల పంపించారు. వాటిని పరిశీలించిన ప్రతినిధులు ఉగ్గినపాలెం వచ్చి పరిశీలించిన మీదట నోబెల్ వరల్డ్ రికార్డులో నమోదు చేసి పురస్కారాన్ని ప్రకటించారు. సర్టిఫికెట్, పతకాన్ని అందిస్తూ పోస్టు ద్వారా ఇక్కడకు పంపారు. దీంతో పురస్కారం రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఎంపీ డాక్టర్ సత్యవతి అభినందన చిన్నతనంలోనే అద్భుతాలు చేస్తున్న దృశ్యంత్కుమార్కు అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి తన కార్యాలయంలో బుధవారం జ్ఞాపికను అందజేసి సత్కరించి కొద్దిసేపు ముచ్చటించి అభినందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కూడా సత్కరించారు. ఈ చిన్నారి మరిన్ని అద్బుతాలు సాధించి అందరికి ఆదర్శంగా నిలవగలడని ఆకాంక్షించారు. డాక్టర్ కె. విష్ణుమూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
CWC 2023 ENG VS NZ: 4658 వన్డేల చరిత్రలో తొలిసారి ఇలా..!
భారత్లో జరుగుతున్న వన్డే వరల్డ్కప్ 2023లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఇంగ్లండ్ తుది జట్టులోని సభ్యులందరూ (11 మంది) రెండంకెల స్కోర్లు చేసి చరిత్ర సృష్టించారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు సభ్యులు జానీ బెయిర్స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11), జోస్ బట్లర్ (43), జో రూట్ (77), లియామ్ లివింగ్స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11), మార్క్ వుడ్ (13 నాటౌట్), ఆదిల్ రషీద్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. 4,658 ODI matches in history so far. First time ever all the 11 batters of a team scored runs in double digits. pic.twitter.com/UYP1oWDf0S — Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023 ఈ మ్యాచ్లో కివీస్ బౌలర్లు రాణించినప్పటికీ జట్టులోని సభ్యులందరూ తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏడో బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ.. వన్డౌన్లో వచ్చిన రచిన్ రవీంద్ర (39), డెవాన్ కాన్వే (33) ధాటిగా ఆడుతూ తమ జట్టును లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 73/1గా ఉంది. -
టాటులతో వరల్డ్ రికార్డు..అది కూడా 667..
వరల్డ్ రికార్డ్ క్రేజ్ ఉన్న వాళ్లు దాన్ని సాధించేందుకు అంతే క్రేజీగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి క్రేజీ లిస్ట్లోకి యూకేకు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్నూ చేర్చొచ్చు. శరీరంపై తన కూతురు పేరుతో 667 టాటూలు వేయించుకున్నాడు. ఆల్రెడీ వీపు వెనుక భాగంపై ‘లూసీ’ పేరుతో 267 టాటూలు వేయించుకుని 2017లో గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నాడు. అయితే 2020లో డ్రా విజిల్ అనే 27 ఏళ్ల మహిళ తన శరీరం మీద తన పేరుతో 300 టాటూలు వేయించుకుని మార్క్ ఓవెన్ ఎవాన్స్ గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసింది. ఆ మహిళను అధిగమించి, ఎలాగైనా తిరిగి గిన్నిస్ రికార్డును పొందాలని మార్క్ నిశ్చయించుకున్నాడు. అందుకోసం అతను తన కూతురు బర్త్ డే సందర్భంగా తన రెండు కాళ్లపై మరో నాలుగు వందసార్లు ఆమె పేరును టాటూలు వేయించుకున్నాడు. అలా మొత్తం 667 టాటూస్తో మార్క్ ఓవెన్ మరోసారి వరల్డ్ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. (చదవండి: జపాన్లో శరత్కాల వేడుకలు!) -
పరుగుల సునామీ.. ఏకంగా 8 సిక్సర్లు.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్
Dipendra Singh Fastest T20I 50: నేపాల్ ఆల్రౌండర్ దీపేంద్ర సింగ్ ఆరీ పరుగుల సునామీ సృష్టించాడు. మంగోలియాతో మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట(ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో) ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా అరుదైన ఘనత సాధించాడు. ఆసియా క్రీడలు -2023లో భాగంగా మెన్స్ క్రికెట్ ఈవెంట్లో నేపాల్- మంగోలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. చైనాలోని హోంగ్జూలో జరిగిన ఈ మ్యాచ్లో దీపేంద్ర సింగ్ ఈ మేర సుడిగాలి అర్ధ శతకంతో మెరిశాడు. ఐదోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ ఆల్రౌండర్ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్గానూ చరిత్రకెక్కాడు. రెండు ఫార్మాట్లలో అద్భుత సెంచరీలు కాగా 23 ఏళ్ల దీపేంద్ర సింగ్ ఆరీ 2018లో నేపాల్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 52 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 889, 991 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ ఖాతాలో వన్డేల్లో 36, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఈ రైట్ హ్యాండ్బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 105, టీ20లలో 110 కావడం విశేషం. సంచలనాలు సృష్టించిన నేపాల్ జట్టు ఇక టీ20 చరిత్రలో బుధవారం(సెప్టెంబరు 27) సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆసియా క్రీడలు- 2023 మెన్స్ క్రికెట్ ఈవెంట్లో మంగోలియాతో మ్యాచ్లో నేపాల్ పలు అరుదైన ఘనతలు సాధించి చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్లో 314 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అంతేకాదు మంగోలియాను 41 పరుగులకే ఆలౌట్ చేసి 273 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. చదవండి: 34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు -
ఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం..
-
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా!
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా? ఇక్కడున్న పెన్ను అదే! జపాన్కు చెందిన మిత్సుబిషి కంపెనీ యూని–బాల్ వన్ సిరీస్ బ్లాక్ జెల్ పెన్ను. ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. దీని సిరా లోపలి వినూత్నమైన వర్ణద్రవ్య కణాల కారణంగా ఈ పెన్నుతో కాగితంపై రాస్తున్నప్పుడు ఇది ఇతర బ్లాక్ జెల్ పెన్నుల కంటే రంగును మరింత నల్లగా కనిపించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పెన్నుకు సంబంధించిన వివరాలను కంపెనీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. చాలామంది ఈ పెన్నును కొనడానికి పోటీ పడుతున్నారు. కానీ ఇది ఇంకా మార్కెట్లో విడుదల కాలేదు. త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. (చదవండి: కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!) -
తోకతో రికార్డు కొట్టేసింది...
ఈ ఫొటోలో విలాసంగా పోజు పెట్టిన పిల్లిని చూశారు కదా! చాలా పిల్లుల్లాగానే ఇది కూడా మామూలు పిల్లి మాత్రమే అనుకుంటే పొరపాటే! ఇది అలాంటిలాంటి పిల్లి కాదు, సుదీర్ఘవాలం కలిగిన మార్జాలరాజం. పొడవుగా పెరిగిన తోకే దీనికి రికార్డు తెచ్చిపెట్టింది. అమెరికాలో మిషిగన్కు చెందిన డాక్టర్ విలియమ్ జాన్ పవర్స్ పెంచుకుంటున్న ఈ ఐదేళ్ల పిల్లి ప్రపంచంలోనే అత్యంత పొడవైన తోక కలిగిన పిల్లిగా ఇటీవల గిన్నిస్ రికార్డు సాధించింది. దీని పేరు అలై్టర్. దీని తోక పొడవు 16.07 అంగుళాలు. ప్రపంచంలో మరే పిల్లికీ ఇంత పొడవాటి తోక లేదని గిన్నిస్బుక్ అధికారులు ధ్రువీకరించారు. అలై్టర్ మాత్రమే కాదు, దీని తోబుట్టువులైన ఆర్కటరస్, ఫెన్రిర్లు ఇదివరకు అతి పొడవాటి పిల్లులుగా గిన్నిస్ రికార్డులు సాధించాయి. (చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు!) -
ప్రపంచ రికార్డు సమం చేసిన బుమ్రా
ఐర్లాండ్తో రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఓ ప్రపంచ రికార్డు సమం చేశాడు. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ను (ఛేదనలో) మెయిడిన్ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20ల్లో (ఐసీసీ ఫుల్టైమ్ సభ్యదేశాలు పాల్గొన్న మ్యాచ్లు) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) వేసిన బౌలర్గా సహచరుడు భువనేశ్వర్ కుమార్ రికార్డును సమం చేశాడు. భువీ 87 టీ20ల్లో 10 మెయిడిన్లు వేస్తే, బుమ్రా తన 62వ మ్యాచ్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ విభాగంలో భువీ, బుమ్రాల తర్వాత బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6), శ్రీలంక నువాన్ కులశేఖర (6) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఐర్లాండ్తో రెండో టీ20లో 4 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (74) తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో చహల్ 96 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 90 వికెట్లతో భువనేశ్వర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్తో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ (58), శాంసన్ (40), రింకూ సింగ్ (38), శివమ్ దూబే (22 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఐర్లాండ్ లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ (72) టాప్ స్కోరర్గా నిలువగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. -
వన్డే ఫార్మాట్లో పెను సంచలనం.. 515 పరుగుల రికార్డు స్కోర్, 450 పరుగుల తేడాతో విజయం
ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్కప్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. యూఎస్ఏ అండర్-19 జట్టు అర్జెంటీనా యువ జట్టుపై 450 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. టొరొంటో వేదికగా నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్-19 క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. 2002లో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్.. కెన్యాపై చేసిన 480 పరుగులే ఈ మ్యాచ్కు ముందు వరకు అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లో ఉండింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్లో యూఎస్ఏ.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసి, అండర్-19 వన్డే ఫార్మాట్లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్గా లిస్ట్-ఏ క్రికెట్లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా యూఎస్ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు టీమ్ రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో అతి భారీ విజయం.. యూఎస్ఏ నిర్ధేశించిన 516 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటీనా.. పేసర్ ఆరిన్ నాదకర్ణి (6-0-21-6) ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. అండర్-19 క్రికెట్ వన్డే ఫార్మాట్లో ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవరాల్గా (లిస్ట్-ఏ క్రికెట్) చూసినా యూఎస్ఏ సాధించిన విజయమే వన్డే ఫార్మాట్ మొత్తంలో అతి భారీ విజయంగా నమోదైంది. ఈ మ్యాచ్కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అతి భారీ విజయం రికార్డు తమిళనాడు (అరుణాచల్పై 435 పరుగుల తేడాతో విజయం) పేరిట ఉండింది. మ్యాచ్ విషయానికొస్తే.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో భవ్య మెహతా (136), రిషి రమేశ్ (100) సెంచరీలతో.. ప్రణవ్ చట్టిపలాయమ్ (61), అర్జున్ మహేశ్ (67) అర్ధసెంచరీలతో చెలరేగడంతో యూఎస్ఏ టీమ్ రికార్డు స్కోర్ చేసింది. యూఎస్ఏ టీమ్లో అమోఘ్ ఆరేపల్లి (48), ఉత్కర్ష్ శ్రీవత్సవ (45) కూడా రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన అర్జెంటీనా 19.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నాదకర్ణితో పాటు ఆర్యన్ సతీశ్ (2), పార్థ్ పటేల్ (1), ఆర్యన్ బత్రా (1) వికెట్లు పడగొట్టారు. అర్జెంటీనా ఇన్నింగ్స్లో థియో (18) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
తొలి టి20.. భారత్ ముంగిట అరుదైన రికార్డు; పాక్ మనకంటే ముందే?
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్లను ముగించుకుంది. టెస్టు సిరీస్ను 1-0తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఇప్పుడు టి20 సిరీస్పై కన్నేసింది. రోహిత్ శర్మ, కోహ్లి, జడేజాలు ఈ సిరీస్కు దూరంగా ఉండడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్తో తొలి టి20లో తలపడనుంది. ఐపీఎల్లో ఇరగదీసిన యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్లు విండీస్తో టి20 సిరీస్లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే జైశ్వాల్ విండీస్తో టెస్టు సిరీస్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇక గిల్, ఇషాన్ కిషన్లు వన్డే సిరీస్లో అద్బుతంగా ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీలతో మెరిశాడు. దీంతో ఈ ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇక మిడిలార్డర్లో సంజూ శాంసన్ ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇక ఫినిషర్స్గా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు తమ వంతు పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విండీస్తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. టి20 క్రికెట్ చరిత్రలో 200 మ్యాచ్లు ఆడిన రెండో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఇంతకముందు పాకిస్తాన్ మాత్రమే ఈ మార్క్ను దాటింది. ఓవరాల్గా పాకిస్తాన్ 223 టి20 మ్యాచ్లు ఆడింది. దీంతో తొలి టి20 మొదలవ్వగానే ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఈ రికార్డును అందుకోనుండడం విశేషం. కాగా ఇప్పటివరకు 199 టి20 మ్యాచ్లాడిన టీమిండియా 127 విజయాలు, 63 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Ishan- Gill: వెటరన్ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- గిల్! -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు.. ఏకంగా..
West Indies vs India, 3rd ODI- Shubman Gill World Record: వెస్టిండీస్తో టెస్టుల్లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్.. వన్డే సిరీస్ను మాత్రం ఘనంగా ముగించాడు. ఏరికోరి టెస్టు సిరీస్లో వన్డౌన్లో వచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 6, 10, 29(నాటౌట్) పరుగులు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్నూ సింగిల్ డిజిట్ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్పై విమర్శలు కొనసాగాయి. తీవ్ర ఒత్తిడిలోనూ.. ఇక, రెండో వన్డేలో 34 పరుగులు సాధించినప్పటికీ జట్టు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన గిల్ మళ్లీ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడితో కూరుకున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో మాత్రం శుబ్మన్ గిల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు బ్రియన్ లారా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో అతడు 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అద్భుత ఇన్నింగ్స్తో సరికొత్త రికార్డు సృష్టించాడు. మొన్న బాబర్ను దాటేసి సెంచరీ మిస్ అయినా.. పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 27 వన్డే ఇన్నింగ్స్లో సగటు 62.48తో 1437 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక గత మ్యాచ్లో 1352 పరుగుల వద్ద ఉన్న గిల్.. బాబర్ ఆజం(1322)ను అధిగమించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వన్డేల్లో 27 వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించింది వీళ్లే! 1.శుబ్మన్ గిల్- 1437 2.ఇమాన్ ఉల్ హక్- 1381 3.రాసీ వాన్ డెర్ డసెన్- 1353 4.రియాన్ టెన్ డొషాటే- 1353 5. జొనాథన్ ట్రాట్- 1342. చదవండి: విండీస్ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా.. ఓడిపోతే ఏం జరిగేదో తెలుసు! అందుకే రోహిత్, కోహ్లిలను కాదని ఇలా: హార్దిక్ మొన్న వాటర్బాయ్! ఇప్పుడు ఇలా.. ఏంటిది కోహ్లి! వీడియో వైరల్ Well played. Deserved a 💯@ShubmanGill . .#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/KPWdZjFQt6 — FanCode (@FanCode) August 1, 2023 -
చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు
పాక్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఏడు టెస్ట్ల్లో కనీసం ఓ హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 27 ఏళ్ల షకీల్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 7 టెస్ట్ మ్యాచ్ల్లో 13 ఇన్నింగ్స్ల్లో 87.5 సగటున ఓ అజేయమైన డబుల్ సెంచరీ, అజేయమైన సెంచరీ, 5 హాఫ్ సెంచరీల (ఓ అజేయమైన హాఫ్ సెంచరీ) సాయంతో 875 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో షకీల్ వరుసగా (37 & 76), (63 & 94), (23 & 53), (22 & 55 నాటౌట్), (125 నాటౌట్ & 32), (208 నాటౌట్ & 30), 57 స్కోర్లు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు.. తన తొలి 7 టెస్ట్ల్లో ఈ ఘనత సాధించింది లేదు. కాగా, శ్రీలంక పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ నెగ్గి 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న పాక్.. లంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ పట్టు బిగించింది. నాలుగో రోజు ఆటలో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ను 576/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అబ్దుల్లా షఫీక్ (201) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అఘా సల్మాన్ (132) అజేయ శతకంతో మెరిశాడు. షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57), మహ్మద్ రిజ్వాన్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 410 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంక.. 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. నిషాన్ మధుష్క (33), దిముత్ కరుణరత్నే (41) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (12), ఏంజెలో మాథ్యూస్ (4) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28 తేదీలు) మిగిలి ఉంది. పాక్కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తే 2 మ్యాచ్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. -
అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..
వయసులో అతను వృద్ధుడే కానీ బాడీ పరంగా ఉక్కులాంటి దేహం. యువ బాడీబిల్డర్లకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతని సొంతం. తొమ్మిది పదుల వయసులో ఓ వీల్చైర్కే పరిమితమై.. మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. అతను మాత్రం చాలా యాక్టివిగ్ అచ్చం యువకుడిలో ఉండే నూతనోత్సహాం అతనిలో ఉంది. ఇంతకీ అతను ఎవరూ? ఆ వయసులో కూడా అంత చురుగ్గా ఎలా ఉన్నాడంటే.. జిమ్ అరింగ్టన్ అనే వ్యక్తి ఓ బాడీ బిల్డర్. అతను వయసులో ఉన్నపుడే ఎలాంటి బాడీని మెయింటేన్ చేశాడో అలానే వృద్ధాప్యంలో కూడా మెయింటేన్ చేసి అబ్బురపర్చాడు. 90ల వయసులో కూడా బాడీ బిల్డర్ మాదిరి తన కండలు, బాడీ తీరు మారకపోవడవం విశేషం. క్రమం తప్పకుండా చేసే జిమ్, తీసుకునే ఫుడ్ డైట్ కారణంగా అతను అలా బాడీని కంటిన్యూ చేయగలిగాడు. దీంతో అతను అత్యంత వృద్ధ బాడీ బిల్డర్గా రికార్డు నెలకొల్పోడు. తనకు చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ మీద మక్కువ ఉండేదని, ఇదే తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకునేలా చేసిందని ఆనందంగా చెబుతున్నడు అరింగ్టన్. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అతని హెల్త్ సీక్రెట్కి సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేసింది. అందులో తన ఆరోగ్య రహస్యం, బాడీని అలా మెయింటైన్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిట్కాలను పంచుకున్నాడు అరింగ్టన్. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ వయసులో కూడా బాడీని ఫిట్గా ఉంచి అందరికి స్ఫూర్తిగా నిలిచారంటూ అరింగ్టన్పై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి) -
ఓర్నీ!.. ఏం రికార్డ్..రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!
ఇంతవరకు ఎన్నో రికార్డులు గురించి విని ఉంటారు. చాలాచాలా వింతవింత రికార్డులను కూడా చూశాం. కానీ ఏడుస్తూ రికార్డు చేయొచ్చు అని మీకు తెలుసా!. అసలు ఇలాంటి వింత ఆలోచన.. కూడా చేస్తారా అనిపిస్తోంది కదా!. ఔను ఓ వ్యక్తి ఇలాంటి వెరైటీ రికార్డును నెలకొల్పాలనుకున్నాడు. వినూత్న రీతిలో ప్రపంచ రికార్డును సృష్టించాలని చాలా గట్టిగా నిశ్చయించకున్నాడు. అందుకోసం నాన్స్టాప్గా ఏడవలనే ఒక విచిత్రమైన టాస్క్ తీసుకున్నాడు. చివరికి రికార్డు సాధించాడో లేదో తెలియదు గానీ అతనికి లేనిపోని శారీరక కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళ్తే..నైజీరియన్కి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్స్టాప్గా ఏడవం అనే ఫీట్ని ఎన్నుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్స్టాప్ ఏడ్చాడు. దీంతో అతడను 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అంతలా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐతే అనతు గిన్నిస్ వరల్ఢ్ రికార్డుకి దరఖాస్తు చేయలేదు కాబట్టి అతడు చేసిన ఫీట్ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి క్రేజీ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. ఎందకంటే గతంలో ఇలానే ఓ మహిళ 100 గంటల పాలు వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
సెంచరీలతో చెలరేగిన ఆఫ్గన్ ఓపెనర్లు.. ప్రపంచ రికార్డు
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్(125 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సర్లు), ఇబ్రహీం జర్దన్(119 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరి ధాటికి అఫ్గానిస్తాన్ 400 పరుగులు దాటుతుందని అనిపించింది. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్ కావడం.. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వీరి తర్వాత మహ్మద్ నబీ చివర్లో 15 బంతుల్లో 25 పరుగులు నాటౌట్గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ ముహ్మద్, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్లు తలా రెండు వికెట్లు తీయగా.. ఎబాదత్ హొసెన్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటింగ్లో తడబడుతోంది. ప్రస్తుతం 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఇక అఫ్గానిస్తాన్ ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడమే కాకుండా ప్రపంచ రికార్డుతో మెరిశారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్లు తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 256 పరుగులు జోడించారు. అఫ్గాన్ వన్డే చరిత్రలో ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2010లో స్కాట్లాండ్పై కరీమ్ సాదిక్, మహ్మద్ షెహజాద్లు రెండో వికెట్కు 218* పరుగులు జోడించి రెండో స్థానంలో ఉన్నారు.2010లోనే షార్జా వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్లో మహ్మద్ షెహజాద్, నూర్ అలీ జర్దన్లు రెండో వికెట్కు 205 పరుగులు జోడించి మూడో స్థానంలో ఉన్నారు. ► ఇక ఓవరాల్గా అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో పరిశీలిస్తే 256 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యధికంగా ఉంది. ఇక మొదటి స్థానంలో అస్గర్ అప్గన్, హస్మతుల్లా షాహిది జోడి ఉంది. ఈ జోడి 2021లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో నాలుగో వికెట్కు 307 పరుగులు జోడించారు. ► ఇక వన్డే క్రికెట్లో బంగ్లాదేశ్పై ఏ జట్టుకైనా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2022లో టీమిండియా నుంచి కోహ్లి, ఇషాన్ కిషన్ల జోడి రెండో వికెట్కు 290 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. The moment @RGurbaz_21 reached his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/0AmNoEtGol — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 When @IZadran18 brought up his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/Lv1eV610cg — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 చదవండి: విలన్గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా?
ఫ్రాన్స్: ఒక విచిత్రమైన పోటీలో పాల్గొని ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే స్టంట్ మ్యాన్. ఆక్సిజన్ తీసుకునే అవకాశం లేకుండా ఒంటికి నిప్పంటించుకుని 100 మీటర్ల పరుగు పందాన్ని 17 సెకండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డుతో పాటు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే 39 ఏళ్ల స్టంట్ మాస్టర్ కు చిన్నప్పటి నుండి స్టంట్స్ అంటే చాలా ఇష్టమట. అందులోనూ నిప్పుతో చెలగాటమాడటం అంటే అతడికి మహా సరదా. నిప్పును నోట్లో వేసుకుని విన్యాసాలు చేయడం వంటి ఎన్నో సాహసాలు చేయడం అతడికి అలవాటు. అందులో భాగంగానే ఒళ్ళంతా నిప్పు అంటించుకుని కాలుతూ పరిగెత్తడంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మంటల్లో మండుతూ 272.25 మీటర్లు పరిగెత్తి కాలుతూ ఆక్సిజన్ తీసుకోకుండా ఎక్కువ దూరం పరిగెత్తిన రికార్డుతో పాటు 17 సెకండ్లలో 100 మీటర్లు పూర్తి చేసి పాత రికార్డును చెరిపేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కేవలం ప్రపంచ రికార్డు మాత్రమే కాదు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు జోనథన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ స్వయంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులే వీడియోతో సహా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు దక్కాయి. నెటిజన్లు ఈ వీడియోకు ఇలాంటి చెత్త రికార్డులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. New record: The fastest full body burn 100 m sprint without oxygen - 17 seconds by Jonathan Vero (France) Jonathan also set the record for the farthest distance ran in full body burn during this attempt at 272.25 metres! 🔥 pic.twitter.com/J0QJsPNkPf — Guinness World Records (@GWR) June 29, 2023 ఇది కూడా చదవండి: ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..? -
అదరహో..! ఐదు రోజుల పాటు నిర్విరామంగా బాలిక డ్యాన్స్.. గిన్నీస్ రికార్డ్..
మహారాష్ట్ర: మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక అరుదైన ఘనత సాధించింది. నిరంతరాయంగా 127 గంటలపాటు డ్యాన్స్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. డ్యాన్స్ మారథాన్లో ఐదు రోజులపాటు నిర్విరామంగా క్లాసికల్ కథక్ నృత్యం చేసింది. మే 29 నుంచి జూన్ 3 వరకు ఈ మారథాన్లో పాల్గొని ఇప్పటివరకు ఉన్న 126 గంటల రికార్డ్ను అధిగమించింది. సృష్టి సుధీప్ జగతాప్(16) లాతూర్కు చెందిన బాలిక. నృత్యంలో మంచి ప్రతిభను చూపించింది. ఏదైనా గొప్పగా సాధించాలనే తన కలను నెరవేర్చుకుంది. నిర్విరామంగా ఐదు రోజుల పాటు క్లాసికల్ కథక్ నృత్యం చేసి గిన్నిస్ రికార్డును సాధించింది. అయితే.. ఈ అంశంలో ఇప్పటివరకు నేపాలీ డ్యాన్సర్ బందన 2018లోనే 126 గంటలపాటు నృత్యం చేసింది. ఆ రికార్డును ఇప్పుడు సుధీప్ జగతాప్ అధిగమించింది. అయితే.. ఈ డ్యాన్స్లో కేవలం ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సుధీప్ కేవలం రాత్రిళ్లు మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకుని నృత్యం చేసింది. సుధీప్ ఎల్లప్పుడూ తన కాళ్లలో కదలికలను ఆపలేదని నిర్వహకులు తెలిపారు. తన తల్లిదండ్రులు ఎల్లప్పుడు తన పక్కనే ఉన్నారని సుధీప్ జగతాప్ చెబుతోంది.రాత్రిళ్లు నిద్ర రాకుండా ముఖంపై నీళ్లు చల్లేవారని తెలిపింది. చివరి గంటవరకు తన శరీరం కదలలేని పరిస్థితికి చేరినప్పటికీ లక్ష్యం మీదే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. తాతయ్యతో పాటు యోగా తరగతులకు వెళ్లి యోగ నిద్ర సాధన చేశానని తెలిపింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచ వేదికకు తీసుకువెళ్లడమే ధ్యేయమని అంటోంది. ఇదీ చదవండి:Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు! -
ఆఫ్గన్తో ఏకైక టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొసెన్ షాంటో చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన షాంటో 175 బంతుల్లో 146 పరుగులు చేశాడు.. తాజాగా రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 115 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న షాంటో ఇన్నింగ్స్లో 14 ఫోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. బంగ్లాదేశ్ తరపున ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీలు బాదిన రెండో క్రికెటర్గా నిలిచాడు. ఇంతకముందు మోమినుల్ హక్ 2018లో శ్రీలంకతో చిట్టగాంగ్ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 176, రెండో ఇన్నింగ్స్లో 105 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో అఫ్గానిస్తాన్ జట్టుపై ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాదిన తొలి క్రికెటర్గా షాంటో నిలిచాడు. ఇక ఓవరాల్ టెస్టు క్రికెట్ జాబితాలో నజ్ముల్ హొసెన్ షాంటో 91వ క్రికెటర్గా నిలిచాడు. ఇక టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్గన్ను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లా మూడోరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. షాంటో 112, మోమినుల్ హక్ 43 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 491 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు మిగిలి ఉండడంతో బంగ్లాదేశ్ భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్ను ఊదేశారు
కౌంటీ క్రికెట్ క్లబ్ సర్రే జట్టు చరిత్ర సృష్టించింది. కౌంటీ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్ను(501 పరుగలు)చేధించిన సర్రే జట్టు ఔరా అనిపించింది. కౌంటీల్లో 1925 తర్వాత ఒక జట్టు 500కు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఇది రెండోసారి. ఇంతకముందు ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా నాట్స్తో జరిగిన మ్యాచ్లో మిడిలెసెక్స్ 502 పరుగుల టార్గెట్ను చేధించింది. అప్పట్లో పాస్టీ హెండ్రెన్ 206 పరగులు నాటౌట్గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మళ్లీ 98 ఏళ్ల తర్వాత 500 పరుగుల టార్గెట్ను అందుకున్న జట్టుగా సర్రే చరిత్రకెక్కింది. విషయంలోకి వెళితే.. కెంట్ విధించిన 501 పరుగుల భారీ టార్గెట్ను సర్రే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐదోరోజు ఆట మొదలయ్యే సమయానికి సర్రే విజయానికి 238 పరుగులు అవసరం కాగా.. కెంట్కు ఏడు వికెట్లు కావాలి. జేమీ స్మిత్ 77 బంత్లులో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో డామ్ సిబ్లే, బెన్ ఫోక్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బెన్ ఫోక్స్(211 బంతుల్లో 124 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ కాగా.. రెండురోజులు ఎంతో ఓపికతో ఆడిన డోమ్ సిబ్లే(511 నిమిషాల పాటు) 415 బంతుల్లో 140 పరుగులు నాటౌట్ అసమాన ఇన్నింగ్స్ ఆడి సర్రేకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. చివర్లో జోర్డాన్ క్లాక్ 26 నాటౌట్ అతనికి సహకరించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. What an effort by Dom Sibley 👏 Sibs finishes 140 not out after batting for 146.1 overs 🤩 So good to have you home 🏡 🤎 | #SurreyCricket https://t.co/iJKxxiQJOt pic.twitter.com/5Wn4Fa7okE — Surrey Cricket (@surreycricket) June 14, 2023 An incredible day 📷 🤎 | #SurreyCricket pic.twitter.com/jYWh9ho31l — Surrey Cricket (@surreycricket) June 14, 2023 చదవండి: రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు?.. గూగుల్ AI ఊహించని పేర్లు -
వంటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ..ఏకంగా వంద గంటల పాటు..
ఇంతవరకు ఎన్నో రకాలు వరల్డ్ రికార్డులను చూశాం. విభిన్నంగా ఉండటం లేదా ఎవరూ చేయలేని సాహసానికి యత్నించడం వంటివి చూశాం. వాటన్నింటికంటే ఇంకాస్త విభిన్నంగా ఓ మహిళ వంటలతో కూడా రికార్డు సృష్టించొచ్చని నిరూపించింది. పైగా ఇంతకమునుపు అదే ఫీట్ని చేసిన మహిళ వరల్ఢ్ రికార్డుని సైతం బ్రేక్ చేసి ఔరా! అనినిపించుకుంది. వివరాల్లోకెళ్తే..నైజీరియాకి చెందిన చెఫ్ హిల్డా బాసి నాన్స్టాప్గా వంటలు చేస్తూ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆమె గత గురువారం నుంచి నాన్స్టాప్గా వంటలు చేస్తూ గతంలో భారతీయ చెఫ్ లతా టాండన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. గతంలో లతా సుమారు 87 గంటల 45 నిమిషాల పాటు వంట చేసి రికార్డు సృష్టిస్తే..హిల్డా సుమారు 100 గంటల పాటు నాన్స్టాప్గా వంటలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉండగా, గిన్నిస్ వరల్డ్ రికార్డు సదరు చెఫ్ హిల్డా బేక్ చేసిన రికార్డు గురించి తెలిసిందని, ఐతే ఆ రికార్డును అధికారికంగా ధృవీకరించే ముందు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో సదరు నైజీరియన్ చెఫ్ హిల్డా మాట్లాడుతూ..నైజీరియన్ యువత ఎంతలా కష్టపడి పనిచేస్తారో ప్రపంచానికి తెలియజేప్పేందుకు ఇలా చేశానని చెప్పుకొచ్చింది. సమాజానికి దూరంగా ఉంటున్న ఆఫ్రికన్ యువతులు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె.. మీరు ఏ పనిచేయాలనుకుంటున్నా.. దాన్ని సీరియస్గా తీసుకుని అందరికంటే మెరుగ్గా చేయలన్నారు. అందుకోసం అదనపు మైళ్లు దాటి రావల్సిందేననిఝ(కష్టాలను అధిగమించి) నైజీరియన్ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు. అంతేగాదు నైజీరియన్ వంటకాలు గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా హిల్డా తన వంటకాల్లో సూప్ దగ్గర నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని ప్రసిద్ధ వంటకాలన్ని హిల్డా తయారు చేసింది. అంతేగాదు ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున విరామం తీసుకుంటూ..తన వ్యక్తిగత విషయాల కోసం 12 గంటల కొకసారి ఒక గంట చొప్పున తీసుకుని ఈ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ నైజీరియాకు ఈ రోజు చాలా గొప్ప రోజు అంటూ హిల్డాను ప్రశంసించాడు. ఆమె ఆశయం చాలా గొప్పదని అభినందించాడు. నైజీరియన్ వంటకాలు తోపాటు ఇక్కడి వ్యక్తులు గురించి తెలుసుకునేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా వంద గంటల పాటు చేయడమనేది అసామాన్య విషయమని అన్నాడు. ఆ మహిళ ఇక్కడ శక్తి చాలా ఎక్కువ ఉందని అనుమానించాల్సిన పని లేదని బల్లగుద్దినట్లు చెప్పింది అంటూ ట్విట్టర్లో హిల్డాని ప్రశంసలతో ముంచెత్తారు అధ్యక్షుడు బుహారీ. View this post on Instagram A post shared by Hilda Baci (@hildabaci) (చదవండి: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం) -
పరుగులే కాదు క్యాచ్ల విషయంలోనూ రికార్డులే
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి బ్యాటింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఆదివారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో జైశ్వాల్ క్యాచ్ అందుకోవడం ద్వారా ఐపీఎల్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న ఫీల్డర్గా(నాన్-వికెట్కీపర్) కోహ్లి రెండోస్థానానికి ఎగబాకాడు. ఈ నేపథ్యంలో కీరన్ పొలార్డ్ 103 క్యాచ్ల రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ప్రస్తుతం కోహ్లి 104 క్యాచ్లతో రెండో స్థానంలో ఉండగా.. 109 క్యాచ్లతో సురేశ్ రైనా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఘోర ప్రదర్శన చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 59 పరుగులకే కుప్పకూలింది. వేన్ పార్నెల్ మూడు వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, బ్రాస్వెల్ తలా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, మ్యాక్స్వెల్లు చెరొక వికెట్ తీశారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. కేకేఆర్తో జరిగిన గత మ్యాచ్లో యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్లు చెలరేగి ఆడడంతో భారీ విజయం దక్కించుకున్న అదే రాజస్తాన్ తాజాగా ఆర్సీబీతో మాత్రం ఘోర ఓటమి చవిచూసింది. చదవండి: #AnujRawat: తొలిసారి తన పాత్రకు న్యాయం చేశాడు -
ఒక్క ఓవర్లో 46 పరుగులు.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
క్రికెట్లో ఒక్క ఓవర్లో సాధారణంగా అత్యధికంగా ఎన్నిపరుగులు వస్తాయంటే టక్కున వచ్చే సమాధానం 36. అది కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదితే ఈ ఫీట్ నమోదవుతుంది. ఒకవేళ మరో నోబాల్.. లేదా వైడ్ వెళితే కొన్ని పరుగులు జత అవుతాయి. అది కూడా అరుదుగా జరుగుతుంది. అందుకే 36 పరుగులే ఇప్పటివరకు చాలాసార్లు అత్యధికంగా ఉంది. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు వచ్చాయంటే మీరు నమ్ముతారా.. అంత లేదు అని తేల్చేస్తాం. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు బాదిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఊహించుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అరుదైన దృశ్యం.. కువైట్ వేదికగా జరిగిన కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టి20 ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో ఇది జరిగింది. ఎన్సీఎమ్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టాలీ సీసీ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ అద్బుతం ఆవిష్కృతమైంది. ఎన్సీఎమ్ బ్యాటర్ వాసు.. టాలీ సీసీ బౌలర్ హర్మన్ ఓవర్ను చితకబాది 46 పరుగులు రాబట్టాడు. తొలి బంతిని నోబాల్ వేయగా సిక్సర్ బాదాడు. దీంతో ఏడు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఫ్రీహిట్కు నాలుగు పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. ఒక్క బంతి కరెక్ట్ వేయగా 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఐదు బంతులను ఐదు సిక్సర్లు కొట్టగా ఇందులో ఒక నోబ్ సహా మొత్తం 31 పరుగులు వచ్చాయి. దీంతో ఐదు బంతుల్లో స్కోరు 42గా మారింది. ఇక ఆఖరి బంతిని బౌండరీ రావడంతో అలా ఆరు బంతుల్లో 46 పరుగులు వచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 46 పరుగులు రావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వన్డేల్లో 36.. టెస్టుల్లో 35.. టి30ల్లో 36.. ఐపీఎల్లో 37.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు వన్డేల్లో ఒక్క ఓవర్లో 36 పరుగులు అత్యధికంగా ఉంది. 2006లో సౌతాఫ్రికా ఓపెనర్ గిబ్స్ నెదర్లాండ్స్పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. 2021లో అమెరికా బ్యాటర్ జస్కరన్ మల్హోత్రా పపువా న్యూ గినియాపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక టెస్టుల్లో 2022లో ఇంగ్లండ్పై టీమిండియా బౌలర్ బుమ్రా కొట్టిన 35 పరుగులు ఇప్పటివరకు ఒక్క ఓవర్లో అత్యధికంగా ఉంది. ఇక టి20ల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు రెండుసార్లు నమోదయ్యాయి. తొలిసారి 2007లో యువరాజ్ ఇంగ్లండ్పై 36 పరుగులు(ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు), 2021లో విండీస్ హిట్టర్ పొలార్డ్ శ్రీలంకపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక ఐపీఎల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు 37గా ఉంది. తొలిసారి 2011లో ఆర్సీబీతో మ్యాచ్లో కొచ్చి టస్కర్స్ బౌలర్ పి. పరమేశ్వరన్ ఒక్క ఓవర్లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 2021లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సీఎస్కేతో మ్యాచ్లో ఒక్క ఓవర్లో 37 పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం. Getting 46 runs in an over is not possible right? Right? Wrong! Watch this absolute bonkers over now. . .#KCCT20 pic.twitter.com/PFRRivh0Ae — FanCode (@FanCode) May 3, 2023 చదవండి: గమనించారా.. మ్యాచ్తో పాటు పాత పగను కూడా! -
కోహ్లి అరుదైన ఫీట్.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడిగా
ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సాధించాడు. గురువారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో డుప్లెసిస్తో కలిసి ఓపెనింగ్ వచ్చాడు. ఆరంభం నుంచి డుప్లెసిస్కు స్ట్రైక్ ఇస్తూ తాను కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రాహుల్ చహర్ బౌలింగ్లో మూడో బంతికి రెండు పరుగులు చేయడం ద్వారా 30 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే కోహ్లి ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో '30 ప్లస్' స్కోరు చేయడం కోహ్లికి ఇది వందోసారి. ఐపీఎల్లో వంద '30 ప్లస్' స్కోర్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కాడు. ఇక పంజాబ్తో మ్యాచ్కు కోహ్లి స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మ్యాచ్కు అందుబాటులో ఉన్నప్పటికి కోహ్లి తానే ఈ మ్యాచ్కు కెప్టెన్గా చేస్తున్నట్లు టాస్ సమయంలో తెలిపాడు. ''డుప్లెసిస్ ఈరోజు మ్యాచ్లో ఫీల్డింగ్కు రాడు.. మొదట బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి డుప్లెసిస్ నాతో కలిసి బ్యాటింగ్కు వస్తాడు. బౌలింగ్ సమయంలో మాత్రం డుప్లెసిస్ స్థానంలో వైశాక్ విజయ్కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్గా రానున్నాడు.'' అంటూ తెలిపాడు. Virat Kohli becomes the first player in IPL history to complete hundred "30+ score". The Man, The Myth, The Legend - King Kohli. pic.twitter.com/3a0h8DtD2K — Johns. (@CricCrazyJohns) April 20, 2023 చదవండి: ఇది విన్నారా.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి! -
Antalya: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
అంటాల్యా (తుర్కియే): భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్లో శుభారంభం చేసింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో ఆమె క్వాలిఫయింగ్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ మొత్తం 713 పాయింట్లు స్కోరు చేసింది. 2015లో సారా లోపెజ్ (కొలంబియా) 713 పాయింట్లతో నమోదు చేసిన ప్రపంచ రికార్డును సురేఖ సమం చేసింది. అంతేకాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 2017లో కొరియా ఆర్చర్ 709 పాయింట్లతో నమోదు చేసిన రికార్డును సురేఖ సవరించింది. క్వాలిఫయింగ్లో ఒక్కో ఆర్చర్ 72 బాణాలు సంధించాలి. తొలి రౌండ్లో 36, రెండో రౌండ్లో మరో 36 బాణాలు సంధిస్తారు. తొలి రౌండ్లో జ్యోతి సురేఖ 353 పాయింట్లు... రెండో రౌండ్లో 360 పాయింట్లు సాధించింది. రెండో రౌండ్లో జ్యోతి సురేఖ కొట్టిన 36 బాణాలు 10 పాయింట్ల సర్కిల్లోకి వెళ్లడం విశేషం. దాంతో ఆమె అందుబాటులో ఉన్న మొత్తం 360 పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో జ్యోతి సురేఖ 360కి 360 పాయింట్లు స్కోరు చేసిన తొలి మహిళా ఆర్చర్గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనతో 2015 నుంచి సారా లోపెజ్ (356 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. ‘ప్రపంచ రికార్డు సాధిస్తానని ఊహించలేదు. ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. టాప్ సీడ్తో మెయిన్ రౌండ్లో బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉంది. ఎలిమినేషన్ రౌండ్లలోనూ పూర్తి ఏకాగ్రతతో పోటీపడతాను’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. క్వాలిఫయింగ్లో టాప్ ర్యాంక్లో నిలిచిన సురేఖకు ఎలిమినేషన్ రౌండ్లలో టాప్ సీడ్ దక్కింది. భారత్కే చెందిన అదితి, అవ్నీత్ కౌర్ స్కోర్ల ఆధారంగా క్వాలిఫయింగ్ టీమ్ విభాగంలో భారత్ 2,112 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని నేరుగా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ఆడుతున్న సురేఖ అంతర్జాతీయ టోర్నీలలో 30 కంటే ఎక్కువ పతకాలు సాధించింది. -
ప్రపంచ రికార్డు: 50 ఏళ్ల వయసు, 500 రోజులు ఒక్కత్తే.. గుహలో...
స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రస్ ఒక ఆరోగ్య ప్రయోగంలో భాగంగా 500 రోజులు గుహలో ఒక్కత్తే గడిపి మొన్న (శుక్రవారం) బయటకు వచ్చింది. బయట నుంచి మాత్రమే నిపుణుల పర్యవేక్షణ ఉన్నా 260 అడుగుల లోతు గుహలో అదరక బెదరక జీవించింది. ఎక్కువ రోజులు గుహలో ఒంటరిగా జీవించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బీట్రస్ కథా కమామీషు... ‘లోపలకు వెళ్లాక రెండు నెలల వరకూ లెక్క బెట్టాను. ఆ తర్వాత రోజుల్ని లెక్క బెట్టుకోవడం మానేశాను. సహాయక బృందం లోపలికి వచ్చి నన్ను బయటకు తెచ్చే వరకు ఏ 160 రోజులో ఉన్నాననుకున్నాను. కాని 500 రోజులు ఉన్నాను. కాలం ఇట్టే గడిచిపోయింది’ అంది బీట్రస్ ఫ్లెమినీ. తన 48వ ఏట నవంబర్ 21, 2021 తేదీన స్పెయిన్లోని గ్రనాడా పట్టణం సమీపంలో ఉన్న ఒక గుహలోకి బీట్రస్ అడుగుపెట్టింది. మళ్లీ 50వ ఏట ఏప్రిల్ 14, 2023న బయటకు వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం గుహలో ఒక్కత్తే గడిపింది. ‘ఈ కాలంలో బయట ఏం జరిగిందో నాకు తెలియదు’ అందామె. గ్రనడా యూనివర్సిటీ, అల్మేరియా యూనివర్సిటీలోని శాస్త్ర నిపుణులు గుహలలో, పర్వతారోహణలో ఒక్కరిగా చిక్కుకుపోయినప్పుడు మనిషి ‘సర్కేడియన్ రిథమ్’ (వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీర, మానసిక స్థితుల్లో 24 గంటల్లో వచ్చే మార్పు) అధ్యయనం చేయడానికి బీట్రస్ను గుహలోకి పంపారు. క్యాలెండర్, గడియారం ఏమీ ఇవ్వలేదు. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీరు, స్టవ్, ఆమె కదలికలను బయటి నుంచి గమనించడానికి సెన్సర్స్ను తీసుకొని ఆమె లోపలికి వెళ్లింది. ‘నేను నాతో మాట్లాడుకుంటూ గడిపాను, వ్యాయామం, టోపీలు అల్లడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం... వీటితో టైమ్ సరిపోయింది. ఒక్కోసారి భ్రాంతి కలిగేది’ అని తెలిపింది. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్ను శాస్త్రజ్ఞులు ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు. Athlete Beatriz Flamini spent almost two years alone in an underground cave. And she makes it sound pretty relaxing... Follow us on Gab: https://t.co/IuhLFQBQPc pic.twitter.com/e7nlKR9Kyc — RT (@RT_com) April 15, 2023 -
అరుదైన ఫీట్.. అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్కడిగా
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్లో ఇంతవరకు ఎవరికి సాధ్యం కాని అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ వరకు అన్ని స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన ఒకే ఒక్కడిగా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటికైతే ఈ రికార్డు యూనిక్గా మిగిలిపోనుంది. తాజాగా బుధవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అశ్విన్ ఓపెనర్గా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే రాజస్తాన్ చేసిన ఈ ప్రయోగం బెడిసికొట్టింది. ఎందుకంటే అశ్విన్ అర్ష్దీప్ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. రాజస్తాన్ ప్రయోగం వికటించినప్పటికి అశ్విన్ మాత్రం చరిత్రకెక్కాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఓపెనర్గా ఒకసారి వచ్చిన అశ్విన్.. నెంబర్-3లో నాలుగుసార్లు, నెంబర్-4లో ఒకసారి, నెంబర్-5లో రెండుసార్లు, నెంబర్-6లో ఐదుసార్లు, నెంబర్-7లో 16 సార్లు, నెంబర్-8లో అత్యధికంగా 32 సార్లు, నెంబర్-9లో 11 సార్లు, ఇక చివరగా పదో స్థానంలో నాలుగుసార్లు బ్యాటింగ్కు వచ్చాడు. మొత్తానికి బ్యాటింగ్లో 76 ఇన్నింగ్స్లు ఆడి 648 పరుగులు సాధించాడు. -
చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం
అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో సరికొత్త శకం మొదలైంది. తొలిసారి ఒక మెన్స్ అంతర్జాతీయ టి20 మ్యాచ్లో ఒక మహిళ ఫీల్డ్ అంపైర్గా విధులు నిర్వర్తించి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్కు చెందిన మహిళా అంపైర్ కిమ్ కాటన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టి20లో కిమ్ కాటన్.. మరో అంపైర్ వేన్ నైట్స్తో కలిసి ఫీల్డ్ అంపైరింగ్ చేసింది. అయితే కిమ్ కాటన్ గతంలో న్యూజిలాండ్, భారత్ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్కు థర్డ్ అంపైర్ పాత్ర పోషించింది. తాజాగా మాత్రం పురుషుల క్రికెట్లో తొలిసారి ఫీల్డ్ అంపైరింగ్ చేసిన కిమ్ కాటన్ తన పేరును క్రికెట్ పుస్తకాల్లో లిఖించుకుంది. కాగా మహిళా అంపైర్గా కిమ్ కాటన్ పేరిట చాలా రికార్డులున్నాయి. 2020లో మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ వుమెన్స్ టి20 వరల్డ్కప్ ఫైనల్కు ఫీల్డ్ అంపైర్గా వ్యవహరించిన తొలి మహిళా అంపైర్గా కిమ్ కాటన్ నిలిచింది. అంతేకాదు మూడు మహిళల టి20 వరల్డ్కప్లతో పాటు వన్డే వరల్డ్కప్లోనూ అంపైర్గా పనిచేసింది. ఇక 2020, 2022, 2023 వరల్డ్కప్ ఫైనల్స్లో ఫీల్డ్ అంపైర్గా బాధ్యతలు నిర్వహించి ఎవరికి దక్కని రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇక ఓవరాల్గా 2018 నుంచి కిమ్ కాటన్ 54 టి20 మ్యాచ్లతో పాటు 24 వన్డేల్లో అంపైర్గా విధులు నిర్వర్తించింది. ఇక రెండో టి20 విషయానికి వస్తే న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. History today for umpire Kim Cotton who becomes the first female umpire to stand in a men’s international match between two @ICC full member countries 🤝#NZvSL #CricketNation pic.twitter.com/EI8C1RJt4d — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 చదవండి: NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే -
ఓ బాలుడి సాహసం..మూడేళ్లుగా టెంట్లోనే నిద్రపోయి..
ఓ యువకుడు క్యాపంగ్ ద్వారా అత్యధిక డబ్బులు సేకరించిన వ్యక్తిగి రికార్డు సృష్టించాడు. ది బాయ్ ఇన్ ది టెన్త్గా పేరుగాంచి ఈ రికార్డు సాధించాడు. ఒక ఛారిటీ కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కూడ బెట్టిన తొలి వ్యక్తి ఆ టీనేజర్. వివరాల్లోకెళ్తే..యూకేకి చెందిన మాక్స్ వూసే అనే యువకుడు తమ పొరుగన ఉండే ఫ్యామిలీ స్నేహితుడిని క్యాన్సర్ వ్యాధి కారణంగా కోల్పోవడంతో..అలాంటి సమస్యను ఎదుర్కొనే వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే నార్త్ డెవాన్ ఛారిటీ కోసం మూడేళ్లుగా క్యాంపింగ్ నిర్వహించి అత్యధికంగా డబ్బును సేకరించాడు. ఇలా అతను సుమారు రూ. 7.6 కోట్లను వసూలు చేశాడు. అందుకోసం పలుచోట్లకు టెంట్ తోసహా తిరిగేవాడు. అక్కడ క్యాంపింగ్ నిర్వహించి టెంట్లోనే నిద్రపోయేవాడు. అలా మూడేళ్లు అదే ధ్యాసలో గడిపాడు. దీంతో వూసే 'ది బాయ్ ఇన్ ది టెన్ట్'గా పేరుగాంచాడు. ఇలా వూసే తన ఫ్యామిలీ స్నేహితుడు రిక్ అబాట్ మరణించిన తర్వాత నుంచి అంటే.. వూసేకి 10 ఏళ్ల ప్రాయం నుంచి నిధుల సేకరణ ప్రారభించాడు. సరిగ్గా మార్చి 2020లో నిధుల సేకరించడం మొదలుపెట్టాడు. తన స్నేహితుడి రిక్కు వూసే కుటుంబం ఆర్థిక సాయం అందిచిన్పటికీ వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు. ఆస్పత్రి కూడా అతడు బతకాలని ఎంతగానో కోరింది గానీ సఫలం కాలేదు. ఆ ఘటన ఫ్యామిలీ స్నేహితుడిలాంటి వారి కోసం ఏదో చేయమన్నట్లు తన మనసుకు బలంగా అనిపించిందని చెబుతున్నాడు. ఐతే వూసే నిధుల సేకరణ మొదలు పెట్టే సమయంలోనే కరోనా, తుపానులు పెద్ద సవాళ్లుగా మారాయి. తీవ్రమైన గడ్డకట్టే మంచుకుని సైతం అధిగమించి ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఈ నిధులను సమకూర్చాడు. ఒకనొక సమయంలో తుపాను కారణంగా వూసే టెంట్ కూడా కూలిపోయింది. అయినా లెక్క చేయక మొక్కవోని దీక్షతో నిధులు సేకరించాడు. ఈ ప్రయాణంలో గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను, ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందాను అని చెబుతున్నాడు వూసే. ఇక ఏప్రిల్ 2023 నాటికి తన నిదుల సేకరణను ఆపేసి తనకెంతో ఇష్టమైన రగ్బీపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపాడు. ఇంత చిన్న వయసులో ఇంత నిబద్ధత, నిస్వార్థపూరితమైన అతని గొప్ప మనసుని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. చిన్నపిల్లలైనా వారు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయగలరు అని నిరూపించాడు వూసే. (చదవండి: వెల్లువలా ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు) -
రేర్ రికార్డ్ నెలకొల్పిన జయ జానకి నాయక
-
సాధించాడు.. టాప్-5లో భారత్ ఫుట్బాల్ స్టార్
ఫుట్బాల్లో భారత్ వెలుగులు లేకపోయినప్పటికి జట్టు స్టార్ ఆటగాడు..కెప్టెన్ సునీల్ ఛెత్రి మాత్రం వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్తో జరిగిన మ్యాచ్లో గోల్ కొట్టడం ద్వారా సునీల్ అంతర్జాతీయ కెరీర్లో 85వ గోల్ నమోదు చేశాడు. ఈ క్రమంలో హంగేరీకి చెందిన ఫెరెన్క్ ఫుకాస్(85 మ్యాచ్ల్లో 84 గోల్స్)ను అధిగమించి టాప్-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 133 మ్యాచ్లాడిన సునీల్ ఛెత్రి 85 గోల్స్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్ల్లో 109 గోల్స్), అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్ల్లో 109 గోల్స్) మూడో స్థానంలో, మొక్తర్ దహారి- మలేషియా(142 మ్యాచ్ల్లో 89 గోల్స్) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపూర్లో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 2–0 గోల్స్ తేడాతో కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సందేశ్ జింగాన్ (34వ ని.లో), సునీల్ చెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. సునీల్ చెత్రి కెరీర్లో ఇది 85వ గోల్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్పై తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 1–0తో విజయం సాధించింది. ....aaaaand that's #85 for Sunil Chhetri.pic.twitter.com/eUu6QHeUdE — Shyam Vasudevan (@JesuisShyam) March 28, 2023 📈 Most International Goals: 🇵🇹 Cristiano Ronaldo 𝟭𝟮𝟬 🇮🇷 Ali Daei 𝟭𝟬𝟵 🇦🇷 Lionel Messi 𝟵𝟵 🇲🇾 Mokhtar Dahari 𝟴𝟵 🇮🇳 Sunil Chhetri 𝟴𝟱 🇭🇺 Ferenc Puskás 𝟴𝟰 Sunil Chhetri becomes 5th all-time International Goalscorer. 🇮🇳🔥#IndianFootall #SC11 #BlueTigers pic.twitter.com/O1rU0ulunz — IFTWC - Indian Football (@IFTWC) March 28, 2023 చదవండి: అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్ -
రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్బాల్ తరంలో లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్ను మెస్సీ తనదైన శైలిలో గోల్గా మలిచాడు. దీంతో తన కెరీర్లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్స్ మార్క్ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్గా 800 గోల్స్తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం. Lionel Messi with an incredible free-kick 🇦🇷 We are witnessing greatness once again 🐐 pic.twitter.com/QBPUO7B9LY — SPORTbible (@sportbible) March 24, 2023 చదవండి: ఫుట్బాల్లో సంచలనం.. చారిత్రాత్మక గోల్ -
ఫుట్బాల్లో సంచలనం.. చారిత్రాత్మక గోల్
ఫుట్బాల్లో గోల్ కీపర్ పనేంటి అని చూసుకుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే గోల్స్ను అడ్డుకోవడం, ఆ తర్వాత బంతిని తన జట్టు ఆటగాళ్లకు పాస్ లేదా సర్వ్ చేయడం. అయితే ఫుట్బాల్ చరిత్రలో ఒక సంచలన గోల్ నమోదైంది. గోల్ కీపర్ సర్వ్ చేసిన బంతి నేరుగా ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్లోకి దూసుకెళ్లింది. దాదాపు 101 మీటర్ల దూరం అవతల ఉన్న గోల్పోస్ట్లోకి బంతి వెళ్లడంతో ఫుట్బాల్లో అత్యంత లాంగెస్ట్ గోల్గా రికార్డులకెక్కింది. ఈ అద్భుతమైన ఫీట్ కొబ్రెసల్, కొలో-కొలో మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది. ఆట 77వ నిమిషంలో అర్జెంటీనాకు చెందిన గోల్ కీపర్ లియాండ్రో రెక్వినా బంతిని పాస్ చేయాలనే ఉద్దేశంతో బంతిని కాస్త వేగంగా తన్నాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో ఎత్తులో వెళ్లిన బంతి పెనాల్టీ ఏరియాలో నిలబడిన కొలో-కొలో గోల్ కీపర్ బ్రయాన్ కోర్టస్ను దాటుకొని అతని తలపై నుంచి గోల్పోస్ట్లోకి వెళ్లింది. ఈ దెబ్బకు గోల్ కీపర్ సహా ప్రత్యర్థి ఆటగాళ్లకు దిమ్మతిరిగింది. చేసేదేం లేక గోల్ కీపర్ బ్రయాన్ దానిని గోల్గా ప్రకటించాడు. దీంతో కొబ్రెసల్ జట్టు 3-1 తేడాతో కొలో-కొలో జట్టుపై సంచలన విజయం సాధించింది. ఇంతకముందు 2021లో టామ్ కింగ్ అనే ఫుట్బాల్ ప్లేయర్ 96.1 మీటర్ల దూరం నుంచి నేరుగా గోల్పోస్ట్లోకి బంతిని పంపడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును గోల్ కీపర్ లియాండ్రో బద్దలుకొట్టాడు. ఈ అద్భుత విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ⚽⚪🟠 El primer gol arco a arco del #CampeonatoBetsson Así fue la anotación de Leandro Requena desde su propia puerta y que dejó a Brayan Cortés quieto, provocando el error del portero albo en el #CSLvsCCxTNTSports. pic.twitter.com/HDL2K22QnS — TNT Sports Chile (@TNTSportsCL) March 18, 2023 చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. -
43 ఏళ్ల వయసులో భారత టెన్నిస్ స్టార్ కొత్త చరిత్ర
భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం టైటిల్ను కొల్లగొట్టింది. ఈ జంట ఫైనల్లో కుహ్లోఫ్- స్కుప్సికిటో ద్వయంపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించింది. తద్వారా ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ను సాధించిన అతి పెద్ద వయస్కుడిగా(43 ఏళ్లు) రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో కెనడాకు చెందిన డానియెల్ నెస్టర్ రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. నెస్టర్ 42 ఏళ్ల వయసులో 2015 సిన్సినాటి మాస్టర్స్ టోర్నీని గెలుచుకున్నాడు. ఇక బోపన్న కెరీర్లో ఇది ఐదో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్. కాగా బోపన్న 2017 మాంటేకార్లో ఏటీపీ మాస్టర్స్ టైటిల్ తర్వాత మళ్లీ టోర్నీ విజేతగా నిలవడం ఇదే. మ్యాచ్ విషయానికి వస్తే బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడి.. కుహ్లోఫ్- స్కుప్సికిటో ద్వయంపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించారు. తొలి సెట్ను 6-3తో గెలిచినప్పటికి రెండో సెట్ను ప్రత్యర్థికి కోల్పోయారు. ఇక కీలకమైన మూడో సెట్లో బోపన్న జోడి ఫుంజుకొని 10-8 తేడాతో సెట్ను కైవసం చేసుకోవడంతో పాటు టైటిల్ను కొల్లగొట్టారు. Indian Wells CHAMPS! The moment 43-year-old @rohanbopanna & 35-year-old Matthew Ebden take the title in #TenisParadise 🌴 🏆 pic.twitter.com/9NEeF8MrYD — Tennis TV (@TennisTV) March 19, 2023 చదవండి: టెస్టు చరిత్రలో లంక తరపున అత్యంత చెత్త రికార్డు క్లబ్ మేనేజర్తో గొడవ.. పీఎస్జీని వీడనున్నాడా? -
అరుదైన ఫీట్తో చరిత్రకెక్కిన బంగ్లా కెప్టెన్
బంగ్లాదేశ్ కెప్టెన్.. ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వన్డేల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఏడువేల పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన మూడో క్రికెట్ర్గా రికార్డులకెక్కాడు. శనివారం ఐర్లాండ్తో మ్యాచ్లో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్ ఈ ఫీట్ అందుకున్నాడు. లంక దిగ్గజం సనత్ జయసూర్య, పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది తర్వాత ఆల్రౌండర్గా షకీబ్ వన్డేల్లో ఏడు వేల పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో షకీబ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 8146 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భాగంగా షకీబ్ వన్డేల్లో 300 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. రియాన్ అహ్మద్ వికెట్ ద్వారా ఈ ఫీట్ సాధించిన షకీబ్.. జయసూర్య, వెటోరి తర్వాత 300 వికెట్ల మార్క్ అందుకున్న మూడో లెఫ్టార్మ్ బౌలర్గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ తరపున వన్డేలు, టెస్టులు, టి20లు కలిపి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. షకీబ్ వన్డేల్లో 300 వికెట్లు, టెస్టుల్లో 231 వికెట్లు, టి20ల్లో 128 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ ఐర్లాండ్పై 183 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. షకీబ్ 93, తౌఫిర్ హృదోయ్ 92 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 155 పరుగులకే కుప్పకూలింది. Only the second batter to go past 7000 ODI runs for Bangladesh 👏 It's another landmark for Shakib Al Hasan 🏆 #BANvIRE #CricketTwitter pic.twitter.com/RT0XElPQCN — ESPNcricinfo (@ESPNcricinfo) March 18, 2023 చదవండి: బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం -
ఔరా.. ప్రపంచ రికార్డు కోసం బాలుడి స్కేటింగ్ యాత్ర
సాక్షి, తిరుపతి: ప్రపంచ రికార్డు కోసం ఎనిమిదేళ్ల బాలుడు స్కేటింగ్ యాత్ర చేస్తున్నాడు. ఏర్పేడుకు చెందిన వేదనరసింహ సోమవారం ఉదయం ఏర్పేడు నుంచి రోలర్ స్కేటింగ్ యాత్ర ప్రారంభించాడు. వెంకటగిరి, రాపూరు, పెంచలకోన, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, నెల్లూరు, గూడూరు మీదుగా మొత్తం 270 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. సోమవారం మధ్యాహ్నానికి కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చేరుకుంది. ఉయ్యాలపల్లి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వేదనరసింహకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలుడి కోచ్ ప్రతాప్ వివరాలు వెల్లడిస్తూ.. ఇప్పటి వరకు కర్ణాటకకు చెందిన వెన్సికసిరి అనే ఎనిమిదేళ్ల బాలిక 2022 ఫిబ్రవరిలో 250 కి.మీ. నాన్స్టాప్ సోలో స్కేటింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించిందని, ఆ రికార్డును అధిగమించేందుకు వేదనరసింహ 270 కి.మీ స్కేటింగ్ యాత్ర చేస్తున్నట్టు చెప్పారు. చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు! -
ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర..
ఫ్రాన్స్ ఫుట్బాల్ సంచలనం కైలియన్ ఎంబాపె చరిత్ర సృష్టించాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పారిస్-సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) జట్టు తరపున ఆల్టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్గా నిలిచాడు. శనివారం అర్థరాత్రి నాంటెస్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ఎంబాపె ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆట (90+2వ నిమిషం) అదనపు సమయంలో గోల్ కొట్టిన ఎంబాపెకు ఇది 201వ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎంబాపె పీఎస్జీ తరపున అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డులెక్కాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు పీఎస్జీ తరపున 200 గోల్స్తో అగ్రస్థానంలో ఉన్న ఎడిసన్ కవానీని వెనక్కి నెట్టిన ఎంబాపె తొలిస్థానాన్ని అధిరోహించాడు. ఎడిసన్ కవానీ 2013 నుంచి 2022 వరకు పీఎస్జీ క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఎంబాపె అనగానే ముందుగా గుర్తుకువచ్చేది గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్కప్ 2022. అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్తో మెరిసిన ఎంబాపె ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. ఒకానొక దశలో ఫ్రాన్స్ను గెలుపు తీరాలకు చేర్చినప్పటికి అదనపు సమయంలో మ్యాచ్ డ్రాగా ముగియడం.. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన విజయం సాధించడం జరిగిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పారిస్-సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) నాంటెస్ క్లబ్పై 4-2 తేడాతో విజయం సాధించింది. పీఎస్జీ తరపున మెస్సీ(12వ నిమిషం), జావెన్ హజమ్(17వ నిమిషం), డానిల్లో పెరీరా(60వ నిమిషం), కైలియన్ ఎంబాపె(90+2 వ నిమిషం)లో గోల్స్ చేయగా.. నాంటెస్ క్లబ్ తరపున లుడోవిక్ బ్లాస్(31వ నిమిషం), ఇగ్నాషియస్ గాంగో(38వ నిమిషం) గోల్స్ చేశారు. An evening for the history books! ✨❤️💙#𝐊EEP𝐌AKINGHIS𝟕ORY pic.twitter.com/eu664c1Bk0 — Paris Saint-Germain (@PSG_English) March 5, 2023 -
పిట్ట కొంచెం.. ప్రతిభ ఘనం: యంగ్ గెస్ట్ ట్యాలెండ్ కిడ్గా చిన్నారి
సాక్షి, హిందూపురం టౌన్: తన ప్రతిభతో ఏడాది వయస్సున్న చిన్నారి ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్(ఐడబ్ల్యూఆర్)లో చోటు దక్కించుకుంది. హిందూపురం శ్రీకంఠపురంలో నివాసముంటున్న డాక్టర్ చరణ్కుమార్, సుష్మాల కుమార్తె జి.నైనిక వయస్సు ఏడాదే. కానీ 12 గృహోపకరణాలను, 10 జంతువులను గుర్తుపట్టడంతో పాటు 10 జంతువుల శబ్దాలనూ చేయగలదు. ఈ నేపథ్యంలో ఐడబ్ల్యూఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన చిన్నారి నైనిక ప్రతిభను వీడియోల రూపంలో పరీక్షించారు. ఇందులో చిన్నారి ఇంటిలోని 12 వస్తువులను, అలాగే 10 జంతువులను గుర్తు పట్టి వాటి శబ్దాలు చేయడంతో ‘యంగ్ గెస్ట్ ట్యాలెండ్ కిడ్’గా రికార్డును అందజేశారు. ఈ మేరకు సర్టిఫికేట్ను శుక్రవారం అందజేశారు. -
LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు
నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్(NBA) స్టార్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును ఈ ఏన్బీఏ ప్లేయర్ తాజాగా బద్దలుకొట్టాడు. లేకర్స్ తరపున ఆడుతున్న లెబ్రాన్ జేమ్స్ బుధవారం ఎన్బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్(38,387) అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట ఉంది. ఒక్లహమా సిటీ థండర్తో జరిగిన మ్యాచ్లో 36వ పాయింట్ వద్ద లెబ్రాన్ జేమ్స్ ఈ ఫీట్ అందుకున్నాడు. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్ ఖాతాలో 38,388 పాయింట్లు ఉన్నాయి. లెబ్రాన్ ఈ రికార్డు అందుకున్న సమయంలో స్డేడియంలో దిగ్గజం కరీమ్ అబ్దుల్ జబ్బార్ ఉండడం విశేషం. వేలాది మంది ప్రేక్షకుల కరతాళద్వనుల మధ్య అబ్దుల్ జబ్బార్.. లెబ్రాన్ జేమ్స్ను అభినందించడం హైలైట్గా నిలిచింది. ఇక ఆగస్టు 5, 1984లో అప్పటి ఎన్బీఏ స్టార్ కరీమ్ అబ్దుల్ జబ్బార్ 31,419 పాయింట్ల వద్ద విల్ట్ చాంబర్లెయిన్ను అధిగమించాడు. 1989లో కరీమ్ రిటైర్ అయినప్పటికి అతని రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. 2003-04 సీజన్ లో అరంగేట్రం చేసిన లెబ్రాన్ జేమ్స్.. తొలి సీజన్ మినహా తర్వాత ప్రతి సీజన్ లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేయడం గమనార్హం. లెబ్రాన్ జేమ్స్ సాధించిన రికార్డులు.. ► NBA ఛాంపియన్: 2012, 2013, 2016, 2020 ► NBA మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): 2009, 2010, 2012, 2013 ► NBA ఫైనల్స్ MVP: 2012, 2013, 2016, 2020 ► NBA ఆల్ స్టార్: 19 సార్లు (2005-2023) ► NBA రూకీ ఆఫ్ ది ఇయర్: 2004 ► ఒలింపిక్ పతకాలు: మూడు (2008, 2012లో స్వర్ణం; 2004లో కాంస్యం) 🎙️ MIC'D UP 🎙️ LeBron James becomes the NBA's all-time leading scorer.#ScoringKing pic.twitter.com/MbRSyw0SBj — NBA (@NBA) February 8, 2023 One photo, 76,777 points. All time greatness. #ScoringKing pic.twitter.com/EJdWZTQZe6 — NBA (@NBA) February 8, 2023 చదవండి: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో Lebron James: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
క్రికెట్ చరిత్రలో ఇద్దరే ఇద్దరు, అందులో మన వాడు.. ఆ చారిత్రక ఘట్టానికి 24 ఏళ్లు
Anil Kumble 10 Wickets Haul Vs Pakistan: క్రికెట్ చరిత్రలో ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1999వ సంవత్సరంలో ఈ తేదీన ఢిల్లీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు (10/74) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. 1956లో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్ల ఘనత (10/53) సాధించగా, ఆ ఘనతను తిరిగి 43 ఏళ్ల తర్వాత అనిల్ కుంబ్లే రెండో సారి నమోదు చేశాడు. కుంబ్లే సాధించిన ఈ ఘనతకు నేటితో 23 పూర్తై 24 ఏళ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కుంబ్లే చారిత్రక ప్రదర్శనను నేటి దినాన క్రికెట్ అభిమానులు స్మరించుకుంటున్నారు. కుంబ్లే నమోదు చేసిన గణాంకాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ జనరేషన్ అభిమానులైతే 10కి 10 వికెట్లు తీయడం ఎలా సాధ్యపడిందని చర్చించుకుంటున్నారు. 2⃣6⃣.3⃣ Overs 9⃣ Maidens 7⃣4⃣ Runs 1⃣0⃣ Wickets 🗓️ #OnThisDay in 1999, #TeamIndia legend @anilkumble1074 etched his name in record books, becoming the first Indian cricketer to scalp 1⃣0⃣ wickets in a Test innings 🔝 👏 Revisit that special feat 🔽 pic.twitter.com/wAPK7YBRyi — BCCI (@BCCI) February 7, 2023 నాటి మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. సదగోపన్ రమేశ్ (60), మహ్మద్ అజహారుద్దీన్ (67) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ ఆఫ్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్లో అనిల్ కుంబ్లే (4/75), హర్భజన్ సింగ్ (3/30) ధాటికి 172 పరుగులకే ఆలౌటైంది. షాహిద్ అఫ్రిది (32) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్లో 339 పరుగులకు ఆలౌటై పాక్కు 420 పరుగుల టార్గెట్ను నిర్ధేశించింది. ఈ ఇన్నింగ్స్లోనే కుంబ్లే మ్యాజిక్ చేశాడు. 101 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోని పాక్ను కుంబ్లే ఒక్కడే 207 పరుగులకు ఆలౌట్ చేశాడు. ఈ చారిత్రక ఘట్టానికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. -
రషీద్ ఖాన్ అరుదైన ఘనత.. టీ20ల్లో 500 వికెట్లు
పొట్టి ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్ సారధి, ఈ తరంలో ప్రపంచంలోనే మేటి స్పిన్నర్గా పేరొందిన రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టుకు సారధ్యం వహిస్తున్న ఇతను.. నిన్న (జనవరి 23) ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో (4-0-16-3) 3 వికెట్లు పడగొట్టడం ద్వారా టీ20 ఫార్మాట్లో (ఓవరాల్గా) 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 24 ఏళ్ల రషీద్ ఖాన్.. ఈ ఫీట్ను 371 టీ20 మ్యాచ్ల్లో సాధించాడు. The moment he reached 500 wickets 💙#MICTvPC #MICapeTown #OneFamily @rashidkhan_19 pic.twitter.com/MzWTMdqC5D — MI Cape Town (@MICapeTown) January 23, 2023 పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు విండీస్ వెటరన్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. బ్రావో.. 500 వికెట్ల మైలరాయిని చేరుకునేందుకు 458 మ్యాచ్లు ఆడాడు. ప్రస్తుతం ఈ విండీస్ వీరుడి ఖాతాలో 614 వికెట్లు ఉన్నాయి. రషీద్ అత్యంత పిన్న వయసులో, అతి తక్కువ మ్యాచ్ల్లో ఈ ఫీట్ను సాధించడంతో మున్ముందు 1000, 1500 వికెట్లు సునయాసంగా సాధిస్తాడని క్రికెట్ ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్తో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని టీ20 లీగ్ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్ (3/37), ఓడియన్ స్మిత్ (2/27) బంతితో రాణించినప్పటికీ.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో చేతులెత్తేయడంతో 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున విల్ జాక్స్ (62) టాప్ స్కోరర్గా నిలువగా.. ఎంఐ కేప్టౌన్ తరఫున బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (46) ఓ మోస్తరుగా రాణించాడు. ప్రిటోరియా బౌలర్లలో వేన్ పార్నెల్, అన్రిచ్ నోర్జే తలో 3 వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్ 2, ఈథన్ బోష్, విల్ జాక్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. -
బుల్లిపిట్ట.. ప్రపంచ రికార్డు.. నాన్స్టాప్గా 13,560 కిలోమీటర్ల ప్రయాణం
ఒక బుల్లి వలస పిట్ట 13,560 కిలోమీటర్లు ఏకబిగిన ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. విశ్రాంతి, ఆహారం లేకుండా నాన్స్టాప్గా 11 రోజులు ప్రయాణించి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. లిమోసా ల్యాపోనికా జాతికి చెందిన బార్ టెయిల్డ్ గాడ్విట్ అనే చిన్న పక్షి అమెరికాలోని అలాస్కా వద్ద నోమ్ తీరం నుంచి గతేడాది అక్టోబర్ 13న బయలుదేరి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వద్ద ఆన్సాన్స్ తీరం వరకు ప్రయాణించి ఈ రికార్డు సాధించింది. – సాక్షి, అమరావతి బహుదూరపు ప్రయాణానికి సిద్ధమైందిలా.. అలాస్కాలో బార్ టెయిల్డ్ గాడ్విట్ జాతికి చెందిన వలస పక్షులు (చిన్న వాటికి) మూడింటికి గతేడాది అక్టోబర్లో మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్నిథాలజీ సైంటిస్టులు తమ బర్డ్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 5 గ్రాముల బరువుండే సోలార్ శాటిలైట్ ట్రాన్స్మిటర్లను అమర్చారు. ఐదు నెలల వయసున్న బీ6 (పక్షికి సైంటిస్టులు పెట్టిన పేరు) కూడా అందులో ఉంది. అయితే వలస వెళ్లిన మిగిలిన రెండు పక్షుల జాడ తెలియలేదు. కాగా, వలసకు సమయం ఆసన్నమైన తరుణంలో ఆ పక్షులు తమ శరీరాన్ని ప్రయాణానికి సిద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. అనవసరమైన బరువును తగ్గించేందుకు జీర్ణ వ్యవస్థ సహా కొన్ని అవయవాలను కుదించుకున్నాయి. శక్తిని ఆదా చేసేందుకు తక్కువ పీడనం ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉన్న గాలులు వీచే వరకు ఎదురు చూశాయి. అన్నీ అనుకూలంగా మారిన తర్వాత ఎగరడం ప్రారంభించాయి. ఆడ పక్షులే పెద్దవి.. ► బార్ టెయిల్డ్ గాడ్విట్ల రెక్కలు పెద్దగా విప్పి ఎగురుతాయి. ► నీటిపై తేలేందుకు వీలుగా వీటి శరీర అమరిక ఉండదు కాబట్టి సముద్రంలో విశ్రాంతి కోసం ఆగలేవు. ► ఈ పక్షులు 37 నుంచి 41 సెంటీమీటర్ల పొడవుంటాయి. ► మగ పక్షుల కంటే ఆడ పక్షులు పెద్దవిగా ఉంటాయి. మగవి 190 నుంచి 400 గ్రాములు, ఆడవి 260 నుంచి 630 గ్రాముల వరకు బరువు ఉంటాయి. ► ఇవి సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి ప్రాంతాల్లో వేట సాగిస్తూ.. నీటి పురుగులు, నత్తల వంటి జీవులను ఆహారంగా తీసుకుంటాయి. బీ6 ప్రయాణమిలా.. ► ఇది తొలుత హవాయికి పశ్చిమ దిశగా ఎగరడం ప్రారంభించింది. ► అక్టోబర్ 19న పసిఫిక్ ద్వీప దేశమైన కిరిబాటి మీదుగా ప్రయాణించింది. ► దాదాపు రెండు రోజుల తర్వాత సిడ్నీకి దగ్గరగా ఎగిరింది. ► న్యూజిలాండ్ మీదుగా అక్టోబర్ 25న టాస్మానియా తీరానికి చేరింది. ► గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది. ► అంతదూరం ఈ చిన్న పక్షి ఒంటరిగా ప్రయాణించిందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. ► అవిశ్రాంత ప్రయాణం కారణంగా పక్షి సగం బరువు కోల్పోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► ఒక వయసుకు రాగానే సాధారణంగా ఈ జాతి పక్షులు గుంపుగా బయలుదేరి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వైపుకు వలస వెళుతుంటాయి. ► కానీ ఇప్పుడు తక్కువ వయసున్న పక్షులు పెద్ద పక్షుల నుంచి విడిపోయి దక్షిణ దిశగా సుదూరంగా ప్రయాణించాయి. ► 2020లో ఇదే జాతికి చెందిన ఓ పక్షి అలస్కా నుంచి న్యూజిలాండ్ వరకు 12,200 కి.మీ. ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. -
ఆర్చరీలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కోల్కతాలో రెండు రోజులపాటు జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ట్రయల్స్లో విజయవాడకు చెందిన 26 ఏళ్ల జ్యోతి సురేఖ డబుల్ 50 మీటర్ల రౌండ్లో 1440 పాయింట్లకుగాను 1418 పాయింట్లు సాధించింది. తొలి రోజు 72 బాణాలు, రెండో రోజు మరో 72 బాణాలు ఉపయోగించారు. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టులో బ్రిటన్ ఆర్చర్ ఎల్లా గిబ్సన్ 1417 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. 24 మంది ఆర్చర్లు పాల్గొన్న సెలెక్షన్ ట్రయల్స్లో జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్లో నిలిచింది. ఈ ట్రయల్స్ ద్వారా ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీలలో, ప్రపంచ చాంపియన్షిప్లో, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేస్తారు. -
అన్స్టాపబుల్ జర్నీ.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది!
హోబార్ట్(టాస్మానియా): రాత్రిపగలు తేడా లేకుండా ఏకధాటిగా పదకొండు రోజుల ప్రయాణం. ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. ఆకలి దప్పిక తీర్చుకోలేదు. పదకొండు వేల కిలోమీటర్లు వలస ప్రయాణంతో సరికొత్త రికార్డుతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది ఓ గాడ్విట్ పక్షి. గాట్విట్(లిమోసా లప్పినోకా).. నెమలి తరహాలో ఉండే ఓ పక్షి. దానికి 234684 అనే నెంబర్తో 5జీ శాటిలైట్ ట్యాగ్ను పక్షి కింది భాగంలో బిగించారు. అమెరికా రాష్ట్రమైన అలస్కా నుంచి వలస మొదలుపెట్టి ఆస్ట్రేలియా రాష్ట్రమైన టాస్మానియాకు చేరుకుని ప్రయాణం పూర్తి చేసుకుంది ఈ పక్షి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అది ఎక్కడ ఆగలేదు. ఆహారం, నీటిని తీసుకోలేదు. తద్వారా అధికారికంగా అత్యధిక దూరం వలస ప్రయాణం చేసిన పక్షిగా రికార్డులు బద్ధలు కొట్టింది. అక్టోబర్ 13వ తేదీన దాని ప్రయాణం మొదలైంది. మొత్తం పదకొండు రోజులపాటు ఎక్కడా వాలకుండా ముందుకెళ్లింది అది. ఈ పక్షి ప్రయాణించిన దూరం.. ఈ భూమి పూర్తి చుట్టుకొలతలో మూడో వంతు!. లండన్ నుంచి న్యూయార్క్ మధ్య రెండున్నర సార్లు ప్రయాణిస్తే ఎంత దూరమో అంత!. గతంలో 217 మైళ్ల దూరం ఇదే గాడ్విట్ సంతతికి చెందిన పక్షి విరామం లేకుండా ప్రయాణించింది. ఈ రాత్రిపగలు సుదీర్ఘ ప్రయాణంలో.. ఆ పక్షి బరువు సగం తగ్గిందని టాస్మానియాకు చెందిన వన్యప్రాణి నిపుణులు ఎరిక్ వోఎహ్లెర్ చెప్తున్నారు. చిన్న తోక, పొడుగు ముక్కు, సన్నకాళ్లతో ఉండే గాడ్విట్ పక్షి.. 90 డిగ్రీల యూటర్న్ తీసుకుని నేల మీద వాలే ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంది. అయితే.. రిస్క్తో కూడుకున్న జీవితం వీటిది. లోతైన నీటిపై గనుక అవి వాలితే.. ప్రాణాలు కోల్పోతాయి. వాటి కాళ్ల కింద భాగం నీటి తేలేందుకు అనుగణంగా ఉండదు. తద్వారా అవి నీళ్లలో పడితే మళ్లీ పైకి ఎగరలేవు. సుదీర్ఘ దూరం ప్రయాణించిన 234684 గాడ్విట్ పక్షి సముద్రాలు దాటుకుంటూ రిస్క్తో కూడిన ప్రయాణమే చేసిందని ఎరిక్ వివరిస్తున్నారు. -
అసమాన ఆటతీరుకు సలాం.. చెక్కుచెదరని రికార్డులకు గులాం
ఫుట్బాల్లో ఒక శకం ముగిసింది. ఫుట్బాల్ ఆటకే వన్నె తెచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పీలే 82 ఏళ్ల వయసులో డిసెంబర్ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం ఫుట్బాల్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. అసమాన ఆటతీరుతో బ్రెజిల్కు ఎన్నో అద్భుత విజయాల్ని అందించాడు పీలే. సుదీర్ఘ కెరీర్లో పీలే సాధించిన కొన్ని రికార్డులు ఇవి... ► బ్రెజిల్కు మూడు వరల్డ్ కప్లను పీలే అందించాడు. 1958, 1962, 1970 మూడు సార్లు బ్రెజిల్ వరల్డ్ కప్ గెలవడంతో పీలే కీలక పాత్ర పోషించాడు. అత్యధిక సార్లు వరల్డ్ కప్ అందుకున్న ఫుట్బాల్ ప్లేయర్గా రికార్డులెక్కాడు. ► 1958 వరల్డ్ కప్ తో పీలే ఫుట్బాల్ కెరీర్ ప్రారంభమైంది. అప్పటికీ పీలే వయసు 17 ఏళ్లు మాత్రమే. వరల్డ్ కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా పీలే రికార్డ్ సృష్టించాడు. ► 1958 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో పీలే ఫ్రాన్స్పై హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. కేవలం 23 మూడు నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేసి బ్రెజిల్ను విజేతగా నిలిపాడు. వరల్డ్కప్లో హ్యాట్రిక్ చేసిన యంగెస్ట్ ప్లేయర్ అతడే కావడం గమనార్హం. ► వరల్డ్ కప్లో గోల్ చేసిన 18 కంటే తక్కువ వయసున్న ఏకైక ఆటగాడు కూడా పీలే కావడం విశేషం. ► బ్రెజిలియన్ క్లబ్ సాంటోస్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు పీలే కావడం గమనార్హం. 659 మ్యాచ్లలో 643 గోల్స్ చేశాడు పీలే. కెరీర్ మొత్తంగా 1363 మ్యాచ్లు ఆడిన పీలే 1283 గోల్స్ చేశాడు. ► బ్రెజిల్ తరఫున 92 మ్యాచ్లలో 77 గోల్స్ చేశాడు. వరల్డ్ కప్లో 14 మ్యాచ్లు ఆడిన పీలే 12 గోల్స్ చేశాడు. ► పీలే బ్రెజిల్ తరుఫున ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన పీలే ఒలింపిక్స్లో మాత్రం ఒక్కసారి కూడా బరిలో దిగలేదు. ► ఒక ఏడాదిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాల్ ప్లేయర్ పీలేనే. 1959వ ఏడాదిలో పీలే 127 గోల్స్ చేశాడు. ► పీలే కెరీర్లో మొత్తం 92 రెండు సార్లు హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. -
కేన్ మామ డబుల్ సెంచరీ.. కివీస్ తరపున తొలి బ్యాటర్గా
పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. మూడోరోజు ఆటలో సెంచరీతో మెరిసిన విలియమ్సన్ తాజా డబుల్ సెంచరీతో కొన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. విలియమ్సన్ ఖాతాలో టెస్టుల్లో ఇది ఐడో డబుల్ సెంచరీ. కివీస్ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్గా కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు బ్రెండన్ మెక్కల్లమ్ నాలుగు డబుల్ సెంచరీలు బాదాడు. తాజాగా కేన్ మామ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ►ఇక ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో టెస్టుల్లో ఎక్కువ డబుల్ సెంచరీలు కింగ్ కోహ్లి పేరిట ఉన్నాయి. కోహ్లి టెస్టుల్లో ఇప్పటివరకు ఏడు డబుల్ సెంచరీలు బాది తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండో స్థానం కేన్ విలియమ్సన్దే కావడం విశేషం. కేన్ మామ ఐదు డబుల్ సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. ►ఇక కేన్ విలియమ్సన్ ఆఖరిసారి సెంచరీ, డబుల్ సెంచరీ కొట్టింది పాకిస్తాన్పైనే. 2021 జనవరిలో క్రైస్ట్చర్చి వేదికగా పాక్తో జరిగిన టెస్టులో ఏకకాలంలో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించాడు. అప్పుడు కేన్ విలియమ్సన్ 238 పరుగులు చేశాడు. తాజాగా రెండేళ్ల తర్వాత మళ్లీ అదే పాక్ జట్టుపై సెంచరీ చేయడంతో పాటు ఈసారి కూడా డబుల్ సెంచరీ ఫీట్ సాధించాడు. పాక్పై టెస్టుల్లో ఒకే మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్గా కేన్ విలియమ్సన్ నిలిచాడు. పాక్, కివీస్ల తొలి టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జీవం లేని పిచ్పై బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇమాముల్ హక్ 45, నుమన్ అలీ 4 పరుగులతో ఆడుతున్నారు. పాక్ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 612 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్(200 నాటౌట్).. ఇష్ సోదీ 65 పరుగులు చేయగా.. టామ్ లాథమ్ సెంచరీ మెరిశాడు. Fifth Test double century for Kane Williamson. A fantastic effort 💯💯#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/tEOiqMRYJB — Pakistan Cricket (@TheRealPCB) December 29, 2022 -
కివీస్తో పాక్ మ్యాచ్.. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
Pakistan vs New Zealand, 1st Test: టెస్టు, వన్డే సిరీస్లు ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. వరల్డ్ టెస్టు చాంపియన్సషిప్ 2021-23 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం(డిసెంబరు 26) ఆరంభమైన తొలి మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు నమోదైంది. టాస్ గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌతీ.. బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో నాలుగో ఓవర్లో బంతిని అజాజ్ పటేల్ చేతికి ఇవ్వగా.. స్పిన్తో తిప్పేశాడు. ఈ బాల్ను అంచనా వేయడంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(7) విఫలం కాగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండల్ అతడిని స్టంపౌట్ చేశాడు. 145 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇక ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్వెల్ బౌలింగ్లోనూ వన్డౌన్ బ్యాటర్ షాన్ మసూద్(3)ను ఇదే రీతిలో బ్లండల్ స్టంపౌట్ చేశాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు నమోదైంది. 145 ఏళ్ల పురుషుల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా తొలి రెండు వికెట్లు స్టంపౌట్ ద్వారా లభించడం ఇదే మొదటిసారి కాగా.. ఓవరాల్గా రెండోసారి. గతంలో.. 1976లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జమైకాలో జరిగిన టెస్టులో తొలిసారి ఈ ఫీట్ నమోదైంది. ఈ మ్యాచ్లో ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ మారీ కార్నిష్ నాలుగు వికెట్లు(టూయీస్ బ్రౌనీ, జాస్మిన్ సామీ, గ్లోరియా గిల్) తీయగా.. అందులో మూడు స్టంపౌట్లే ఉండటం విశేషం. చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్ పడితే నీ ఆట ముగిసేది.. భారత్ 89కే ఆలౌట్ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్ Mohammad Rizwan: వైస్ కెప్టెన్పై వేటు! 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలి మ్యాచ్.. ఆఫ్రిదిపై విమర్శలు Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. 34 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే భారత్ టెస్టు సిరీస్ను కైవసం చేసుకోవడంలో వెటరన్ ఆటగాడు రవిచంద్ర అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ (42 నాటౌట్) అయ్యర్తో కలిసి భారత జట్టుకు అద్భుతమైన విజయం సాధించాడు. ఈ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో విజయవంతమైన ఛేజింగ్లో తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు విన్స్టన్ బెంజమిన్ పేరిట ఉండేది. 1988లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బెంజమిన్ 40 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్తో 34 ఏళ్ల బెంజమిన్ రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: WTC 2021-23: చిన్న టార్గెట్కే కిందా మీదా .. ఇలాగైతే డబ్ల్యూటీసీ గెలిచేదెలా? -
ఏడో ప్రపంచ రికార్డు కోసం థీమ్.. ఒకేచోట 500కు పైగా వంటకాలు
సనత్నగర్ (హైదరాబాద్): తెలంగాణ సకినాలు.. ఆంధ్రా ఉలవచారు.. తమిళనాడు చికెన్ చెట్టినాడ్.. కేరళ ఇడియప్పం.. బెంగాలీ రసగుల్లా.. గుజరాతీ దోక్లా.. రాజస్తానీ పాపడ్ కీ సబ్జీ.. ఒకటా రెండా.. దేశంలోని 28 రాష్ట్రాలు.. ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల రుచులు అక్కడ ఘుమఘుమలాడాయి. 500 పైచిలుకు వంటకాలు ప్రదర్శనలో నోరూరించారు. ప్రపంచ రికార్డులో భాగంగా అన్ని రాష్ట్రాల వంటకా లను తయారు చేసి ప్రదర్శించారు. బేగంపేట ఉమానగర్లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా విద్యార్థులు శుక్రవారం ఆయా రాష్ట్రాల వంటకాలను ఇండియా మ్యాప్ ఆకృతిపై ప్రదర్శించారు. గతంలో వివిధ అంశాల్లో ఆరు ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా ఈసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘ఇండియా ఆన్ థాలి’ పేరిట ఏడో ప్రపంచ రికార్డు కోసం ఈ థీమ్ను ఎంచుకుంది. ఆయా రాష్ట్రాల వస్త్ర ధారణలో విద్యార్థులు ఆకట్టుకు న్నారు. -
రక్తదానంలో వైఎస్ఆర్ సీపీ ప్రపంచ రికార్డ్
-
CM YS Jagan Birthday Special: వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్
-
CM YS Jagan Birthday: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్
సాక్షి, తాడేపల్లి: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్సాధించింది. లక్షా 30 వేల మంది రిజిస్ట్రేషన్లతో వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 72 వేల నిల్వలతో దక్షిణాఫ్రికా పేరిట గతంలో రికార్డు ఉండగా, దక్షిణాఫ్రికా రికార్డును వైఎస్సార్సీపీ బద్దలుకొట్టింది. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలోనూ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చల్లా మధుసూదన్రెడ్డి, సిబ్బందిని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభినందించారు. చదవండి: ట్విటర్ టాప్ ట్రెండింగ్గా #HBDYSJagan -
ఇంగ్లండ్కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు
పాకిస్తాన్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. పాక్ను వారి సొంతగడ్డపై వైట్వాస్ చేసి ఆ జట్టుకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఇక ఈ సిరీస్ ద్వారా హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్కు మంచి బ్యాటర్ దొరికాడు. ఈ సిరీస్లో బ్రూక్స్ మూడు టెస్టులు కలిపి 468 పరుగులు సాధించాడు. 93.60 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన బ్రూక్ ఖాతాలో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యారీ బ్రూక్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటంటే.. పాక్ గడ్డపై ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇంతకముందు 1983-84లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ గోవర్ 449 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇదే సిరీస్లో 179 పరుగులు నాటౌట్గా నిలిచాడు. అంతేకాదు మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన మార్కస్ ట్రెస్కోథిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ట్రెస్కోథిక్ పాక్ గడ్డపై 12 ఇన్నింగ్స్లు కలిపి 445 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి రికార్డులను బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్ పాక్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్కు పరాభవమే ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. చదవండి: ఇంగ్లండ్ చేతిలో వైట్వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం అంపైర్కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
125 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్తో ప్రారంభమైన టెస్టు సిరీస్లో బ్రూక్ పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా పాక్తో మొదలైన మూడో టెస్టులో మరోసారి సెంచరీతో మెరిసిన హ్యారీ బ్రూక్ 125 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా హ్యారీబ్రూక్ నిలిచాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన బ్రూక్ ఆరు ఇన్నింగ్స్లు కలిపి 480 పరుగులు(12, 153, 87, 9, 108,111) చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో విషయమేంటంటే బ్రూక్ సాధించిన ఆ మూడు సెంచరీలు పాకిస్తాన్తో టెస్టు సిరీస్లోనే వచ్చాయి. ఇంతకముందు ఇంగ్లండ్ తరపున కేఎస్ రంజిత్సింగ్హ్జి 418 పరుగులు( 62, 154*, 8, 11, 175,8*), టిప్ ఫోస్టర్ 411 పరుగులు(287, 19,49*, 21, 16,19)లు ఉన్నారు. తాజాగా వీరిద్దరిని అధిగమించిన హ్యారీ బ్రూక్ 480 పరుగులతో టాప్ స్థానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడో టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు జరుగుతున్న ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. బెన్ ఫోక్స్ 60, మార్క్వుడ్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులకు ఆలౌట్ అయింది. Harry Brook has broken KS Ranjitsinhji's 125 year-old record for the most runs in a batter's first 6 men's Test inns for England: 436 HARRY BROOK (12, 153, 87, 9, 108, 67*) 418 KS Ranjitsinhji (62, 154*, 8, 11, 175, 8*) 411 Tip Foster (287, 19, 49*, 21, 16, 19) — Mark Puttick (@GryllidaeC) December 18, 2022 చదవండి: చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం బంగ్లాపై టీమిండియా విజయం.. విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు -
మాతృదేశానికి తోడునివ్వడంలో మనవాళ్లే టాప్
శ్రీకాంత్రావు.కె, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులు తాము సంపాదించిన సొమ్మును స్వదేశానికి పంపడంలో ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నారు. స్వదేశంలోని తమ కుటుంబ అవసరాలు, పెట్టుబడుల కోసం గత ఏడాది ఏకంగా 88 బిలియన్ డాలర్లను స్వదేశానికి తరలించగా.. ఈ ఏడాది ఇది ఏకంగా 100 బిలియన్ డాలర్లకు చేరనున్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనా వేయడం గమనార్హం. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే.. 8,24,205 కోట్లు (ఎనిమిది లక్షల 24 వేల 205 కోట్ల రూపాయలు) అన్నమాట. ఇలా విదేశాల్లో సంపాదించిన సొమ్మును స్వదేశానికి తరలించడాన్ని రెమిటెన్స్గా పిలుస్తారు. ప్రపంచంలో భారత్కు వచ్చే రెమిటెన్సులే ఎక్కువ. ఈ రెమిటెన్సులు మన దేశ వాణిజ్య లోటును తగ్గించేందుకు, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగేందుకు తోడ్పడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, మాంద్యం భయం ఉన్నప్పటికీ భారతదేశానికి భారీగా రెమిటెన్సులు రావడం ఆశావహ పరిణామమని చెప్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రత్యేకం ఎన్నో ఏళ్లుగా మన దేశానికి గణనీయంగా రెమిటెన్సులు వస్తున్నా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరీ ప్రత్యేకమైనది. విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ సంపాదించి మాతృదేశానికి ఏటా పంపిస్తున్న సంపద మొదటిసారిగా వంద బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. మరే దేశం కూడా భారత్ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ఇక్కడ కుటుంబాన్ని వదిలివెళ్లిన వారు తమ కుటుంబ అవసరాల కోసం, ఆస్తులు సమకూర్చుకోవడానికి పంపిస్తున్న సంపద.. ఇదే సమయంలో దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతోంది. భారత్కు వస్తున్న రెమిటెన్సులు ప్రధానంగా గల్ఫ్ దేశాలతోపాటు అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాల నుంచి అందుతున్నాయి. కరోనా సమయంలో రెమిటెన్సులు కాస్త తగ్గినట్టు కనిపించినా.. అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తిరిగి పుంజుకున్నాయి. భయాలు తొలగి.. ఆదాయం పెరిగి.. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్లు, ఆంక్షలు, ఉద్యోగాల కోత, ఉపాధికి దెబ్బతో రెండేళ్లపాటు దీని ప్రభావం కనిపించింది. కొన్ని నెలలుగా ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. విదేశాలకు వలసలు, స్వదేశానికి వచ్చే రెమిటెన్సులు పెరుగుతున్నాయి.భారతీయులు 2021లో 7.5 శాతం పెరుగుదలతో 89.4 బిలియన్ డాలర్లను మాతృదేశానికి పంపగా.. ఇది 2022లో 12 శాతం పెరుగుదలతో 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆరు కారణాలను విశ్లేషించింది. ►మాతృదేశం నుంచి వలసలు వెళ్లినవారు తమ దేశానికి నిధులు పంపించాలన్న సంకల్పం. ►కరోనా మహమ్మారి తర్వాత క్రమంగా పరిశ్రమలు, సేవలు, పర్యాటక, విమానయానం తదితర రంగాలు మామూలు స్థితికి చేరుకోవడం, తమ దేశాలకు వెళ్లిన వారు తిరిగి విదేశాల్లో పనులకు వెళ్లడం. ►ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు మెరుగవడంతో విదేశాల్లోని భారతీయుల సంపాదన పెరిగిస్వదేశానికి ఎక్కువ నిధులు పంపించడం. ►విదేశీ మారకద్రవ్యంలో మార్పులు, డాలర్తో రూపాయి విలువ తగ్గడం కూడా ఎక్కువ నిధుల ప్రవాహానికి కారణం. ►కరోనా సమయంలో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించడంతో.. సంస్థలు ఉద్యోగులను కాపాడుకోవడం, వేతనాలు పెరగడం వంటివి జరగడం. ►పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల వలసదారుల నిజ ఆదాయాన్ని తగ్గించాయి. అయినా మాతృదేశానికి పంపించే నిధులు పెరిగాయి. దక్షిణాసియాలో పెరుగుదల 3.5 శాతం దక్షిణాసియా దేశాలకు రెమిటెన్సులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 3.5 శాతం అదనంగా ఉంటాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దక్షిణాసియా దేశాలకు మొత్తంగా 163 బిలియన్ డాలర్లు వస్తాయని పేర్కొంది. ఇందులో ఒక్క భారత వాటానే 100 బిలియన్ డాలర్లుగా ఉండబోతున్నట్టు తెలిపింది. విదేశాల నుంచి మాతృదేశాలకు పంపే సొమ్ముపై చార్జీలు కూడా దక్షిణాసియాలో తక్కువని వెల్లడించింది. వచ్చే ఏడాది తగ్గే అవకాశం! అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రగతి తగ్గుదల, ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల దక్షిణాసియా దేశాలకు నిధులు రాక 2023 ఆర్థిక సంవత్సరంలో తగ్గే అవకాశం ఉందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. దక్షిణాసియా దేశాలకు రెమిటెన్సులు ఈ ఏడాది 3.5 శాతం పెరిగితే.. 2023లో పెరుగుదల 0.7 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. భారత్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గల్ఫ్ కౌన్సిల్ ఆఫ్ కంట్రీస్ (జీసీసీ)లోని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్ తదితర దేశాల నుంచి రెమిటెన్సులు తగ్గవచ్చని అంచనా వేసింది. అయితే అమెరికా, యూకే, సింగపూర్ తదితర దేశాల్లో ఎక్కువ వేతనాలు అందుకునే భారతీయులు స్వదేశానికి ఎక్కువ నిధులు పంపే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా చాలా దేశాలకు రెమిటెన్సులు తగ్గిపోయినా.. భారతదేశానికి మాత్రం కనీసం నాలుగుశాతం మేర పెరగవచ్చని పేర్కొంది. విదేశీ పెట్టుబడుల కంటే ఇవే అధికం మన దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల కంటే మనవాళ్లు పంపిస్తున్న నిధులే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. భారతీయులు దేశాభివృద్ధి కోసం పడుతున్న తపన దీని ద్వారా అవగతం అవుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మనదేశ జనాభాలో కేవలం 1.3 శాతం మాత్రమే ఇతర దేశాలకు వలస వెళ్లారని.. కానీ అత్యధికంగా రెమిటెన్సులు పంపుతున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడిస్తోంది. గల్ఫ్ నుంచి తగ్గి అమెరికా, యూరోప్ నుంచి పెరుగుతున్నాయి కొన్నేళ్లుగా అత్యధిక రెమిటెన్స్ పొందుతున్న దేశం మనదే. చైనాను కూడా ఎప్పుడో దాటేశాం. విదేశాల్లో భారతీయులు కష్టపడి సంపాదించి ఆదా చేసిన సొమ్మును ఇక్కడి తమ కుటుంబాల అవసరాలు, ఇతర కమిట్మెంట్లు, పెట్టుబడుల కోసం పంపిస్తున్నారు. గతంలో గల్ఫ్దేశాల్లో కార్మికులు సంపాదించిన చిన్నచిన్న మొత్తాలే దేశంలోని తమ కుటుంబాలకు ఎక్కువగా అందేవి. ఇప్పుడు ఇతర దేశాల్లో పెద్ద మొత్తాల్లో సంపాదిస్తున్నవారు కూడా తమ వ్యక్తిగత రెమిటెన్స్లు పంపించడం పెరిగింది. దాదాపు రెండున్నరేళ్ల కరోనా పరిణామాల్లో కూడా ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బుపై ప్రభావం పడలేదు. గతంలో గల్ఫ్దేశాల నుంచి ఎక్కువగా రెమిటెన్సులు వచ్చేవి. ఇప్పుడు అమెరికా, యూరప్ల నుంచి వస్తున్నాయి. భారత్ చేసే ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. వాటికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సిన పరిస్థితిలో లోటు తలెత్తుతోంది. అయితే విదేశాల నుంచి అందుతున్న రెమిటెన్స్లు కొంతవరకు ఈ లోటును పూడ్చుతున్నాయి. – డి.నర్సింహారెడ్డి, ప్రముఖ ఆర్థికవేత్త, హెచ్సీయూ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విశ్రాంత డీన్ విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి భారత షేర్ మార్కెట్లోకి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల రూపంలో విదేశీ మారక ద్రవ్యం వచ్చినా అది తిరిగి వెళ్లిపోతోంది. చైనాకు వస్తున్న విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) రూపంలో మనకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నారైల నుంచి విదేశీ కరెన్సీ, డాలర్ల రూపంలో వచ్చే రెమిటెన్సుల వల్ల దేశంలో విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. రెమిటెన్సులు మరింతగా పెరగడంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పడిపోతున్న రూపాయి విలువ కోలుకునేందుకు ఇది సహాయపడుతుంది. – డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకుడు -
చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు
అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్కప్స్లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో మెస్సీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజం మారడోనా రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో రౌండ్ ఆఫ్ 16 పోరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో మెస్సీ ఈ ఫీట్ అందుకున్నాడు. ఆట 35వ నిమిషంలో బాటమ్ లెఫ్ట్ కార్నర్ నుంచి గోల్ కొట్టిన మెస్సీ ఈ వరల్డ్కప్లో మూడో గోల్ సాధించాడు. ఓవరాల్గా ఫిఫా వరల్డ్కప్స్లో 23వ మ్యాచ్ ఆడుతున్న మెస్సీకి ఇది 9వ గోల్ కావడం విశేషం. ఈ క్రమంలో ఫిఫా వరల్డ్కప్స్లో మారడోనా చేసిన 8 గోల్స్(21 మ్యాచ్లు)ను మెస్సీ అధిగమించాడు. అర్జెంటీనా తరపున ఫిఫా వరల్డ్కప్స్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా ఆ దేశ దిగ్గజం గాబ్రియెల్ బటిస్టుటా 12 మ్యాచ్ల్లో 10 గోల్స్ చేశాడు. ఇక మెస్సీ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. మెస్సీకి ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఓవరాల్గా 789 గోల్స్ కొట్టాడు. ఇక ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్లో డిసెంబర్ 10న నెదర్లాండ్స్తో తలపడనుంది. Cannot quantify #Messi magic with numbers but it's worth a shot 😬 📹 The 🔢 behind that 🤌🏻 ⚽ Watch the @Argentina star LIVE at the #WorldsGreatestShow 👉🏻 #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/yT6jywFK6f — JioCinema (@JioCinema) December 4, 2022 Scoring beautiful goals & surpassing legends, one at a time ❤️#Messi now has more #FIFAWorldCup goals (9) than legendary Diego Maradona (8) 👏 Watch him dazzle at the #WorldsGreatestShow, LIVE on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/BO6rcDUhvs — JioCinema (@JioCinema) December 4, 2022 -
మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్ చూడాల్సిందే
ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనాకు టైటిల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న లియోనల్ మెస్సీ ఆ దిశగా అడుగులేస్తున్నాడు. తొలి మ్యాచ్లో తాను గోల్ చేసినప్పటికి సౌదీ అరేబియా చేతిలో చిత్తవ్వడం మెస్సీ బాధించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతం అయ్యాడు. అయితే తొలి మ్యాచ్ ఓటమికి కుంగిపోకుండా మరుసటి మ్యాచ్లో మెస్సీ అంతా తానై నడిపించాడు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగంలో గోల్ రాకపోయేసరికి మ్యాచ్ డ్రా అవుతుందా అని అభిమానులు భయపడ్డారు. కానీ మెస్సీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఆట 62వ నిమిషంలో మెస్సీ కళ్లు చెదిరే గోల్తో మెరిశాడు. తన సహచర ఆటగాడు అందించిన పాస్ను చక్కగా వినియోగించుకున్న మెస్సీ ఎలాంటి పొరపాటు చేయడకుండా లో స్ట్రైక్తో బంతిని గోల్పోస్ట్లోకి పంపించాడు. అలా అర్జెంటీనాకు తొలి గోల్ లభించింది. ఆ తర్వాత 82వ నిమిషంలో ఫెర్నాండేజ్ మరో గోల్ కొట్టడంతో అర్జెంటీనా 2-0తో విజయం సాధించింది. ఏది ఏమైనా మెస్సీ కొట్టిన గోల్ జట్టుకు దైర్యాన్ని ఇవ్వడంతో పాటు విజయం దిశగా నడిపించింది. ఈ క్రమంలోనే మెస్సీ అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా రికార్డును సమం చేశాడు. ఫిఫా వరల్డ్కప్స్లో మెస్సీ 8 గోల్స్ చేశాడు. 1982, 1986, 1990,1994లో మారడోనా ఈ గోల్స్ చేశాడు. తాజాగా మెస్సీ మారడోనా గోల్స్ రికార్డును సమం చేశాడు. ఇక ఫిఫా వరల్డ్కప్స్లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ రికార్డు దిగ్గజం గాబ్రియెల్ బటిస్టుటా పేరిట ఉంది. గాబ్రియెల్ మొత్తంగా 10 గోల్స్ కొట్టాడు. గాబ్రియెల్ రికార్డును బద్దలు కొట్టేందుకు మెస్సీ కేవలం మూడు గోల్స్ దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక అర్జెంటీనా తరపున ఫిఫా వరల్డ్కప్లో 21వ మ్యాచ్ ఆడుతున్న మెస్సీ ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక 2014లో రన్నరప్గా నిలిచిన అర్జెంటీనా జట్టులో మెస్సీ సభ్యుడిగా ఉన్నాడు. తాజాగా కెప్టెన్గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తనకు ఇదే చివరి వరల్డ్కప్ అని ఊహిస్తున్న దశలో మెస్సీ ఎలాగైనా ఫిఫా వరల్డ్కప్ను సాధించి తన కలను సాకారం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అర్జెంటీనా 1978, 1986 ఫిఫా వరల్డకప్స్లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. Cometh the ⌛ Cometh the 🐐 💯 ▶ Relive Messi's heroics against #ElTri that kept @Argentina in the #FIFAWorldCup 🙌 Keep watching the #WorldsGreatestShow, only on #JioCinema & @Sports18 📲📺#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/KQHjSrSDTY — JioCinema (@JioCinema) November 27, 2022 చదవండి: మెస్సీ గురి అదిరింది.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ ఆశలు సజీవం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పర్వతం అతనికి పాదాక్రాంతం
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): కృషితో పట్టుదలతో ఆ యువకుడు ఏ పర్వతాన్నయినా అవలీలగా అధిరోహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం మనసులో వచ్చిన ఆలోచనకు పదును పెట్టి ఆచరణ సాధ్యం చేస్తున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన అతని పేరు ఉమేష్ ఆచంట. ఇతని తల్లిదండ్రులు బాలాజీ..పద్మావతి. ఉమేష్ చదువులో దిట్ట. టేబుల్ టెన్నిస్ అంటే ప్రాణం. ఈ ఆటలో అద్భుత ప్రావీణ్యం కనబరిచాడు. బీకాం ఉత్తీర్ణుడైన ఈ యువకుడు స్టోర్ట్సు కోటాలో రాజమహేంద్రవరంలోని పోస్టల్ డిపార్టుమెంట్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2016లో చూసిన ఎవరెస్ట్ సినిమా ఇతని ప్రవృత్తిని మార్చేసింది. తాను కూడా ఎవరెస్ట్ ఎక్కాలని బలంగా సంకల్పించాడు. వాస్తవానికి పర్వతారోహణ అనేది సాహస విన్యాసం. అయినప్పటికీ కృతనిశ్చయంతో తల్లితండ్రులను ఒప్పించి అరుణాచల ప్రదేశ్ వెళ్లాడు. కఠోరమైన శిక్షణ పొందాడు. అప్పటి నుంచి చిన్న చిన్న కొండలను ఎక్కడం ప్రారంభించి నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. చూసి తాను కూడా ఎవరెస్ట్ ఉమేష్ అంచెలంచెలుగా తన లక్ష్యాన్ని పెంచుకుంటూ పోయాడు. మూడు ఖండాలలో అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించగలిగాడు. గతేడాది మార్చిలో ఆఫ్రికాలో అతి పెద్ద పర్వతం కిలిమంజారోను అధిరోహించి ఔరా అనిపించాడు. అదే ఏడాది ఆగస్టులో యూరప్ ఖండంలో అతిపెద్ద పర్వతం మౌంట్ ఎలబస్ని ఎక్కాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో అతిపెద్ద పర్వతం మౌంట్ కోజిస్కోని అధిరోహించి అందరి దృష్టీ ఆకర్షించాడు. తాజాగా ఎవరెస్ట్ ఎక్కడానికి సన్నద్ధమవుతున్నట్లు ఉమేష్ సాక్షికి చెప్పాడు. ప్రమాద అంచున పయనం కిలిమంజారో ఎత్తు 19340 అడుగులు. మొదటి రెండు రోజులు ఏ ఆటంకాలు లేకుండా ఎక్కగలిగాడు. మూడో రోజు ఆక్సిజన్ లెవల్ తగ్గిపోయింది. దీంతో ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న అధికారవర్గాలు వెంటనే స్పందించాయి. అక్కడికి గైడ్, రిస్క్యు టీంను పంపాయి. దీంతో ఉమేష్ ప్రాణాలతో బయట పడ్డాడు. అలాగే మౌంట్ కోజిస్కోపర్వతం ఎత్తు 2228 మీటర్లు. ఆస్ట్రేలియా ఖండంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది. దీంతో అక్కడ పర్వతారోహనను ఆపేశారు. కానీ ఉమేష్ ప్రత్యేక అనుమతి తీసుకుని ఈనెల 11న బేస్ క్యాంపు నుంచి బయులుదేరాడు. సుమ్మిట్ పూర్తి చేసుకుని కిందకు రాత్రి లోపు వచ్చేయాలి. జీపీఎస్ సిగ్నల్స్..తీప్ర మంచు సమస్యలతో రూట్ మ్యాప్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. రావ్సన్ వద్ద ఎడమ వైపునకు వెళ్లాల్సి ఉంది. కానీ పొరపాటున దారి తప్పిపోయాడు. ఆ రాత్రి మళ్లీ కిందికి చేరుతానో లేదో అని తాను తీవ్ర ఆందోళన చెందానని ఉమేష్ చెప్పాడు. రాత్రి 12 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ టీంకు సమాచారం ఇద్దామన్నా సిగ్నిల్స్ లేవన్నాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రెస్క్యూ అపరేషన్ టీం ఇతడ్ని గుర్తించింది. అతి జాగ్రత్తగా బేస్ క్యాంపునకు తీసుకు వచ్చింది. అయినా పట్టు వీడకుండా ఈనెల 12న బేస్ క్యాంప్ నుంచి మళ్లీ బయలుదేరి మౌంటైనీర్ అవిన జోష్ మాతేవ్తో కలిసి మౌంట్ కోజిస్కోను అధిరోహించగలిగాడు. ఉమేష్ సాధించిన మెడల్స్ ఒడిదుడుకులు ఎదుర్కొని.. ప్రపంచంలో అతి ఎత్తయిన ఏడు పర్వతాలత్లో మౌంట్ ఎల్బస్ ఒకటి. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే పర్వతమిది. సముద్రమట్టానికి 16510 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా చేరుకోగలిగాడు. టీటీలో పలు ర్యాంకింగులు సాధించిన ఉమేష్ పర్వతరోహణలో ఏడు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. -
FIFA WC: రికార్డులు ఎవరికి కావాలి.. ఇరాన్ను ఓడించకపోతే మేం ఇంటికే!
వేల్స్ సీనియర్ ఆటగాడు గారెత్ బేల్ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయంగా వేల్స్ తరపున అత్యధిక మ్యాచ్ల్లో పాల్గొన్న తొలి ఆటగాడిగా గారెత్ బేల్ నిలిచాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో ఇరాన్తో మ్యాచ్ గారెత్ బేల్కు 110వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇంతకముందు వేల్స్ తరపున క్రిస్ గంటర్ 109 మ్యాచ్లు ఆడాడు. అమెరికాతో మ్యాచ్తో గారెత్ అతని సరసన చేరాడు. తాజాగా ఇరాన్తో మ్యాచ్ ఆడడం ద్వారా గంటర్ను అధిగమించిన గారెత్ అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ వరల్డ్కప్లో అమెరికాతో జరిగిన తొలి పోరులో గారెత్ బేల్ గోల్ చేసి తన ఆటను షురూ చేశాడు. కాగా వేల్స్ తరపున ఫిఫా వరల్డ్కప్స్లో గోల్ చేసిన నాలుగో ఆటగాడిగా గారెత్ నిలిచాడు. ఇంతకముందు ఇవోర్ అల్చర్చ్(1958లో రెండు గోల్స్), జాన్ చార్ల్స్, టెర్రీ మెడ్విన్లు(1958) చెరొక గోల్ కొట్టారు. ఇక ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో ఇప్పటివరకు గారెత్ బేల్ 12 గోల్స్ నమోదు చేయడం విశేషం. ఇక ఈ వరల్డ్కప్లో వేల్స్ తమ ఆటను డ్రాతో ప్రారంభించింది. అమెరికాతో జరిగిన పోరులో వేల్స్ 1-1తో మ్యాచ్ను డ్రాగా ముగించుకుంది. ఈ నేపథ్యంలో వేల్స్కు ఇరాన్తో పోరు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే వేల్స్ ముందంజ వేస్తుంది. అటు ఇరాన్ పరిస్థితి కూడా అంతే. ఈ నేపథ్యంలోనే గారెత్ బేల్.. ఇరాన్తో మ్యాచ్కు ముందు బీబీసీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు. వేల్స్ తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నారు.. ఇది ఎలా అనిపిస్తుంది అని ప్రశ్న వేశారు. దీనిపై గారెత్ స్పందిస్తూ.. ''దేశం తరపున అత్యధిక మ్యాచ్లు ఆడడం గొప్ప విషయమే. ఇరాన్ను ఓడించకపోతే మేం ఇంటిబాట పట్టే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు ఈ రికార్డులు సాధించి ఉపయోగమేంటి.. రికార్డులు కాదు ఇరాన్తో మ్యాచ్ గెలవడం నాకు ముఖ్యం'' అంటూ పేర్కొన్నాడు. A special day for Gareth Bale! 👏 Can he celebrate the milestone with Wales' first World Cup victory in 64 years? 🙌 📺📻📲 Watch on @BBCiPlayer from 09:15 GMT, listen now on @BBCSounds & get more on the @BBCSport app#BBCFootball #BBCWorldCup — BBC Sport (@BBCSport) November 25, 2022 చదవండి: FIFA WC: బ్రెజిల్ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్క్రీంలు అమ్మి -
ముగిసిన ప్రపంచకప్.. కోహ్లి సరికొత్త రికార్డు
టీమిండియా రన్మెషిన్ విరాట్ కోహ్లి ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా కోహ్లి మరో రికార్డు బద్దలు కొట్టాడు. టి20 ప్రపంచకప్లలో లీడింగ్ రన్స్కోరర్గా నిలవడం కోహ్లికి ఇది రెండోసారి. ఈ ప్రపంచకప్లో ఆరు మ్యాచ్లు కలిపి 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. కోహ్లి ఖాతాలో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక మెల్బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కోహ్లి (53 బంతుల్లో 82 పరుగులు నాటౌట్) ఇన్నింగ్స్ ఈ ప్రపంచకప్కే హైలైట్గా నిలిచింది. ఇక ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగుల జాబితా చూస్తే.. కోహ్లి తర్వాత నెదర్లాండ్స్కు చెందిన మాక్స్ ఓడౌడ్ 8 మ్యాచ్ల్లో 242 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో మరో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్(ఆరు మ్యాచ్లు కలిపి 239 పరుగులు) ఉన్నాడు. జాస్ బట్లర్ 225 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. లంకకు చెందిన కుషాల్ మెండిస్ 223 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. అంతకముందు 2014 టి20 ప్రపంచకప్లోనూ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. అప్పుడు ఆరు మ్యాచ్లు కలిపి కోహ్లి 106.33 సగటుతో 319 పరుగులు సాధించాడు. అప్పుడు కూడా నాలుగు అర్థసెంచరీలు సాధించిన కోహ్లి అత్యధిక స్కోరు 77గా ఉంది. ఇలా రెండు ప్రపంచకప్లలో లీడింగ్ స్కోరర్గా నిలవడం కోహ్లికి మాత్రమే సాధ్యమైంది. ఇక ఓవరాల్గా అన్ని ప్రపంచకప్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలోనూ కోహ్లినే అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లి టి20 ప్రపంచకప్లలో 27 మ్యాచ్లాడి 81.5 సగటుతో 1141 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉండగా.. 89 పరుగులు నాటౌట్ అత్యధిక స్కోరుగా ఉంది. ఇక టీమిండియా 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2014లో ఫైనల్ చేరినప్పటికి కప్ అందుకోవడంలో విఫలమైంది. తాజాగా 2022లో సెమీఫైనల్ చేరినప్పటికి ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకొని ఇంటిబాట పట్టింది. He's a 1⃣0⃣ but he sets unrealistic standards. 🤷♂️ Now the only player to top the run-scoring charts in✌️T20 World Cups. 🙇♂️#PlayBold #TeamIndia #T20WorldCup @imVkohli pic.twitter.com/CiuOD7IS6U — Royal Challengers Bangalore (@RCBTweets) November 13, 2022 చదవండి: బాబర్కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్ -
70 ఏళ్లు.. 9 కి.మీటర్లు.. 83 నిమిషాలు
కాచిగూడ (హైదరాబాద్): కాచిగూడలోని జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్.గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఎద్దుల కృష్ణారెడ్డి (70) 9 కిలోమీటర్లను 83 నిమిషాల్లో నడిచి వరల్డ్ రికార్డును సాధించారు. ఇప్పటికే గతంలో రెండు వరల్డ్ రికార్డ్స్ను డాక్టర్ కృష్ణారెడ్డి తన ఖాతాలో వేసుకున్నారు. సైదాబాద్లోని వివేక్ ఆస్పత్రి వద్ద డాక్టర్ కృష్ణారెడ్డి ప్రారంభించిన నడకను జైళ్ళ శిక్షణ కళాశాల (చంచల్గూడ) ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, జైలర్ రత్నంలు ప్రారంభించారు. ట్యాంక్బండ్లోని వివేకానంద విగ్రహం వరకు 9 కిలోమీటర్ల దూరాన్ని 83 నిమిషాల్లో నడిచి ఆయన ఈ రికార్డును నెలకొల్పారు. కృష్ణారెడ్డి చేసిన ఈవెంట్ను గుర్తించి (9 వరల్డ్ రికార్డ్ సంస్థలు) వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ట్రెజర్ వరల్డ్ రికార్డ్స్, గ్రాండ్ వరల్డ్ రికార్డ్స్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫోకస్ వరల్డ్ రికార్డ్స్, గ్లోరీ వరల్డ్ రికార్డ్స్, కోహినూర్ వరల్డ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్ సంస్థలు రికార్డ్ను నమోదు చేశాయి. ఈ సందర్భంగా జీవీఆర్ కరాటే అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధుల సమక్షంలో రికార్డును కృష్ణారెడ్డికి అందజేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ...ఈ రికార్డ్ను సీనియర్ సిటిజన్స్కు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాయామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఆర్ కరాటే అకాడమి కరాటే బ్లాక్బెల్ట్ ప్రతినిధులు కరీం, సుభాష్, సర్వర్, అమృత తదితరులు పాల్గొన్నారు. -
టి20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
టి20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్లో అడుగుపెట్టింది. ఆదివారం ముగిసిన సూపర్-12 పోటీల్లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో నెగ్గి గ్రూప్-2 టాపర్గా సెమీస్కు చేరుకుంది. నవంబర్ 10(గురువారం) ఇంగ్లండ్తో సెమీఫైనల్-2లో టీమిండియా అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. జింబాబ్వేపై విజయం ఈ ఏడాది టి20ల్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మకు 21వది. ఈ నేపథ్యంలో ఒక ఏడాదిలో అత్యధిక టి20 విజయాలు అందుకున్న సారథిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2021లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(20 విజయాలు) అందుకున్నాడు. తాజాగా బాబర్ను వెనక్కి నెట్టిన హిట్మ్యాన్ తొలిస్థానంలో నిలిచాడు. 2018లో పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 18 టి20 విజయాలు అందుకోగా.. 2016లో ఎంఎస్ ధోనీ 15 విజయాలు అందుకున్నాడు. ► ఈ ఏడాది 50+ పరుగుల తేడాతో విజయం అందుకోవడం టీమిండియాకి ఇది 10వ సారి. ఇదే ఏడాది 6 సార్లు 50+ పరుగుల తేడాతో విజయం అందుకున్న న్యూజిలాండ్ రెండో పొజిషన్లో ఉంటే, 2018లో పాకిస్తాన్ 5 సార్లు ఈ ఫీట్ సాధించింది.. ► ఓవరాల్గా రోహిత్ శర్మకు ఆటగాడిగా ఇది 100వ టి20 విజయం. ఇంతకుముందు పాక్ సీనియర్ క్రికెటర్ 87 టి20 విజయాల్లో భాగం పంచుకోగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. ► జింబాబ్వేతో జరిగిన టి20 మ్యాచ్లో సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది సూర్యకుమార్కు ఇది ఆరో అవార్డు కావడం విశేషం. 2016లో విరాట్ కోహ్లీ 6 సార్లు టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలవగా ప్రస్తుతం సూర్య దానిని సమం చేశాడు. చదవండి: అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం ఏమా కొట్టుడు.. 'మిస్టర్ 360' పేరు సార్థకం -
పొట్టి క్రికెట్లో ప్రపంచ రికార్డు.. ఒకే మ్యాచ్లో ఏకంగా 501 పరుగులు..!
టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) టీ20 ఛాలెంజ్ లీగ్ ఈ ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. పొట్టి క్రికెట్లో ఒక్క మ్యాచ్లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 501 పరుగులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్లో ఈ స్థాయిలో పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ లీగ్లో భాగంగా టైటాన్స్-నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 501 పరుగులు సాధించాయి. గతంలో టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్ల స్కోర్లు కలిపి) 497 పరుగులుగా ఉండింది. 2016లో సూపర్ స్మాష్ లీగ్లో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్-ఒటాగో మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు కలిపి ఈ స్కోర్ సాధించాయి. ఇక, అంతర్జాతీయ క్రికెట్లో ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగుల రికార్డు 2016లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో నమోదైంది. ఆ మ్యాచ్లో ఏకంగా 489 పరుగులు నమోదయ్యాయి. #CSAT20Challenge@Titans_Cricket claim a comfortable 41-run victory over @KnightsCricket in a game that broke the world record for the highest match aggregate in a T20 game - 5⃣0⃣1⃣ 🤯 🗒️ Ball by ball https://t.co/QxPLEjNMQg 📺 SuperSport 208#BePartOfIt #SummerOfCricket pic.twitter.com/yu4wsSfwxH — DomesticCSA (@DomesticCSA) October 31, 2022 ఇదిలా ఉంటే, సీఎస్ఏ లీగ్లో భాగంగా నైట్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. డెవాల్డ్ బ్రెవిస్ (57 బంతుల్లో 162; 13 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఛేదనలో నైట్స్ సైతం అదే రేంజ్లో రెచ్చిపోయి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి, లక్ష్యానికి 41 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో ఏకంగా 36 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్ల జాబితాలో ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. That record-breaking innings 🤯#CSAT20Challenge #BePartOfIt #SummerOfCricket pic.twitter.com/C7KLkPBHzD — DomesticCSA (@DomesticCSA) November 1, 2022 -
అలుపెరుగని బాటసారి.. 11 రోజులు నాన్–స్టాప్ జర్నీ.. ప్రపంచ రికార్డు
సిడ్నీ: పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది. ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్లోని పుకొరోకొరో మిరండా షోర్బర్డ్ సెంటర్ ప్రకటించింది. నీటిపై వాలితే మృత్యువాతే గాడ్విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్డబ్ల్యూ అనే గాడ్విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది. ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు. గాట్విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్విట్, హడ్సోనియన్ గాడ్విట్, మార్బ్ల్డ్ గాడ్విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి. -
ENG VS AFG: పొట్టి క్రికెట్లో ప్రపంచ రికార్డు.. చరిత్రలో రెండోసారి ఇలా..!
పొట్టి క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. టీ20 వరల్డ్కప్-2022 సూపర్-12 మ్యాచ్ల్లో భాగంగా ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 22) జరుగుతున్న మ్యాచ్ ఈ రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ సామ్ కర్రన్ (5/10) ధాటికి 19.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. కర్రన్కు జతగా బెన్ స్టోక్స్ (2/19), మార్క్ వుడ్ (2/23), క్రిస్ వోక్స్ (1/24) రాణించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఇబ్రహీం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) ఓ మోస్తరుగా రాణించారు. ప్రపంచ రికార్డు విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ల రూపంలో పెవిలియన్కు చేరారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇలా పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. ఇదే ఏడాది క్రెఫెల్డ్ వేదికగా ఆస్ట్రియా-జర్మనీ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో తొలిసారి పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్లో ఈ సీన్ రెండోసారి రిపీట్ అయ్యింది. ఇదిలా ఉంటే, 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఫజల్ హాక్ ఫారూఖీ బౌలింగ్లో బట్లర్ (18) ఔట్ కాగా.. అలెక్స్ హేల్స్ (11), డేవిడ్ మలాన్ క్రీజ్లో ఉన్నారు. -
Aadi Swaroopa: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
-
లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
ఈ అమ్మాయి గురించి తెలిసిన వారందరూ ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ యువతి పేరు ఆది స్వరూప. రెండు చేతులను సరి సమానంగా ఉపయోగించడం ఈమె ప్రత్యేకత. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల ఈ యువతి తన స్పెషల్ టాలెంట్తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకే సమయంలో రెండు చేతులతో ఇంగ్లీషు, కన్నడ, తుళు, హిందీ, మళయాలం భాషల్లోనూ రాయగలదు. ఒక నిమిషంలో తన రెండు చేతులతో ఒకే దిశలో 45 పదాలను లిఖించి ఎక్స్క్లూజివ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. లతా ఫౌండేషన్ ఈ రికార్డును గుర్తించింది. అంతేకాదు కళ్లగు గంతలు కట్టుకుని కూడా రెండు చేతులతో రాసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్వరూప సాధించిన రికార్డుకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా ఈ వీడియో ట్విటర్లో రీ షేర్ చేయడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. నెటిజన్ల ప్రశంసలు ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అని ఒకరు ప్రశంసించగా.. ‘త్రి ఇడియట్స్’ హిందీ సినిమాలో ‘వైరస్’పాత్ర చేసిన బొమన్ ఇరానీ గుర్తుకొచ్చారని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఆమె ప్రతిభ చాలా ప్రత్యేకమైందని మరికొంత మంది మెచ్చుకున్నారు. స్వరూప గురించి తెలిసిన వారంతా ఆమె గిన్నీస్ రికార్డు సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు. బహుముఖ ప్రతిభ ఆది స్వరూప.. బహుముఖ ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. నటన, చిత్రలేఖనం, అనుకరణ(మిమిక్రీ)లోనూ రాణిస్తోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2021లోనూ తన పేరును లిఖించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి తరచుగా పర్యాటక ప్రాంతాల విహారానికి వెళ్లే స్వరూపకు జంతువులన్నా, పక్షులన్నా ఎంతో ప్రేమ. అన్నట్టు తన వీడియోలు, ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటుంది. పాకిస్తాన్ బౌలర్ రికార్డు రెండు చేతులతో సమానంగా ఉపయోగించి పాకిస్తాన్ బౌలర్ యాసిర్ జాన్ 2017లో గిన్నీస్ రికార్డుకు ఎక్కాడు. తన కుడి చేతితో 145, ఎడమ చేతితో 135 కిలోమీటర్ల స్పీడ్తో బౌలింగ్ చేసి అతడు ఈ ఘనత సాధించాడు. -
Berlin: మారథాన్లో కిప్చోగె కొత్త ప్రపంచ రికార్డు
కెన్యా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ చాంపియన్ ఎలీడ్ కిప్చోగె మారథాన్లో తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. ప్రతిష్టాత్మక బెర్లిన్ మారథాన్లో 37 ఏళ్ల కిప్చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 1 నిమిషం 9 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2018 బెర్లిన్ మారథాన్లోనే 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్చోగె సవరించాడు. చదవండి: Julius Baer Generation Cup: రన్నరప్ ఇరిగేశి అర్జున్.. -
ప్రపంచ రికార్డుతో మెరిసిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్
ఇంగ్లండ్తో జరిగిన రెండో టి20లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లను చెడుగుడు ఆడిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లు పాక్కు ఒంటిచేత్తో విజయాన్ని అందించారు. తొలి టి20లో ఓటమికి బదులు తీర్చుకున్న పాకిస్తాన్ ఏడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్లో ఈ జంట ప్రపంచ రికార్డుతో పాటు మరికొన్ని రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. ►పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లు టి20 క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇంగ్లండ్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఈ ఇద్దరే ఉదేశారు. ఈ నేపథ్యంలో తమ పేరిటే ఉన్న పాత రికార్డును కూడా ఈ జంట బద్దలు కొట్టింది. ►203 పరుగుల భాగస్వామ్యం టీ20ల్లో పాకిస్థాన్ తరఫున అత్యధిక ఓపెనింగ్ స్టాండ్గా నిలవనుంది. ఇంతకముందు బాబర్-రిజ్వాన్ జోడి చేసిన 193 పరుగులు భాగస్వామ్యం ఇప్పటివరకు అత్యుత్తమంగా నిలిచింది. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. ►ఇక పాకిస్తాన్ జట్టుకు టి20ల్లో 10 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. ఇంతకముందు టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియాపై పాకిస్తాన్ 10 వికెట్లతో విజయం సాధించింది. ►ఇక బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్లు నెలకొల్పిన 203 పరుగులు భాగస్వామ్యం టి20 క్రికెట్లో ఏదైనా వికెట్కు ఐదో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. -
సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు
అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఇటలీలోని వెరోనాలో మంగళవారం జరిగిన యురోపియన్ ఛాంపియన్షిప్లో లిథువేనియాకు చెందిన 41 ఏళ్ల అలెగ్జాండర్ సోరోకిన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 24 గంటల్లో సోరోకిన్ 319.614 కిలోమీటర్ల దూరం పరిగెత్తి ప్రపంచ రికార్డు లిఖించాడు. కాగా అలెగ్జాండర్ సగటున ఒక కిలోమీటర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు.ఇంతకముందు అతని పేరిటే ఉన్న రికార్డుపే సోరోకిన్ బద్దలు కొట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో 24 గంటల్లో అతను 303.506 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాడు. తాజా రికార్డుపై 40 ఏళ్ల సోరోకిన్ ఇన్స్టాగ్రామ్లో స్పందించాడు. ''చాలా అలిసిపోయా.. కానీ రికార్డుతో డబుల్ ఆనందంతో ఉన్నా. విషయమేంటనేది అర్థమయిందిగా.. ప్రపంచ రికార్డు కొట్టడం ఒక ఎత్తయితే.. నా రికార్డును నేనే బద్దలు కొట్టడం మరింత సంతోషాన్నిచ్చింది.'' అంటూ తెలిపాడు. ఇక పొలాండ్కు చెందిన అథ్లెట్ పియోట్రోస్కీ 24 గంటల్లో 301.858 కిలోమీటర్ల దూరం పరిగెత్తి రెండో స్థానంలో నిలవగా.. ఇటలీకి చెందిన మార్కో విసినిటీ 288 కిలోమీటర్ల దూరం పరిగెత్తి మూడో స్థానంలో నిలిచాడు. Ultrarunning legend Aleksandr Sorokin has just smashed his own record (192.252 miles) of distance covered in 24 hours of running 🔥🇱🇹 The Lithuanian has just covered 318.8km / 198.1 miles (unofficial) – 7:15/mile and 4:30/km pace...over a day 🤯 pic.twitter.com/35pWdAE3Ug — AW (@AthleticsWeekly) September 18, 2022 View this post on Instagram A post shared by Aleksandr Sorokin (@ultrarunner_aleksandr_sorokin) చదవండి: Karman Kaur: భారత నంబర్వన్గా కర్మన్ కౌర్ ICC New Rules: అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. టి20 ప్రపంచకప్లో తొలిసారిగా -
ఆసియా కప్లో రోహిత్ శర్మ కొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి తన హిట్టింగ్ పవర్ చూపించాడు. ఆరంభంలోనే కోహ్లి, కేఎల్ రాహుల్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికి సూర్యకుమార్తో కలిసి రోహిత్ టీమిండియా ఇన్నింగ్స్ను నడిపించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న రోహిత్.. ఓవరాల్గా 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ అరుదైన రికార్డులు అందుకున్నాడు. ►ఆసియాకప్ టోర్నీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. టీమిండియా తరపున టోర్నీలో రోహిత్ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆసియాకప్లో టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్(971 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. తాజాగా రోహిత్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ►టీమిండియా తరపున 1016 పరుగులతో తొలి స్థానంలో ఉన్న రోహిత్.. ఓవరాల్గా ఆసియాకప్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో సనత్ జయసూర్య 1220 పరుగులు.. కుమార సంగక్కర 1075 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ►ఆసియాకప్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. ఇంతకముందు షాహిద్ అఫ్రిదితో కలిసి 40 సిక్సర్లతో సంయుక్తంగా ఉన్న రోహిత్ తాజాగా తొలి స్థానంలో నిలిచాడు. -
Rehana Shah Jahan: కేరళ అమ్మాయి ప్రపంచ రికార్డ్! 24 గంటల్లో ఏకంగా..
‘నేనింతే’ అనుకుంటే.. ‘అవును. అంతే’ అంటుంది విధి. అప్పుడు కాళ్లకు బంధనాలు పడతాయి. కలలు మసకబారిపోతాయి. ‘యస్. నేను సాధించగలను. ఆ శక్తి నాలో ఉంది అనుకుంటే మాత్రం కొత్త అడుగులు పడతాయి. మన విజయాలు సగర్వంగా మాట్లాడుతాయి...’ అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం రెహన షాజహాన్... ఒక్క మార్కుతో దిల్లీలోని ప్రసిద్ధ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఎంకాం సీటు మిస్ అయిన సందర్భంలో కేరళలోని కొట్టాయంకు చెందిన రెహన షాజహాన్ ముందు ప్రశ్న రూపంలో చీకటి నిల్చుని ఉంది. ఆ చీకట్లోనే, అక్కడే ఉండి ఉంటే రెహన ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచేది కాదు. సీటు మిస్ అయిన నిరాశలో నుంచి వేగంగా తేరుకొని, ఒకేసారి ఆన్లైన్లో సోషల్వర్క్, గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసింది. జామియా మిలియా ఇస్లామియాలో ఎంబీఏలో సీటు సంపాదించింది. ‘ఎంబీఏ సీటు సంపాదించడం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నేను సాధించగలను అనే బలాన్ని ఇచ్చింది’ అంటుంది రెహన. ‘మహిళలలో ఉన్న శక్తిసామర్థ్యాలు అపారం. వాటిని వారికి ఎరుకపరచడమే మా ధ్వేయం’ అనే నినాదంతో దిల్లీ కేంద్రంగా ‘వుమెన్స్ మ్యానిఫెస్టో’ అనే స్వచ్ఛంద సంస్థ మొదలైంది. ఈ సంస్థలో భాగం కావడం ద్వారా తన మానసిక దృక్పథాన్ని విశాలం చేసుకునే అవకాశం ఏర్పడింది. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, గృహహింస బాధితులకు అండగా నిలవడం, వారికి కావాల్సిన న్యాయసహాయాన్ని అందించడం, ఆరోగ్యం, శుభ్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్డడం...ఇలా కెరీర్ గైడెన్స్ నుంచి బాధితుల కన్నీరు తుడవడం వరకు ‘వుమెన్స్ మ్యానిఫెస్టో’ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహించింది. పాఠ్యపుస్తకాలు చదువుకున్న రెహనకు ‘ఉమెన్స్ మ్యానిఫెస్టో’ ప్రభావంతో సమాజాన్ని లోతుగా చదువుకునే అవకాశం లభించింది. వెబినార్ స్పీకర్, జోష్ టాక్స్ స్పీకర్గా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసింది. జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడానికి అవకాశం ఇచ్చే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ సంస్థల ఉచిత ఆన్లైన్ కోర్సుల గురించి తెలుసుకుంది. 24 గంటలలో 81 ఆన్లైన్ సర్టిఫికెట్లను సొంతం చేసుకొని ప్రపంచ రికార్డ్ సృష్టించింది. అంతకుముందు ఉన్న రికార్డ్ను బ్రేక్ చేసింది. ‘నీలో ఉన్న ధైర్యాన్ని నువ్వు కనిపెట్టేంత వరకు నువ్వు ఎంత ధైర్యవంతురాలివో నీకు తెలియదు. నీలోని శక్తి,సామర్థ్యాలను తెలుసుకునేంత వరకు నువ్వు ఎంత శక్తిమంతురాలిలో నీకు తెలియదు’ అంటున్న రెహన యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. రెహన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంలోని నుంచి కొంత... ‘మన కోసం ఒక అవకాశం ఎక్కడో ఒకచోట ఎదురుచూస్తుంటుంది. అది ఎక్కడ ఉందో తెలుసుకోవడమే మన పని. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా తక్కువ చేసి చూశారా? ఏమీ సాధించలేరనే వెక్కిరింపులు మీకు ఎదురయ్యాయా! అయితే మీరు నా గురించి తెలుసుకోవాల్సిందే. చిన్నప్పుడు అక్కయ్యతో పోల్చుతూ నన్ను చిన్నబుచ్చేవారు. మనకు ఏ సబ్జెక్ట్లో ఆసక్తి ఉందో ఆ సబ్జెక్ట్లోనే రాణిస్తాం. మంచి విజయాలు సాధిస్తాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సైన్స్ నుంచి కామర్స్కు మారాను. ఇక వెనక్కి చూసుకోవాల్సిన పనిలేదు. అయితే జామియా యూనివర్శిటీలో పీజీ సిట్ మిస్ అయిన క్షణం మాత్రం కొంచెం నిరాశకు గురయ్యాను. దీని నుంచి నేను గుణపాఠం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసం మంచిది, అతి ఆత్మవిశ్వాసం మాత్రం చెడ్డది’ ‘మీ ప్రసంగం విన్న తరువాత నన్ను నేను చాలా మార్చుకున్నాను’ అని యూట్యూట్ కామెంట్ సెక్షన్లో ఒకే వాక్యంలో తనలోని మార్పు గురించి రాసింది ఒక అమ్మాయి. రెహన షాజహాన్ స్ఫూర్తిదాయకమైన విజేత అని చెప్పడానికి ఆ అమ్మాయి కామెంట్ చాలు కదా! చదవండి: Divya Mittal: ఐ.ఏ.ఎస్ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి -
జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ వెటరన్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వంద టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా జేమ్స్ అండర్స్న్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. అండర్సన్ తర్వాతి స్థానంలో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(స్వదేశంలో 94 టెస్టులు) రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(స్వదేశంలో 92 టెస్టులు) మూడో స్థానంలో.. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(స్వదేశంలో 91 టెస్టులు) ఉన్నాడు. అండర్సన్ తర్వాత స్వదేశంలో వంద టెస్టులు ఆడే అవకాశం ప్రస్తుతం స్టువర్ట్ బ్రాడ్కు మాత్రమే ఉంది. ఇటీవలే 40వ పడిలో అడుగుపెట్టిన అండర్సన్.. వయసు మీద పడుతున్నా బౌలింగ్లో మాత్రం పదును అలాగే ఉండడం విశేషం. ఇక 19 ఏళ్ల కెరీర్లో అండర్సన్ ఇంగ్లండ్ తరపున 174 టెస్టులాడి 658 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అండర్సన్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు) ఉండగా.. రెండో స్థానంలో ఆసీస్ దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు) ఉన్నాడు. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రారంభమైన రెండో టెస్టును మాత్రం పాజిటివ్ నోట్తో ఆరంభించింది. లంచ్ విరామం అనంతరం సౌతాఫ్రికా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు, స్టోక్స్, బ్రాడ్ తలా రెండు వికెట్లు తీశారు. 19 years after his Test debut at Lord's, James Anderson has another milestone at home 🏴 pic.twitter.com/kMh7aFSh10 — ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2022 చదవండి: Asia Cup 2022: 'దీపక్ చహర్ గాయపడలేదు.. ఆ వార్తలు నమ్మకండి' SA vs ENG: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ -
దీపక్ హుడా ఉంటే టీమిండియా గెలిచినట్టే..
-
ప్రపంచ రికార్డుకు చేరువగా.. భారత్ తరపున తొలి ఆటగాడిగా
టీమిండియా యంగ్ ఆల్రౌండర్ దీపక్ హుడా ముందు ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. జింబాబ్వేతో వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో గెలిస్తే ఒక రికార్డు.. సిరీస్ గెలిస్తే ఇంకో రికార్డు.. ఇలా అతని పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. టీమిండియాలో మరెవరికి సాధ్యం కాని యునివర్సల్ రికార్డు దీపక్ హుడా పేరిట లిఖించుకునే అవకాశం ఉంది. మరి ఆ యునివర్సల్ రికార్డు కథాకమీషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గతేడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున అద్బుత ప్రదర్శన చేశాడు. అనంతరం బరోడా తరపున దేశవాలీ క్రికెట్లో దుమ్మురేపి ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. ఇక దీపక్ హుడా ఇప్పటి వరకూ 14 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 9 టీ20లు, 5 వన్డేలు ఉండగా.. అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియాదే విజయం కావడం విశేషం. దీంతో దీపక్ హుడా జట్టులో ఉంటే గెలుపు ఖాయమనే ప్రచారం మొదలైంది. మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తూ విధ్వంసకర హిట్టింగ్తో టీమిండియాకు స్లాగ్ ఓవర్లలో భారీ స్కోర్లు అందించడమే గాక.. బౌలింగ్లోనూ ఆఫ్ స్పిన్నర్గా తన సేవలందిస్తున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం వరుసగా 14 మ్యాచ్ల్లో విజయాల్ని చూసిన భారత ఆటగాడు ఎవరూ లేరు. ఈ విషయంలో మాత్రం దీపక్ హుడా చరిత్ర సృష్టించాడు. అయితే.. ఓవరాల్గా మాత్రం ఈ రికార్డ్లో రొమానియాకి చెందిన సాత్విక్ నదిగొట్ల 15 మ్యాచ్లతో టాప్లో ఉన్నాడు. సాత్విక్, దీపక్ హుడా తర్వాత దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ (13 మ్యాచ్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక శంతను వశిష్ట్ (రొమేనియా)-13 విజయాలు, కొల్లిస్ కింగ్ (వెస్టిండీస్)-12 విజయాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఒకవేళ జింబాబ్వేతో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే దీపక్ హుడా వరుస 15 విజయాలతో రొమేనియా ఆటగాడు సాత్విక్ నదిగొట్టతో సంయుక్తంగా తొలిస్థానం పంచుకోనున్నాడు. ఒకవేళ రెండో వన్డేలోనూ టీమిండియా విజయం సాధించి సిరీస్ గెలిస్తే.. దీపక్ హుడా 16 వరుస విజయాలతో టాప్ స్థానాన్ని ఆక్రమించే అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. ఒకవేళ జింబాబ్వేపై సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం.. ఆ మూడు మ్యాచ్ల్లోనూ దీపక్ హుడా ఆడితే మాత్రం అతని విజయాల పరంపరకు బ్రేక్ పడనట్లే. మరి ఇది ఎక్కడ ఆగుతుందో వేచి చూడాలి. చదవండి: Kabaddi Game: కబడ్డీ నింపిన విషాదం.. వారం రోజులు మృత్యువుతో పోరాడి ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ.. నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్లు! -
దేశభక్తి గీతాలాపనలో రాజస్తాన్ విద్యార్థుల రికార్డు
జైపూర్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాజస్తాన్లోని కోటి మంది పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించారు. వందేమాతరం, సారే జహాసె అచ్చా తదితరాలను విద్యార్థులు 25 నిమిషాలపాటు ఆలపించారు. శుక్రవారం సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన దేశభక్తి గీతాలాపన ప్రధాన కార్యక్రమంలో రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ మాట్లాడారు. రికార్డు సాధనలో పాలుపంచుకున్న విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘కోటి మంది విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలను విని లండన్ నుంచి ప్రఖ్యాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు సర్టిఫికెట్ పంపడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఇన్ఛార్జి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
హెలికాప్టర్కి వేళ్లాడుతూ.... క్రేజీ గిన్నిస్ రికార్డు
ఇంతవరకు పలు గిన్నిస్ రికార్డులు చూశాం. విచిత్రంగా గోళ్లు లేదా జుట్టు పెంచడం వంటివి చేసి రికార్డు సృష్టిస్తారు. మరికొందరూ తమ ప్రతిభా పాటవాలతో అందర్నీ అబ్బురపరుస్తూ ప్రపంచ రికార్డు సృష్టిస్తారు. కానీ ఇక్కడోక వ్యక్తి అందరిలా కాకుండా అన్నింటికంటే భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా చేసి గిన్నిస్ రికార్డులో కెక్కాడు . వివరాల్లోకెళ్తే....డచ్ ఫిట్నెస్ జౌత్సాహికుడు స్టాన్ బ్రౌనీ, తన సహచర అథ్లెట్ అర్జెన్ ఆల్బర్స్తో కలిసి యూట్యూబ్ ఛానెల్ని నడుపుతున్నాడు. ఈ ఇద్దరు అథ్లెట్లు గాల్లో హెలికాప్టర్కి వేళ్లాడుతూ ఫుల్ అప్ ఎక్సర్సైజులు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం వారాల తరబడి ప్రాక్టీస్ చేశారు చూడా. అదీగాక బ్రౌనీ కాలిస్టెనిక్స్కి సంబంధించిన జెమ్నాస్టిక్స్లో నిపుణుడు. ఈ మేరకు బ్రౌనీ జూలై 6, 2022న బెల్జియంలోని ఆంట్వెర్ప్లో హోవెనెన్ ఎయిర్ఫీల్డ్లో ఈ క్రేజీ రికార్డ్ను బద్దలు కొట్టాడు. అతను గాల్లో హెలికాప్టర్కి వేళ్లాడుతూ ఒక నిమిషం వ్యవధిలో దాదాపు 25 పుల్ అప్ ఎక్సర్సైజులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని సహచర అథ్లెట్ ఆల్బర్స్ గత అమెరికన్ రోమన్ సహ్రద్యన్ రికార్డుని బ్రేక్ చేస్తూ ఒక నిమిషంలో 24 పుల్ అప్ ఎక్సర్సైజులు చేశాడు. కానీ బ్రౌనీ ఈ రికార్డును కూడా బద్దలు కొడుతూ ఏకంగా ఒక నిమిషంలో 25 చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డు పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్లో ఆహుతైన వాహనాలు) -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డేల్లో ప్రపంచ రికార్డు..
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ భారత్ను గెలిపించాడు. అఖరి ఓవర్లో టీమిండియా విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే లభించాయి. అయితే నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన అక్షర్ పటేల్ భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి దాంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. తద్వారా వన్డేల్లో ప్రపంచ రికార్డును భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. 2006 నుంచి ఇప్పటి వరకు విండీస్పై వరుసగా 12 వన్డే సిరీస్ల్లో టీమిండియా విజయం సాధించింది. ఇక జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్ల్లో విజయం సాధించిన పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టాస్: విండీస్- బ్యాటింగ్ వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) సెంచరీతో చెలరేగిన షై హోప్(115 పరుగులు) భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్) అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) చదవండి: IND Vs WI 2nd ODI: నరాలు తెగే ఉత్కంఠ.. విండీస్పై టీమిండియా ఘన విజయం -
కెప్టెన్లను మార్చడంలో టీం ఇండియా ప్రపంచ రికార్డు
-
World Athletics Championship: పసిడి... ప్రపంచ రికార్డు
యుజీన్ (అమెరికా): రేసు మొదలైన వెంటనే ట్రాక్పై వాయువేగంతో దూసుకెళ్తూ... ఒక్కో హర్డిల్ను అలవోకగా అధిగమిస్తూ... ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెడుతూ... ఎవరూ ఊహించని సమయంలో లక్ష్యానికి చేరిన అమెరికా మహిళా అథ్లెట్ సిడ్నీ మెక్లాఫ్లిన్ తన పేరిట నాలుగోసారి ప్రపంచ రికార్డును లిఖించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భాగంగా శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ ఈవెంట్లో 22 ఏళ్ల సిడ్నీ మెక్లాఫ్లిన్ 50.68 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచ రికార్డు సాధించినందుకు సిడ్నీకి లక్ష డాలర్లు (రూ. 79 లక్షల 84 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. ఫెమ్కే బోల్ (నెదర్లాండ్స్; 52.27 సెకన్లు) రజతం, దాలియా మొహమ్మద్ (అమెరికా; 53.13 సెకన్లు) కాంస్యం సాధించారు. బంగారు పతకం గెలిచే క్రమంలో సిడ్నీ గత నెల 25న 51.41 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. గత 13 నెలల కాలంలో సిడ్నీ ప్రపంచ రికార్డును తిరగరాయడం ఇది మూడోసారి కావడం విశేషం. మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జావెలిన్ను 61.12 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంలో నిలువగా... డిఫెండింగ్ చాంపియన్ కెల్సీ బార్బర్ (ఆస్ట్రేలియా; 66.91 మీటర్లు) స్వర్ణం సాధించింది. -
కెప్టెన్లను మార్చడంలోనూ రికార్డే.. ప్రపంచ రికార్డును సమం చేసిన భారత్
విజయాలు, పరాజయాలు, వ్యక్తిగత రికార్డులు పక్కన పెడితే మరో విషయంలోనూ భారత క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డులను బద్దలుకొడుతుంది. నిన్న (జులై 22) విండీస్తో జరిగిన తొలి వన్డేతో ఓ ఏడాదిలో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన జట్టుగా టీమిండియా రికార్డుల్లోకెక్కింది. ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ మంది కెప్టెన్లను మార్చిన దేశంగా శ్రీలంక పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. 2017లో శ్రీలంక ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చగా.. తాజాగా విండీస్తో జరిగిన మ్యాచ్తో టీమిండియా ఆ రికార్డును సమం చేసింది. విండీస్తో వన్డేకు శిఖర్ ధవన్ కెప్టెన్గా వ్యవహరించడంతో ఈ ఏడాది భారత జట్టు కెప్టెన్ల సంఖ్య ఏడుకు చేరింది. 1959లో కూడా భారత జట్టుకు ఇంచుమించు ఇలాగే కెప్టెన్లను మార్చింది. ఆ ఏడాది వినూ మన్కడ్, హేమూ అధికారి, దత్తా గైక్వాడ్, పంకజ్ రాయ్, గులాబ్ రాయ్ రాంచన్ లు టీమిండియా సారధులుగా వ్యవహరించారు. ఈ ఏడాది టీమిండియా కెప్టెన్లు వీరే.. విరాట్ కోహ్లి (సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్) కేఎల్ రాహుల్ (సౌతాఫ్రికాతో వన్డేలు) రోహిత్ శర్మ (సౌతాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్లు) రిషభ్ పంత్ (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్) హార్ధిక్ పాండ్యా (ఐర్లాండ్లో టీ20 సిరీస్) జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లండ్ తో రీషెడ్యూల్ 5వ టెస్ట్) శిఖర్ ధవన్ (వెస్టిండీస్తో వన్డే సిరీస్) ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన జట్లు.. భారత్ - 2022 - ఏడుగురు కెప్టెన్లు శ్రీలంక - 2017 - ఏడుగురు కెప్టెన్లు జింబాబ్వే - 2001 - ఆరుగురు కెప్టెన్లు ఇంగ్లండ్ - 2011 - ఆరుగురు కెప్టెన్లు ఆస్ట్రేలియా - 2021 - ఆరుగురు కెప్టెన్లు చదవండి: రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన శ్రేయస్ అయ్యర్ -
తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..!
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్వెల్ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బ్రేస్వెల్ ఈ ఘనత సాధించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన బ్రేస్వెల్.. మూడు, నాలుగు, ఐదు బంతుల్లో వరుస వికెట్లు తీసి తొలి హ్యాట్రిక్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా తన టీ20 కెరీర్లో ఇదే అతడికి తొలి ఓవర్. మూడో బంతికి మార్క్ అడైర్ బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగగా.. నాలుగో బంతికి మెక్ గ్రాతీ, ఐదో బంతికి క్రెగ్ యంగ్ పెవిలియన్కు చేరారు. ఈ మ్యాచ్లో కేవలం 5 బంతులే వేసిన అతడు ఐదు పరుగులతో పాటు మూడు వికెట్లు సాధించాడు. కాగా జూలై 18న ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రేస్వెల్కు ఆ మ్యాచ్లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో న్యూజిలాండ్ బౌలర్గా బ్రేస్వెల్ నిలిచాడు. అంతకుమందు జాకబ్ ఓరమ్,టిమ్ సౌథీ ఈ ఘనత సాధించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్ను 88 పరుగుల తేడాతో కివీస్ చిత్తు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 91 పరుగులకే కుప్ప కూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోధి, మైఖేల్ బ్రేస్వెల్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. జాకబ్ డఫీ రెండు, లాకీ ఫెర్గూసన్ ఒక్క వికెట్ సాధించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో మార్క్ అడైర్ 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ క్లీవర్ 78 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఇక మూడు మ్యాచ్లో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో కివీస్ సొంతం చేసుకుంది. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్..! Michael Bracewell can't Do anything Wrong Hat-trick in his First Over of T20 Internationals is just amazing and Unbelievable 🥵pic.twitter.com/nIPmvgCmjM — ⚡ (@Visharad_KW22) July 20, 2022 -
బ్లాక్రాక్ ‘ఆస్తులు’ ఆవిరి!
న్యూఢిల్లీ: మార్కెట్లో మామూలు ఇన్వెస్టర్లే కాదు. కాకలు తీరిన కంపెనీలూ దెబ్బతింటాయి. ఏకంగా 10 లక్షల కోట్ల డాలర్ల ఆస్తులున్న బ్లాక్రాక్ లాంటి దిగ్గజం కూడా గడిచిన ఆరు నెలల్లో స్టాక్ మార్కెట్ ఆటుపోట్లను తట్టుకోలేకపోయింది. ఈ సంస్థ ఏకంగా తన నిర్వహణ ఆస్తుల్లో లక్షా డెబ్బై వేల కోట్ల డాలర్లను (రూ.136 లక్షల కోట్లు) కోల్పోయింది. అది కూడా ఆరు నెలల కాలంలో. ఇది ఓ ప్రపంచ రికార్డు కూడా. గతంలో ఎన్నడూ ఓ సంస్థ ఆరు నెలల కాలంలో ఇంతలా నిర్వహణ ఆస్తులను కోల్పోలేదు. నిజానికి 2022 తొలి ఆరు నెలలు ప్రపంచ క్యాపిటల్ మార్కెట్లకు ఏమాత్రం కలసి రాలేదనే చెప్పుకోవాలి. ఈ ప్రతికూలతలను ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థలు సాధ్యమైన మేర అధిగమించే ప్రయత్నాలు చేశాయి. కానీ, బ్లాక్రాక్పై మార్కెట్ పరిణామాల ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే ఈ సంస్థ నిర్వహణ ఆస్తుల్లో మూడొంతులు ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్లోనే ఉన్నాయి. పెట్టుబడుల పరంగా మారిన ఇన్వెస్టర్ల ప్రాథాన్యతలు సైతం ఈ సంస్థ ఆస్తులపై ప్రభావం చూపించాయి. ఈ సంస్థ నిర్వహించే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్లో పావు శాతమే బెంచ్మార్క్ కంటే మెరుగైన పనితీరు చూపించాయి. 8.49 లక్షల కోట్ల డాలర్లు.. జూన్ చివరికి బ్లాక్రాక్ మొత్తం నిర్వహణ ఆస్తులు 8.49 లక్షల కోట్ల డాలర్లకు పరిమితం అయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలం నుంచి చూస్తే 11 శాతం క్షీణించాయి. అసలు బ్లాక్రాక్ మూలాలు యాక్టివ్ ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్)లోనే ఉన్నాయని చెప్పుకోవలి. 2002లో మొదటి యూఎస్ డోమిసిల్డ్ బాండ్ ఈటీఎఫ్ను ఆరంభించగా, గత పదేళ్ల కాలంలో యాక్టివ్ ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లోకి 280 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2022 జూన్ 30 నాటికి 954 బిలియన్ డాలర్ల ఆస్తులను యాక్టివ్ బాండ్ ఫండ్స్లో నిర్వహిస్తుంటే.. యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్లోని నిర్వహణ ఆస్తులు 393 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఈ ఏడాది బాండ్ మార్కెట్ కుప్పకూలడం యాక్టివ్ ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు బయటకు వెళ్లేందుకు దారితీసింది. ‘‘స్టాక్స్, బాండ్స్కు 2022 అత్యంత చెత్త ఆరంభంగా మిగిలిపోతుంది’’ అని బ్లాక్రాక్ చైర్మన్, సీఈవో లారీఫింక్ ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. -
తొమ్మిది నిమిషాల్లో 5 గోల్స్.. ఫుట్బాల్లో కొత్త మొనగాడు
ఫుట్బాల్లో పెను సంచలనం నమోదైంది. బేయర్న్ మ్యూనిచ్ ఫుట్బాల్ క్లబ్ ఆటగాడు రాబర్ట్ లెవాండోస్కీ కొత్త చరిత్ర నమోదు చేశాడు. కేవలం తొమ్మిది నిమిషాల వ్యవధిలో ఐదు గోల్స్ కొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ అద్బుత దృశ్యం జర్మన్ క్లబ్ వోల్ఫ్స్బర్గ్, బేయర్ మ్యూనిచ్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది. ఆట 50, 53, 54, 56, 59వ నిమిషం.. ఇలా 9 నిమిషాల వ్యవధిలోనే రాబర్ట్ లెవాండోస్కీ ఐదు గోల్స్ కొట్టాడు. ఇందులో 53,54,56 వ నిమిషాలు హ్యాట్రిక్ గోల్స్ కాగా.. ఓవరాల్గానూ 5-గోల్స్ హాల్ సాధించాడు. ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్గా వచ్చి ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంత చేశాకా బేయర్న్ మ్యూనిచ్ గెలవకుండా ఉంటుందా. లెవాండోస్కీ జోరుతో గతేడాది ఓటమికి జర్మన్ క్లబ్ వోల్ప్స్ బర్గ్పై పనిలో పనిగా ప్రతీకారం తీర్చుకుంది.ఇక లెవాండోస్కీ లాంటి స్ట్రైకర్ కోసం అన్ని ఫుట్బాల్ క్లబ్స్ ఎదురుచూస్తున్నాయి. మంచి అటాకింగ్ గేమ్ కనబరిచే లెవాండోస్కీ.. 'ఫుట్బాల్లో కొత్త మొనగాడు వచ్చాడంటూ' అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. Never forget when Robert Lewandowski scored five goals in nine minutes as a sub ⚡ (via @FCBayernUS)pic.twitter.com/03wY6cyo85 — B/R Football (@brfootball) July 15, 2022 చదవండి: Tiger Woods: కన్నీటి పర్యంతమైన టైగర్వుడ్స్ Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్.. కెరీర్కు గుడ్బై -
రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ సీనియర్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా రీఎంట్రీ మ్యాచ్లోనే అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో యాసిర్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యాసిర్ షా ఐదో స్థానానికి చేరుకున్నాడు. లంక సీనియర్ బ్యాట్స్మన్ ఏంజెల్లో మాథ్యూస్ను ఔట్ చేయడం ద్వారా యాసిర్ టెస్టుల్లో 237వ వికెట్ను దక్కించుకున్నాడు. తద్వారా అబ్దుల్ ఖాదీర్(236 వికెట్లు)ను దాటిన యాసిర్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక యాసిర్ షా కంటే ముందు పాక్ దిగ్గజ బౌలర్లు వసీమ్ అక్రమ్(414 వికెట్లు), వకార్ యూనిస్(373 వికెట్లు), ఇమ్రాన్ ఖాన్(362 వికెట్లు), దానిష్ కనేరియా(261) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక యాసిర్ షా పాకిస్తాన్ క్రికెట్లో పెను సంచలనం. వైవిధ్యమైన బౌలింగ్తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ►2014లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యాసిర్ షా పాకిస్తాన్ తరపున 50 వికెట్లు అత్యంత వేగంగా తీసిన బౌలర్గా నిలిచాడు. ►టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని(17 టెస్టుల్లో 100 వికెట్లు) అందుకున్న ఆటగాడిగా మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ►200 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆటగాడిగా యాసిర్ షా చరిత్ర. 33 టెస్టుల్లో యాసిర్ 200 వికెట్లు సాధించాడు. అంతకముందు ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమెట్(36 టెస్టుల్లో 200 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉంది. ►ఇప్పటివరకు యాసిర్ షా పాకిస్తాన్ తరపున 47 టెస్టుల్లో 237 వికెట్లు, 25 వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ఫీట్ను 16 సార్లు అందుకున్నాడు. ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్న యాసిర్ షా లంకతో టెస్టులో మంచి ప్రదర్శననే ఇచ్చాడు. 21 ఓవర్లు వేసిన యాసిర్ షా 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. అజర్ అలీ (3), బాబర్ ఆజం(1) క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులకు ఆలౌట్ అయింది. చండీమల్ 76 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మహీస్ తీక్షణ 38 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. యాసిర్ షా, హసన్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు. -
టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 82 పరుగులు..!
ఇంగ్లండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మాట్ మెకరైన్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విటాలిటీ బ్లాస్ట్ టీ20లో సోమర్సెట్,డెర్భీషైర్ మధ్య జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మెకరైన్ ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా మెకరైన్ నిలిచాడు. అంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ బౌలర్ సర్మద్ అన్వర్ పేరిట ఉండేది. 2011లో సూపర్ ఎలైట్ టీ20 కప్లో అన్వర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 81 పరుగులు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్లో ఈ రికార్డును మెకరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెర్భీషైర్పై సోమర్ సెట్ 191 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. సోమర్సెట్ బ్యాటర్లలో రోసోవ్ (93),బాంటన్(73) పరుగులతో చెలరేగారు. ఇక 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెర్భీషైర్ 74 పరుగులకే కుప్పకూలింది. సోమర్సెట్ బౌలర్లలో పీటర్ సిడిల్,గ్రీన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. లూయిస్ గ్రెగొరీ రెండు ,ఓవర్టాన్ ఒక్క వికెట్ సాధించారు. -
ఒకే ఓవర్లో 29 పరుగులు.. బుమ్రా ప్రపంచ రికార్డు..!
టెస్టు క్రికెట్లో టీమిండియా ఆటగాడు, స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్తో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఏకంగా బుమ్రా 29 పరుగులు రాబట్టాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను బుమ్రా తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్గా ఈ ఓవర్లో బ్రాడ్ ఆరు ఎక్స్ట్రాలతో కలిపి 35 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుమందు 2003లో జొహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్.పీటర్సన్ బౌలింగ్లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా 28 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు వరకు అదే ప్రపంచ రికార్డు కాగా.. ఇప్పుడు బుమ్రా 29 పరుగులు సాధించి లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో రిషబ్ పంత్(146), జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, పొట్స్ 2 వికెట్లు,బ్రాడ్,రూట్,స్టోక్స్ తలా వికెట్ సాధించారు. చదవండి: ENG vs IND: టెస్టుల్లో జడేజా అరుదైన ఫీట్.. నాలుగో భారత ఆటగాడిగా..! BOOM BOOM BUMRAH IS ON FIRE WITH THE BAT 🔥🔥 3️⃣5️⃣ runs came from that Broad over 👉🏼 The most expensive over in the history of Test cricket 🤯 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - https://t.co/tsfQJW6cGi#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/Hm1M2O8wM1 — Sony Sports Network (@SonySportsNetwk) July 2, 2022 -
100 మీటర్ల రేసులో 105 ఏళ్ల బామ్మ కొత్త చరిత్ర
100 మీటర్ల పరుగు పందెంలో 105 ఏళ్ల రామ్బాయి కొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో ఈ బామ్మ వంద మీటర్ల రేసులో భాగంగా 45.40 సెకన్లలోనే గమ్యాన్ని చేరింది. అయితే సమాచారం ప్రకారం ఈ రేసులో రామ్బాయి తప్ప మరెవరు పాల్గొనలేదంట. కేవలం 100 ఏళ్లు పైబడిన వారికే నిర్వహించిన రేసులో రామ్బాయి ఒక్కరే పాల్గొన్నారు. ఎవరు పోటీ లేకపోవడం.. తన రికార్డును తానే బద్దలు కొట్టి గమ్యాన్ని చేరిన రామ్బాయికి స్వర్ణ పతకం అందజేశారు. కాగా అదే రోజున నిర్వహించిన 200 మీటర్ల స్ప్రింట్ను ఒక నిమిషం 52.17 సెకన్లలో గమ్యాన్ని అందుకొని స్వర్ణం సాధించడం విశేషం. కాగా 100, 200 మీటర్ల రేసులో విజయం సాధించిన తర్వాత రామ్బాయిని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో అభినందించారు. అనంతరం ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక ఇదే గుంపులో రామ్బాయి మనవరాలు.. అథ్లెట్ అయిన షర్మిలా సంగ్వాన్ కూడా ఉంది. తన నానమ్మ విజేతగా నిలవడంతో ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆమె మాట్లాడుతూ.. ''మా నానమ్మ విజయం మాకు గర్వకారణం. ఈ విజయానికి ఆమె అర్హురాలు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఉదయాన్నే లేచి 3-4 కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తడం ఆమెకు అలవాటు. ఇది ఆమెను మరింత బలంగా తయారయ్యేలా చేసింది.'' అంటూ పేర్కొంది. At 105 years, super grandma sprints new 100m record. #Rambai ran alone in #Vadodara as there was no competitor above 85 competing at the National Open Masters Athletics Championship pic.twitter.com/iCIPTOkuFt — TOI Bengaluru (@TOIBengaluru) June 21, 2022 చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని -
82 ఏళ్లు.. 24 గంటలు.. 125 కిలోమీటర్లు
ఇవేం లెక్కలబ్బా... అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? బార్బరా హంబర్ట్ అనే ఫ్రాన్స్ మహిళ రికార్డులివి. గత నెలాఖరులో జరిగిన ఫ్రెంచ్ చాంపియన్షిప్లో 24 గంటల్లో 125 కిలోమీటర్లు పరుగెత్తి ప్రపంచరికార్డు సృష్టించింది 82 ఏళ్ల బార్బరా. 24 గంటల్లో 105 కిలోమీటర్లు పరుగెత్తి ఓ జర్మన్ మహిళ నెలకొల్పిన రికార్డును బార్బరా బ్రేక్ చేసింది. ఆ వయసులో అలా పరుగెత్తిందంటే ఆమె జీవితమంతా రన్నింగేనేమో అనుకోకండి. తనకు 43 ఏళ్ల వయసులో అంటే తన కూతురు హైస్కూల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ టైమ్లో రన్నింగ్ మొదలుపెట్టారామె. మొదట బౌఫ్మాట్వీధులకే పరిమితమైన బార్బరా పరుగు... తరువాత మారథాన్స్ దాకా వెళ్లింది. ఈ 39 ఏళ్ల కాలంలో పారిస్, న్యూయార్కుల్లో జరిగిన 137 రేసులు, 54 మారథాన్స్లో పాల్గొన్నది. ‘మొదట మెడిటేషన్లాగా మొదలుపెట్టాను. కానీ వీధుల్లో పరుగెడుతున్నప్పుడు కలిగిన స్వేచ్ఛా భావన నాకో స్పష్టతనిచ్చింది. అప్పటినుంచి పరుగును ఆపలేదు’ అంటుంది బార్బరా. అంతేకాదు.. పరుగు పూర్తయ్యేవరకు దాహం, ఆకలి, నిద్ర అన్నింటినీ మరిచిపోతుంది. ముగింపు లైన్ దాటాకే ఆమెకు అలసట గుర్తొస్తుంది. 14 గంటల రేసులో ఆమెతోపాటు ఉండి... అవసరమైనవల్లా అందించిన ‘మై హస్బెండ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అంటారు బార్బరా. ఆ వయసులో పరుగు మొదలుపెడితే అడ్డంకులేం ఎదురు కాలేదా? అంటే... చాలా గాయాలయ్యాయి. నొప్పులొచ్చాయి. అయినా ఇవేవీ ఆమె పరుగును ఆపలేకపోయాయి. ఎలాంటి మందులు వేసుకోను, కేవలం ట్రైనింగ్నే నమ్ముతానని చెప్పే బార్బరా.. రన్నింగ్ను వదిలేస్తే మాత్రం నిరుత్సాహం ఆవహిస్తుందంటారు. -
అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును తిరగరాసిన ఆఫ్ఘాన్ బౌలర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో ఆఫ్ఘాన్ యువ బౌలర్ నూర్ అహ్మద్ చరిత్ర తిరగరాశాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 17 ఏళ్ల నూర్ అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శనతో (4/10) జట్టును విజయపథంలో నడిపించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ అయిన నూర్ 17 ఏళ్ల 162 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. ఆఫ్ఘాన్కే చెందిన రహ్మానుల్లా గుర్భాజ్ 17 ఏళ్ల 354 రోజుల్లో, పాకిస్థాన్కు చెందిన మహ్మద్ అమీర్ 18 ఏళ్ల 84 రోజుల్లో అంతర్జాతీయ టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే, ఆతిధ్య జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో నూర్, అష్రాఫ్ (2/13) చెలరేగడంతో పర్యాటక ఆఫ్ఘానిస్థాన్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా.. ఛేదనలో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. అంతకుముందు జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను కూడా ఆఫ్ఘానిస్థాన్ 3-0 తేడాతో వైట్వాష్ చేసింది. చదవండి: మరో శతకం దిశగా దూసుకెళ్తున్న క్రీడా మంత్రి -
ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు... బనానా రికార్డు!
Banana Bonanza: అరటి పండ్లను ఇలా వరుసగా పేర్చారేమిటని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలోని షికాగోకు చెందిన జ్యువెల్ ఓస్కో అనే సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వాహకులు ఇలా పండ్లను పేర్చడం ద్వారా సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇందులో పెద్ద గొప్పేం ఉంది.. ఎవరైనా ఈ రికార్డు సృష్టించొచ్చు అనుకుంటున్నారా? కానీ ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు మరి.. ఇందుకోసం వాడిన అరటిపండ్లు ఎన్నో తెలిస్తే మీరు అవాక్కవుతారు.. ఎందుకంటే ఏకంగా 31,751 కిలోల అరటిపండ్లను ఇలా వరుసగా పేర్చారు. అంటే ఒక్కో అరటిపండు సుమారు 100 గ్రాముల బరువు ఉంటుందనుకుంటే ఈ రికార్డు కోసం వాడిన అరటిపండ్ల సంఖ్య సుమారు 3 లక్షలన్నమాట! ఇలా అరటిపండ్లను వరుసగా పేర్చడానికి స్టోర్ నిర్వాహకులకు 3 రోజుల సమయం పట్టిందట. ఈ రికార్డుతో బ్రెజిల్లో 2016లో 18,805.83 కిలోల అరటిపండ్లను పేర్చడం ద్వారా నమోదైన గిన్నిస్ రికార్డు తెరమరుగైంది. గిన్నిస్ ప్రతినిధులు ఈ రికార్డును ధ్రువీకరించాక ఆ అరటిపండ్లలో కొన్నింటిని సూపర్ మార్కెట్కు వచ్చిన వినియోగదారులకు నిర్వాహకులు పంచిపెట్టారు. మిగిలిన వాటిని ఉత్తర ఇల్లినాయీ ఆహార బ్యాంకుకు పంపారు. The folks from @GWR have surveyed the display and it's official! We have a new WORLD RECORD! Our roving banana reporter Leslie Harris is LIVE at the @jewelosco in Westmont (@westmontilgov) with the latest fruit-related news!#Westmont #Bananas #LotsofBanans #WorldRecord pic.twitter.com/n5Qobn13YA — 95.9 The River (@959TheRiver) June 8, 2022 (చదవండి: దురదృష్టకరమైన ఘటన... గాయపడిన పక్షిని రక్షించడమే శాపమైంది) -
రెండేళ్లకే ‘హైరేంజ్’
వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన శివాన్ష్ నాగ ఆదిత్య(2) ఏ టూ జెడ్ వరకు క్రమబద్ధంగా ఆంగ్ల అక్షరాలు ఉచ్ఛరిస్తూ, అనుబంధ ఆంగ్ల పదాలు చెబుతూ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాడు. గ్రామానికి చెందిన కసుమర్తి శ్రీనివాస్, సరిత దంపతుల కుమారుడైన ఆదిత్య చిన్న వయసులోనే ఆంగ్లపదాలు క్రమపద్ధతిలో పలకడం నేర్చుకున్నాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి బాలుడి ప్రతిభ తెలియపరుస్తూ వీడియోను 2021 ఫిబ్రవరిలో పంపించారు. బాలుడి ప్రతిభ గుర్తించి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేస్తూ సర్టిఫికెట్ను శుక్రవారం బాలుడి తల్లిదండ్రులకు పంపించారు. బాలుడిని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అభినందించారు. -
దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్..!
దక్షిణాఫ్రికాతో తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇరు జట్లు మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా గరువారం జరగనుంది. అయితే తొలి టీ20కు ముందు భారత్ను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. టీమిండియా తన చివరి 12 టీ20 మ్యాచ్లలో వరుస విజయాలు సాధించింది. ప్రోటీస్తో జరగనున్న తొలి వన్డేలో భారత్ గెలుపొందితే.. టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు(13) సాధించిన జట్టుగా రికార్డులకెక్కుతుంది. ఇప్పటికే ఆఫ్గానిస్తాన్, రోమానియా జట్లు వరుసగా 12 మ్యాచ్ల్లో విజయాలు సాధించి భారత్తో సమానంగా నిలిచాయి. ఇక తొలి టీ20కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్గా రిషభ్ పంత్ను బీసీసీఐ నియమించింది. తుది జట్లు (అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ చదవండి: Ind Vs SA: పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా! -
ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్.. బెంగాల్ జట్టు ప్రపంచ రికార్డు
రంజీ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఫీట్ చోటుచేసుకుంది. జట్టులో ఉన్న టాప్-9 మంది ఆటగాళ్లు కనీసం హాఫ్ సెంచరీతో మెరిశారు. బెంగాల్, జార్ఖండ్ల మధ్య జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బుధవారం ఈ అద్భుతం జరిగింది. ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో టాప్-9 మంది బ్యాటర్స్ ఒకే ఇన్నింగ్స్లో కనీసం అర్థసెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకముందు 1893లో ఆస్ట్రేలియాకు చెందిన 8 మంది బ్యాటర్లు ఆక్స్ఫర్డ్ అండ్ కేమ్బ్రిడ్జ్ యునివర్సిటీ జట్టుపై అర్థసెంచరీలు సాధించారు. ఈ 8 మంది వరుసగా టాప్-8 బ్యాటర్స్ మాత్రం కాదు. కానీ తాజాగా బెంగాల్ జట్టు మాత్రం ఈ విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. బెంగాల్ జట్టులో వరుసగా తొమ్మిది మంది బ్యాటర్స్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్ సాధించారు. ఈ తొమ్మిది మందిలో సుదీప్ గరామీ(380 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 186 పరుగులు), అనుస్తుప్ మజుందార్(194 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 117 పరుగులు) సెంచరీలతో మెరవగా.. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 65, మరో ఓపెనర్ అభిషేక్ రమణ్ మొదట 41 పరుగుల వద్ద రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. మజుందార్ ఔటైన తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి 61 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఐదో స్థానంలో వచ్చిన ఎంపీ మనోజ్ తివారి 73 పరుగులతో ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ అభిషేక్ పొరేల్ 68 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్లో చివరి వికెట్గా వెనుదిరిగిన షాబాజ్ అహ్మద్ 78 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిదో స్థానంలో వచ్చిన మోండల్ 53 నాటౌట్, ఆకాశ్దీప్( 18 బంతుల్లో 8 సిక్సర్లతో 53 పరుగులు) టి20 తరహాలో అలరించాడు. ఇలా తొమ్మిది మంది బ్యాటర్లు కనీసం హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో బెంగాల్ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జార్ఖండ్ 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ సౌరబ్ తివారీ 25, విరాట్ సింగ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ నిజామ్ సిద్దికీ 53 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్ కుమార్ డియోబ్రాత్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చదవండి: Ranji Trophy 2022: నమ్మశక్యం కాని క్యాచ్.. వీడియో వైరల్ రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర; ఎవరీ సువేద్ పార్కర్ Bengal Creates History!#Cricket #FirstClassCricket #Bengal #RanjiTrophy pic.twitter.com/BN8gziQNrB — CRICKETNMORE (@cricketnmore) June 8, 2022 -
హైదరాబాద్: వరల్డ్ బుక్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన చిన్నారి
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ బుక్ రికార్డ్స్లో స్థానం సంపాదించి ఆ చిన్నారి అబ్బుర పరిచింది.. వచ్చీ రాని మాటలతో సరిగా పదాలే పలకలేని చిన్నారి ఏకంగా ప్రీహిస్టారికల్ అనిమల్స్ పేర్లను చకా చకా చెబుతూ ఆశ్యర్య చకితులను చేస్తోంది.. నిజాంపేట్ సిరిబాలాజీ టవర్స్లో నివాసముండే మధు కుమార్తె నాలుగేళ్ల గొట్టుముక్కుల నితీషా కేవలం 30 సెండ్ల వ్యవధిలోనే అత్యధిక ప్రీహిస్టారిక్ యానిమల్స్ను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. చిన్నారి జ్ఞాపక శక్తిని గమనించిన తల్లి మధు ఆమెకు ప్రీహిస్టారిక్ యానిమల్స్కు సంబంధించిన వీడియోలను చూపించారు. వీడియో చూసే క్రమంలో ఠక్కున సదరు జంతువుల పేర్లను చెప్పడం ప్రారంభించింది. దీంతో చిన్నారి తల్లి మధు ప్రీహిస్టారికల్ యానిమల్స్ పేర్లు చెబుతున్న క్రమంలో వీడియోలు తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపించారు. చిన్నారి ఘనతను గుర్తిస్తూ ఈ నెల 23న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి, 21న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి కన్షర్మేషన్ లెటర్లు అందాయని చిన్నారి తల్లి మధు ‘సాక్షి’ కి తెలిపారు. -
ప్రపంచంలోనే పొట్టి టీనేజర్గా బహదూర్.. రికార్డు బలాదూర్
World's shortest teen: ప్రపంచంలోనే పొట్టి టీనేజర్ (మగవాళ్లలో)గా నేపాల్కు చెందిన డోర్ బహదూర్ ఖపంగి గిన్నిస్ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల బహదూర్ కేవలం 73 సెంటీమీటర్ల పొడవే ఉన్నారు. ప్రపంచంలోనే పొట్టి వ్యక్తి రికార్డు కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ పేరిట ఉంది. ఈయన ఎత్తు 70 సెంటీమీటర్లు. ఇంతకుముందు ఈ రికార్డు 67 సెంటీమీటర్ల ఎత్తుండే ఖగేంద్ర థాపా మగర్ పేరిట ఉండేది. అయితే ఈయన 2020లో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే పొట్టి మహిళ రికార్డు భారత్కు చెందిన జ్యోతి అమ్గే పేరిట ఉంది. ఈమె ఎత్తు కేవలం 62 సెంటీమీటర్లు. (చదవండి: ఇల్లంతా దోచేసి...ప్రేమలేఖ పెట్టి పారిపోయిన దొంగలు) -
అతి చిన్న బైబిల్
బైబిల్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న ఈ బైబిల్ చూడాలంటే మాత్రం బ్రిటన్లోని లీడ్స్ సిటీ లైబ్రరీకి వెళ్లాలి. అంతేకాదు... చదవాలంటే భూతద్దం కావాలి. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న బైబిల్. ఐదు సెం.మీ. పొడవు... మూడున్నర సెం.మీ. వెడల్పు, పలుచటి ఇండియన్ పేపర్తో దీన్ని రూపొందించారు. సాధారణంగా బైబిల్స్ పాతనిబంధన, కొత్త నిబంధన ప్రకారం విడివిడిగా ఉంటాయి. కానీ రెండింటినీ కలిపి 876 పేజీల్లో ప్రింట్ చేశారు. 1911లో రూపొందించినట్టుగా భావిస్తున్న ఈ బైబిల్ 16వ శతాబ్దానికి చెందిన ‘చైన్డ్ బైబిల్’ అనుకరణగా భావిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో లీడ్స్ లైబ్రరీలో ఎన్నో పురాతన పుస్తకాలను కనిపెట్టారు. దాదాపు 3 వేల పుస్తకాలను వెలుగులోకి తేగలిగారు. కొన్ని 15వ శతాబ్దానికి చెందినవి కూడా అందులో ఉన్నాయి. ఆ సమయంలోనే ఈ టినీ బైబిల్ లైబ్రేరియన్ కంటపడింది. ఈ టినీ బైబిల్ పబ్లిష్ అయిన కాలంలో అతి చిన్న బైబిల్గా నమోదైందని, కానీ ఇది నిజం కాకపోవచ్చని స్పెషల్ కలెక్షన్స్ సీనియర్ లైబ్రేరియన్ రిహాన్ ఇస్సాక్ చెబుతున్నారు. ఇదెక్కడినుంచి వచ్చిందన్న సమాచారం కూడా తమ దగ్గర లేదని, ఎవరైనా డొనేట్ చేసిందై ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. అయితే... ఇదే అతి చిన్నదా? ఇంతకుముందేమైనా ఉన్నాయా? వంటి విషయాలన్నీ పక్కన పెడితే.. ఆ బైబిల్ను చూసేందుకు విద్యావేత్తలు, పరిశోధకులు వస్తారని లైబ్రరీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఆసక్తి ఉంటే సాధారణ పౌరులు సైతం వచ్చి ఈ బైబిల్ చదవొచ్చని లైబ్రేరియన్ ఇస్సాక్ చెబుతున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్