'రాయలసీమకు నీటి విడుదల చేయకపోవడం అన్యాయం'
కడప: శ్రీశైలం ప్రాజెక్ట్లో నీరు 854 అడుగులు దాటినా రాయలసీమకు నీటి విడుదల చేయకపోవడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్ బాషాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్ట్లకు నీటి విడుదల చేసిన తర్వాతే దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రిజర్వు బ్యాంక్, ఇతర బ్యాంక్లు రీ షెడ్యూల్ కుదరదన్నా ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని రవీంద్రనాధ్ రెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో రైతులు, ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్ బాషా అన్నారు.