‘గాలేరు-నగరి’ సాధనకు రోజా పాదయాత్ర | YSRCP MLA Roja Starts Padayatra For Galeru-Nagari | Sakshi
Sakshi News home page

‘గాలేరు-నగరి’ సాధనకు రోజా పాదయాత్ర

Published Tue, Nov 28 2017 11:32 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

YSRCP MLA Roja Starts Padayatra For Galeru-Nagari - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, తిరుమల : గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు తాగునీరు, సాగునీటి కోసం గాలేరు-నగరి ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.

ప్రాజెక్టు కోసం చేపడుతున్న పాదయాత్ర నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమై తిరుమల వరకు సాగుతుందని వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీ శ్రీవారిని దర్శించుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రార్థిస్తామన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. పాదయాత్రలో పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement