పోలాండ్‌లో వరదరాజుపల్లె విద్యార్థి మృతి | YSR kadapa District Student Died in Poland | Sakshi
Sakshi News home page

పోలాండ్‌లో వరదరాజుపల్లె విద్యార్థి మృతి

Published Fri, Dec 21 2018 11:56 AM | Last Updated on Fri, Dec 21 2018 11:56 AM

YSR kadapa District Student Died in Poland - Sakshi

శ్రీనాథ్‌రెడ్డి (ఫైల్‌)

వైఎస్‌ఆర్‌ జిల్లా, అట్లూరు : మండలంలోని వరదరాజుపల్లె గ్రామానికి చెందిన మాచునూరు శ్రీనాథ్‌రెడ్డి (23) జర్మనీలోని పోలాండ్‌లో మృతి చెందినట్లు మృతుని బంధువులు గురువారం తెలిపారు.  శ్రీనాథ్‌రెడ్డి పోలాండ్‌లో బ్యాచులర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఎంఎస్‌ చేస్తున్నాడని,  సోమవారం రాత్రి అతను ఉంటున్న గదికి వచ్చి ఇంటికి ఫోన్‌ చేశాడని, మంగళవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం అందిందన్నారు. ఎలా చనిపోయాడో సమాచారం ఇంత వరకు తెలియరాలేదని వారు తెలిపారు.

శోకసంద్రంలో తల్లిదండ్రులు
రమణారెడ్డి, సుజాత దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు కాగా పెద్దవాడైన శ్రీనాథ్‌రెడ్డి చదువులో రాణిస్తుండటంతో ఉన్నత చదువులు చదివించాలనే ఆశయంతో జర్మనీకి పంపించారు. ఎదిగి వచ్చిన కుమారుడు కన్ను మూయడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement