
సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం వైఎస్ జగన్ సంతరావురు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రాధాకృష్ణ నగర్, అంబేద్కర్ కాలనీ మీదుగా వేటపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. జననేత అడుగులో అడుగు వేస్తూ ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రజాసంకల్పయాత్రలో రాజన్న బిడ్డ ఇప్పటివరకు 1,444.7 కిలోమీటర్లు నడిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్తో మహిళా కార్యకర్తలు కేట్ కట్ చేయించారు. ఈ సందర్భంగా మహిళలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment