రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | young man killed in road accident | Sakshi

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Oct 26 2015 4:52 PM | Updated on Aug 30 2018 3:56 PM

గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండకు చెందిన యువకుడు మృతి చెందాడు.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం మండాదిగోడు గ్రామ శివారులో సోమవారం జరిగింది.

మాచెర్ల వైపు వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న అటవీ శాఖ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  టాటా ఏస్ వాహనం పైన కూర్చొని ఉన్న యువకుడు మృతిచెందాడు. మృతుడు నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లికి చెందిన గాలి శ్రీహరి(22)గా గుర్తిచారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement