rayalaseema
-
‘చంద్రబాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం’
సాక్షి, అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని మాజీ చీఫ్ విప్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాయచోటి ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. తాజాగా రాయచోటి పర్యటన సందర్భంగా సీఎం హోదాలో కొత్త విద్యాసంస్థలు, రాయచోటి నీటికష్టాలకు పరిష్కారంను ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు చంద్రబాబు తీవ్ర నిరాశను మిగిల్చారని అన్నారు.శ్రీకాంత్రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:చంద్రబాబు నిస్సిగ్గు అబద్ధాలు:చంద్రబాబు అంటేనే చేయాల్సింది చేయడు.. ఇతరులు చేసిందంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం అని అందరికీ తెలుసు. ఈ దేశంలో ఐటీకి తానే మూల పురుషుడుగా, హైదరాబాద్కు ఐటీని పరిచయం చేసిన విజనరీగా తనను తాను సిగ్గు లేకుండా పరిచయం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ది చెందింది. గణనీయమైన ఆదాయాన్ని సాధించింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేలా తానే ఐటీని కనిపెట్టినట్లు చెప్పుకుంటున్నాడు. చివరికి హైదరాబాద్ను సైతం తానే అభివృద్ధి చేసినట్లు చెప్పాడు. నిన్న (శనివారం) ఐటీ ఉద్యోగులను పక్కన పెట్టుకుని రాయచోటిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారని అందరూ ఆశించారు.కానీ చంద్రబాబు చెంత ఉన్న ఐటీ ఉద్యోగులు ‘‘మేం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం, మేం సంపాదించినది పార్టీ కోసం ఖర్చు చేశాం, ఎన్నికల్లో పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నాం. గ్రామాల్లో మేమే పార్టీ బాధ్యత తీసుకున్నాం’’ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రాంతానికి సీఎం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడే అవకాశం లభించినప్పుడు యువతకు స్పూర్తిదాయకమైన మాటలు చెబుతారని అందరూ భావించారు. కానీ దానిని కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం విడ్డూరంగా ఉంది. దానికి తగినట్లుగా చంద్రబాబు మండల స్థాయిలోనే ఐటీ టవర్స్ నిర్మిస్తాను, వర్క్ ఫ్రం హోంను కూడా తానే కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పే మాటలు వింటే మరింత ఆశ్చర్యం కలిగించింది.స్థానిక సమస్యలపైన ఎందుకు మాట్లాడలేదు?:వైఎస్ జగన్ హయాంలో రాయచోటి ప్రజలకు నీటి కష్టాలు తప్పించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు తగ్గిపోయినా కూడా ప్రత్యామ్నాయంగా గండికోటలో నిల్వ చేసిన నీటిని వాడుకునేందుకు ప్రణాళిక సిద్దం చేశాం. కాలేటివాగును ఒక టీఎంసీకి అభివధ్ధి చేసి, అక్కడి నుంచి వెలిగల్లుకు నీటిని పంపించేందుకు వీలుగా పనులకు శ్రీకారం చుట్టాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే డెబ్బై శాతం పనులు కూడా పూర్తి చేశాం. దాని మిగిలిన పనులను పూర్తి చేస్తామని చంద్రబాబు తన పర్యటనలో ఒక్క మాట కూడా చెప్పలేదు.రాయచోటి ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఒక్క విద్యాసంస్థను కూడా ప్రకటించలేదు. మహిళా జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, రెండో ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో సాధించుకున్నాం. రాయచోటిలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ఇప్పటికే 80 ఎకరాలు భూమిని కూడా సేకరించి సిద్దంగా ఉంచాం. ఈ కాలేజీని ప్రైవేటీకరించ వద్దంటూ విద్యార్ధులు ప్రశ్నిస్తే, వారిని సంఘ విద్రోహశక్తులు అంటూ నిందిస్తారా? యూనివర్సిటీకి నిధులు, కొత్త కలెక్టరేట్ భవనాలు, గండికోట నుంచి నీటని అందించే ప్రాజెక్ట్ వంటి వాటిపై చంద్రబాబు మాట్లాడతారని అందరూ అనుకున్నారు.కానీ ఎప్పటిలాగానే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. ఈ ప్రాంత ప్రజలను మోసగించారు. మభ్యపెట్టే మాటలతో ప్రజలను వంచించారు. కర్నూలులో శాశ్వత హైకోర్ట్ కావాలంటే, దానికి బదులుగా బెంచ్ తో సరిపెట్టారు. కొప్పర్తి పారిశ్రామికవాడను ఆనాడు వైయస్ఆర్, ఆ తరువాత వైఎస్ జగన్ ప్రత్యేక సెచ్గా అభివద్ధి చేశారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చంద్రబాబు చొరవ చూపాలి. చేసింది చెప్పాలే కానీ.. జరిగిందంతా తానే చేసినట్లు చెప్పుకోవడం సరికాదు.గ్రామాల్లోనూ నాడు ఐటీకి ప్రాధాన్యం:సీఎంగా వైఎస్ జగన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనులు చేసుకోవాలనే ఆలోచనతో గ్రామ స్థాయిలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిని కొనసాగించకుండా చంద్రబాబు ఆ నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు మండల స్థాయిలో ఐటీ టవర్స్ నిర్మిస్తానని చెప్పడం చంద్రబాబు రెండు నాలుకల ధోరణికి, ద్వంద వైఖరికి నిదర్శనం.సంపద సృష్టించడం గురించి ప్రజలకు చెప్పడం కాదు, వారు సంపద సృష్టించుకునేలా ప్రభుత్వం పని చేయాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ముఖ్యమంత్రిగా ఆదుకున్నది వైఎస్ జగన్. ఈ రోజు అన్ని అవకాశాలు ఉన్నా, కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కోటిన్నర మందికి పైగా అర్హులైన మహిళలు చంద్రబాబు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. యాబై ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఈ ఏడాది రైతుభరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు.సాగునీటి ప్రాజెక్ట్లపై అడుగడుగునా నిర్లక్ష్యం:చంద్రబాబు ఏనాడూ తన హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నా, ఆయన ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే, తరువాత దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆ ప్రాజెక్టులు వృథా అని మాట్లాడారు. హంద్రీనీవా నుంచి 40 టీఎంసీలు రావు. కేవలం 5 టీఎంసీల నీరే వస్తాయని ఏకంగా జీఓ ఇచ్చారు. అలాగే గండికోటను 20 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు కుదించి జీఓ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత జలయజ్ఞంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ను ఐదేళ్లలో అడివిపల్లి వరకు 90 శాతం కాలువ పనులు పూర్తి చేశారు. 27 టీఎంసీల సామర్థ్యంతో కూడిన గండికోట ప్రాజెక్ట్, దానిలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన ఘనత వైఎస్ జగన్ది. చంద్రబాబు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కృష్ణా బ్యారేజీ వద్ద టీడీపీ వారితో ధర్నాలు చేయించారు.ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీరు అందుతోంది. ఏడు నెలలు ఇన్ ఫ్లో ఉన్న కష్ణానదిలో ఈ రోజు డెడ్ స్టోరేజీ స్థాయికి నీటిని తోడేశారు. రాయలసమీకు ఎలా నీరు ఇస్తారో చంద్రబాబు చెప్పాలి. గతంలో పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇస్తానంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎలా ఇస్తారో చెప్పండి అంటే దానిపై మాట్లాడరు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?ఇప్పుడు కొత్తగా బనకచర్ల అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బనకచర్ల క్రాస్ నుంచి సరైన అవగాహన చంద్రబాబుకు లేదు. దీనిని ఎలా పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పగలరా? రాష్ట్ర ప్రజలకు కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కుదిస్తున్నా చంద్రబాబు మాట్లడటం లేదు. పోలవరం నుంచి కష్ణా బ్యారేజీకి, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు, అక్కడి నుంచి వెలుగొండ ద్వారా బనకచర్ల క్రాస్ కు నీటిని తరలిస్తారో సరైన ప్రణాళిక ఉందా?ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ:మీడియా సమావేశం అనంతరం ఈనెల 5న పార్టీ తలపెట్టిన ఫీజు పోరు పోస్టర్ను పార్టీ సీనియర్ నేత ఆకెపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకెపాటి అమర్నాధ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఎనిమిది నెలల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. రైతుసమస్యలు, పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్సార్సీపీ ఇప్పటికే ఆందోళనలు చేసింది.తాజాగా విద్యార్ధులకు సకాలంలో చెల్లించాల్సిన ఫీజు, స్కాలర్ షిప్ బకాయిలను కూడా చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రతి పేద విద్యార్ధి చదువుకోవాలని ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టారు. దీనితో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రోఫెషనల్ కోర్స్ లతో తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. నేడు చంద్రబాబు పేద, మధ్యతరగతి విద్యార్ధుల ఆశలపై నీళ్ళు చల్లుతున్నారు. విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల అయిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను చేపడుతున్నాం. -
KSR Live Show: జగన్ కు భయపడే ఇదంతా!
-
చలి పంజా
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది. సాధారణంగా ఈ సమయంలో 22 నుంచి 26 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఏజెన్సీ ప్రాంతాల్లో 18 నుంచి 22 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండేవి. కానీ.. తాజాగా మైదాన ప్రాంతాల్లోనే 18 నుంచి 24 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ రీజియన్లోనూ చాలాచోట్ల 12 నుంచి 20 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు మించడం లేదు.ఏజెన్సీలో చలి విజృంభణచలితో ఏజెన్సీలో ప్రజలు వణుకుతున్నారు. మళ్లీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు శుక్రవారం పడిపోయాయి. సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి సమయంలో చలిప్రభావం మరింత అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. అరకులోయలో 8.2 డిగ్రీలు, జి.మాడుగుల 9, డుంబ్రిగుడ 9.2, అనంతగిరి 9.5, జీకే వీధి 9.8, పాడేరు మండలం మినుములూరు 10, హుకుంపేట 10.5, చింతపల్లి 10.6, కొయ్యూరు 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి.వణుకుతున్న ఏజెన్సీఅల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో డిసెంబర్ 16న అతి తక్కువగా 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోయారు. ఈ నెల 4న అరకు సమీపంలోని కుంటలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, అనంతగిరి, డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో 7 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే చాలాచోట్ల ఏజెన్సీలో 12 నుంచి 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అంతకంతకు పడిపోతున్నాయి. రాయలసీమలోని వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 23 డిగ్రీల వరకూ పడిపోయాయి.ఎల్నినో ప్రభావమే కారణంనైరుతి రుతుపవనాలు తిరోగమించే సమయంలో ఈసారి రాష్ట్రమంతటా వర్షాలు కురిశాయి. డిసెంబర్ చివరి వరకూ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. ఎల్నినో ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేకువజామున మంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి.దట్టమైన మంచులో వాహనాలు వెళ్లేందుకు దారులు కనిపించడంలేదు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటితే గానీ మంచు వీడటం లేదు. చలికి చల్లగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు సైతం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. -
సీమలో పుట్టి.. సీమకే షాకిచ్చిన చంద్రబాబు
-
హంద్రీ–నీవా.. చుక్కాని లేని నావ!
సాక్షి, అమరావతి : దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. సీమకు కల్పతరవు వంటి హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దు చేసింది. ప్రధాన కాలువ ప్రవా హ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకే పరిమితం చేసింది. తద్వారా సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తా గు నీటికీ తల్లడిల్లాల్సిన దుస్థితిలోకి సీమ ప్రజలను నె ట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజులపాటు 3,850 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోస్తేనే హంద్రీ–నీవా ద్వారా సీమకు 40 టీఎంసీలు అందించవచ్చు. హంద్రీ–నీవాపై ఆధారపడి చేపట్టిన భైరవా నితిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, 68 చెరువుల పథకం, కర్నూలు నగరానికి తాగు నీటి కోసం గాజులదిన్నెకు 3 టీఎంసీల తరలింపు.. తదితర ప్రాజెక్టులకు మరో 25 టీఎంసీలు అవసరమని ప్రభుత్వమే తేల్చింది. అంటే.. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 65 టీఎంసీలు ఎత్తిపోయాలి. ఇందుకోసం శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 196 రోజులు ఎత్తిపోయాలి. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టులో అన్ని రోజులు వరద ప్రవాహం, నిల్వ ఉండదు. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–1 తీర్పు అమల్లో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు 811 టీఎంసీల నికర జలాలను వినియోగించుకున్న తర్వాతే హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేస్తామని ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 2,578 టీఎంసీలను పూర్తిగా వాడుకున్న తర్వాతే హంద్రీ–నీవాకు మిగులు జలాలను విడుదల చేస్తామని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రానున్న సంవత్సరాల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవాకు నీటిని ఎత్తిపోసేందుకు అవకాశమే ఉండదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవకాశం ఉన్న రోజుల్లో కూడా కేవలం 3,850 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోయడం వల్ల కనిష్ట స్థాయిలో మాత్రమే హంద్రీ–నీవాకు నీటిని తరలించే పరిస్థితి ఉంటుందని తేల్చి చెబుతున్నారు.తెలంగాణ దోపిడీ..ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎన్నడూ లేని రీతిలో జూన్ నుంచి ఇప్పటి వరకు 1,575.62 టీఎంసీల నీటి ప్రవాహం వచ్చింది. జూన్ 2న శ్రీశైలం ప్రాజెక్టులో 806.2 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నప్పుడే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటి తరలింపును ప్రారంభిస్తే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఆగస్టు 2 నుంచి హంద్రీ–నీవాకు నీటి ఎత్తిపోతలను ప్రారంభించింది. రోజుకు కనిష్టంగా 253 నుంచి గరిష్టంగా 1,695 క్యూసె క్కుల చొప్పున ఎత్తిపోయడం వల్ల ఆగస్టు 2 నుంచి బు« దవారం వరకు అంటే 152 రోజుల్లో కేవలం 19.65 టీ ఎంసీలను మాత్రమే తరలించగలిగింది. శ్రీశైలం ప్రా జెక్టులో ఏడాదికి 33 టీఎంసీలు ఆవిర వుతాయి. అంటే.. ఆవిరయ్యే నీటిలో 59 శాతం మేర కూడా హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు తరలించలేదన్నది స్ప ష్టమవుతోంది. ఎడమ గట్టు కేంద్రం నుంచి తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రా జె క్టు నుంచి దిగువకు నీటిని తరలించేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులో ఇక ఎన్ని రోజులు నీరు నిల్వ ఉంటుందో చెప్పలేని పరిస్థితి. దీన్ని బట్టి సీమ ప్రజలకు కూట మి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నది స్పష్టమవుతోంది.తాగునీటికీ కష్టాలే.. పరిశ్రమలు మూతే » శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలు తరలించి, రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరు, 33 లక్షల మందికి తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టు చేపట్టారు. 2009 నాటికే తొలి దశ పనులు పూర్తవడంతో 2012 నుంచి నీటిని తరలిస్తున్నారు.» 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పూర్తి సామర్థ్యం మేరకు హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, సీమను సస్యశ్యామలం చేసింది. గతంలో చంద్ర బాబు 2014–19 మధ్య అధికారంలో ఉన్న ప్పుడుగానీ, ఇప్పుడుగానీ హంద్రీ–నీవా సా మ ర్థ్యం మేరకు నీటిని తరలించిన దాఖలాలు లేవు. » వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే రోజులు తగ్గడం వల్ల కృష్ణా నుంచి శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో గరిష్ట స్థాయిలో నీటిని ఒడిసి పట్టి.. హంద్రీ–నీవా నుంచి తరలించే ఎత్తిపోతలు, ప్రధా న కాలువ (–4.806 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టేందుకు రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. » కాలువలో నీటి ప్రవాహం లేనప్పుడు కాంట్రాక్టర్లు పనులు చేపడుతున్నారు. రోజుకు 6,300 క్యూసెక్కుల చొప్పున 120 రోజులు తరలిస్తేనే హంద్రీ–నీవా, దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు 65 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకే పరిమతం చేయడం.. బ్రిజేష్కు మార్ ట్రిబ్యునల్కు స్పష్టం చేసిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే సీమలో 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందే అవకాశమే లేదని, గుక్కెడు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కియా వంటి పరిశ్రమల అవసరాలకు నీటి లభ్యత ఉండదని, ఇది సీమలో ఉపాధి అవకాశాలను మరింత దెబ్బ తీస్తుందని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
AP Rains: ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది -
తిరుమలలో భారీ వర్షం.. సీమకు ఎల్లో అలర్ట్
సాక్షి, తిరుమల/విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఒకవైపు వర్షం.. పెరిగిన చలి తీవ్రత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తిరుమలలో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డుల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండటంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, గోగర్భం, పాపవినాశనం జలాశయాలలో పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. వర్షం కారణంగా తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోసా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.#tirupati #tirumala #HeavyRain pic.twitter.com/8uN6R5FHr4— tirupati weatherman (@TPTweatherman) December 12, 2024ఇదిలా ఉండగా.. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ కాలనీ, కోర్లగుంట, సత్యనారాయణ పురం, లక్ష్మి పురం సర్కిల్లో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరుకుంది. వెస్ట్ చర్చి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా చేరుకుంది. దీంతో, వన్ వేలోనే వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిస్తున్నారు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. -
రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన
-
‘ఫెంగల్’ దోబూచులాట!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట రూరల్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను దాగుడుమూతలాడుతోంది. దీన్ని ట్రాక్ చేసేందుకు వాతావరణ శాఖ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇది బుధవారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండం నుంచి తుపానుగా మారినట్లే మారి కాస్తా బలహీనపడిపోయింది. దీంతో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. మళ్లీ తుపానుగా బలపడే అవకాశాలున్నా.. ఎప్పుడనే దానిపై అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది. తుపాను వ్యతిరేక శక్తిలా పనిచేస్తున్న బలమైన గాలులతో కూడిన షియర్ జోన్.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తుపానుకు వ్యతిరేక దిశలో ఇది కొనసాగుతుండటంవల్ల.. 48 గంటలు గడిచినా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని.. ఈ కారణంగానే ఫెంగల్ ముందుకు కదల్లేకపోతోందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఈ తీవ్ర వాయుగుండం గంటకు కేవలం 10 కిమీ వేగంతో నెమ్మదిగా కదులుతూ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ట్రింకోమలికి 200 కిమీ, పుదుచ్ఛేరికి ఆగ్నేయంగా 410 కిమీ, చెన్నైకి దక్షిణాగ్నేయంలో 470 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా సముద్రంలోనే బలహీనపడనుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్న క్రమంలో.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలైన కరైకల్, మహాబలిపురం మధ్య 30వ తేదీ ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 50–60 కిమీ.. గరిష్టంగా 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఒకవేళ తుపానుగా బలపడితే మాత్రం గంటకు 65–75 కిమీ.. గరిష్టంగా 85 కిమీ వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.నేటి నుంచి వర్షాలు..ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. అలాగే 30 నుంచి డిసెంబరు 2 వరకూ కోస్తాంధ్ర అంతటా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. ఈఓఎస్–06, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాల సహాయంతో ఫెంగల్ తుపాను కదులుతున్న తీరుపై ఇస్రో అధికారులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. -
ఏపీని భయపెడుతున్న తుపాను
సాక్షి, విశాఖ: తమిళనాడుతో పాటు ఏపీని కూడా తుపాను భయపెడుతోంది. ఈ రాత్రికి తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంటోంది. ఫెంగల్ తుపాను సమీపించే కొద్దీ.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తాయని హెచ్చరిస్తోంది... ఇప్పటికే దక్షిణ కోస్తా భారీ వర్షాలు, తీవ్ర గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు నేపథ్యంలో వ్యవసాయ పనులు చేసే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అధికార యంత్రాంగం. ఇక.. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. .. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. రాగల రెండ్రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అన్నారాయన.ఏపీపై తుపాను ప్రభావం వారంపాటు కొనసాగనుంది. రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో.. దక్షిణ కోస్తా. రాయలసీమ, ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఈ నెల 30వ తేదీ దాకా మత్య్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు ఇదివరకే జారీ అయ్యాయి. ఇంకోవైపు.. తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. -
25న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు చలిగాలులు ప్రారంభమైన తరుణంలో... భారీ వర్షాలు మరోసారి విరుచుకుపడనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, 25 నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. క్రమంగా.. ఇది దక్షిణకోస్తా మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనీ.. లేదంటే.. దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే సూచనలు కూడా ఉన్నాయని వివరించారు. దీని ప్రభావంతో 25 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. 23 నుంచి తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు 23 నుంచి 27 వరకూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
AP: అలా చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రాజుకోవా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాయలసీమకు మోసం చేసే పనులు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనూహ్య విజయాలు అందించిన రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు. కర్నూలు నుంచి న్యాయవ్యవస్థకు చెందిన పలు కార్యాలయాలు, కడప నుంచి కేంద్ర ప్రబుత్వానికి చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు చర్యలు చేపట్టడం ఆ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే. సీమ ప్రజల మనసులను గాయపరిచినట్లే. కర్నూలులో హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టింది. జ్యుడిషియల్ సిటీ నిర్మాణానికి సుమారు 273 ఎకరాల స్థలమూ కేటాయించింది. నేషనల్ లా యూనివర్శిటీ కోసం వంద ఎకరాలు ఇవ్వడమే కాకుండా రూ.వెయ్యి కోట్లు మంజూరు కూడా చేశారు. అయితే ఇప్పుడు వివిధ ఆఫీసులతోపాటు లా యూనివర్శిటీని కూడా తరలించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అన్న సందేహం వస్తోంది. 201419 మధ్యకాలంలోనే అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్ను చంద్రబాబు అండ్ కో మంగళగిరి తరలించింది. తాజాగా పులివెందులలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరైన యాభై ఎంబీబీఎస్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వదులుకుంది. ఇవన్నీ ఆయన రాయలసీమకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నట్లుగానే చూడాలి. రాయలసీమ, ప్రత్యేకంగా కర్నూలు అన్నది ఒక సెంటిమెంట్. మద్రాస్ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం అంతా భాగంగా ఉండేది. ఆ రోజులలో తెలుగు వారిని కూడా ఢిల్లీలో మదరాసీలు అనేవారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఆకాంక్షతో కోస్తా ప్రాంత నాయకులు ఇందుకోసం ప్రజలను సమీకరించడం ఆరంభించి పలు చోట్ల సభలను పెట్టేవారు. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన రాజకీయ పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లాలని తలపెట్టారు. కానీ అప్పటికే కృష్ణా, గోదావరి నదులపై కొన్ని ప్రాజెక్టులు కోస్తాలో ఉండడం, తద్వారా రైతులు ఆర్థికంగా ముందంజలో ఉండటం తదితర కారణాలను చూపుతూ రాయలసీమ నేతలు పలు సందేహాలను లేవనెత్తారు. ఆ దశలో ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు తన శ్రీబాగ్ నివాసంలో ఇరు ప్రాంతాల నేతలతో సమావేశం జరిపి ఒక అవగాహన కుదిరేందుకు కృషి చేశారు. అప్పుడు వివిధ అంశాలతో ఇరుప్రాంత నేతలు చేసుకున్న ఒప్పందమే శ్రీ బాగ్ ఒప్పందం. దాని ప్రకారం రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలి. తదుపరి రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో ఆంధ్ర ఉద్యమం ఉదృతం అయింది. చివరికి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో జవహర్ లాల్ ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించింది. ఆ సమయంలో ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ మళ్లీ ఏర్పడింది. గుంటూరువిజయవాడతో పాటు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి నగరాలపై ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. అప్పటికే తెలుగు వారంతా ఒక్కటి కావాలన్న భావన ఉండడంతో, భవిష్యత్తులో తెలంగాణతో కూడిన ఉమ్మడి ఏపీ ఏర్పాటైతే హైదరాబాద్ రాజధాని అవుతుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఆ దశలో సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలని, గుంటూరు వద్ద హైకోర్టు పెట్టాలని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారం కర్నూలులో శాసనసభను ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరులో హైకోర్టు నిర్వహించారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ లోనే స్థాపితమయ్యాయి. అదృష్టమో, దురదృష్టమో అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి సాగుతూ వచ్చింది. అయినా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను ఆరంభించారు. దానికి రాజకీయ కారణాల కూడా తోడయ్యాయి.1969లో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచింది.తదుపరి 1973 ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడే రాష్ట్రం విడిపోయి ఉంటే ఎలా ఉండేదో కాని, అప్పట్లో ఆరుసూత్రాల పథకాన్ని కేంద్రం ప్రకటించింది. విశేషం ఏమిటంటే దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆరు జోన్ లు ఏర్పాడడం మినహా, మళ్లీ అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. సెంట్రల్ యూనివర్శిటీతో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ చుట్టూరానే ఏర్పాటయ్యాయి. అంతకుముందు వచ్చిన ఉక్కు ఉద్యమం కారణంగా విశాఖపట్నంలో స్టీల్ ప్యాక్టరీ మాత్రం వచ్చింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ కు వలస వెళ్లడం ఆరంభం అయింది. 2001నుంచి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రకరకాల రూపాలు దాల్చుతూ 2014 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యత వరకు వెళ్లింది. కాంగ్రెస్, బీజేపీలతోపాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంతో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల అధిక నష్టం జరిగింది సీమాంధ్ర ప్రాంతానికే అని అంతా అంగీకరిస్తుంటారు. అప్పుడు మళ్లీ రాజధాని సమస్య మొదటికి వచ్చింది. ఉమ్మడి హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉండాల్సి ఉన్నా, ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబు ప్రభుత్వం ఆకస్మికంగా ఏపీకి తరలివెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీబాగ్ ఒడంబడిక అంశం తిరిగి తెరపైకి వచ్చింది. విజయవాడగుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నందున కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. అయినా అప్పట్లో ప్రభుత్వం అంగీకరించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేయడం, అక్కడే అన్ని ఆఫీస్ లు నెలకొల్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. తదుపరి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ,కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి గుర్తింపు తేవచ్చని అప్పటి ముఖ్యమంత్రి జగన్ భావించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. ఆ విషయంలో చట్టం కూడా చేయడానికి సంకల్పించినా తెలుగుదేశం పార్టీ పలు చిక్కులు కల్పించగలిగింది. దాంతో ఆ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, 2024 ఎన్నికల తర్వాత ఆ ప్రణాళిక అమలు చేయవచ్చని భావించింది. కానీ వైఎస్సార్సీపీ ఓటమిపాలై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విశాఖలో కార్యనిర్వవహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మంగళం పలికినట్లయింది. అమరావతి రాజధానికి ఏభైవేల ఎకరాలకు పైగా సేకరించాలని తలపెట్టడం, తదితర అంశాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తొలుత వ్యతిరేకించినా, ఆ తర్వాత కాలంలో అవి తమ వైఖరి మార్చుకున్నాయి. బీజేపీ అయితే రాయలసీమలో హైకోర్టుతోపాటు, సచివాలయం కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేక డిక్లరేషన్ కూడా ప్రకటించి, తదుపరి ప్లేట్ మార్చేసింది. జగన్ మాత్రం కర్నూలులో న్యాయ రాజధానిలో భాగంగా లోకాయుక్త, హెచ్ఆర్సీ, సీబై కోర్టు, లా యూనివర్శిటీ వంటివి కొన్నింటిని స్థాపించే ప్రయత్నం చేశారు. అమరావతిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కొన్ని ఆఫీసుల ఏర్పాటుపై టీడీపీతోపాటు ఈనాడు, జ్యోతి వంటి మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే అమరావతితోపాటు విశాఖ, కర్నూలు లకు జగన్ ప్రాధాన్యత ఇస్తే, మూడు ప్రాంతాలలో వైఎస్సార్సీపీ పరాజయం చవిచూసింది. ఈవీఎంల మహిమో, ప్రజల ఓట్లో కారణం తెలియదు కాని టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, కర్నూలు నుంచి వివిధ ఆఫీసులకు రంగం సిద్ధమవుతూండటం జరిగిపోయింది. ఇప్పుడు రాయలసీమ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలోని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు దీనిపై బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పలేకపోతున్నా, వారికి భయం పట్టుకుంటుంది. వైఎస్సార్సీపీ నేతలైతే కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆఫీసుల తరలింపుపై మండి పడుతున్నారు. లాయర్లు కూడా తమకు అన్యాయం జరుగుతోందని ప్రకటించి వారం రోజుల పాటు కోర్టుల బహిష్కరణ పాటించారు కూడా. ఈ ఆందోళనలు కాస్తా ఉద్యమరూపం దాల్చితే, మళ్లీ ప్రాంతాల మధ్య వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ స్టీల్ను రక్షిస్తామని చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే ఒకసారి విశాఖ నుంచి ఒక రైల్వే ఆఫీస్ ను విజయవాడకు తరలించాలని ప్రతిపాదనలు వస్తే ఆ ప్రాంత ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. దాంతో అది ఆగింది. మరి ఇప్పుడు కర్నూలు నుంచి ఆఫీస్ లను తరలిస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో స్పందిస్తారో అప్పుడే చెప్పలేం. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి కేంద్రం రూ.250 కోట్లతో మంజూరు చేసిన కార్యాలయాన్ని కూడా తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టింది. ఇది కూడా రాయలసీమ వ్యతిరేక సెంటిమెంట్ కు దారి తీయవచ్చు. జగన్ కొప్పర్తి వద్ద పారిశ్రామికవాడను అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దానికి విఘాతం కలుగుతుందా అన్నది కొందరి అనుమానం. అమరావతిలో కొత్త సంస్థలను తీసుకు రాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని కార్యాలయాలను అక్కడకు తీసుకువెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కూడా ఉంది. హైదరాబాద్ లో మాదిరి అన్నీ అమరావతిలోనే కేంద్రీకరిస్తే నష్టం జరుగుతుందేమోనన్న భయం కూడా లేకపోలేదు. అయినప్పటికి టీడీపీ ప్రభుత్వం కేంద్రీకరణవైపే మొగ్గు చూపుతోంది. పేరుకు విశాఖను ఆర్థిక రాజధానిని చేస్తామని అంటున్నా అదెలాగో ప్రభుత్వం వివరించలేకపోతోంది.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా, ఈలోగా లోకాయుక్త తదితర ఆఫీసులను తీసుకుపోవడం ఏమిటన్నది పలువురి ప్రశ్నగా ఉంది. అసాధారణ మాండేట్ వచ్చినందున తాము ఏమి చేసినా ఎదురు ఉండదని, రాయలసీమ ప్రజలు ఆందోళనలకు సిద్దమయ్యే పరిస్థితి లేదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. అలా ఆ ప్రాంత ప్రజలు ఎదిరించకపోతే కూటమికి ఇబ్బంది ఉండదు. కాని రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత చేతులు కాల్చుకోవడం కన్నా, ముందుగానే చంద్రబాబు నాయుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకుని దీనిపై నిర్ణయం చేస్తే మంచిదని చెప్పాలి. లేకుంటే ప్రాంతీయ విద్వేషాలు రాజుకునే ప్రమాదం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
వర్తమానంలోని అనేక సమస్యలకు చరిత్రలోనే మూలాలు ఉంటాయి. అటువంటి చరిత్రను పనికిమాలినదిగా భావించిన పాలకుల హయాంలో సమస్యలకు పరిష్కారాలు ఎలా లభిస్తాయి? కరవుకాటకాలతో వెనుకబడి పోయిన రాయలసీమ వెతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘శ్రీబాగ్ ఒడంబడిక’లోని అంశాలను చిత్త శుద్ధితో అమలుకు ప్రయత్నించకపోవడమే ఈ నాటి రాయలసీమ దుఃస్థితికి ప్రధాన కారణం. ఒడంబడిక ప్రకారం దక్కిన రాజధాని ఎటూ చెయ్యి దాటిపోయింది. కనీసం అభివృద్ధికి కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నా పూర్తవుతాయా?శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న అనుబంధం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం. పాలకుల నిరాదరణకు గురైన ఈ ఒడంబడికకు నేటికి 87 సంవత్సరాలు. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. భాషాభిమానం, రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలనే ఆలోచన మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలో 1913 (బాపట్ల)లో తొలి ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. అది భాష, సాంస్కృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయినా... అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోవాలని దీని నిర్వాహకులకు ఉండేది. కారణాలు ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు. అయితే రాయలసీమ భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్ర మహాసభ పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సీమలో పర్యటించిన అనంతరం జరిగిన సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ ప్రాంతం... విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అలాగే కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీల వల్ల సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవా లతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రా యూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మద్రాసు శాసనసభలో ఈ అంశంపై జరిగిన తీర్మానంలో తమిళ శాసన సభ్యులు పాల్గొన వద్దని ఆనాటి ముఖ్యమంత్రి సూచించారు.వాస్తవానికి ఆంధ్ర మహాసభ తీర్మానం ప్రకారం... కోస్తా, సీమ సభ్యులు అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఓటు వేయాలి. అందుకు భిన్నంగా మధ్య కోస్తా సభ్యులు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి సూచనను పక్కన పెట్టి తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో 25 – 35 ఓట్లతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్ని కాదని విశాఖలో ఏర్పాటు చేసి తొలి ఉప కులపతిగా రాయలసీమ వారికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి లాంటి వారు... ‘ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా (ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోదాం’ అని ప్రతిపాదన చేశారు.ఇదంతా గమనిస్తున్న ఆంధ్రమహాసభలోని పెద్దలు చర్చల నిమిత్తం రెండు ప్రాంతాల సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 1937 నవంబర్ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్)లో కమిటీ సమావేశమయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలపై ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే ‘శ్రీబాగ్ ఒడంబడిక’. కోస్తా, సీమ ప్రజల పోరాటం... మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష–ఆత్మార్పణల ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అవతరించింది.శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు:1. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. 2. కృష్ణా, తుంగభద్రలలో నీటి వినియోగంలో రాయలసీమకు వాటా కేటాయించాలి. అందుకనుగుణంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. 3. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని సాధించేందుకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రా యూనివర్సిటీ కింద ఒక కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 4. జనాభా లెక్కల ప్రకారం కాకుండా సీమ, కోస్తా ఆంధ్రకు సమానంగా నియోజక వర్గాల ఏర్పాటు చేయాలి.ఈ ఒప్పందం ప్రకారం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ, 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో రాజధాని రాయలసీమ నుంచి తెలంగాణకు మారింది. అలా శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడటం ప్రారంభమయ్యింది. రాయలసీమ అభివృద్ధిలో అతి ముఖ్యపాత్ర పోషించే నీటి ప్రాజెక్టులనన్నా పూర్తి చేస్తున్నారా అంటే అదీ జరగడం లేదు. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత లేదనీ, అది కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అనీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. నాటి కాంగ్రెస్ విభిన్న అభిప్రాయాలు ఉన్నవారి సంగమం. కమిటీ సభ్యులు కాంగ్రెస్లో ఉన్నంత మాత్రాన ఈ ఒప్పందం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చడం సమంజసమేనా?చదవండి: హానికరమైన కొత్త జాతీయవాదంమద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోవడంలో సీమ ప్రజల త్యాగం ఉన్నది. ప్రస్తుత సీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి ఇప్పటికీ హైదరాబాద్ కన్నా చెన్నై నగరంతోనే అనుబంధం ఎక్కువ. తెలుగు రాష్ట్రం కావాలనే కోరిక పుట్టిన ప్రారంభంలోనే... తమిళులు మదురై కేంద్రంగా తమిళ రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. దీనికి కారణం ఎప్పటికైనా చెన్నై తెలుగు వారిదే అవుతుందేమో అని వారి ఆలోచన. నిజానికి పప్పూరి రామా చార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి ప్రతిపాదన ప్రకారం రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ఉంటే (ప్రస్తుత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బళ్ళారి, చెన్నై సమీప జిల్లాలతో కలిపి) చెన్నై మహానగరం మనదే అయ్యేది. దీన్నిబట్టి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు త్యాగం చేశారని అర్థం చేసుకోవాలి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. మరి నీటి ప్రాజెక్టుల సంగతేమిటి? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సత్వరం అందిపుచ్చుకునే విధంగా సిద్ధేశ్వరం ఆలుగునూ, పోతిరెడ్డి పాడునూ వెడల్పు చేయడం; రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విధంగా గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు నిర్మించడం; గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం; చెరువుల పునరుద్ధరించడం వంటి చర్యలే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీబాగ్ ఒప్పంద స్ఫూర్తితో సీమ సమాజం ఇందుకోసం ముందుకు సాగాలి.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
బాబు మోసం.. నోరుమెదపని ఎమ్మెల్యేలు, ఎంపీలు
-
అంతులేని అన్యాయం.. సీమకు బాబు వెన్నుపోటు
-
రాయలసీమలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో నేడు అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు పడేందుకు ఆస్కారముందని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.ఇదీ చదవండి: 9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
‘కడప, రాయలసీమపై చంద్రబాబు కక్ష సాధింపు’
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారని కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కొప్పర్తి సేజ్కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపు చంద్రబాబు నైజానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి సేజ్కు కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపుపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆయన మాట్లాడారు.‘‘ఇది సీమ యువత అవకాశాలను దెబ్బ తీయడమే. ప్రభుత్వం జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. దానికి కొప్పర్తి సేజ్కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపే నిదర్శనం’’ అని అన్నారు.కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా నిలదీశారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను తీసుకెళ్ళిపోతున్నారు. పులివెందుల మెడికల్ సీట్లు వెనక్కి పంపారు. రాయలసీమ వాడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.కేంద్రం ఇక్కడి యువతకు ఇచ్చిన టెక్నాలజీ సెంటర్ను తరలించడానికి చంద్రబాబు ఎవరని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర ప్రశ్నించారు. ‘‘ ఇది క్షమించరాని నేరం. ఇలాంటి చర్యలు యువత అవకాశాలను దెబ్బ తీస్తాయి. ఈ అంశంపై అఖిలపక్షంగా పోరాడతాం’ అని అన్నారు.ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను తరలించడం అంటే సీమకు అన్యాయం చేయడమేనని కడప జిల్లా సీపీఎం కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ‘‘ ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం దారుణం. నైపుణ్యాలను రాయలసీమ యువతకు అందించాల్సిన అవసరం లేదా?. ప్రభుత్వం మారగానే ఇలా చేయడం సరికాదు’ అని అన్నారు.రౌండ్ టెబుల్ సమావేశానికి కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు. -
కర్నూలులో హైకోర్టు పెట్టాలి లేదంటే ప్రత్యేక రాష్ట్రం
-
రాయలసీమకు తీవ్ర అన్యాయం
సాక్షి, అమరావతి: వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు సర్కారు మొండి చెయ్యి చూపింది. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి.. 24 గంటలు గడవకుండానే మరో కేంద్రాన్నీ అమరావతికే తరలించారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని చంద్రబాబు సర్కారు అమరావతికి తరలించేసింది. అన్నీ అమరావతిలోనే ఏర్పాటు కావాలని, ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలన్న దిశగా ప్రతి అడుగూ పడుతోంది. విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్రం మంజూరు చేయడంతో పాటు గత ప్రభుత్వ సూచనతో ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కూడా మరో కేంద్రాన్ని మంజూరు చేసింది. కొప్పర్తిలో మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల భూమిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ సెంటర్ను సీఆర్డీఏ పరిధిలోని అమరావతికి తరలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో ఈ కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో మరో ఎంఎస్ఎంఈ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా కొప్పర్తిలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని తరలించడం సమంజసంగా లేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధి పరిశ్రమల శాఖ ప్రతిపాదనల మేరకు 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎస్ఎంఈలకు ఈ నిధి ద్వారా క్రెడిట్ సహకారాన్ని అందించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీఐఐసీ భూముల కేటాయింపులకు ఆమోదం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించే అధికారాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. అందుకు అనుగుణంగా ఏపీఐఐసీ 203 పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించింది. ఆ కేటాయింపులకు రాష్ట్ర భూ కేటాయింపుల కమిటీ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మాతో పెట్టుకుంటే కాల్చిపారేస్తాం!
ఈనెల 9న పుట్టపర్తి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ‘నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా.. రక్తచరిత్ర.. రక్త చరిత్ర..’ అంటూ పాటలు వేసుకుని టీడీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా డ్యాన్సులు చేశారు. ఇవి చూసి భక్తజనం బెంబేలెత్తిపోయారు.ఈనెల 10న రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో టీడీపీ కార్యకర్త గంగాధర్ నాటు తుపాకీతో నానా హంగామా చేశాడు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత కేశవపై దాడి చేయబోయాడు. అతను అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈనెల 11న మడకశిర మండలం గుండుమల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులు బహిరంగంగా కత్తులు, తుపాకీలతో విన్యాసాలు చేశారు. ఇది చూసి జనం బేజారెత్తిపోయారు. సాక్షి, టాస్్కఫోర్స్ : రాయలసీమ జిల్లాల్లో నాటు తుపాకుల సంస్కృతి మళ్లీ ఊపిరిపోసుకుంటోందనడానికి ఈ ఘటనలే తాజా ఉదాహరణలు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా నాటు తుపాకుల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు వీటితో బహిరంగంగా డ్యాన్సులు చేస్తూ చెలరేగిపోతున్నారు. దీంతో ‘ఆర్ఓసీ’ రోజులు మళ్లీ దాపురించాయా! అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిజానికి.. నాటు తుపాకులు, బాంబులు, కత్తులు.. ఈ మాటలు వింటే ఉమ్మడి అనంతపురంలో జిల్లాలో ఆర్ఓసీ (రీఆర్గనైజింగ్ కమిటీ) అరాచకాలు గుర్తుకొస్తాయి. అప్పట్లో టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి నేతృత్వంలో ఈ దారుణాలు విచ్చలవిడిగా సాగాయి. ఇందుకు ఎందరో బలయ్యారు. అయితే, ఇప్పుడు మళ్లీ నాటి రోజులు గుర్తొచ్చేలా ఆ పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. ఉదా.. రామగిరి మండలంలో మాజీమంత్రి పరిటాల సునీత అనుచరులు నాటు తుపాకులతో నానా హంగామా చేస్తున్నారు. ‘మాతో పెట్టుకుంటే అంతే.. కాల్చిపడేస్తాం.. మళ్లీ మాకు పాత రోజులు వచ్చాయి’ అని రెచి్చపోతున్నారు. ఒకచోట గన్ ఘటన వెలుగులోకి రాగానే.. మరోచోట వినాయక నిమజ్జనంలో తుపాకులతో విన్యాసాలు చేశారు. ఇంకోచోట.. రక్తచరిత్ర పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేశారు. ఐదేళ్లలో అభివృద్ధి పనులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రామగిరి మండల వ్యాప్తంగా పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కుంటిమద్ది గ్రామంలో కూడా రోడ్లు వేశారు. తాగునీటి సౌకర్యం కలి్పంచారు. ఫలితంగా ఈ ప్రాంతం ఫ్యాక్షన్ ప్రభావం నుంచి బయటపడుతున్న సమయంలో ఇప్పుడు మళ్లీ పరిటాల కుటుంబం ఆ గ్రామంలో ఫ్యాక్షన్ వాతావరణానికి ఆజ్యం పోస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. వినాయక చవితి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సి ఉండగా.. గ్రామాల్లో కొందరు టీడీపీ అల్లరిమూకలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా చెలరేగిపోయారు. నాటు తుపాకులు, కత్తులు, డమ్మీ తుపాకులు చూపించి ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇదేంటని ప్రశి్నంచిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో మళ్లీ ‘ఆర్ఓసీ’ కాలంలో మాదిరిగా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని ప్రజలు వణికిపోతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించం.. తుపాకులు వాడాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. అనుమతులు పొందిన వారే వాడాలి. ఎవరుపడితే వారు నాటు తుపాకులతో రెచ్చిపోతే కేసులు తప్పవు. పండుగ వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే సహించేదిలేదు. – వి. రత్న, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ -
మరిచారా బాబూ.!
సీమ ముద్ద బిడ్డను.. కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాలకు పేర్లు మార్చడం సహజం. తమ పార్టీ నాయకులు లేదా నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే జాతీయ నాయకుల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టడం పరిపాటి. ఇదే కోవలో తాజాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివిధ పథకాల పేర్లు మార్చింది. అందులో జగనన్న గోరుముద్ద పథకానికి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’అని పేరు మార్చంది. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టి ఆదుకున్న డొక్కా సీతమ్మ పేరుపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. ఊళ్లకు ఊళ్లు కరువు బారిన పడి ప్రజలు మృత్యు ముఖంలోకి జారుతున్న విషాద సమయంలో తన ఆస్తుల్ని ధాన్యంగా మార్చి వేలాది పేదల కడుపు నింపి ప్రాణాలు కాపాడిన పూర్వపు కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామ వాసి బుడ్డా వెంగళరెడ్డి పేరు ప్రభుత్వానికి ఎందుకు స్ఫురణకు రాలేదని ఇక్కడి మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. దాతృత్వానికి మరో పేరు వెంగళరెడ్డి 1866లో రాయలసీమను భయంకర కరువు ఒకటి కబళించింది. ప్రజలు దాన్ని ఎర్రగాలి కరువు అని పిలిచేవారు. తినడానికి తిండి లేక, తాగేందుకు గుక్కెడు నీరు సైతం కరువై ప్రజలు డొక్కలు ఎండి అస్థిపంజరాలుగా మారారు. కలరా, మశూచి, బోవెల్ వ్యాధులు విజృంభించి వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. కడుపు చేతపట్టుకుని వలసలు వెళ్లడంతో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయ్యాయి. ఈ తరుణంలో బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం గురించి ఆ నోటా ఈ నోటా విన్న బళ్లారి, అనంతపురం, కడప జిల్లాల ప్రజలు ఉయ్యాలవాడ గ్రామానికి చేరుకోవడం ప్రారంభించారు. అలా వేల సంఖ్యలో వచ్చిన కరువు బాధితులతో గ్రామం కిటకిటలాడింది. వెంగళరెడ్డి తాము నిల్వ ఉంచిన 12 పాతర్ల ధాన్యం అంటే 1440 బస్తాలు ఖర్చు చేసి పూటకు ఎనిమిది వేల మందికి చొప్పున అన్నం, అంబలి వంటివి అందజేసి ప్రాణాలు నిలిపారు. చివరికి తన భూములు అమ్మి అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించారు. అలా మూడు నెలలకు పైగానే ఈ కార్యక్రమం నడిచింది. కరువు వల్ల తమ ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయలేకపోయారని తెలుసుకున్న వెంగళరెడ్డి తాళిబొట్లు, ముక్కెరలు దానం చేశారు. వర్షాలు కురుస్తున్నాయని తెలియడంతో ప్రజలు తమ గ్రామాలకు బయలుదేరే సమయంలో 15 రోజులపాటు తినడానికి అవసరమైన భత్యం ఆయన అందజేశారు. రైతులకు పశువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు కూడా సమకూర్చారు. ముఖ్యమంత్రి సీమ వాసి అయినా.... సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ వాసి అయినప్పటికీ ఈ ప్రాంతంలోని మహనీయుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టాలన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతృత్వం, త్యాగంలో ఎవరికీ తీసిపోని ఎంతోమంది రాయలసీమలో జన్మించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి గట్టిగా తీసుకు వెళ్లాలంటున్నారు. ‘సీమ’నేతల వైఖరే కారణం డొక్కా సీతమ్మ పేరును వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కోస్తా నాయకులు ఎలాంటి వారైనా ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటై ప్రాంతీయ అభిమానాన్ని ప్రదర్శిస్తారు. బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సుద్దపల్లె లక్షుమ్మ, చిన్నదండ్లూరు శివమ్మ తదితర గొప్పవాళ్ల గురించి రాయలసీమ నేతలు ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ల గొప్పతనాన్ని తెలుసుకుంటే ప్రజలు తమను అసహ్యించుకుంటారనే భయమే ఇందుకు కారణం. ఈ ప్రాంత నాయకుల వైఖరి వల్లే రాయలసీమ వివక్షకు గురవుతోంది. – సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి ఇది ముమ్మాటికీ వివక్షే కరువులో పేదలను ఆదుకోవడమే కాకుండా అనేక దానధర్మాలతో బుడ్డా వెంగళరెడ్డి మహాదాతగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర భావనే లేని రోజుల్లో సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటీషర్లపై గొప్ప పోరాటం చేసి భావి జాతీయోద్యమానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంతో ప్రేరణ ఇచ్చారు. ఏదైనా చారిత్రక స్థలానికి ఆయన పేరు పెట్టాలి. తొలి రాజకీయ ఖైదీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరి సుబ్బారావు, పప్పూరి రామచార్యులు వంటిఎందరో మహానీయులకు రాయలసీమ జన్మనిచ్చింది. మొట్టమొదటి ఆధునిక కావ్యాన్ని రాసిన కట్టమంచి రామలింగారెడ్డి సీమ వాసి. ఆధునిక సాహిత్య విమర్శకు ఆయన ఆద్యుడు. రాష్ట్ర సాహిత్య అకాడమికి ఆయన పేరు పెట్టడం ఎంతో సముచితం. రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి, అక్కడి అభివృద్ధి తప్ప మరేది పట్టలేదు. కనీసం ప్రభుత్వ పథకాల్లో కూడా సీమ వాసుల పేర్లు పెట్టలేదంటే ఇది ముమ్మాటికీ వివక్షే. – ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పథకాల పేర్ల మార్పులో రాయలసీమపై వివక్ష! కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న మేధావులు మిగతా పథకాలకై నా ‘సీమ’వాసులకు స్థానం కల్పించాలి -
‘పుట్టా’ పాపం..‘సీమ’కు శాపం
మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన రోడ్డు నిర్మాణ సంస్థ ఈ ఫోటోలో కనిపిస్తున్న హంద్రీ–నీవా కెనాల్ను పూడ్చివేసి దీనిపై తాత్కాలిక రహదారిని నిర్మించింది. కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పనుల్లో భాగంగా గార్గేయపురం – బ్రాహ్మణకొట్కూరు మధ్య కాలువపై వంతెన నిర్మాణం కోసం కెనాల్ను పూడ్చివేయడంతో హంద్రీ–నీవా నీళ్లు దిగువకు విడుదల కాని దుస్థితి నెలకొంది. రాయలసీమ మొత్తానికి జీవనాడి అయిన హంద్రీ–నీవాకు నీళ్లు రాకపోవడంతో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కుచెందిన పీఎస్కే ఇన్ఫ్రా ఈ రహదారి నిర్మాణ పనులను చేస్తోంది. కాలువలో కనీసం పైపులు అమర్చి రోడ్డు నిర్మించినా నీళ్లు పారేవి. ఆ మాత్రం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా పుట్టా సంస్థతో పాటు జలవనరులశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించగా నీటి విడుదల నిలిచిపోవటానికి కారణాలు వెల్లడించకుండా రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: జలవనరులశాఖ నిర్లక్ష్యం, పుట్టా సంస్థ పీఎస్కే ఇన్ఫ్రా లెక్కలేనితనం వెరసి ప్రభుత్వ వైఫల్యం.. రాయలసీమకు పెనుశాపంగా పరిణమించింది. కళ్లెదుట కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నా, శ్రీశైలం రిజర్వాయర్ నిండటంతో నీళ్లు దిగువకు విడుదలవుతున్నా హంద్రీ–నీవాకు నీళ్లు మళ్లించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి తలెత్తింది. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్టాది కావడంతో ఇటు అధికారులు, అటు ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఉన్నారు. తాత్కాలిక రోడ్డు వేసే సమయంలోనే కాలువలో నీళ్లు దిగువకు వెళ్లేలా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? 15 రోజులుగా కృష్ణాకు వరద నీరు వస్తున్నా హంద్రీ–నీవాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అని సమీక్షించి అప్రమత్తం కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది. సర్కారు నిర్వాకాలతో ఈ ఏడాది ‘సీమ’లో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం నెలకొంది.గత ఐదేళ్లూ ముందుగానే..గతేడాది రాయలసీమలో వర్షాభావంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అయితే అదృష్టవశాత్తూ మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర పోటెత్తాయి. శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిగా నిండటంతో ఆరు గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో హంద్రీ–నీవా నీటితో చెరువులు, రిజర్వాయర్లు నింపితే భూగర్భ జలాలు పెరిగి పంటలు సాగు చేసుకోవచ్చని సీమ రైతులు ఆశ పడ్డారు. గత ఐదేళ్లూ పోతిరెడ్డిపాడు కంటే ముందుగానే హంద్రీ–నీవాకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. శ్రీశైలంలో నీటిమట్టం 834 అడుగులకు చేరితే హంద్రీ–నీవాకు నీళ్లు విడుదల చేయవచ్చు. ముచ్చుమర్రి ద్వారా 800 అడుగులకే నీరు లిఫ్ట్ చేయవచ్చు. అయితే రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నా ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా, కారణాలు చెప్పకుండా దాగుడు మూతలాడుతోంది. 15 రోజులుగా నీళ్లు విడుదల కాకపోవడంపై రైతన్నలు తీవ్రంగా మథన పడుతున్నారు.పైపులు వేసి ఉంటే..కర్నూలు–విజయవాడ నేషనల్ హైవే పనుల్లో భాగంగా ఎన్హెచ్–340 సి రోడ్డు పనుల్లో ఒకటో ప్యాకేజీని పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన పీఎస్కే ఇన్ఫ్రా దక్కించుకుంది. ఈ ప్యాకేజీలో 30.6 కి.మీ. నాలుగు లేన్ల రహదారిని రూ.827.39 కోట్లతో నిర్మించనున్నారు. ఇందులో గార్గేయపురం, బ్రాహ్మణ కొట్కూరు మధ్య హంద్రీ–నీవా కాలువపై వంతెన నిర్మించాలి. దీంతో కాలువపై ఉన్న కల్వర్టు తొలగించి వంతెన నిర్మిస్తున్నారు. రాకపోకల కోసం హంద్రీ–నీవా కెనాల్ను పూడ్చేసి తాత్కాలిక రోడ్డు వేశారు. పైపులు వేసి రోడ్డు నిర్మిస్తే కాలువలో నీటి ప్రవాహానికి వీలుండేది. 15 రోజుల క్రితమే హంద్రీ–నీవా నీళ్లు విడుదలయ్యేవి. పీఎస్కే ఇన్ఫ్రా నిర్లక్ష్యంగా వ్యవహరించి పైపులు వేయకుండా కాలువను పూర్తిగా పూడ్చేసింది. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. హంద్రీ–నీవాపై ఆధారపడ్డ 6.02 లక్షల ఎకరాల ఆయకట్టు‘హంద్రీ–నీవా సుజల స్రవంతి’పై ఆధారపడి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జిల్లాలలో 30 లక్షలమందికి తాగునీరు అందుతోంది. క్రిష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్ల కింద వందల చెరువులకు ఏటా నీళ్లు ఇస్తున్నారు. 76 చెరువులకు గత ప్రభుత్వం నీరందించింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ కుప్పానికి కూడా హంద్రీ–నీవా నీటిని విడుదల చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కృష్ణాలో నీళ్లున్నా విడుదల చేయకుండా అన్నదాతలతో పరిహాసమాడుతోంది. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను 120 రోజుల పాటు ఎత్తిపోసేలా పథకాన్ని డిజైన్ చేశారు. అయితే అన్ని రోజులు కృష్ణాలో ప్రవాహం ఉండటం లేదు. దీంతో కెనాల్ను విస్తరించాలని గత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో 15 రోజుల ముందే నీటిని విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ దృష్టి సారించకపోవడంతో ‘సీమ’కు తీవ్ర నష్టం జరుగుతోంది.రోడ్డు తొలగించి నీటిని విడుదల చేస్తాంజాతీయ రహదారి పనుల్లో భాగంగా హంద్రీ–నీవా కాలువపై వంతెన నిర్మాణం జరుగుతోంది. నీటిని విడుదల చేసే లోపు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి తాత్కాలిక రోడ్డు వేశారు. అయితే సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయారు. గడువు దాటితే ఏజెన్సీతో పని లేకుండా రోడ్డు తొలగించి, పూడిక తీసేసి నీటిని విడుదల చేస్తాం. – రామగోపాల్, ఎస్ఈ, హంద్రీ–నీవా సుజల స్రవంతిప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాంపీఎస్కే ఇన్ఫ్రా హంద్రీ కాలువపై వంతెనను నిర్మిస్తోంది. కాలువను నిర్మాణ సంస్థే పూడ్చింది. నీటి విడుదల కోసం జలవనరులశాఖ అధికారులు తాత్కాలిక రోడ్డును తొలగించే యోచనలో ఉన్నారు. ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నాం. – జి.గోవర్ధన్, పీడీ, నేషనల్ హైవేస్ అథారిటీ, కర్నూలు -
ఏపీలో రెండ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు
అమరావతి, సాక్షి: మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం, దీనికి అనుబంధంగా విస్తరించిన ఆవర్తనం రాష్ట్రం మీద ప్రభావం చూపించనుంది. ఈ ప్రభావంతో రెండ్రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి (జులై 18, 19వ తేదీల్లో) కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే.. మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారాయన. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.‘‘వర్షం పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సూచించారాయన. అలాగే.. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 సంప్రదించాలని కోరారాయన. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుశ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్లుభారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం -
వరుణించిన నైరుతి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు సీజన్ ఆరంభం నుంచే అధిక వర్షాలు కురిపించాయి. రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 91.2 మి.మీ. కాగా.. 143.7 మి.మీ. వర్షం కురిసింది. 52.5 మి.మీ. అధిక వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 58 శాతం అధికం. సస్యశ్యామల ‘సీమ’ నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది రాయలసీమను కరుణించాయి. రాయలసీమలోని 8 జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతమే నమోదైంది. కోస్తాంధ్రలోని అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే అత్యధిక వర్షం కురవగా.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. ఇక తూర్పు గోదావరి, కాకినాడ, ఎనీ్టఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, పశి్చమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. రాష్ట్రంలోకెల్లా శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180 శాతం వర్షపాతం కురిసింది.ఆ జిల్లాలో జూన్లో 55.1 మి.మీ.లకు గాను 154.2 మి.మీ. వర్షం పడింది. ఆ తర్వాత 177 శాతంతో అనంతపురం రెండో అత్యధిక వర్షం కురిసిన జిల్లాల్లో నిలిచింది. అక్కడ 63.6 మి.మీ.లకు 176.2 మి.మీ. వర్షం కురిసింది. రాష్ట్రంలో వాతావరణ విభాగం పరిధిలో కోస్తాంధ్ర, రాయలసీమ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ లెక్కన కోస్తాంధ్రలో 105.6 మి.మీ.లకు 129.1 మి.మీ. (22 శాతం అధికం), రాయలసీమలో 70.7 మి.మీ.లకు 160 మి.మీ. (127 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. సీమలోనే ఎక్కువ ఎందుకంటే.. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణాలున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు జూన్ ఆరంభంలోనే రాయలసీమ మీదుగా కోస్తాంధ్రలోకి ప్రవేశించాయి. ఆ సమయంలో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాలోకి విస్తరించిన రుతుపవనాలు ముందుకు కదలకుండా 10 రోజులపాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో ఆ సమయంలో రాయలసీమలో వర్షాలు కొనసాగాయి. కోస్తాంధ్రలో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులే కురిశాయి. దీంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం రికార్డయింది.జూలైలోనూ సమృద్ధిగా.. జూన్ నెలలో ఆశాజనకంగా కురిసిన వర్షాలు జూలైలో మరింత సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం జూలైలో అధికంగా ఉంటుందని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే జూలై నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందని.. ఇవి కూడా వర్షాలు కురవడానికి దోహదపడతాయని చెబుతున్నారు. -
రాయలసీమ వాసులకు గుడ్న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్తో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వీడీ14 వర్కింగ్ టైటిల్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీని ప్రధానంగా రాయలసీమలో జరిగిన పీరియాడిక్ కథగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినవారికే ప్రత్యేకంగా ఆడిషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. 'ఈ తూరి అంతా మన సీమలోనే..బెరీనా పోయి మావోల్లను కల్వండి' అంటూ సీమ యాసలో పోస్టర్ను రిలీజ్ చేశారు. జూలై 1,2 తేదీల్లో కర్నూలు, 3,4 తేదీల్లో కడప, 5,6 తేదీల్లో తిరుపతి, 7,8 తేదీల్లో అనంతపురంలో కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడేవారిని ఆడిషన్స్ ద్వారా సినిమా ఛాన్సులు ఇవ్వనున్నారు. మరి ఇక ఆలస్యమెందుకు? సీమ యాసలో మెప్పించి సినిమా ఛాన్స్ కొట్టేయండి. -
రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోకి రుతుపవనాలు!
సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోత, భానుడి భగభగలతో విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే చల్లటి కబురిది. గురువారం కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 2, 3 తేదీలనాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, నేడు, రేపు కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. -
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Monsoon 2024: నేడు కేరళకు నైరుతి ఆగమనం.. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక రోజు ముందుగా అంటే గురువారానికే అవి కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 31 లేదా వచ్చే నెల ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. వీటి పురోగమనం ఆశాజనకంగా ఉండడంతో గురువారం లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.ఒకటి నుంచి వర్షాలు..రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి వర్షాలు కురవనున్నాయి. జూన్ ఒకటిన అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను, జూన్ 2న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా సంభవిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు భారీ వర్షాలు
-
సీమకు సైంధవుడు..
దేశంలోనే తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను మళ్లించకుండా నాడు చంద్రబాబు ద్రోహం చేయగా, నేడు గరిష్టంగా ఒడిసిపట్టి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి చాటుకుంటున్నారని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కృష్ణా జలాలపై హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతిలో పూర్తి సామర్థ్యం మేరకు నీటి తరలింపు పనులను పూర్తి చేయడంతోపాటు తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో, ఎస్సార్బీసీలో అంతర్భాగమైన గోరకల్లు, అవుకు రిజర్వాయర్లు, గాలేరు–నగరిలో భాగమైన గండికోట, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండలతోపాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని ఇప్పటికే పూర్తి చేయగా రెండో సొరంగం కూడా దాదాపుగా పూర్తి అయింది. నల్లమల సాగర్కు కృష్ణా జలాలను తరలించడం ద్వారా ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీలకు హక్కుగా దక్కిన జలాలను వాడుకోవడం కోసం రాయలసీమ ఎత్తిపోతలను సీఎం వైఎస్ జగన్ చేపడితే దానిపై ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడే దుస్సాహసానికి చంద్రబాబు ఒడిగట్టారని రైతులు మండిపడుతున్నారు.శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైన చోట కొత్త ప్రాజెక్టులను నిరి్మంచడం కోసం రాయలసీమ కరవు నివారణ పథకం కింద సీఎం జగన్ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు.హంద్రీ–నీవా సుజల స్రవంతి..మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి రాయలసీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.తన హయాంలోనే రూ.6,862.26 కోట్లు ఖర్చు చేసి సింహ భాగం పూర్తి చేశారు. హంద్రీ–నీవాకు తొలుత శ్రీశైలం రిజర్వాయర్లో 834 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసేలా మల్యాల వద్ద పంప్హౌస్ నిర్మించిన మహానేత వైఎస్.. ఆ తర్వాత నీటి మట్టం 795 అడుగుల్లో ఉన్నా నీటిని తరలించేలా ముచ్చుమర్రి ఎత్తిపోతల 2007, ఆగస్టు 31న చేపట్టి, 2009 నాటికే 90 శాతం పూర్తి చేశారు. నాడు అలా..విభజన నేపథ్యంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హంద్రీ–నీవాలో మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. ఆ తర్వాత వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. జీవో 22(ప్రైస్ ఎస్కలేషన్), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అక్రమంగా వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను 2017 జనవరి 3న జాతికి అంకితం చేసిన నాటి సీఎం చంద్రబాబు.. ఇది తన ఘనతే అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ నిస్సిగ్గుగా ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.హంద్రీ–నీవా అంతర్భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తరలించేందకు చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ను కూడా కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమే‹Ùకు కట్టబెట్టిన చంద్రబాబు.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు తప్ప తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు.మహానేత వైఎస్ పూర్తి చేసిన హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా టీడీపీ హయాంలో ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా సీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేశారు.నేడు ఇలా..వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో కేవలం 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు.హంద్రీ–నీవాలో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు.హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి.. ఈ ఏడాదే కృష్ణా జలాలను కుప్పానికి తరలించే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రతి ఏటా డిజైన్ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నారు.తెలుగు గంగ..శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో తరలించే 29 టీఎంసీల కృష్ణా జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలను జతచేసి 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా ఉమ్మడి కర్నూలు (1.08 లక్షల ఎకరాలు), వైఎస్సార్ కడప(1.67 లక్షల ఎకరాలు), ఎస్పీఎస్ఆర్ నెల్లూరు (2.54 లక్షల ఎకరాలు), చిత్తూరు జిల్లా (46 వేల ఎకరాలు) కలిపి మొత్తం 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది తెలుగుగంగ ప్రాజెక్టు ఉద్దేశం. నాడు అలా...పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్సార్ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కలువ) ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు చేరే జలాల్లో 15 వేల క్యూసెక్కులను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్కు తరలించేలా 7.8 కి.మీ. పొడవున తవ్విన లింక్ కెనాల్కు లైనింగ్ చేయకపోవడం వల్ల 6 నుంచి 7 వేల క్యూసెక్కులను కూడా తరలించేందుకు వీలయ్యేది కాదు. దీంతో వెలిగోడు రిజర్వాయర్(16.95 టీఎంసీలు) నిండేది కాదు. లింక్ కెనాల్కు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యంతో నీటిని తరలించడం ద్వారా వెలిగోడును సకాలంలో నింపాలన్న ఆలోచన కూడా 2014–19 మధ్య చంద్రబాబు చేయలేదు.వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్కు ఐదు వేల క్యూసెక్కులను తరలించేలా 42.566 కిమీల పొడవున తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడంతో 2 నుంచి 2,500 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి. బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు. మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి. తెలుగుంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేసిన పాపాన పోలేదు. ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతులను దెబ్బతీశారు.నేడు ఇలా..వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ను, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ కాలువల ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు నీటిని తరలించడానికి మార్గం సుగమం చేశారు. దీంతో 2019, 2020, 2021, 2022లో వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపగలిగారు.వెలిగోడు రిజర్వాయర్బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వకు లైన్ క్లియర్ చేశారు. 2021–22 నుంచే బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. తెలుగుగంగ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తూ రైతుల జీవన ప్రమాణాలను పెంచేలా సీఎం జగన్ కృషి చేశారు.బ్రహ్మంసాగర్గాలేరు – నగరి సుజల స్రవంతి..శ్రీశైలం నుంచి 38 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 1.55, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500 వెరసి 2.60 లక్షలకు సాగునీరు, ఐదు లక్షల మందికి తాగునీరు అందించేలా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో చేపట్టారు. 2009 నాటికే వరద కాలువ, గండికోట రిజర్వాయర్, పైడిపాళెం, వామికొండ, సర్వారాయసాగర్ల జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేశారు.నాడు అలా...2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరి ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల్లో అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద తవ్వాల్సిన జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్(పెలుసుమట్టి)లో 165 మీటర్ల మేర మాత్రమే పనులు చేయాలి. వాటిని చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక సొరంగానికి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా కాలువ(లూప్)తో సరిపుచ్చారు.కమీషన్లు రావనే కారణంతో గాలేరు–నగరిలో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. దాంతో కేవలం నాలుగైదు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్లను పట్టించుకోలేదు.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పది టీఎంసీల సామర్థ్యం) నిర్వాసితులకు కూడా చంద్రబాబు పునరావాసం కల్పించలేదు. ఏటా కేవలం సగటున రెండు మూడు టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు.నేడు ఇలా..సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు అంటే పది వేల క్యూసెక్కులను తరలించేలా అభివృద్ధి చేయించారు. రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనంతో పూర్తి చేశారు. ఇప్పుడు గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. శ్రీశైలానికి వరద వచ్చిన 30 రోజుల్లోనే గాలేరు–నగరి కింద ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేలకు పెంచిన సీఎం జగన్ ఆ పనులను కూడా శరవేగంగా చేస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది.గండికోట రిజర్వాయర్గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి పునరావాసం కల్పించడం ద్వారా పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో గండికోటలో ఏటా 26.85 టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించి.. రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (ఆరు టీఎంసీలు), వామికొండసాగర్(1.6 టీఎంసీలు), సర్వారాయసాగర్(3.06 టీఎంసీలు)లలోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో ఏటా పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతుల జీవితాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారు.రైతుల హక్కులు నాడు తాకట్టు.. నేడు పరిరక్షణవిభజన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్లు ఉమ్మడి ప్రాజెక్టులుగా కేంద్రం గుర్తించింది. శ్రీశైలం నిర్వహణను ఆంధ్రప్రదేశ్కు, నాగార్జునసాగర్ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని ఏపీకి అప్పగించకుండా తన అధీనంలోనే ఉంచుకోవడంపాటు ఏపీ భూభాగంలోని నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను కూడా అ«దీనంలోకి తీసుకుంది. రాష్ట్ర హక్కులను హరించేలా తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు.శ్రీశైలంలో 834(మల్యాల), 795(ముచ్చుమర్రి) అడుగుల నుంచి హంద్రీ–నీవా ద్వారా రోజుకు 3850 క్యూసెక్కులు మాత్రమే తరలించే సామర్థ్యం ఏపీకి ఉంది. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ 881 అడుగుల్లో నీటి మట్టం శ్రీశైలంలో ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. తెలంగాణ సర్కార్ రోజూ 6.5 టీఎంసీలను తోడేస్తే శ్రీశైలంలో నీటి మట్టం పెరగదు. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందవు. ఓటుకు కోట్లు కేసుకు జడిసి బాబు నోరుమెదపలేదు.వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఇది పూర్తయితే తనకు భవిష్యత్ లేదని చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారు. -
నేడు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నేడు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ మీదగా ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు,రేపు(శుక్ర,శని)వారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొందిఈనెల 13వ తేదీన రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. ఏపీలో గత మూడు రోజుల్లో సగటున 10 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన మూడు రోజుల్లో రాయలసీమతో పాటు రాష్ట్రంలో సగటున రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా నమోదైంది. -
సీమలో తు‘ఫ్యాన్’
సాక్షి, అమరావతి: రాయలసీమలో ఫ్యాన్ గాలి ప్రచండంగా వీస్తోంది. ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచి్చన పిలుపునకు ‘సీమ’ ప్రజలు పిడికిలి బిగించి సిద్ధం.. సిద్ధం.. అంటూ ప్రతిస్పందిస్తున్నారు. ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు జనం బ్రహ్మరథం పడుతుంటే.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి నిరాశ ఎదురవుతోంది.వీటిని పరిగణనలోకి తీసుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో సీమలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని 52 శాసనసభ, 8 లోక్సభ స్థానాలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సీమలో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 52 శాసనసభ స్థానాలకుగాను 49 స్థానాలను చేజిక్కించుకుంది. హిందూపురం, ఉరవకొండ, కుప్పంలలో మాత్రమే టీడీపీ గెలిచి ఉనికి చాటుకుంది. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనకు పట్టం గత 59 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ నాయకత్వంపై సీమ ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగింది. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచిన సీఎం జగన్.. గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. తెలుగు గంగ ప్రధాన కెనాల్కు లైనింగ్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. మట్టికట్ట లీకేజీలకు డయాఫ్రమ్ వాల్తో అడ్డుకట్ట వేసి బ్రహ్మంసాగర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కుందూ వరదను ఒడిసిపట్టి దుర్భిక్ష సీమను సస్యశ్యామలం చేశారు.కృష్ణా జలాలపై సీమ హక్కులను పరిరక్షించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టిన సీఎం జగన్.. వరదను ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపేందుకు కరవు నివారణ ప్రణాళిక కింద కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం పెంచే పనులు చేపట్టారు. ఇది స్థానిక సంస్థల (పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్) ఎన్నికల్లో ప్రస్ఫుటితమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన కుప్పం, హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధితపత్యాన్ని సాధించింది. రాప్తాడు ‘సిద్ధం’ సభతో ఖాయమైన వైఎస్సార్సీపీ విజయం ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి రాప్తాడులో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభకు సీమ ప్రజలు ఊళ్లకు ఊళ్లు కదలివచ్చారు. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా రాప్తాడు సిద్ధం సభ నిలిచింది. ఈ సభ వేదికగా ఎన్నికల్లో సీమలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ప్రజానీకం చాటిచెప్పారు. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకు కెరటాల్లా జనం పోటెత్తితే.. మలి విడత ప్రచారంలో సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలు జనసముద్రాలను తలపిస్తున్నాయి.ప్రధాని మోదీ, అమిత్ షాలను రప్పించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన కూటమి సభలు జనం లేక వెలవెలబోయాయి. ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇంటింటా జనం బ్రహ్మరథం పడుతుంటే.. కూటమి అభ్యర్థులకు ప్రజలు మొహం చాటేస్తున్నారు. ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయనడానికి ఇదే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆ మూడు స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం ఖాయం గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచిన 49 శాసనసభ, ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఈ ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకే. సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో 1985 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు.. 1989 ఎన్నికల్లో కుప్పానికి వలస వెళ్లారు. అప్పటి నుంచి దొంగ ఓట్లు, దౌర్జన్యాలు, నోట్ల కట్టలు వెదజల్లి గెలుస్తూ వస్తున్నారు. అలాంటి చంద్రబాబు కోటను స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బద్ధలు చేసింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేసి కుప్పానికి సీఎం జగన్ కృష్ణా జలాలను తరలించడంతో ఆ నియోజకవర్గ ప్రజల్లో సింహభాగం వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతున్నారు.దాంతో చంద్రబాబు, వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ మధ్య పోటీ నువ్వా–నేనా అన్నట్లు సాగుతోంది. కుప్పంలో ఈసారి వైఎస్సార్సీపీ పతాకం ఎగరడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూ వస్తున్న హిందూపురంలో ఈసారి సైకిల్ గల్లంతు కానుంది. హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభకు పోటెత్తిన జనసంద్రమే అందుకు తార్కాణం. టీడీపీ అభ్యరి్థ, సిటింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైఎస్సార్సీపీ అభ్యరి్థ, బీసీ వర్గానికి చెందిన దీపిక విజయం సాధించడం ఖాయం. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు ఎదురుగాలి తీవ్రంగా వీస్తోంది. ఆ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారీ్టతో విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. -
AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. నెలన్నర రోజులుగా వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకుంటున్నాయి.ఈ తరుణంలో ఒకపక్క వడగాడ్పులు కొనసాగుతూనే మరోపక్క ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పతున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది.ఈ నెల 7న (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మరోవైపు శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. 28 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 187 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఆదివారం 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 247 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. సోమవారం 15 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 69 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. -
ఏపీకి వడగాడ్పుల వార్నింగ్ బెల్
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేనివిధంగా నెలరోజుల ముందుగానే రాష్ట్రంలో వడగాడ్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. తొలుత ఇవి రాయలసీమతోనే మొదలుకానున్నాయి. దీని ఫలితంగా ఏప్రిల్ ఆఖరి నాటి ఉష్ణోగ్రతలు ఆరంభంలోనే నమోదు కానున్నాయి. సాధారణంగా మార్చి ఆఖరు, ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 34–39 డిగ్రీలకు మించవు. కానీ, రాష్ట్రంలో పలుచోట్ల అప్పుడే 38–42 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అంటే.. ఇవి సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికం. ఈ నేపథ్యంలో.. సోమవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. రానున్న నాలుగు రోజులు వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం నాటి బులెటిన్లో వెల్లడించింది. అలాగే, ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ 40–44 డిగ్రీలకు చేరుకోవచ్చని తెలిపింది. వీటి ఫలితంగా ఆయా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇంకా పల్నాడు జిల్లాలో 40–42, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 40–41 డిగ్రీల చొప్పున రికార్డయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఉష్ణతాపం, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, కోస్తాంధ్రలో.. మరోవైపు.. వడగాడ్పుల ప్రభావం ఆదివారం నుంచే మొదలైంది. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా కర్నూలు, కడప, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 41, నందిగామ, జంగమహేశ్వరపురం, విజయనగరం, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది. -
చంద్రబాబు వ్యాఖ్యలకు జర్నలిస్ట్ విజయబాబు కౌంటర్
-
సీమ ప్రజల కాంక్షలు ఫలించేలా...
2024 లోక్ సభ, శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాయల సీమ ప్రాంత సమస్యలను జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు నిర్దిష్టంగా తమ మ్యానిఫెస్టోలలో చేర్చాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాయలసీమ ప్రయోజనాలతో ముడిపడిన అనేక అంశాలు ఉన్నాయి. సాక్షాత్తు భారత పార్లమెంటుచే ఆమోదం పొంది చట్టబద్ధంగా అవకాశం ఉన్న ఆ హక్కుల అమలు జరగాలి. వీటితో పాటు ఇతర అనేక అంశాలను కూడా రాయలసీమ పౌరసమాజం, ప్రజా సంఘాలూ కోరుతున్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలకు చోటు కల్పించాలని మనవి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడింట ఒక భాగం జనాభా ఉన్న అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవ స్థల విషయంలో సీమ వాసుల ఆకాంక్షల మేరకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి. ఇతర రంగాల అభివృద్ధిలోనూ ప్రాధాన్యత ఇవ్వాలి. కోటి ఎకరాల భూభాగం ఉన్న రాయలసీమకు తుంగభద్ర–కృష్ణా నదీ జలాలలో 133 టీఎంసీల నికరజలాలపై హక్కు ఉంది. ఆ నీటిని అందేలా చూడాలి. పెండింగ్ ప్రాజె క్టులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసి ఆయకట్టు స్థిరీకరించాలి. విభజన చట్టం సెక్షన్ 46లో వెనకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి తగిన ఆర్థిక వెసులుబాటులు చేయా లని ఉంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధి కోసం ప్యాకేజీ రూపొందించాలని ఉంది. ఈ ప్యాకేజీని కనీసం లక్షకోట్లతో సమగ్రంగా చేపట్టాలి. సెక్షన్ 94 ప్రకారం ఇరు రాష్ట్రాలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పన్ను మినహాయింపుతో సహా తగిన ఆర్థిక చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేక పన్ను మినహాయింపుతో సీమ ఖనిజ వనరులు వెలికితీతతో పాటు, స్థానికంగా ఉత్పాదక పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వాలి. సీమ యువతకు ఆయా రంగాలలో ప్రత్యేక నైపుణ్యాలు అభివృద్ధి చేసేలా కేంద్రాలు నెలకొల్పాలి. యువతకు నిరుద్యోగ భృతి కల్పించి ఆత్మవిశ్వాసం నింపాలి. విభజన చట్టం సెక్షన్ 93 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 జాతీయ ప్రాధాన్యత ఉన్న విద్యాసంస్థలను కేటాయించింది. ఇందులో రాయలసీమకు సంబంధించినవి కేంద్రీయ విశ్వవిద్యాలయం (అనంతపురము), రెండు ఐఐటీలు (తిరుపతి, కర్నూలు), ఐఐఎస్ఇఆర్ (తిరుపతి) ఉన్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని విశాఖపట్నం ఉక్కు కర్మాగారం స్థాయిలో ఈ ప్రాంతానికి లబ్ధి చేకూరేలా నిర్మాణం చేయాలి. ముద్దనూరు – పుట్టపర్తి, కడప –రాయచోటి– కదిరి – పుట్టపర్తి– చిక్ బళ్ళాపురం, రాయచోటి – మదనపల్లె– బెంగుళూరు, కళ్యాణదుర్గం– పావగడ్డ – తుమకూరు, నంద్యాల – కర్నూలు తదితర రైల్వేలైన్లలను నిర్మించాలి. కర్నూలు, నంద్యాల జిల్లాలను సీడ్ హబ్లుగా అభివృద్ధి చేయాలి. రైతులకు ఉపయోగపడేలా సీమలో శీతల గిడ్డంగులు నిర్మాణం చేయాలి. సీజనల్ వలస కూలీలకు ఉపాధి కల్పించాలి. రాయలసీమ పురావస్తు, చరిత్ర అవశేషా లనూ, సంస్కృతి, సాహిత్యం, మాండలికం, జానపదకళల సంరక్షణకు ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. 1800 నాడు బ్రిటిష్ వారిపై పాలేగాళ్ల తిరుగుబాట్లను ప్రథమ స్వాతంత్య్ర పోరాటంగా గుర్తించాలి. రాయలసీమలోని పర్యా టక, చారిత్రక స్థలాలు సంరక్షించి, కనీస వసతులు కల్పించాలి. ప్రసిద్ధ ప్రాంతాలతో టూరిజం సర్క్యూ ట్లు నెలకొల్పాలి. సీమ వాతావరణం, కరువు నివారణ, నీటి సంరక్షణ, కృత్రిమ వర్షాలు, మైనింగ్, తదితర అంశాల నేపథ్యంగా పరిశోధన సంస్థలు నెలకొల్పాలి. స్వయంప్రతిపత్తితో కూడిన రాయల సీమ బోర్డును నెలకొల్పాలి. డా‘‘ అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత ‘ 99639 17187 -
ముందే హీటెక్కిన సీమ
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రాయలసీమలో వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి మరింతగా విజృంభిస్తున్నాయి. ఏప్రిల్ నెలారంభంలో నమోదు కావాల్సిన పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఇప్పటినుంచే రికార్డవుతున్నాయి. ప్రస్తుత ఉష్ణతాపాన్ని చూసి మున్ముందు ఇంకెంత తీవ్రతను చవి చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో నెలకొంటోంది. సాధారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచి 40 డిగ్రీలు, అంతకుమించి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి ఆరంభంలోనే 41 డిగ్రీలకు పైగా చేరుకుంటున్నాయి. ఈ నెల 2న శనివారం అనంతపురంలో 41, కర్నూలు 39, నంద్యాల, కడపలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3న అనంతపురంలో 39, కర్నూలులో 39, నంద్యాల, కడపలో 38, 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీలు, 5న 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే రాయలసీమలోనే ఉష్ణతాపం అధికంగా కనిపిస్తోంది. అక్కడ సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, కళింగపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో 33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో రాయలసీమ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం ఆ ప్రాంత వాసులకు ఒకింత ఊరటనిస్తోంది. సెగలకు ఇదీ కారణం కోస్తాంధ్ర కంటే రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడానికి గాలిలో తేమ తక్కువగా ఉండటమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గాలిలో తేమ తక్కువగా ఉంటే ఉష్ణతాపం పెరగడానికి దోహదపడుతుంది. ఈ తేమ 50 శాతం కన్నా తగ్గే కొద్దీ వేడి అధికమవుతుంది. కొద్ది రోజులుగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో తేమ 19 నుంచి 26 శాతం మాత్రమే ఉంటోంది. అందువల్ల అక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వారంలో మరింత భగభగ రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా.. వారం పది రోజుల్లో అవి 4–5 డిగ్రీలకు ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. -
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి జరిగేది ఇదే
-
గ్రేటర్ రాయలసీమ వాసుల కోసం విస్తృతంగా సేవలు అందిస్తున్న గ్రాడా
అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తున్నదని ఆసంస్థ ప్రతినిధులు డాక్టర్ నాగిరెడ్డి, చెన్నాకొర్వి, డాక్టర్ రాజేంద్ర ప్రోలు, డాక్టర్ శ్రీనాథ్ పలవల ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం,చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వివిధకారణాల రీత్యా అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి విచ్చేసిన విద్యార్థులు,ఉద్యోగులు, దంపతులు,పిల్లల కోసం గ్రాడా (GRADA) సంస్థ వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్ రాయలసీమ విద్యార్థుల కోసం ఉద్యోగమేలాలు, మహిళా సాధికారత కోసం ఉమెన్ ఫోరం, వివాహ కోరుకునే యువతియువకుల కోసం మాట్రిమోనీ మొదలయిన సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. గ్రేటర్ రాయలసీ సంస్కృతిని కాపాడటం కోసం సంస్కృతిక కార్యక్రమాలు డల్లాస్ నగరంలో నిర్వహిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల సర్వతోముఖాభి వృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని పేర్కొన్నారు. ఇవేకాకుండా క్రీడలు, పారిశ్రామికవేత్తలుగా తయారుకావడానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు వైద్య నేత్ర శిబిరాలు, ఆధ్యాత్మిక రియల్ ఎస్టేట్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ అందించడం, విద్యార్థుల సమస్యల పరిష్కార కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. డల్లాస్ నగరంలో రాలయసీమ ప్రజల కోసం 150 మంది విరాళాలతో ప్రారంభమైన గ్రాడా (GRADA) సంస్థ రోజురోజుకి సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ గ్రేటర్ రాయలసీమ తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని డల్లాస్ వాసలు, డల్లాస్కి వచ్చేవారు గ్రాడా(GRADA) సంస్థ సేవలను వినియోగించుకోవడానికి www.gradaus.org ద్వారా సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఫిబ్రవరి 17న నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్(North Texas Food Bank) వారి ద్వారా దాదాపు 500 మందికి సరిపోయే ఆహారాన్ని గ్రాడా సభ్యులు పంచి పెట్టారు. మునుముందు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మన డల్లాస్ వాసుల కోసం GRADA నిర్వర్తించనుంది. ఈ కార్యక్రమంలో నందకొర్వి, రమ్య నవీన్, హారిక కల్లే, జ్యోత్స్న అమృతం, మల్లికార్జున వేమన, శంకర్ ఓబిలి, ఉమామహేశ్వర్ గర్రెపాటి, శివ వల్లూరు, శివ పోతన్నగారి, జగదీష్ నందిమండలం, శ్రీని గాలి, ప్రభాకర్ మెట్ట, రతన్ అమృతం, కోటి గుడ్డేటి, మణి కుమార్ సోమిశెట్టి, శివరాజు అద్దేపల్లి, హేమంత్ కాకుట్ల,భానుమితి రేవుల, సునీల జంపాల, హర్షదళవాయి, మనోజ్ గుంటూరు, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ మోపూరు, సుధాకర్ మేనకూరు, వరదరాజులు కంచం, అనిల్ కుమార్కుంట, హరినాత్ పొగాకు, ప్రసాద్ నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవని మెట్ట, ప్రవీణ్ కుమార్ ఎద్దుల, పురుషోత్తం బోరెడ్డి, శ్రీనివాస ముక్క, శ్రీనివాసుల కొత్త, ఎల్లారెడ్డి చలమల, గౌతమ్ కాతెరగండ్ల, అనిత నాగిరెడ్డి, భాస్కర్ మస్నా, శ్రీకాంత్ కల్లే, ప్రశాంత్ మద్దిపట్ల, రమేష్ చలమూరు… ఇంకా ఎందరో ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. (చదవండి: అమెరికాలో ‘గ్రాడా’ ఆవిర్భావం..) -
పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీకి సిద్ధం: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: ఫిబ్రవరి 3న అనంతపురం జిల్లాలో రాయలసీమ ప్రాంతం ఎన్నికల శంఖారావం సభ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. రాయలసీమలో 50 స్థానాలు గెలుపే లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సోమవారం రాయలసీమ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రి రోజాతోపాటు ఏడు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే వారంరోజుల్లో జరిగే క్యాడర్ మీటింగ్కు జన సమీకరణకు ఎలా సన్నద్ధం కావాలి అనే దానిపై చర్చించారు. నాన్లోకల్ పొలిటీషియన్లను ప్రజలే హైదరాబాద్ ప్యాక్ చేస్తారని అన్నారు. చంద్రబాబు మతితప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఫ్రస్ట్రేషన్కు పరాకాష్ట అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. షర్మిల వేసుకున్న డ్రెస్ కాంగ్రెస్.. స్రిప్ట్ చంద్రబాబుదని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ పెట్టి.. కాంగ్రెస్లో కలిపిన షర్మిలకు క్రెడిబులిటీ లేదని విమర్శించారు. పచ్చమీడియా వైఎస్సార్సీపీలో గొడవలు పెట్టడమే పనిగాపెట్టుకుందన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడిన ఉంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు.. తమ పార్టీ గురించి మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. చదవండి: నారాయణ విద్యా సంస్థలపై ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు -
రాయలసీమ హెల్త్ హబ్
-
చినబాబా? సీమ టీడీపీ నేతల నెత్తిన పిడుగు!
చంద్రబాబు మదిలో మెదిలిన కొత్త ఆలోచన.. గ్రేటర్ రాయలసీమ నాయకుల్లో కలవరం రేపుతున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. నారా లోకేష్ బాబుకి అక్కడి ఎన్నికల పగ్గాలు అప్పజెప్పడం. ‘‘చాలు.. అయన ఘనకార్యాలు.. అయన వీరత్వం మేము కళ్లారా చూశాం.. ఇక చాలు. ఆయన్ను మా నెత్తిన రుద్దకండి’’ అని నాయకులు చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. బ్రేకులతో సాగిన యువగళం పాదయాత్ర అనంతరం.. లోకేష్ ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు అని భావిస్తున్నారు చంద్రబాబు. అందుకే లోకేష్ నెత్తిన బృహత్తరమైన బాధ్యత పెట్టాలని చూస్టున్నట్లు తెలిసింది. అయితే ఆ ప్రతిపాదన విన్న టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలిసింది. ఇంతకీ చంద్రబాబు లోపల ఏముందంటే... ‘‘కడప, కర్నూలు.. అనంతపురం.. చిత్తూరుతోబాటు.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాలు కలిపి గ్రేటర్ రాయలసీమగా పరిగణించే ప్రాంతానికి చినబాబును ఇంచార్జ్ గా పెట్టి ఎన్నికలకు వెళ్లాలి. అంటే ఆ ఆరు జిల్లాల్లోని 74సీట్ల అభ్యర్ధుల ఎంపిక,ప్రచారం,గెలుపు బాధ్యతలు అన్నీ లోకేష్ కు అప్పగిస్తే అయన గెలిపించుకు వస్తారు. రాష్ట్రం మొత్తాన్ని నేనొక్కడ్ని చూసుకోవడం అంటే కష్టం. ఆ 74 సీట్లను లోకేష్ కు అప్పగించి, మిగతా స్థానాలను.. అంటే కోస్తానుంచి ఉత్తరాంధ్ర వరకు తానూ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిపి మ్యానేజ్ చేసుకోవచ్చు’’అని అంతర్గతంగా ఆయన నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. మాకొద్దు బాబోయ్.. అంటున్న నాయకులు ఇదింకా వాస్తవ రూపం దాల్చలేదు.. ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. వామ్మో.. లోకేష్ పెత్తనం అంటే ఇక గెలిచినట్లే! ఆయనే గెలుస్తాడో గెలవడో తెలియని పరిస్థితి!!. అలాంటి లోకేష్ కు ఈ ప్రాంతం గురించి రాజకీయ, కుల, ఆర్థిక , సామాజిక సమీకరణాల గురించి ఏమి తెలుసనీ ఆయన్ను బాధ్యునిగా చేస్తున్నారు. అయన నిజంగా లాగుతారా ? ఏ నియోజకవర్గం ఎక్కడ ఉందో ఆయనకు అవగాహనలేదు. ఈ ప్రాంతంగుండా వెళ్లిన పాదయాత్రలో అయన విశ్వరూపం చూశాం.. ఇక ఇప్పుడు ఆయన్ను మా నెత్తినబెట్టి పార్టీ పుట్టిముంచొద్దు అని నాయకులు లోలోన ఫీలవుతున్నారు. నిజంగా అలా చేస్తారా? లేదా? అనేది పక్కనబెడితే.. ఆ ఊహను కూడా భరించలేకపోతున్నారు. వైసీపీ బలం ముందు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాయలసీమతో బాటు 2019 ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుచుకున్న నెల్లూరు వంటి ప్రాంతాలు లోకేష్ కు ఇవ్వడం ఆత్మహత్య సదృశం అని అంటున్నారు. దీంతోబాటు రాయలసీమతో గత ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం మూడంటే మూడే గెలిచింది అంటే అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో అర్థం అవుతోంది. అయితే చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచన ఇంకా వాస్తవరూపం దాల్చలేదు కానీ.. నిజంగా చంద్రబాబు అలా చేస్తారా ? ఆ ఆరు జిల్లాల బాధ్యత లోకేష్ కు అప్పగించే సాహసం చేస్తారా ? నిజంగా కొడుకు మీద ఆయనకు అంత నమ్మకం ఉందా? అనే సందేహాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.. ✒️✒️ సిమ్మాదిరప్పన్న -
ఎదురుతన్నిన చంద్రబాబు దుష్ప్రచారం
తోచీతోచనమ్మ తోడికోడలుపుట్టింటికి వెళ్లిందట.. అలా అయింది చంద్రబాబు పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఏమీ విషయం లేక దిగాలుగా ఉన్న చంద్రబాబుకు.. ఆయన మాటల్లో ఉర్లగడ్డ అనే పదం ఉల్లిగడ్డగా ఉచ్చరించారు అంటూ టీడీపీ, చంద్రబాబు, ఐటీడీపీ లో రెండ్రోజులుగా తెగ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలో పెట్టి లబ్ధిపొందాలన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇదేం పెద్ద మైలేజి తీసుకురాకపోగా తిరిగి ఎదురుతన్నింది. కొన్ని పదాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పలుకుతారు. అదేం నేరం కాదు.. ఘోరం కాదు.. ఒకే వస్తువును ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉచ్ఛరిస్తారు. ఆ అంశాన్ని పట్టుకుని చంద్రబాబు యాగీ చేసేందుకు ప్రయత్నించడం ద్వారా ఒక ప్రాంతం ప్రజానీకాన్ని అవమానించినట్లు అయింది. తనదీ రాయలసీమే అని చెప్పుకునే చంద్రబాబు ఆ ప్రాంత యాసభాషలను వెక్కిరించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన చంద్రబాబుకు అలుగడ్డను ఉర్లగడ్డ అంటారన్నది తెలీదా.. లేకపోతే అది తప్పా.. ఎందుకని అలా విమర్శిస్తున్నారు అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించాలి అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా లోపాలు ఉంటే చూడాలి కానీ రాయలసీమ భాషను అడ్డం పెట్టుకుని మొత్తం ప్రాంతాన్ని చిన్నబుచ్చడం ఏమిటని అంటున్నారు. క్షమాపణ చెప్పాలి చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ చెప్పుకోవడానికే రాయలసీవాసులు కానీ ఎన్నడూ ఇక్కడ నివసించింది లేదు. పండగపూట చుట్టపు చూపుగా సొంత ఊరికి వచ్చి వెళ్లేవారికి రాయలసీమ యాస, భాష ఎలా తెలుస్తాయి అని అంటున్నారు. జగనన్న నిఖార్సైన రాయలసీమ బిడ్డ. ఈ ప్రాంతం వ్యక్తిగా ఎవరైనా పెద్ద వారు కనిపిస్తే ఏన్నా బాగుండావా అని.. చిన్నోళ్లయితే ఏమబ్బా బాగుండావా అంటూ ఆప్యాయంగా మా సీమ యాసలో మాట్లాడతారు. మరి రాయలసీమ వాసులని చెప్పుకునే చంద్రబాబుకు, లోకేష్కు రాయలసీమ యాస, భాష గురించి తెలుసా? అంటూ రాయలసీమ భాషాపరిరక్షణ సమితి ప్రశ్నిస్తోంది. తమ భాషను విమర్శించినందుకు చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో గతం ఎన్నికల్లో వచ్చిన మూడు సీట్లు కూడా రానివ్వమని, మొత్తానికి సున్నా చుట్టి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరిస్తూ సమితి పేరిట వచ్చిన కరపత్రాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆ ప్రాంత భాషాభిమానులు ఇప్పుడు చంద్రబాబుమీద ధ్వజమెత్తుతున్నారు. రెండెకరాలతో ఇప్పుడు వేలకోట్లకు అధిపతిగామారి సీమ యాసను వెక్కిరించే స్థాయికి చేరిన చంద్రబాబును నేలకు దించుతామని వారు అల్టిమేటం ఇచ్చారు. -
AP: దూసుకొస్తున్న ‘మిచాంగ్’ తుపాను.. ఐఎండీ రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్ తుపాను దూసుకొస్తుంది. ఐఎండీ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో 4వ తేదీ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సెలవు ప్రకటించారు. Strong breeze now in Vizag . Similar 30-40kmph wind speed along the AP coast now !! #CycloneMichaung pic.twitter.com/BpcYuJrB1w — Vizag Weatherman@AP (@VizagWeather247) December 2, 2023 తుపాను ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రతో పాటు, రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
జలసిరుల సీమ
సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం (టన్నెల్) ఫాల్ట్ జోన్లో పనులు అసాధ్యమని నాడు చంద్రబాబు చేతులెత్తేయగా నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానం తో పూర్తి చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి జగన్ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. 2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు.. అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీమకు చంద్రబాబు ద్రోహం గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. సుభిక్షం చేసిన వైఎస్సార్ దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు. వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు. ♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపుతున్నారు. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. సీమ చరిత్రలో మేలిమలుపు ముఖ్యమంత్రి జగన్ మార్గ నిర్దేశాల మేరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానంతో అవుకు రెండో సొరంగాన్ని పూర్తి చేశాం. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమమైంది. దీంతో గాలేరు–నగరి తొలి దశ పూర్తైంది. శ్రీశైలానికి వరద రాగానే గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్లను సత్వరమే నింపి సకాలంలో ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు లబ్ధి చేకూర్చేలా అన్ని అడ్డంకులను సీఎం జగన్ తొలగించారు. సీమ చరిత్రలో ఇదో మేలిమలుపు. – శశిభూషణ్కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా పూర్తి సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ సీఎం జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారు. ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళిక మేరకు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లను పూర్తి చేసి సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి ప్రారంభించారు. ఇప్పుడు గాలేరు–నగరిలో అత్యంత కీలకమైన అవుకు సొరంగాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు దివంగత వైఎస్సార్ అవుకు చెరువును రిజర్వాయర్గా మార్చారు. 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు రెండు టన్నెళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మట్టి వదులుగా ఉండటంతో పనులకు ఆటంకం కలిగింది. ఆ తరువాత టీడీపీ పాలకులు విఫలం కావటంతో పనులు నిలిచిపోయాయి. సీఎం జగన్ పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తున్నారు. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. – అరవ రూమభూపాల్ రైతు శింగనపల్లె ఏటా రెండు పంటలు.. గతంలో నీరు సరిగా అందక ఏడాదికి ఒక్క పంట మాత్రమే పండించాం. సీఎం జగన్ పుణ్యమా అని రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో అవుకు రిజర్వాయర్ నీటితో కళకళలాడనుంది. భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా పెరుగుతాయి. ఇక ఏటా రెండు పంటలు పండించుకుంటాం. ఒక ఏడాది వర్షాలు పడకపోయినా అవుకు రిజర్వాయర్ ద్వారా పంటలు పండించుకునే అవకాశం ఉంది. సీఎం జగన్కు రైతులంతా రుణపడి ఉంటారు. – దొర్నిపాటి నాగరాజు, రైతు, అవుకు కల నెరవేరింది రెండో టన్నెల్ నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీళ్లు రావడం కలగానే మిగిలిపోతుందనుకున్నాం. సీఎం జగన్ అవుకు టన్నెళ్లు పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని వదలనుండటం ఎంతో సంతోషంగా ఉంది. రైతుల కల నెరవేరుతోంది. – వెలుగు సీతారామయ్య రైతు, అవుకు -
సీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘ఎంవీఆర్’ పేరు
సాక్షి, అమరావతి/ఎర్రగుంట్ల( వైఎస్సార్ జిల్లా): రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ) పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి(ఎంవీఆర్) సేవలకు గుర్తింపుగా, రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి ఆమోదంతో వైఎస్సార్ జిల్లా కలమళ్లలోని 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకొస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు థర్మల్ ప్లాంట్లకు ముగ్గురు ప్రముఖుల పేర్లు రాష్ట్రంలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లుండగా, వేర్వేరు రంగాలకు చెందిన వారి పేర్లు వాటికి సార్థక నామధేయాలుగా మారాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్లాంట్కు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రమని పేరు పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని పవర్ ప్లాంటుకు విద్యుత్ రంగ పితామహుడుగా పేరు పొందిన డాక్టర్ నార్ల తాతారావు పేరు పెట్టారు. తాజాగా ఆర్టీపీపీని కార్మిక నేత ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా ప్రభుత్వం మార్చింది. ఎంవీఆర్ కృషితో సీమలో థర్మల్ ప్లాంట్ వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం థర్మల్ విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయాలని మొట్టమొదట డిమాండ్ చేసిన నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి. 1985లో ‘రాయలసీమ కన్నీటి గాథ’ అనే పుస్తకం ద్వారా ఆయన రాయలసీమ సమస్యలను, గణాంకాలు, సహేతుకమైన ఆధారాలతో రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు. కరువుతో అల్లాడుతున్న సీమకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని గళమెత్తారు. ఎంవీఆర్ చేసిన డిమాండ్.. ఆర్టీపీపీ స్థాపనకు బాట వేసిందని, ఆ నేతకు నివాళిగా ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుగా మార్చాలని రాయలసీమ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ విమోచన సమితి పేరుతో రమణారెడ్డి, రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి పేరుతో వైఎస్సార్, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, టీటీడీ చైర్మన్ కరుణాకరెడ్డి తదితర నేతలంతా అప్పట్లో ఉద్యమం చేపట్టారని సాహితీవేత్త భూమన్ తెలిపారు. ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చడం దివంగత నేతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని భూమన కరుణాకర్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యలు ప్రశంసించారు. ఆర్టీపీపీకి డాక్టర్ ఎంవీఆర్ పేరు పెట్టినందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు నేతలు ముఖ్యమంత్రికి, ఇంధన శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీపీపీకి ఎంవీఆర్ పేరు చేర్చడాన్ని రాయలసీమ వాసులు స్వాగతిస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి వైఎస్సార్సీపీ ‘సామాజిక సాధికారత బస్సు యాత్ర’.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎల్లుండి నుంచి వైఎస్సార్సీపీ బస్సు యాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న బస్సుయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సుయాత్ర ప్రారంభం కాబోతోంది. డిసెంబరు నెలాఖరు వరకు జరిగే ఈ యాత్రకు సామాజిక సాధికార యాత్ర అనే పేరు పెట్టారు. 175 నియోజకవర్గాల్లోనూ గెలుపు లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతోంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ పరమైన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాచరణ సిద్ధం చేశారు. గతేడాది మే నెలలో ప్రారంభమైన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పరమైన కార్యక్రమాలను కూడా మరింత వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 అంటే బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సుయాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బస్సులను రెడీ చేశారు. బస్సుల ముందు భాగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాను ప్రముఖంగా కనిపించేలా స్టిక్కరింగ్ చేశారు. పైభాగాన సామాజిక సాధికార యాత్ర పేరు కనపడేలా చేశారు. ఇక మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రమఖుల చిత్రాలను కూడా బస్సు మీద ఏర్పాటు చేశారు. ఇక బస్సు యాత్రలు తొలిరోజు అంటే ఈ నెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాలలో ప్రారంభం కాబోతున్నాయి. తొలి విడతలో నవంబర్ తొమ్మిదో తేదీ వరకు యాత్రలకు సంబంధించిన వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దాని ప్రకారం ఉత్తరాంధ్రలో తొలుత ఇచ్చాపురంలో 26వ తేదీన బస్ యాత్ర ప్రారంభం కానుండగా, 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4న శృంగవరపుకోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లె నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుంది. ఇక కోస్తాంధ్రలో ఈనెల 26న తెనాలిలో ప్రారంభమయ్యే బస్సుయాత్ర 27న నరసాపురం, 28న చీరాల, 30న దెందులూరు, 31న నందిగామ, నవరంబరు 1న కొత్తపేట, 2న అవనిగడ్డ, 3న కాకినాడ రూరల్, 4న గుంటూరు తూర్పు నియోజకవర్గం, 6న రాజమండ్రి రూరల్, 7న వినుకొండ, 8న పాలకొల్లు, 9న పామర్రు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఇక రాయలసీమ విషయానికొస్తే.. తొలుత ఈనెల 26న సింగనమల నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభై 27న తిరుపతి, 28న ప్రొద్దుటూరు, 30న ఉదయగిరి, 31న ఆదోని, నవంబర్ 1న కనిగిరి, 2న చిత్తూరు, 3న శ్రీకాళహస్తి, 4న ధర్మవరం, 6న మార్కాపురం, 7న ఆళ్లగడ్డ, 8న నెల్లూరు రూరల్, 9న తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గడిచిన నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా జగన్ చేసిన అభివ్రుద్ది, సంక్షేమ పథకాల గురించి వివరిస్తారని ఈనెల 9న విజయవాడలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి బస్సు యాత్రను ఒకటీమ్ గా భావిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన లీడర్లు స్పీకర్లుగా ఉంటారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. వైనాట్ 175 అనేది ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నినాదం. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే పలు వేదికల మీద ప్రకటించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మ్యానిఫెస్టోలో ఇప్పటికే 98.5 శాతానికి పైగా అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్దే. గత ప్రభుత్వాలన్నీ ఇచ్చిన హామాలను తుంగలో తొక్కేస్తే జగన్ మాత్రం మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా పవిత్రంగా భావిస్తూ అందులోని హామీలను అమలు చేసేందుకు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అంతేకాదు.. మంత్రివర్గంలో కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికే 77 శాతం పదవులను కట్టబెట్టారు. స్థానిక పదవుల్లోనైతే మహిళలకు యాభై శాతాకిపైగా కేటాయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ, అభివ్రుద్ది కార్యక్రమాలను వారికి పూర్తిస్థాయిలో కల్పించారు. అందుకే జగన్ను ఆ వర్గాలన్నీ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను మరో కురుక్షేత్ర యుద్దంగా భావిస్తున్న నేపథ్యంలో పేదలు, పెత్తందార్ల మధ్యనే పోటీ జరగబోతున్నదని ఇప్పటికే పేద వర్గాలన్నీ భావిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా నిలిచింది. అందుకే వారంతా తమ జెండా, ఎజెండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని బాహాటంగానే చెప్తున్నారు. మొత్తమ్మీద బస్సు యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ క్యాడర్ మొత్తం ఈ యాత్రలో పాల్గొనబోతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావారణం కనిపిస్తోంది. చదవండి: అదీ సంగతి.. లోకేష్ ముందుగానే ఫిక్స్ అయిపోయారన్నమాట.. -
నిజాలకు పాతర.. అబద్ధాల జాతర
సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు అచ్చేయడంలో తనకు తానే సాటి అని ‘ఈనాడు’ రామోజీరావు మరోసారి నిరూపించుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమతుల అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వెనుకబడిన రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. ఫలితంగా మునుపెన్నడూ లేని రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధిలో పురోగమిస్తోంది. దీన్ని ఇప్పుడు రామోజీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలను నిత్యం వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని విషం కక్కుతున్నారు. వాటిని అపహాస్యం చేస్తూ.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి కొన్ని రాజకీయ శక్తులతో కలిసి ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ‘కరవు నేలపై కనికట్టు మాటలు’ శీర్షికన మంగళవారం ఈనాడులో అచ్చోసిన అబద్ధాల సమాహారం. సీమ పచ్చబడుతుంటే ఎందుకంత కడుపుమంట?.. ♦ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ తదితర ప్రాజెక్టులను చేపట్టారు. ఈ ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను టీడీపీ సర్కార్ పూర్తిచేయలేదు. పైగా.. ఆ పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. నామినేషన్పై అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. ప్రభుత్వ ఖజానాను చంద్రబాబు ఇలా దోచుకోవడంపై రామోజీరావు పెన్ను ఎప్పుడూ కదల్లేదు.. నోరు పెగల్లేదు. ఎందుకంటే.. అలా దోచుకుని, పంచుకుని, తిన్న దాంట్లో ఆయనకూ వాటా వచ్చిం ది కాబట్టి. కానీ, జగన్ ఈ ప్రాజెక్టులన్నింటిని పెద్దపీట వేశారు. ♦ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగుగంగలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. ఇక తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకూ సీఎం జగన్ డయాఫ్రమ్ వాల్ నిర్మించి లీకేజీలకు అడ్డకట్ట వేయడం ద్వారా ఆ ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు 17 టీఎంసీలు నిల్వచేస్తున్నారు. అలాగే, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్నూ పూర్తిచేశారు. అంతేకాక.. రూ.950 కోట్లు వెచ్చిం చి గండికోట, రూ.280 కోట్లు వెచ్చిం చి సీబీఆర్ నిర్వాసితులకు పునరావాసం కలి్పంచి.. ఆ రెండు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో అంటే గండికోటలో 26.85 టీఎంసీలు, సీబీఆర్లో పది టీఎంసీలు నిల్వచేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. ఇలా సీమ పచ్చబడుతుంటే ఎందుకంత కడపుమంట రామోజీ? ♦ఇక రాయలసీమ సాగు, తాగునీటి కష్టాలు కడతేర్చాలనే లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. దీనిపై ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవునిలా చంద్రబాబు అడ్డుపడుతుంటే ఏనాడైనా నిలదీశారా రామోజీ? శరవేగంగా పారిశ్రామిక ప్రగతి.. నిజానికి.. నాలుగేళ్లలో రాయలసీమ పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధించింది. రవాణా, విద్యుత్ ఎల్రక్టానిక్స్, ఉక్కు రంగాల్లో శరవేగంగా ముందుకు సాగుతోంది. రాయలసీమ ప్రగతికి ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు చుక్కానిలా నిలవనుంది. సీమలో ఉత్పత్తయ్యే వస్తువుల రవాణాకు.. ఎగుమతి, దిగుమతులు ఊపందుకోవడానికి ఈ పోర్టు ఉపయోగపడుతుంది. దీనిని రూ.2,365 కోట్లతో ప్రభుత్వం నిరి్మస్తోంది. ఈ పోర్టుకు సమీపంలోనే నాలుగైదు వేల ఎకరాల్లో పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి కానుంది. ఏడాదికి 34 మిలియన్ టన్నుల సరుకులు ఈ పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతులు జరగనున్నాయి. ♦ కడప స్టీల్ ప్లాంట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ♦ 2019–23 మధ్యకాలంలో రాయలసీమ ప్రాంతంలో 71 అతిపెద్ద–భారీ పరిశ్రమలు వచ్చాయి. రూ.36,610 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 55 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ♦ రాయలసీమ ప్రాంతం దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల రంగానికి తలమానికం కానుంది. ప్రభుత్వ కృషివల్ల ఈ ఒక్క రంగంలోనే.. అదీ ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 16 ప్రాజెక్టులు రాబోతున్నాయి. ♦ శ్రీకాళహస్తి సమీపంలోని ఇంగలూరులో అడిడాస్ షూ తయారీ కంపెనీ అపాచీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ఒక్క కార్యక్రమంతోనే ప్రారంభించిన, భూమి పూజ చేసుకున్న పరిశ్రమల పెట్టుబడుల విలువ దాదాపు రూ.4వేల కోట్లు కాగా.. సుమారు 20వేల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు.. రాయలసీమలో వైద్యారోగ్య పరంగా కూడా ఈ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిం ది. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తుండగా అందులో ఐదు కాలేజీల నిర్మాణాన్ని రాయలసీమలో చేపట్టింది. ఒక్కో మెడికల్ కాలేజీ కోసం సుమారుగా రూ.500 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తూ ప్రజారోగ్య రంగంలో పెట్టుబడి పెడుతోంది. రాయలసీమ చరిత్రలోనే ఇంత పెట్టుబడి ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. ఇక తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర, కడప, అనంతపురం, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల రూపురేఖలను సైతం మారుస్తోంది. ప్రజారోగ్యంపై టీడీపీ సర్కార్ ఎప్పుడైనా ఇంత శ్రద్ధ పెట్టిందా రామోజీ? -
రాయలసీమ ఎత్తిపోతల తొలిదశకు గ్రీన్ సిగ్నల్
-
రాయలసీమ ఎత్తిపోతల తొలిదశకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం తొలిదశలో రాయలసీమలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీరు, చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన పనులను ప్రాధాన్యతగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆరు పంపులను (ఒక్కొక్కటి 2,913 క్యూసెక్కుల సామర్థ్యం) ఏర్పాటుచేసి.. నీటి సమస్య తీవ్రంగా ఉండే జూన్ నుంచి జూలై మధ్య 59 టీఎంసీలు తరలించి నీటి ఎద్దడిని నివారించవచ్చని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం సముద్ర మట్టానికి 885 అడుగుల ఎత్తున ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరునిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగుగంగకు 29, గాలేరు–నగరికి 38 వెరసి 101 టీఎంసీలు సరఫరా చేయాలి. వర్షాభావ పరిస్థితులవల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు ఏయేటికాయేడు తగ్గుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటం ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందడంలేదు. అనుమతి వచ్చేలోగా తాగునీటి కోసం.. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అది వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులు చేపట్టాలని నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు 8.4 టీఎంసీలు వెరసి 35.23 టీఎంసీలు కనీసం నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశముంటుంది. రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6)అంటే దాదాపు 59 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగునీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతివ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పర్యావరణ అనుమతితోనే పనులు రాయలసీమ హక్కులను పరిరక్షించడం, చెన్నైకి నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా.. శ్రీశైలం రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020, మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. పర్యావరణ అనుమతి తీసుకోకుండా ఎత్తిపోతలను చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో టీడీపీ నేతలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. అదనంగా నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్లు నిర్మించడంలేదని.. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని ఎన్జీటీలో ప్రభుత్వం వాదించింది. కానీ.. ఎత్తిపోతల పనులను ఆపేయాలంటూ 2020, మే 20న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్జీటీ నియమించిన జాయింట్ కమిటీ కూడా ఏపీ ప్రభుత్వ వాదననే బలపరుస్తూ నివేదిక ఇచ్చింది. కానీ, పర్యావరణ అనుమతితోనే పనులు చేపట్టాలని 2020, అక్టోబర్ 29న ఎన్జీటీ నిర్దేశించింది. దాంతో పర్యావరణ అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో జలవనరుల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గురువారంకి పశ్చిమ, వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి ప్రస్తుత అల్పపీడన ప్రాంతం వరకు తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా వెళ్తోంది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 45–55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. -
రాయలసీమకు హైకోర్టు అక్కర్లేదట.. సీమకు చంద్రబాబు ద్రోహం
“అమరావతిలో లక్షల కోట్లు ఖర్చుపెట్టేసి టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచేయాలి. కానీ వెనుక బడిన రాయలసీమకు కనీసం హైకోర్టు కూడా అవసరం లేదట. ఉత్తరాంధ్రకు ముందే గుండు సున్నా కొట్టేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమపైనా విషం చిమ్మేశారు. మొత్తానికి తనకు అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకే ప్రాంతమూ నగరమూ ముఖ్యమే కాదని చంద్రబాబు నాయుడు చాటి చెప్పారు. రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న న్యాయరాజధాని వద్దే వద్దని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారు.” రాయలసీమలో పర్యటిస్తోన్న చంద్రబాబు నాయుడు ఒక పక్క తన అవినీతిని ఐటీ నోటీసులు బట్టబయలు చేయడంతో ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న భయంతో ఉన్నారు. మరో పక్క రాయలసీమ వాసులు న్యాయ రాజధాని ప్రస్తావన తీసుకురాగానే చంద్రబాబుకు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తుకొచ్చింది. అంతే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమకు హైకోర్టు ఎందుకు? అని ఎదురు ప్రశ్రించారు. కావాలంటే హై కోర్టు బెంచ్ ఇస్తే అదే ఎక్కువ అని కూడా తీర్పు చెప్పారు. రాయలసీమ ప్రజల ఓట్లతో రాజకీయ బిక్ష పెడితే రాజకీయాల్లో ఎదిగి కుదరకపోతే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. తనను అంతటి వాణ్ని చేసిన రాయలసీమ ప్రజల రుణాన్ని ఎలా తీర్చుకోవాలా? అని ఆయన ఆలోచించాలి. అలాంటిది రాయలసీమకు ఎలా ద్రోహం తలపెడదామా అన్న ఆలోచనే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార.. అభివృద్ది వికేంద్రీకరణల్లో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించిస సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగానూ కర్నూలును న్యాయ రాజధానిగానూ చేయాలని ఆయన నిర్ణయించారు. అయితే కర్నూలులో హై కోర్టు పెడితే ఏం వస్తుంది? నాలుగు జిరాక్స్ సెంటర్లు వస్తాయంతే అని చంద్రబాబు విషం చిమ్మారు. తాజాగా చంద్రబాబు రాయలసీమ పర్యటనలో సీమ న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ప్రస్తావన తీసుకురాగనే చంద్రబాబుకు మండుకొచ్చేసింది. రాయలసీమకు హైకోర్టు అవసరమే లేదని తెగేసి చెప్పారు. కావాలంటే ఓ బెంచ్ ఇస్తే సరిపోతుందన్నారు. హైకోర్టు పెడితేనే నాలుగు జిరాక్స్ షాపులు తప్ప ఏవీ రావన్న చంద్రబాబు నాయుడు హైకోర్టు బెంచ్ పెడితే కర్నూలుకు ఏం వస్తుందో చెప్పాలంటున్నారు రాయలసీమ హక్కుల వేదిక నేతలు. బాగా అభివృద్ది చెంది.. రాజధానికి అన్ని విధాలా అనువైన నగరంగా అందరూ ఒప్పుకునే విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నారు చంద్రబాబు. అక్కడ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని ఉత్తరాంధ్ర ప్రజలే అంటున్నారంటూ బుకాయిస్తున్నారు చంద్రబాబు. ఇటు రాయలసీమకు హైకోర్టు అవసరం లేదంటూ ఈ ప్రాంతంపైనా విషం చిమ్ముతున్నారు. తాను తన బంధువులు.. తన ఎల్లో మీడియా అధినేతలు.. టీడీపీ సీనియర్లు వారి బంధువులు భూములు కొని అట్టేపెట్టుకున్న అమరావతిలో మాత్రం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయినా సరే లక్షన్నర కోట్లకు పైగా ఖర్చే చేసేయాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు. చదవండి: ‘చంద్రబాబు నిజంగానే భయపడ్డారు’ ఏ అమరావతి జపం చేస్తున్నారో అదే అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం ముసుగులోనే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు అడ్డంగా భోంచేసిన వైనాన్ని ఐటీ శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తాను జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు నాయుడికి అర్ధమైపోయింది. తాను చేసిన తప్పేంటో తనకి తెలుసు. ఆ తప్పుకు శిక్ష ఏం పడుతుందో కూడా బాబుకు తెలుసు. అందుకే తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ఆయన కంగారు పడుతున్నారు. ఈ ఉక్రోషంలోనే రాయలసీమకు హైకోర్టు బెంచ్ చాలునని విషం కక్కుతున్నారని రాయలసీమకు చెందిన న్యాయవాదులు అంటున్నారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు, సాక్షి -
రాయలసీమపై మరోసారి విషం చిమ్మిన చంద్రబాబు
-
బాబుపై రాయలసీమ యువజన విద్యార్థి JAC నేతల ఆగ్రహం
-
రాయలసీమలో భారీ వర్షాలు
(సాక్షి నెట్వర్క్) : రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉమ్మడి వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజోలి ఆనకట్టకు భారీగా నీరు.. కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు వైఎస్సార్ జిల్లా మండల పరిధిలోని రాజోలి ఆనకట్టకు భారీగా వచ్చి చేరుతోంది. కుందూ పరీవాహక గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఇందిరారాణి సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలో రికార్డు స్థాయిలో 73.2 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో సగటున 53.4, కర్నూలు జిల్లాలో సగటున 19.8 మి.మీ. వర్షం కురిసింది. రెండు రోజులుగా తిరుపతి జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం జిల్లాలో గరిష్టంగా బాలయపల్లి మండలంలో 118.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తిరుపతి అర్బన్లో 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా తవణంపల్లె మండలంలో 83.6 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ వర్షాలు కురిశాయి. అటు సత్యసాయి జిల్లా, ఇటు అనంతపురం జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో మొదటిసారిగా పుట్లూరు మండలంలో 111.6 మి.మీ. భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లాలో సగటున 17.2 మి.మీ., ఎన్టీఆర్ జిల్లాలో 25.52 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ♦ వైఎస్సార్ జిల్లా చెన్నూరు వద్ద పెన్నా నదిలో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా నీటి ఉధృతి ఎక్కువైంది. నదిలో షికారుకు వెళ్లిన చెన్నూరు కొత్త గాంధీనగర్కు చెందిన వెంకట సుబ్బయ్య, రాజు, రమణ(పెద్దోడు), వెంకట సుబ్బయ్య, సుబ్బరాయుడు, శ్రీను, రమణ, రాజేష్ పెన్నా నదిలో షికారుకెళ్లి పెన్నా నదిలో చిక్కుకున్నారు. మైదుకూరు రూరల్ సీఐ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటు సాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ♦శనివారం రాత్రి కురిసిన వర్షానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు సమీపంలోని ఇసుక వంకలో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఇసుక వంకలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ సదాశివయ్య పోలీసులు, రెస్క్యూ టీమ్ వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న 13 మంది ప్రయాణికులను, డ్రైవర్, కండక్టర్ను తాడు సాయంతో ఉప్పలపాడు వైపు గట్టుకు తీసుకొచ్చారు. రేపు అల్పపీడనం! సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి, ఆంధ్రప్రదేశ్ను ఆనుకుని ఉన్న తెలంగాణపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర, రాయలసీమలపై బలంగా ఉన్నాయి. వీటన్నిటి ఫలితంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయి. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. పార్వతీపురం మన్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోను, బుధవారం ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని తెలిపింది. -
ఎట్టకేలకు వానలు!
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల రోజులుగా హిమాలయాల్లోనే తిష్ట వేసిన రుతుపవన ద్రోణి అక్కడి నుంచి దక్షిణాదికి మారడం, విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉండి, వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే, ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. ఒకట్రెండు చోట్ల అదీ స్వల్పంగానే వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాలంటే అల్పపీడన ద్రోణులు గానీ, ఉపరితల ఆవర్తనాలు గానీ, బంగాళాఖాతంలో అల్పపీడనాలు గానీ ఏర్పడాలి. వాటివల్ల నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయి. కానీ దాదాపు నెల రోజులుగా ద్రోణులు, ఆవర్తనాల జాడ లేదు. వర్షాలకు దోహదపడే నైరుతి రుతుపవనాల ద్రోణి కూడా మూడు వారాలకు పైగా దక్షిణాది వైపునకు రాకుండా హిమాలయాల ప్రాంతంలోనే ఉండిపోయింది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఆగస్టు నెల వర్షపాతం సాధారణంకంటే 54 శాతం, నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభం నుంచి ఆగస్టు ఆఖరు వరకు చూస్తే 25 శాతం తక్కువగా నమోదైంది. ఈ తరుణంలో రుతుపవన ద్రోణిలో కదలిక రావడం, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురిసేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. దాదాపు నెలరోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు, ప్రజలకు ఈ వానలు ఎంతగానో ఊరట కలిగించనున్నాయి. -
నెత్తుటి పారుదల యాగమా ఇది?
అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తుతుంటే అతడి మానసికస్థితి ఎలా ఉంటుంది? ఈ వారం రాయలసీమ పర్యటనలో చంద్రబాబు ప్రవర్తనలా ఉంటుంది. ఇంచుమించు ఉన్మాదస్థితిని తలపిస్తుంది. బాధాకరం. రాజకీయాల్లో ఆయనది నెగెటివ్ పాత్రే కావచ్చు. వెన్నుపోటుకు మారుపేరే కావచ్చు. విధానపరంగా పేదల వ్యతిరేకే కావచ్చు. పెత్తందార్ల ప్రతినిధే కావచ్చు. అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు. కానీ పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుని హోదా అనుభవించారు. నగరవాసమూ, అరణ్యవాసమూ తర్వాత మిగిలింది అజ్ఞాతవాసమే కదా! అందుకు సిద్ధపడాల్సిన సమయంలో ఈ దుఃస్థితి! తెలుగు వారందరూ విచారించ దగిన పరిణామం. సాగునీటి ప్రాజెక్టులపై ‘యుద్ధభేరి’ అనే పేరుతో కర్నూలు జిల్లా బనకచర్ల దగ్గర ఆయన యాత్రను ప్రారంభించారు. పేరు ఏదైనా సరే తన ఉద్దేశం వేరే ఉన్నట్లు తొలిరోజు నుంచే సంకేతాలు పంపిస్తున్నారు. పాల్గొన్న ప్రతి సభలో ముఖ్యమంత్రిపై దూషణలకు తెగబడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిని ఆంబోతుగా సంబోధించారు. చివరకు ముప్ఫయ్యేళ్ల వయసు కూడా లేని యువకుడు సిద్ధార్థరెడ్డిని కూడా వదల్లేదు. నాలుకను నాలుగించులు సాగదీసి మరీ బెదిరించారు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక సభలో ఆటంబాంబు లాంటి స్టేట్మెంట్ను జనం మీదకు వదిలారు. ఆ బాంబును తయారుచేసిన ఒపెన్హైమర్ సినిమా ఇప్పుడు నడుస్తున్నందువల్ల స్ఫూర్తి పొందాడేమో తెలియదు. ‘ఏయ్! నేను సింహంలాంటోణ్ణి’ అనగానే సభికులు అవాక్కయ్యారు. వారి పంచేంద్రియాలు ఎవరో మంత్రించినట్టుగా స్తంభించిపోయాయి. నవనాడుల్లో రక్తప్రసరణ ఆగిపోయినట్టయింది. ఆంధ్రప్రదేశ్లో దసరాకు పులివేషాలు సహజమే – ఆ వేషాలు వేసే వాళ్లు లేక ఇప్పుడవీ తగ్గిపోయాయట! కానీ, బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు తమకు నప్పని, కుదరని వేషాలు వేస్తే జనం అంగీకరించరని అనేకమార్లు రుజువైంది. అందుకే ఎన్టీ రామారావు దేవదాసు వేషాన్నీ, నాగేశ్వరరావు దుర్యోధన వేషాన్నీ వేయడానికి సాహసించలేదు. కిల్బిల్ పాండే వేషంలో బ్రహ్మానందం ఎంత సీరియస్గా మొహం పెట్టినా అది కామెడీ ట్రాక్గానే మిగిలిపోయింది. ఈ కారణం వల్లనే చంద్రబాబు బాంబింగ్కు జనం స్పందించలేదు. చప్పట్లు కొట్టలేదు. నప్పని వేషాలు వేస్తేనే అంగీకరించని జనం స్వభావ విరుద్ధమైన పోలికలు తీసుకొస్తే, పొగడ్తలు కురిపిస్తే షాకవ్వడం సహజం. పోనీ, ఎవరో ఒక అభిమానో, లేదా కార్యకర్తో వచ్చి ‘అన్న టైగర్’, ‘అన్న లయన్’ అంటే అది వేరు. కానీ స్వయంగా ‘నేను లయన్’ను అని ప్రకటించుకోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. కొంతమంది తాము కూర్చునే కుర్చీ వెనుక పెద్దపులి బొమ్మల్ని పటం కట్టించి పెట్టుకుంటారట! ఇలాంటి వారు స్వభావసిద్ధంగా పిరికివాళ్లనీ, దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం ఇటువంటి బొమ్మల్ని పెట్టుకుంటారనీ సైకాలజిస్టులు చెబుతారు. ఇక స్వయంప్రకటిత నర‘సింహా’లకూ, నర‘శార్దూల’లకూ కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో తెలుసుకోవాలి. మొదటి సింహ ప్రయోగం రసాభాస కావడంతో రెండోరోజు కొంత కసరత్తు చేసి కార్యకర్తలను ముందుగానే సిద్ధం చేశారు. ఈ సభలో వారు చప్పట్లు కొట్టారు. ‘నేను సింహాన్ని, కొదమ సింహాన్ని’ అని రెండు మూడుసార్లు ఆయన ప్రకటించుకున్నారు. కొదమసింహం అంటే యువసింహం అని అర్థం. ఆయనే యువసింహం అయితే వాళ్లబ్బాయి బాలసింహం అవుతాడా, శిశుసింహం అవుతాడా అనే తర్కం అనవసరం. ఈ సింహోపాఖ్యానాన్ని వ్యూహం ప్రకారమే ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మరో ఓటమి తప్పదనే అంచనాలు ఆయనకు తెలియనివి కావు. గత ఎన్నికల్లో టీడీపీ కంటే పదిశాతం ఎక్కువ ఓట్లు వైసీపీకి లభించాయి. ఇప్పుడా తేడా మరింత పెరిగి దాదాపు పద్దెనిమిది శాతానికి చేరుకున్నట్టు వివిధ సర్వేల అంచనాలు తేల్చుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన కొన్ని జాతీయ సంస్థలతో ప్రతిపక్షాలు చేయించిన సర్వేలో వైసీపీకి 52 శాతం, తెలుగుదేశం పార్టీకి 34 శాతం ఓటర్ల మద్దతున్నట్టు వెల్లడైందట! గడచిన ఏడాది కాలంగా జరిగిన సర్వేల్లో ఈ బలాబలాల పొందికలో ఒకటి రెండు శాతానికి మించిన ఊగిసలాట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఒక్క దానితో పొత్తు కుదిరినా ప్రయోజనం లేదు. బీజేపీతో సహా మిగిలిన పార్టీలన్నీ తనకు మద్దతుగా నిలబడాలి. అందరూ ఏకమవడం ఎలా కుదురుతుంది? బీజేపి మద్దతు ఉన్న కూటమి వైపే కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులూ ఎలా నిలబడతారు? ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ఏకం చేయవచ్చుననే అంధ విశ్వాసమేదో చంద్రబాబులో ఉన్నదని అంటారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చివేసినప్పుడు ఈ ఐక్యత సాధ్యమైందట! తిరిగి అధికారంలోకి రావడానికి సహకరించినందుకు కృతజ్ఞతగా ఎన్టీరామారావు ఒక పక్క బీజేపీనీ, మరోపక్క కమ్యూనిస్టులనూ కలుపుకొని తదుపరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఐక్యతకు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరు పెట్టినప్పటికీ, కనిపించని ‘కామన్ త్రెడ్’ ఏదో వీరిని కలిపేసిందని అప్పట్లోనే కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఆ ‘కామన్ త్రెడ్’ ఇప్పుడు కూడా అక్కరకొస్తుందని చంద్రబాబు ఆశ. కొందరు కమ్యూనిస్టులు, కొందరు కాంగ్రెస్ నాయకులతో కూడా ఈ మేరకు ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయడానికి ఒక భూమిక కావాలి కదా! ఆ భూమిక కోసం ఇంతకు ముందే, ఒకటి రెండు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనీ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారనీ ఎల్లో మీడియా సహకారంతో తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్నే నిర్వహించింది. కానీ, ఆ క్యాంపెయిన్ ప్రజలను నమ్మించలేకపోయింది. ఇటీవల గోదావరి జిల్లాల్లో బాబు భాగస్వామి పవన్ కల్యాణ్ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో ఆడపిల్లలను అక్రమంగా తరలిస్తున్నారంటూ చేసిన గాలి ఆరోపణను కూడా ఈ కోణంలోంచి చూడాలి. దానికి కొనసాగింపు చంద్రబాబు రాయసీమ పర్యటన. కర్నూలు జిల్లాలో సింహం మాస్క్తో మొదలై చిత్తూరు జిల్లాలో రక్తం చిందే వరకు సాగింది. అంగళ్లులో, పుంగనూరులో జరిగిన అల్లర్లలో చంద్రబాబు పాత్ర వీడియో ఫుటేజీల సాక్షిగా రుజువైంది. రెండు రోజుల కింద పులివెందులలోనే ఇటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులుగానీ, వైసీపీ శ్రేణులు గానీ కవ్వింపులకు రెచ్చిపోకుండా నిగ్రహం పాటించడంతో ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి గుణపాఠం తీసుకున్న చంద్రబాబు గురి తప్పకుండా పుంగనూరులో అల్లర్లు జరిగేలా ప్లాన్ చేశారు. పర్యటన జరిగినన్ని రోజులూ మూడు నాలుగు జిల్లాల నుంచి సమీకరించిన రౌడీ దండును ఆయన వెంటేసుకుని తిరిగారు. ఈ రౌడీదండు తమ వెంట రాళ్లు, గాజుముక్కలతో పాటు కత్తులు, తుపాకులను కూడా ఉంచుకున్నారు. ఇవన్నీ సందేహాతీతంగా నిరూపణ కాబోతున్నాయి. నిందితుల మీద చర్యలు తీసుకుంటే ప్రత్యర్థులను వేధిస్తున్నారని గగ్గోలు పెట్టాలి. చర్యలు తీసుకోకపోతే మరింత చెలరేగిపోవాలి. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా, ఎవరి భాష్యాలు ఎలా చెప్పినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ఒక తంతుగానే సాగింది. చిత్తం ప్రాజెక్టుల మీద, భక్తి పచ్చినెత్తురు మీద అన్నట్టుగా ముగిసింది. ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఉంటే రాయలసీమ సాగునీటికి సంబంధించి వైసీపీ వాళ్లు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. రాయలసీమ ప్రజల్లో, మేధావుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రధాన ఆధారం కృష్ణా ప్రవాహం. 1983–84లో తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలం జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వద్ద అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం హెడ్ రెగ్యులేటర్ను ఏర్పాటుచేసింది. దాని సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ రెగ్యులేటర్ ద్వారా తరలించిన నీటి పరిమాణం ఎంత అని ఇరవయ్యేళ్ల తర్వాత పరిశీలించినప్పుడు, రిజర్వాయర్లో ఆవిరైన నీటిలో సగానికంటే తక్కువని వెల్లడైంది. ఆ ఇరవై ఏళ్ల కాలంలో శ్రీశైలం డ్యామ్లోకి 19,642 టీఎమ్సీల నీరు చేరింది. అందులో 349 టీఎమ్సీల నీరు ఆవిరైంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా సీమకు చేరిన నీరు 160 టీఎమ్సీలు మాత్రమే. అంటే ఆవిరైన నీటిలో 0.45 శాతం. రామారావు తర్వాత తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఎందుకు పెంచలేదని రాయలసీమ రైతులు, మేధావులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు రాజశేఖరరెడ్డి పెంచినప్పుడు తెలుగుదేశం శ్రేణుల చేత కర్నూలు రహదారిపై, ప్రకాశం బ్యారేజీపై ఎందుకు వ్యతిరేక ధర్నాలు చేయించావు చంద్రబాబూ అని వారు గత పద్దెనిమిదేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటి తరలింపు కార్యక్రమం రిజర్వాయర్లో 881 అడుగుల స్థాయి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతున్నది. ఈ స్థాయి నీటిమట్టం ఏడాదిలో సగటున 35 రోజులు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 800 నుంచి 826 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎడమగట్టు కాల్వలను డిజైన్ చేసింది. 796 అడుగుల నుంచి విద్యుత్ కేంద్రం ద్వారా 44 వేల క్యూసెక్కులను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉన్నది. రోజుకు 6.5 టీఎమ్సీలను తక్కువ నీటి మట్టం నుంచే తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి ఏం చేశావన్నది రాయలసీమ ప్రజలు చంద్రబాబుకు వేస్తున్న ప్రశ్న. ‘ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదా’ అని వారు ఆగ్రహిస్తున్నారు. ఇందుకు విరుగుడుగా 800 అడుగుల మట్టం నుంచే ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసి జగన్మోహన్రెడ్డి ఎలా సీమ ప్రాజెక్టుల ద్రోహి అయ్యాడో వివరించమని వారు నిలదీస్తున్నారు. బనకచర్ల క్రాస్ టు వెలిగోడు లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంలో అందులో సగం కూడా వెళ్లలేని పరిస్థితి. బ్రహ్మంసాగర్ నిల్వ సామర్థ్యం 17.85 టీఎమ్సీలు. మట్టికట్ట లీకేజీల వల్ల నాలుగు టీఎమ్సీలు కూడా నిలబెట్టలేని స్థితి. అధికారంలో ఐదేళ్లు ఉండి పట్టించుకోని మీరా? అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆ పనులు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డా? ఎవరు ద్రోహి? అని రాయలసీయ ప్రజలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ఏ ప్రాంతంలోనైతే నెత్తురు పారించాలని ప్రయత్నం చేశాడో, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని హంద్రీ–నీవా, గాలేరు–నగరిని సంధానిస్తూ జగన్మోహన్రెడ్డి మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతల చేత చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించారు. కడుపు మండిన ఆ ప్రాంత రైతులు రోడ్ల పక్కన నిలబడి చంద్రబాబుకు నిరసన తెలిపారు. రాయలసీమకు నీరందించే ఒక్కో ప్రాజెక్టు కింద ఒక్కో డజన్ ప్రశ్నలు చంద్రబాబు కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటికి ఆయన దగ్గర సమాధానాల్లేవు, సమాధానం చెప్పే ఉద్దేశం కూడా లేదు. సీమలో సాగునీరు పారితే ఆయనకు అధికారం రాదు. ఏమో... నెత్తురు పారితే? ఎంతవరకు ఉపయోగమనే ట్రయల్రన్ నడుస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
టీడీపీ రాక్షస క్రీడ
సాక్షి, తిరుపతి/చిత్తూరు/ పుంగనూరు/బి కొత్తకోట: రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్తో అగ్గి రాజేశారు. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి.. పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రాజెక్టుల సందర్శన పేరుతో శుక్రవారం ఆయన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. ములకలచెరువు మండలం నాయనపల్లి చెరువు వద్ద ఉన్న హంద్రీ–నీవా, గాలేరు నగరి అనుసంధానం కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బి కొత్తకోట మండలం చీతివారిపల్లి సమీపంలో ఉన్న హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ పనులను పరిశీలించాల్సి ఉండింది. అయితే పుంగనూరులో విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతో రూట్ మ్యాప్ మార్చుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల పరిధిలోని ముదివేడు రిజర్వాయర్ పరిశీలనకు వెళ్తున్నారని తెలుసుకున్న స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులు బాబు తీరుపై మార్గం మధ్యలోని అంగళ్లు సర్కిల్ వద్ద నిరసన తెలిపి వెనుదిరిగారు. అంతలో అక్కడికి చేరుకున్న చంద్రబాబు బృందం వందలాది మందితో వచ్చీ రాగానే కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారు. దూరంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు ఎంతగా వారించినా వినలేదు. స్థానికులు భయాందోళనతో ఇళ్లలోకి పరుగులు తీశారు. టీడీపీ గూండాల రాళ్ల దాడిలో ముదివేడు పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కేశవ, అంగళ్లకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అర్జున్రెడ్డి (35) తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువుకు చెందిన విశ్వనాథరెడ్డి సహా మరో పది మందికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు వారించడం అటుంచి, చోద్యం చూశారు. పైగా జీపుపైకి ఎక్కి రెచ్చగొట్టేలా మాట్లాడారు. పోలీసులపై రాళ్లు విసిరి దాడికి పాల్పడుతున్న టీడీపీ శ్రేణులు పుంగనూరు పుడింగితో తేల్చుకుందాం రండి అంగళ్ల వద్ద నుంచి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బైపాస్, పలమనేరు మీదుగా చంద్రబాబు చిత్తూరుకు చేరుకోవాల్సి ఉంది. చంద్రబాబు రూట్ మ్యాప్లో పుంగనూరు ప్రస్తావన లేదు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు.. పుంగనూరుకు వెళ్దాం.. రండి అంటూ టీడీపీ గూండాలకు మైక్ ద్వారా పిలుపునిచ్చారు. ‘పుంగనూరులో పుడింగి ఉన్నాడు.. రండి తేల్చుకుందాం’ అని గట్టిగా అరుస్తూ ముందుకు కదిలారు. బాబు పిలుపుతో పుంగనూరు వద్ద విధ్వంసం అంగళ్ల వద్ద చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు పుంగనూరు వద్ద టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో అధినేత రాకముందే గుమిగూడారు. ఒక్కసారిగా బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. పుంగనూరు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా వినిపించుకోకుండా గొడవకు దిగారు. ఒక ఏఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలతోపాటు సుమారు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతలో చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ గూండాలను వెనకేసుకుని బైపాస్ రోడ్డులోని భీమగానిపల్లె సర్కిల్ నుండి పుంగనూరులోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘పుంగనూరులో కాలుమోపుతా.. ఎవరు అడ్డుకుంటారో? చూస్తా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎంతగా వారించినా వినలేదు. పైగా పోలీసులను టార్గెట్గా చేసుకుని టీడీపీ శ్రేణులు తొలుత రాళ్ల వర్షం కురిపించాయి. ఆ తర్వాత కర్రలతో పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ముందస్తుగా సిద్ధం చేసుకున్న బీరు బాటిళ్లు, మద్యం సీసాలు పోలీసులపైకి విసిరి తీవ్రంగా గాయపరిచారు. పోలీసు గస్తీ కోసం ఏర్పాటు చేసిన వజ్ర వాహనాన్ని, మరో పోలీసు వాహనాన్ని కిందకు పడదోసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఎంతగా సంయమనం పాటించి, సర్దిచెప్పినప్పటికీ వారు వినకపోవడంతో పోలీసులు వారిపైకి బాష్ప వాయువు ప్రయోగించి చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ విధ్వంసం గంటన్నరకుపైగా సాగింది. 27 మందికి గాయాలు టీడీపీ శ్రేణుల దాడిలో ఏఎస్పీ, డీఎస్పీతోపాటు ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలతోపాటు మొత్తం 27 మందికి రక్త గాయాలయ్యాయి. సాయంత్రం 4 నుండి 5.30 గంటల మధ్య పుంగనూరు బైపాస్రోడ్డు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. చిత్తూరు ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, దిశ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్, క్రైమ్ సీఐ భాస్కర్, పాలసముద్రం ఎస్ఐ ప్రసాద్లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ పోలీసుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటోలు, వీడియోల్లో పోలీసు అధికారులు, సిబ్బంది రక్త గాయాలతో ఉండటం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని పోలీసులపై టీడీపీ శ్రేణులు ఇలా దాడులు చేసి గాయ పరచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు. అనంతరం అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డితో కలిసి పుంగనూరులో ఘటన వివరాలను మీడియాకు వివరించారు. కాగా, గొడవ విçషయం తెలిసి పుంగనూరు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్న స్థానిక వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో 50 మందికి టీడీపీ నేతల రాళ్ల దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులపైకి రాళ్లు విసురుతూ దూసుకొస్తున్న టీడీపీ శ్రేణులు అంతా వ్యూహాత్మకం చిత్తూరు అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో) నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్ మ్యాప్లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఆర్మ్డ్ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు. కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్ హోటల్కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థి నరహరి కారులో గన్ బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది. కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహే‹Ùపైకి దూసుకొచ్చింది. మహేష్ హెచ్చరికతో కారు ఆగింది. అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా.. ఆగ్రహించిన గురుమిత్సింగ్ కారులోంచి డబుల్ బ్యారల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు.పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్ బ్యారల్ గన్, సీటు కవర్లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్ లభించాయి. వీటితోపాటు కారును స్వాదీనం చేసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్మిత్సింగ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. రెచ్చగొట్టే ప్రసంగాలతోనే విధ్వంసం రెచ్చగొట్టే ప్రసంగాలతో పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు జరగడం బాధాకరం. ఇలాంటి మాటలు సమాజానికి మంచిది కాదు. గాయపడిన పోలీసుల పరిస్థితి ఇది.. తెలుగుదేశం వారు ఉపయోగించిన రాళ్లివి (వీడియో చూపుతూ). అనుమతి పొందిన రూట్మ్యాప్ను కాదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పుంగనూరులోకి వచ్చే ప్రయత్నం చేయడంతోనే విధ్వంసం జరిగింది. పోలీస్ అధికారుల వద్ద పిస్టల్ ఉన్నప్పటికీ, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రహించినా సంయమనంతో వ్యవహరించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడదని కాల్పులు జరపలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దాడులు చేసిన వారిని గుర్తిస్తాం. బాధ్యులందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేస్తాం. విధ్వంసం సృష్టించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. – అమ్మిరెడ్డి, అనంతపురం రేంజ్ డీఐజీ ముందస్తు పథకం ప్రకారమే దాడులు ముందస్తు పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దాడి చేశారు. రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పోలీస్ వాహనాలను సైతం తగులబెట్టడం దారుణం. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు. చట్ట ప్రకారం వారందరిపై కేసులు నమోదు చేస్తాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. రూట్ మ్యాప్లో లేకపోయినా.. టీడీపీ నాయకులు కొంత మంది కావాలనే నిబంధనలకు విరుద్దంగా పుంగనూరులోనికి రావడానికి ప్రయత్నించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిలువరించినందుకే దాడి చేశారు. పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించి, దెబ్బలు తిన్నప్పటికీ కాల్పులు జరపలేదు. గొడవనంతటినీ వీడియో చిత్రీకరించాము. చట్టప్రకారం బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం. – రిషాంత్రెడ్డి, చిత్తూరు ఎస్పీ నేడు చిత్తూరు జిల్లా బంద్ పుంగనూరులో చంద్రబాబు అనుచరగణం సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ వైఎస్సార్సీపీ శనివారం చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. కాగా అంగళ్లు కూడలిలో శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ దాష్టీకంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
-
కోతల బాబు రోత మాటలు.. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారో..!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల యాత్ర చేస్తూ మద్యం సరఫరా గురించి మాట్లాడుతున్నారు. కర్నూలు న్యాయరాజధాని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. తన హయాంలో ప్రాజెక్టులను పూర్తి చేసేసినట్లు కోతల మీద కోతలు కోస్తున్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రజలలో బాగా చొచ్చుకుపోయిన ముఖ్యమంత్రి జగన్ పైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన అధిక శాతం అభాండాలు మోపడమే లక్ష్యంగా ఆయన ఈ యాత్ర చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడిగా ప్రాజెక్టులు చేపడతానంటూ శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టులవద్దకు వెళ్లి పూలు పెట్టి నిరసన తెలిపారు. బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రస్తుతం ఆ పద్దతిలోనే పాట్లు పడుతున్నారు. (చదవండి: సినిమాలు తీసి అప్పులు తీర్చాలనుకోవడం అమాయకత్వం) ఉమ్మడి ఎపిలోకాని, విభజిత ఎపిలో కాని కలిపి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు అసలు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సత్వరమే పూర్తి కావని, వాటివల్ల రాజకీయ ప్రయోజనం రాదన్నది ఆయన సిద్దాంతం. అందువల్లే తెలుగుదేశం నేతలు కోరినా పోలవరం, పులిచింతల, వెలిగొండ తదితర ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. రాజశేఖరరెడ్డి వచ్చాకే ప్రాజెక్టులకు ప్రాధాన్యత వచ్చింది. ఆయన ప్రాజెక్టులను ప్రకటించడమే కాదు.. చకచకా చేపట్టారు. వాటిని అడ్డుకోవడానికి తెలుగుదేశం చేయని ప్రయత్నం లేదు. అంతదాకా ఎందుకు! 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా ఏ ప్రాజెక్టు ప్రారంభించారు? దేనిని పూర్తి చేశారు? ఏదో ఒకటి చెప్పడం తప్ప ఆయనకు నిజాయితీ లేదన్నది వాస్తవం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని చేపట్టినా, పోతిరెడ్డిపాడును విస్తరించాలని తలపెట్టినా చంద్రబాబు సహకరించారా? వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడును విస్తరించడానికి ప్లాన్ చేస్తే టిడిపి నేతలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమా, కోడెల వంటి నేతలతో ధర్నాలు చేయించింది చంద్రబాబు కాదా? అది రాయలసీమకు మేలు చేయడానికా? ద్రోహం చేయడానికా? పోతిరెడ్డిపాడు విస్తరిస్తే కోస్తాకు నీరు రావని ప్రచారం చేసింది టిడిపి నేతలు కాదా? అప్పుడేమో అలా వ్యవహరించి ఇప్పుడేమో రాయలసీమకు తానేదో పోడిచేశానని, జగన్ చేయడం లేదని అసత్య ప్రచారం చేయడానికి ఈ యాత్రను సంకల్పించారన్న సంగతి తెలుస్తూనే ఉంది. (చదవండి: అలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?: మంత్రి అంజాద్ బాషా) కడప జిల్లాలో గండికోట రిజర్వాయిర్ లో 27 టిఎమ్.సిల నీటిని నిలబెట్టడానికి వైఎస్ చేసిన కృషిని జిల్లా ప్రజలు ఎన్నటికి మరవరు. చంద్రబాబు ఎంత చెప్పినా అవన్ని ఉబుసుపోక కబుర్లే అవుతాయన్న సంగతి అందరికి తెలుసు. పులివెందులకు గండికోట నుంచి నీరు తెస్తానని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ ఆర్ చెబితే ఎవరూ నమ్మలేదట. అదెలా సాధ్యమని చాలా మంది భావించారట. కాని ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే కొండను తొలిచి టన్నెల్ ను నిర్మించి నీరు రప్పించిన తీరు చూశాకా ఔరా! అని అనుకున్నామని పులివెందులలో ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పారు. చంద్రబాబు గురించి ఎవరైనా అలా చెబుతారేమో ఆలోచించండి. ఆయనకు నిజంగా చిత్తశుద్ది ఉంటే పోలవరం ప్రాజెక్టును పక్కనబెట్టి పట్టిసీమ లిఫ్ట్ ప్రాజెక్టును టేకప్ చేసేవారా? విశేషం ఏమిటంటే ఆ లిఫ్ట్ ద్వారా వచ్చిన నీటిని వైఎస్ తవ్వించిన కాల్వ ద్వారానే కృష్ణానదికి తరలించవలసి వచ్చింది. ఆ కాల్వే లేకపోతే పట్టిసీమే లేదు. అదే కాదు వైఎస్ ముందు చూపుతో పోలవరం కాల్వలు తవ్వించి ఉండకపోతే పోలవరం ఇప్పటికి కూడా మొదలయ్యేది కాదు. కేంద్రం చేపట్టవలసిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకుని మొత్తం ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టారు. లేకుంటే పునరావాసం తో సహా అన్ని వ్యయాల బాధ్యత కేంద్రానిది అయి ఉండేది. నిజంగా చంద్రబాబుకు ప్రాజెక్టులపై చిత్తశుద్ది ఉంటే , నీటి పారుదల ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లి మద్యం గురించి ప్రసంగాలు చేస్తారా? పైగా అందులోను అసత్యాలు! మంచి మద్యాన్ని తక్కువ రేటుకు సరఫరా చేస్తానని నలభై ఐదేళ్ల సీనియర్ నేత అయిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నారంటే ఏమన్నా అర్ధం ఉందా? ఇంతకన్నా నీచం ఉంటుందా? మద్యం తాగవద్దని చెప్పాల్సిన ఆయన తాగండి.. బాబూ.. తాగండి అని ప్రచారం చేస్తున్నారు. మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వపరంగా నడుస్తుండడంతో ప్రైవేటు దందాకు అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు టైమ్ లో ఏమి జరిగేది. మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. నలభైఐదు వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు. దాని ప్రభావంతో ఆయన గత ఎన్నికలలో ఓటమి పాలైనా, ఇప్పటికీ అదే దిక్కుమాలిన నినాదం ఎత్తుకుని తిరుగుతున్నారు. మందుబాబుల ఓట్లతో గెలిచిపోతానని బాబు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కాని ఆయన ఉపన్యాసాలను మహిళలు చీత్కరించుకుంటారని తెలుసుకోలేకపోతున్నారు. (చదవండి: నేను మూర్ఖుడిని.. ఎవర్నీ వదలను: నారా లోకేశ్) కర్నూలు న్యాయ రాజధానిగా ఎందుకు చేయలేకపోయారని చంద్రబాబు ప్రశ్నించడం మిలియన్ డాలర్ జోక్ అయినా కావాలి.. మరో అవకాశవాదపు హేళన స్టేట్ మెంట్ అన్నా కావాలి. ఎందుకంటే కర్నూలులో హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్నదే ఆయన అయితే.. దానిని నిస్సిగ్గుగా బుకాయించడం శోచనీయం అని చెప్పాలి. అమరావతి గ్రామాలకు వెళ్లి ఆయన కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పగలరా? అక్కడేమో వ్యతిరేకిస్తారు. ఇక్కడేమో తానేదో అనుకూలం అన్నట్లుగా జగన్ ను ప్రశ్నిస్తారు. రాయలసీమ ప్రజలందరికి తెలుసు. ఎవరు కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్నది. తద్వారా రాయలసీమకు ద్రోహం చేస్తున్నది చంద్రబాబే అని న్యాయవాదులే కాకుండా అన్ని వర్గాల వారికి స్పష్టత ఉంది. మరో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఆయన అధికారంలోకి వస్తే వైసిపివారి పని పడతారట. మురికి కాల్వలో వేసి తొక్కుతారట. ఇది ఒక నాయకుడు మాట్లాడవలసిన తీరేనా? ఇలాంటి నేతను ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్దపడతారా? తన ప్రత్యర్ధి పార్టీవారిని మురికి కాల్వలో తొక్కడం ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అన్నమాట. ఏది ఏమైనా వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి జనం చర్చించుకోకుండా, వాటిని మర్చిపోయేలా చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు విపరీతంగా తంటాలు పడుతున్నారు. అదంతా కేవలం ఓటమి భయంతోనే అని అంతా గుర్తించాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
రూ.19,761 కోట్లతో రాయలసీమలో జాతీయ రహదారులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో రూ.19,761.8 కోట్లతో పలు జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదించిన ఈ జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో 9 నిర్మాణదశలో ఉండగా, 3 అవార్డు అయినప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదని, మరో 11 ప్రాజెక్టులు మంజూరైనప్పటికీ కాంట్రాక్ట్ అవార్డు కాలేదని వివరించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. మొత్తంగా రూ.12,951.68 కోట్లతో చేపట్టిన వివిధ జాతీయ రహదారి అభివృద్ధి పనులు గ్రౌండ్ అయి వివిధదశల్లో పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. రూ.1,989.4 కోట్లతో చేపట్టాల్సిన మూడు జాతీయ రహదారి పనులకు కాంట్రాక్ట్లు అవార్డు పూర్తయి పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. రూ.4,820.72 కోట్లతో చేపట్టాల్సిన 11 హైవే పనులు మంజూరై అవార్డు కోసం ఎదురుచూస్తున్నట్టు మంత్రి వివరించారు. ఎన్డీఆర్ఎఫ్కు రూ.1,60,153 కోట్లు ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు 2021–26 మధ్య కాలంలో ఎన్డీఆర్ఎఫ్కు రూ.1,60,153 కోట్లు కేటాయించినట్లు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. గత కేటాయిపులతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు అధికమని చెప్పారు. దీనికి అదనంగా మరో రూ.68 వేల కోట్ల తక్షణ సహాయనిధిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోస్తా రాష్ట్రాల్లో తుపాన్లు వచ్చినప్పుడు భారత వాతావరణ విభాగం (ఐఎండీ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఎన్డీఆర్ఎఫ్ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ విపత్తు సహాయ చర్యలను చేపడుతోందని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఎస్డీఆర్ఎఫ్కు కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవచ్చని తెలిపారు. -
ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నావు చంద్రబాబూ!?
రాష్ట్రంలో 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వెలగబెట్టింటి ఏమీ లేకపోగా, పోజులివ్వడానికి మాత్రం ఎప్పుడూ ముందుంటారు. ఇతరులు చేసిన పనులను సైతం నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడంలో ఈ పెద్దమనిషిది అందె వేసిన చేయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే గుడ్లురిమి చూడటం, ‘పచ్చ’ మూక/మీడియాతో ఎదురు దాడి చేయించడం ఆయన గారికి మంచి నీళ్లు తాగినంత సులువు. రాయలసీమలో పుట్టి ఆ ప్రాంతానికే వెన్నుపోటు పొడవడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. ఓటుకు కోట్లు కేసుకు జడిసి కృష్ణా జలాలపై హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ తప్పిదాన్ని సరిచేస్తుంటే సైంధవుడిలా అడ్డుపడుతున్నారు. తగుదునమ్మా అంటూ ఇప్పుడు ‘సీమ’ ప్రాజెక్టుల వద్ద ఫొటో సెషన్కు బయలుదేరారు. ఇలా ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నావు చంద్రబాబూ!? దేశంలోనే తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను మళ్లించకుండా నాడు చంద్రబాబు ద్రోహం చేయగా, నేడు గరిష్టంగా ఒడిసిపట్టి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి చాటుకుంటున్నారని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కృష్ణా జలాలపై హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతిలో పూర్తి సామర్థ్యం మేరకు నీటి తరలింపు పనులను పూర్తి చేయడంతోపాటు తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో, ఎస్సార్బీసీలో అంతర్భాగమైన గోరకల్లు, అవుకు రిజర్వాయర్లు, గాలేరు–నగరిలో భాగమైన గండికోట, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండలతోపాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని ఇప్పటికే పూర్తి చేయగా రెండో సొరంగం కూడా దాదాపుగా పూర్తి అయింది. నల్లమల సాగర్కు కృష్ణా జలాలను తరలించడం ద్వారా ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీలకు హక్కుగా దక్కిన జలాలను వాడుకోవడం కోసం రాయలసీమ ఎత్తిపోతలను సీఎం వైఎస్ జగన్ చేపడితే దానిపై ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడే దుస్సాహసానికి చంద్రబాబు ఒడిగట్టారని రైతులు మండిపడుతున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైన చోట కొత్త ప్రాజెక్టులను నిర్మిం చడం కోసం రాయలసీమ కరవు నివారణ పథకం కింద సీఎం జగన్ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి శ్రీశైలం నుంచి 38 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 1.55, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500 వెరసి 2.60 లక్షలకు సాగునీరు, ఐదు లక్షల మందికి తాగునీరు అందించేలా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జలయ/æ్ఞంలో భాగంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో చేపట్టారు. 2009 నాటికే వరద కాలువ, గండికోట రిజర్వాయర్, పైడిపాళెం, వామికొండ, సర్వారాయసాగర్ల జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేశారు. నాడు అలా... 2014లో అధికారంలోకి వచి్చన చంద్రబాబు గాలేరు–నగరి ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల్లో అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద తవ్వాల్సిన జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్(పెలుసుమట్టి)లో 165 మీటర్ల మేర మాత్రమే పనులు చేయాలి. వాటిని చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక సొరంగానికి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా కాలువ(లూప్)తో సరిపుచ్చారు. కమీషన్లు రావనే కారణంతో గాలేరు–నగరిలో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. దాంతో కేవలం నాలుగైదు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్లను పట్టించుకోలేదు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పది టీఎంసీల సామర్థ్యం) నిర్వాసితులకు కూడా చంద్రబాబు పునరావాసం కలి్పంచలేదు. ఏటా కేవలం సగటున రెండు మూడు టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు. నేడు ఇలా.. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు అంటే పది వేల క్యూసెక్కులను తరలించేలా అభివృద్ధి చేయించారు. రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనంతో పూర్తి చేశారు. ఇప్పుడు గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. శ్రీశైలానికి వరద వచి్చన 30 రోజుల్లోనే గాలేరు–నగరి కింద ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేలకు పెంచిన సీఎం జగన్ ఆ పనులను కూడా శరవేగంగా చేస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి పునరావాసం కలి్పంచడం ద్వారా పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో గండికోటలో ఏటా 26.85 టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించి.. రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (ఆరు టీఎంసీలు), వామికొండసాగర్(1.6 టీఎంసీలు), సర్వారాయసాగర్(3.06 టీఎంసీలు)లలోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కలి్పంచడం ద్వారా పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో ఏటా పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతుల జీవితాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారు. తెలుగు గంగ.. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో తరలించే 29 టీఎంసీల కృష్ణా జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలను జతచేసి 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా ఉమ్మడి కర్నూలు (1.08 లక్షల ఎకరాలు), వైఎస్సార్ కడప(1.67 లక్షల ఎకరాలు), ఎస్పీఎస్ఆర్ నెల్లూరు (2.54 లక్షల ఎకరాలు), చిత్తూరు జిల్లా (46 వేల ఎకరాలు) కలిపి మొత్తం 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది తెలుగుగంగ ప్రాజెక్టు ఉద్దేశం. నాడు అలా... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్సార్ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కలువ) ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు చేరే జలాల్లో 15 వేల క్యూసెక్కులను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్కు తరలించేలా 7.8 కి.మీ. పొడవున తవి్వన లింక్ కెనాల్కు లైనింగ్ చేయకపోవడం వల్ల 6 నుంచి 7 వేల క్యూసెక్కులను కూడా తరలించేందుకు వీలయ్యేది కాదు. దీంతో వెలిగోడు రిజర్వాయర్(16.95 టీఎంసీలు) నిండేది కాదు. లింక్ కెనాల్కు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యంతో నీటిని తరలించడం ద్వారా వెలిగోడును సకాలంలో నింపాలన్న ఆలోచన కూడా 2014–19 మధ్య చంద్రబాబు చేయలేదు. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్కు ఐదు వేల క్యూసెక్కులను తరలించేలా 42.566 కిమీల పొడవున తవి్వన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడంతో 2 నుంచి 2,500 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి. బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు. మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి. తెలుగుంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేసిన పాపాన పోలేదు. ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతులను దెబ్బతీశారు. నేడు ఇలా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ను, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ కాలువల ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు నీటిని తరలించడానికి మార్గం సుగమం చేశారు. దీంతో 2019, 2020, 2021, 2022లో వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపగలిగారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వకు లైన్ క్లియర్ చేశారు. 2021–22 నుంచే బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. తెలుగుగంగ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తూ రైతుల జీవన ప్రమాణాలను పెంచేలా సీఎం జగన్ కృషి చేశారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి రాయలసీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. తన హయాంలోనే రూ.6,862.26 కోట్లు ఖర్చు చేసి సింహ భాగం పూర్తి చేశారు. హంద్రీ–నీవాకు తొలుత శ్రీశైలం రిజర్వాయర్లో 834 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసేలా మల్యాల వద్ద పంప్హౌస్ నిర్మించిన మహానేత వైఎస్.. ఆ తర్వాత నీటి మట్టం 795 అడుగుల్లో ఉన్నా నీటిని తరలించేలా ముచ్చుమర్రి ఎత్తిపోతల 2007, ఆగస్టు 31న చేపట్టి, 2009 నాటికే 90 శాతం పూర్తి చేశారు. నాడు అలా.. విభజన నేపథ్యంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హంద్రీ–నీవాలో మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. ఆ తర్వాత వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. జీవో 22(ప్రైస్ ఎస్కలేషన్), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అక్రమంగా వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను 2017 జనవరి 3న జాతికి అంకితం చేసిన నాటి సీఎం చంద్రబాబు.. ఇది తన ఘనతే అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ నిస్సిగ్గుగా ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. హంద్రీ–నీవా అంతర్భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తరలించేందకు చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ను కూడా కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమే‹Ùకు కట్టబెట్టిన చంద్రబాబు.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు తప్ప తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. మహానేత వైఎస్ పూర్తి చేసిన హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా టీడీపీ హయాంలో ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా సీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేశారు. నేడు ఇలా.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో కేవలం 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. హంద్రీ–నీవాలో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి.. ఈ ఏడాదే కృష్ణా జలాలను కుప్పానికి తరలించే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రతి ఏటా డిజైన్ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నారు. రైతుల హక్కులు నాడు తాకట్టు.. నేడు పరిరక్షణ విభజన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్లు ఉమ్మడి ప్రాజెక్టులుగా కేంద్రం గుర్తించింది. శ్రీశైలం నిర్వహణను ఆంధ్రప్రదేశ్కు, నాగార్జునసాగర్ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని ఏపీకి అప్పగించకుండా తన అధీనంలోనే ఉంచుకోవడంపాటు ఏపీ భూభాగంలోని నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను కూడా అ«దీనంలోకి తీసుకుంది. రాష్ట్ర హక్కులను హరించేలా తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు. శ్రీశైలంలో నీటిమట్టం 796 అడుగుల్లో ఉన్నప్పుడే కష్ణా బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తిని ప్రారంభించి రోజూ 44 వేల క్యూసెక్కులను తరలిస్తున్న తెలంగాణ సర్కార్.. 800 అడుగుల నుంచి రోజూ 24,014 క్యూసెక్కలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, 802 అడుగుల నుంచి రోజూ 3200 క్యూసెక్కులు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచడంతోపాటు విభజన చట్టంలో లేని ఎస్సెల్సీసీ నుంచి 826 అడుగుల నుంచే రోజూ 4 వేల క్యూసెక్కులు తరలించే పనులను వేగవంతం చేసింది. 796–826 అడగుల మధ్య నీటి మట్టం ఉన్నప్పుడే రోజూ 6.5 టీఎంసీలు తరలించడానికి తెలంగాణ సిద్ధమైంది. శ్రీశైలంలో 834(మల్యాల), 795(ముచ్చుమర్రి) అడుగుల నుంచి హంద్రీ–నీవా ద్వారా రోజుకు 3850 క్యూసెక్కులు మాత్రమే తరలించే సామర్థ్యం ఏపీకి ఉంది. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ 881 అడుగుల్లో నీటి మట్టం శ్రీశైలంలో ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. తెలంగాణ సర్కార్ రోజూ 6.5 టీఎంసీలను తోడేస్తే శ్రీశైలంలో నీటి మట్టం పెరగదు. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందవు. ఓటుకు కోట్లు కేసుకు జడిసి బాబు నోరుమెదపలేదు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఇది పూర్తయితే తనకు భవిష్యత్ లేదని చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారు. -
హీరో నవదీప్ సమర్పిస్తున్న, 'సగిలేటి కథ'
హీరో నవదీప్ సమర్పణలో రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటించిన చిత్రం ‘సగిలేటి కథ’. రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో నవదీప్ సమర్పణలో అశోక్ మిట్టపల్లి, దేవిప్రసాద్ బలివాడ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ‘‘రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగే ఘటనలతో సాగే చిత్రం ఇది. రాయలసీమ నేటివిటీ, సంస్కృతీ సంప్రదాయాలతో వచ్చే సన్నివేశాలు సహజంగా ఉంటాయి. ఇందులో చికెన్ కూడా ఒక పాత్ర. ఈ నెల 31న ట్రైలర్ రిలీజ్ చేస్తాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘సగిలేటి కథ కేవలం సినిమా కాదు. మన జీవితంలో ఉండే అన్ని భావోద్వేగాలా సమర్పణ. ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమా లో హీరో గా చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను’అని రవితేజ మహాదాస్యం అన్నారు. -
యాసలందు అన్ని యాసలూ లెస్స
ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ‘యాస’ల ట్రెండ్ నడుస్తోంది. పాత్రలకు తగ్గట్టు స్టార్స్ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల యాసలు పలకడానికి ‘యస్’ చెబుతున్నారు. ఏ యాసకి ఆ యాస ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడానికి ఉపయోగపడుతోంది. అందుకే ‘యాసలందు అన్ని యాసలూ లెస్స’ అని చెప్పాలి. ప్రస్తుతం ‘పుష్ప 2, హరోం హర’తో పాటు విశ్వక్ సేన్ చిత్రం, అనన్య నాగళ్ల మూవీ వంటి పలు సినిమాలు ఆయా ప్రాంత యాసల నేపథ్యంలో రూపొందుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేద్దాం. పుష్పగాడి రూలు ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’... ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ సహా దాదాపు అన్ని పాత్రలు రాయలసీమలోని చిత్తూరు యాసలో మాట్లాడతాయి. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘పుష్ప 2: ది రూల్’ కూడా చిత్తూరు యాసలో రూపొందుతోంది. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇక ‘అడవిలో జంతువులు రెండడుగులు ఎనక్కి ఏసినాయంటే పులి వచ్చుండాదని అర్థం.. అదే పులి రెండడుగులు ఎనక్కి ఏసినాదంటే పుష్ప వచ్చుండాడని అర్థం’, ‘పుష్పగాడి రూలు’ వంటి డైలాగులు ‘పుష్ప 2: ది రూల్’ గ్లింప్స్లో ఉన్నాయి. ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే సుధీర్బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన 1989 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్లో ‘సుబ్రహ్మణ్యం అన్న.. జనాలు నీ కోసం సూస్తా ఉండారు.. అట్లా కదలకుండా ఉంటే ఎట్లా.. ఏందోకటి సెప్పు’, ‘ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే’ వంటి చిత్తూరు యాస డైలాగులు వినిపించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది బ్లాక్.. వైట్ ఉండదు.. ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అంటూ ‘వీఎస్ 11’ (వర్కింగ్ టైటిల్) చిత్రం వీడియో రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విశ్వక్ సేన్ గోదావరి యాసలో మాట్లాడతారు. శ్రీకాకుళం యాసతో... అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. బేబీ లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం శ్రీకాకుళం యాస నేపథ్యంలో సాగుతుంది. నెల్లూరి నెరజాణ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన చిగురుపాటి సుబ్రమణ్యం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ఎంఎస్ చంద్ర, హరి హీరోలుగా, అక్షా ఖాన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం పక్కా నెల్లూరు యాసలో రూపొందినట్లు చిగురుపాటి సుబ్రమణ్యం తెలిపారు. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాల్లో కూడా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ యాస వినిపించనుంది. -
AP: కదిలిన రుతుపవనాలు..వచ్చే 4 రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరణ
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ముందుకు కదిలాయి. పది రోజుల క్రితమే అవి రాయలసీమను తాకినా బిపర్జోయ్ తుపాను ప్రభావంతో ముందుకు కదల్లేదు. శ్రీహరికోట ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉండిపోయాయి. తుపాను తీరం దాటడంతో ఆదివారం నుంచి అవి ముందుకు కదిలేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం దాదాపు రాయలసీమ అంతటికీ విస్తరించాయి. దీంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారానికి కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలు, తెలంగాణకు విస్తరించే అవకాశం ఉంది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరించి వర్షాలు కురిసే పరిస్థితి నెలకొంది. ఉపరితల ఆవర్తనం ఇలాగే కొనసాగితే ఇంకా ముందుగానే రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తగ్గిన ఉష్ణోగ్రతలు రుతుపవనాల ప్రభావంతో కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. కొన్ని ప్రాంతాలు మినహా చాలాచోట్ల వాతావరణం చల్లబడింది. గ్రేటర్ రాయలసీమ జిల్లాలన్నీ చల్లబడగా కోస్తా జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గాయి. కృష్ణా, గుంటూరు బెల్ట్లోనే సోమవారం ఎండ తీవ్రత కనిపించింది. గత పది రోజులుగా 600కి పైగా కేంద్రాల్లో 40 నుంచి 46 డిగ్రీలు వరకు నమోదైన ఉష్ణోగ్రతలు సోమవారం 120 కేంద్రాల్లోనే నమోదయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన మేఘాలు బలంగా కదులుతుండడంతో మంగళవారానికల్లా రాష్ట్రం మొత్తం చల్లబడి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
రాయలసీమను తాకిన రుతుపవనాలు
సాక్షి, అమరావతి/తిరుమల: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. రుతు పవనాలు కేరళను తాకిన తర్వాత ఏపీకి రావడానికి సాధారణంగా నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈ నెల 8వ తేదీన అవి కేరళలో ప్రవేశించగా.. 12వ తేదీ నాటికి ఏపీకి వస్తాయని భావించారు. కానీ.. బిపర్జోయ్ తుపాను కారణంగా అవి చురుగ్గా కదలడంతో ఒకరోజు ముందుగానే ఏపీని తాకాయి. ఆదివారం తిరుపతి జిల్లా శ్రీహరికోట మీదుగా ఏపీలోకి ప్రవేశించాయి. వచ్చే 48 గంటల్లో అవి రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు, కోస్తాలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. వారం రోజుల్లో మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రుతు పవనాల వల్ల ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. మరో వారం ఎండల తీవ్రతే రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. అంటే మరో వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత, వడగాలులు ఉండనున్నాయి. సోమవారం 134 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదిలావుండగా ఆదివారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి, కాకినాడ జిల్లా కరప, విజయనగరం జిల్లా జామిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ జిల్లా పద్మనాభంలో 44.7, మన్యం జిల్లా భామిని, కోనసీమ జిల్లా శివలలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 86 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 110 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరోవైపు పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. మబ్బుల ‘సన్’దడి తిరుమలలో ఆదివారం ఉదయం నుంచే నీలాకాశం మబ్బులతో నిండిపోయింది. వెండి మబ్బులు దోబూచులాడుతూ భానుడితో ఆటలాడడం ప్రారంభించాయి. సాయంత్రానికి మరిన్ని మబ్బులు చేరి సందడి చేశాయి. దాదాపు రెండు నెలలపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్టయ్యింది. -
వందల మంది రెడ్ల ప్రాణాలు తీసినప్పుడు ఎక్కడున్నావ్!
తెలుగుదేశం యువ కిశోరం లోకేష్ బాబుకు ఉన్నట్టుండి రెడ్లు గుర్తుకు వచ్చారు. రాయలసీమలో పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్న లోకేష్కు ప్రత్యేకించి కడప జిల్లాకు వచ్చాకా రెడ్లు గుర్తుకు వచ్చారు. చిత్తూరు జిల్లాలో అయినా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అయినా లోకేష్కు రెడ్లు గుర్తుకు రాలేదు. ఎందుకో ప్రత్యేకించి కడప జిల్లాకు వచ్చాకా రెడ్లు అంటూ మాట్లాడు తున్నారు. రెడ్ల సామాజిక వర్గ మీటింగులు పెడుతున్నారు! ఆ మీటింగుల్లో ఎవరో ఒక రెడ్డి చెప్పారట.. లోకేష్ పేరును లోకేష్ రెడ్డిగా పెట్టుకోమంటూ! ఏమిటో ఈ కలికాలం! చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా కడపకు మించిన స్థాయిలోనే రెడ్ల జనాభా ఉంది. అయితే లోకేష్ ఆ జిల్లాల్లో ఎక్కడా రెడ్ల ప్రస్తావన, రెడ్లను ఉద్ధరించే ప్రస్తావన తీసుకురాలేదు. మరి కడప రెడ్లనే లోకేష్ ఉద్ధరిస్తారు కాబోలు. తమది రెడ్ల పార్టీ అని చెప్పుకోవడానికి కడప జిల్లాలో లోకేష్ చాలా ప్రయాసపడుతున్నారు. తనకు నోరు తిరగని రీతిలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అయితే లోకేష్కు రెడ్లపై ప్రేమాప్యాయాతలు కారిపోతున్న దశలో గుర్తుకు చేసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. వాటిల్లో ఒకటి.. తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలాల్లో హతమైన రెడ్లకు ఇప్పుడు లోకేషుడు ఏం సమాధానం ఇస్తారనేది! తన తండ్రి సీఎంగా ఉండగా.. అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర నాయకత్వంలో సాగించిన ఫ్యాక్షన్ హత్యాకాండలో కనీసం రెండు వందల మందికి పైగా ప్రాణాలు తీశారు కదా!. అందులో మెజారిటీ మంది కాంగ్రెస్ కార్యకర్తలు. కనీసం వంద మందికి పైగా రెడ్లు. రాజకీయ కక్షల కొద్దీ, అక్కసు కొద్దీ, ఆధిపత్యం కోసం జరిగిన హత్యలవి. మరి ఆ హత్యలు జరిగినప్పుడు రెడ్లు గుర్తుకు రాలేదా!. బహుశా అప్పటికి లోకేష్కు ఈ మాత్రం బుద్ధి కూడా రాలేదనుకుందాం. మరి చంద్రబాబుకు తెలియదా! 1995 నుంచి 2004ల మధ్యన అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎంతమంది రెడ్లు కేవలం రాజకీయ కారణాలు, ఆధిపత్యం, ఫ్యాక్షన్ కారణాలతో హత్యకు గురయ్యారో లోకేష్కు తెలుసోలేదో కానీ... స్థానికులకు తెలుసు. అప్పటి చరిత్రను మరిచిపోదాం అంటారా.. 2014 నుంచి 2019 మధ్యన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెడ్లను తెగ నరకలేదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, లోకేషుడు మంత్రయ్యాకానే.. పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కంగటి నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయలేదా! పెద్దగా హడావుడి లేకుండా, కేవలం తన జీప్ లో మాత్రమే ప్రయాణిస్తూ.. ప్రత్యర్థులు తన కోసం పొంచి ఉంటారనే భయపడాల్సిన నేపథ్యం లేని నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయడంలో తెలుగుదేశం నేతల పాత్ర ఎంతో అప్పుడు లోకేష్ చెప్పరా?. రాప్తాడు ఎమ్మార్వో ఆఫీసులో ప్రసాద్ రెడ్డిని కత్తులతో నరికినప్పుడు లోకేష్కు రెడ్లు గుర్తుకు రాలేదు కాబోలు! నారాయణరెడ్డి కానీ, ప్రసాద్రెడ్డి కానీ విపరీతమైన ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వారు కాదు. కేవలం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అడ్డుగా ఉన్న వారే కానీ.. వారేమీ తమ ప్రత్యర్థులను హత్యలు చేసిన వారు, చేయించిన వారు కాదు. కేవలం రాజకీయంగా అడ్డున్నారనే కారణాలతోనే ఈ హత్యలు జరిగాయి. ఇవే కావు.. పరిటాల రవి, ఆర్వోసీ కాలం నాటి హత్యలు కూడా కేవలం క్రూరత్వంతో, రాక్షసత్వంతో జరిగిన హత్యలే హత్యలను సమర్థించుకోవడానికి వాటికి ఫ్యాక్షన్ రంగును పులిమారు. చదవండి: బాబు బాగా ‘వరెస్టు’.. పుట్టిన గడ్డకు తీరని ద్రోహం.. ప్రత్యేకించి చంద్రబాబు తనయుడు అనంతపురం దాటాకా, కర్నూలు దాటుకుని వచ్చాకా.. కడపలో అడుగుపెట్టాకా రెడ్ల సంక్షేమం, రెడ్లపై ప్రేమాప్యాయతలు కురిస్తూ కామెడీ చేస్తున్నారు. ఇలా రెడ్లపై మాట్లాడే దమ్ము కనీసం, ప్రేమ చూపే శక్తి పక్క జిల్లాల్లో కూడా నీకు లేకపాయె కదా లోకేషా! తండ్రికి మించిన జిత్తుల మారిలా ఉన్నావే! ఎన్నికల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని స్వయంగా లోకేష్ తన ప్రకటన ద్వారా నిరూపించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు సరి కాదంటున్నారు రాయలసీమ వాసులు. ఒక రాయలసీమ రెడ్డి సోదరుడు సోషల్ మీడియాలో పంచుకున్న అనుభవం ఇది. -సత్యానందరెడ్డి, సాక్షి వెబ్డెస్క్ -
‘సీమ’కు చేసిన ద్రోహానికి క్షమాపణ చెప్పండి
కడప కార్పొరేషన్ : రాయలసీమకు చేసిన ద్రోహానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరాలని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ మిడిమిడి జ్ఞానంతో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలతో మమేకం కాకుండా 19 గంటలు టెంట్లో ఉంటూ, ఐదు గంటలు మాత్రమే బయట తిరుగుతున్నారని, అందులో ఒక గంల సెల్ఫీలకే సరిపోతోందని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. మొత్తం మీద అది పాదయాత్రలా కాకుండా ఒంటిపూట యాత్రలా ఉందన్నారు. కడప పర్యటనలో లోకేశ్ ‘రాయలసీమ డిక్లరేషన్’ అని మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. గత 27 ఏళ్లలో 14 ఏళ్లు మీ తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇన్నేళ్లలో రాయలసీమకు ఆయన చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెప్పకుండా, మళ్లీ అధికారవిుస్తే చేస్తామని చెప్పడం మోసపూరితమన్నారు. రాయలసీమ ప్రజలను రౌడీలు, గూండాలుగా, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి వారి మనోభావాలు దెబ్బతీశారన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయకుండా కాలయాపన.. తెలుగుగంగ ప్రాజెక్టును దివంగత ఎన్టీఆర్ చేపడితే వైఎస్సార్ పూర్తిచేశారని శ్రీకాంత్ తెలిపారు. పదేళ్లు సీఎంగా ఉండి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా వాటిని తాగునీటి ప్రాజెక్టులుగా మార్చి, శంకుస్థాపనలతోనే కాలయాపన చేశారన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యాకే వాటిని సాగునీటి ప్రాజెక్టులుగా మార్చి పూర్తిచేశారని గుర్తుచేశారు. చంద్రబాబే ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి వాటాలు దక్కేవన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్ పెంచుతుంటే కృష్ణా బ్యారేజీపై ధర్నా చేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా వారితో లేఖ రాయించారన్నారు. మరోవైపు.. రాయలసీమలో హైకోర్టు పెడతామంటే అడ్డుకుని, ఇప్పుడు హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పడం దారుణమన్నారు. ఇన్ని విధాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్న తండ్రీకొడుకులు ఏ ముఖం పెట్టుకుని ‘రాయలసీమ డిక్లరేషన్’ అంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు మూడుసార్లు అవకాశవిుస్తే కుప్పానికి నీళ్లివ్వలేని మీరు రాయలసీమకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పంకు రెవెన్యూ డివిజన్ తెచ్చారని, మున్సిపాలిటీగా మార్చారని శ్రీకాంత్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం ఈ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తూ, కాంట్రాక్టు కార్మికులను కూడా పర్మినెంట్ చేస్తున్నారన్నారు. కడప కొప్పర్తి పారిశ్రామిక వాడలో నాలుగేళ్లలో వెయ్యి కోట్ల కేంద్ర నిధుల్ని ఈ ప్రభుత్వం తెచ్చిందన్నారు. బాబు బాధ్యతారాహిత్యం.. సామాన్యుడికి ఎలా మేలు చేయాలో ఆలోచించకుండా కర్ణాటకలో ఇచ్చిన హామీలను తీసుకొచ్చి మేనిఫెస్టోలో చేర్చారని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. అన్నిదేశాలు, రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కృషిచేస్తుంటే చంద్రబాబు మాత్రం బాధ్యతారాహిత్యంగా ఎంతమందినైనా కనండి అంటూ రివర్స్లో చెబుతున్నారని మండిపడ్డారు. -
బాబు బాగా ‘వరెస్టు’.. పుట్టిన గడ్డకు తీరని ద్రోహం..
మంచి చేయలేరు.. ఎదుటివారు చేస్తున్న మంచిని ఓర్చుకోలేరు. తాను పుట్టిన గడ్డకు కనీస న్యాయం చేయకపోగా, తీరని ద్రోహం చేసిన చంద్రబాబు.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం. రాయలసీమకు ఘనమైన చరిత్ర ఉంది. రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, మాత్రమే సీమలో ఉన్నాయని చిత్రీకరించి దుష్ప్రచారం చేయించిన ఘనుడు చంద్రబాబు.. ఆయన దిగజారుడు రాజకీయాలను కాస్త లోతుకెళ్లి పరిశీలిస్తే.. కరువు సీమ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని, 2007-08లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల సామర్ద్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. బాబు ఆదేశాల మేరకు, టీడీపీ దేవినేని ఉమ చౌదరి, కోడెల చౌదరి తదితరులు పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసి రాయలసీమకు వైఎస్ జలాన్ని దోపిడీ చేస్తున్నారని ఆందోళన చేశారు. కర్నూలుకు కొంచెం అయినా న్యాయం చేయండి అని బాబును అడిగితే కర్నూల్లో టీడీపీని 3 చోట్ల మాత్రమే గెలిపించారు నేనేందుకు చేయాలంటూ ముఖ్యమంత్రి బాబు అంటున్నాడంటూ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి రెండు సార్లు మీడియా ముందు చెప్పాడు. మద్రాస్లో వరదలు వచ్చినప్పుడు పక్కనే తిరుపతిలో 10 వేల ఉద్యోగాలు కల్పించే హెచ్సీఎల్ ఏర్పాటు చేస్తామని ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చిన సందర్బంగా ప్రకటించారు. శివనాడార్పై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పెట్టమని ఒత్తిడి చేశాడు. కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లో కెల్లా పెద్దది ఏఐఐఎంస్. అనంతపురంలో ఏర్పాటు చేయాల్సి ఉంటే ఏఐఐఎంస్(All India Institute of Medical Sciences)ను సొంత కులస్థులు ఉన్న విజయవాడ గుంటూరుకు తరలించాడు. చదవండి: చంద్రబాబు అందుకే మాట్లాడకుండా వెళ్లిపోయారా? శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం (నవంబర్ 16,1937) రాజధాని, హైకోర్టుల్లో ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలి. అందులో ఏం కావాలో కోరుకునే స్వేచ్ఛ సైతం రాయలసీమకుంది. కానీ అన్నీ అమరావతి లోనే పెట్టి మా వాళ్లు మాత్రమే బాగుపడాలని కోరుకున్నాడు.. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ రాజధానికి సరైన ప్రాంతమని భావించింది. కానీ చంద్రబాబు దొనకొండలో రెడ్లు ఎక్కువగా ఉన్నారని, సొంత కులస్తులు ఉన్న విజయవాడ–గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేశాడు. కాపు గర్జన అప్పుడు తునిలో రైలు తగలపడితే ఇది రాయలసీమ రౌడీల పని అంటూ అవమానం చేశాడు బాబు.. కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా కాపులను.. బాబు ఆదేశాల మేరకు సొంత కులస్థులు తీసే సినిమాల్లో రాయలసీమ అంటే ఏహ్య భావం కలిగేలా చూపుతారు. కమ్మ వాళ్లను జమిందార్లుగా స్వాతంత్ర సమర యోధుల్లాగా చూపిస్తూ.. రెడ్లను యాదవులని విలన్లుగా బ్రాహ్మిన్స్ వైశ్యాస్ ని జోకర్లుగా చూపుతారు చదవండి: బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా? రాయలసీమలో ఉన్న శ్రీ సిటీని 2008లో ఆనాడు వైఎస్సార్ ప్రారంభించారు. ఇప్పుడు అది ఏపీలో పరిశ్రమల కేంద్రంగా ఉంది. నేడు శ్రీసిటీ లాగా.. కడప జిల్లా కొప్పర్తిని సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు. -
నేటి నుంచి మోస్తరు వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం/శింగనమల: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రోహిణి కార్తె కావడంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు ఉత్తర–దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా వెళుతోంది. వీటి ఫలితంగా సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండుచోట్ల, బుధ, గురువారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నేడు వైఎస్సార్ జిల్లాలో వడగాడ్పులు వైఎస్సార్ జిల్లాలోని చాపాడు, కమలాపురం, ప్రొద్దుటూరు, వల్లూరు, వీరపునాయుడుపల్లె, ఎర్ల గుంట్ల మండలాల్లో సోమవారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొంది. ఆదివారం ప్రకాశం జిల్లా కురిచేడులో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.2, పల్నాడు జిల్లా రొంపిచర్ల లో 44.8, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో 44.7 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆదివారం 24 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. పిడుగుపడి ఇద్దరు మృతి అనంతపురం జిల్లా శింగనమల మండలం ఉల్లి కల్లు గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి ఇద్దరు మృతిచెందారు. ఉల్లికల్లుకు చెందిన వడ్డే బాలకృష్ణ (35), గౌరీశంకర్(19), వారి బంధువు తరుణ్కుమార్ కలిసి పొలం నుంచి బైక్పై ఇంటికి వస్తుండగా, పెద్ద వర్షం కురవడంతో మార్గమధ్యంలోని ఓ చెట్టు కింద ఆగారు. ఆ చెట్టుపై పిడుగుపడటంతో బాలకృష్ణ, గౌరీశంకర్ అక్కడికక్కడే మృతిచెందారు. తరుణ్కుమార్ ప్రా ణాలతో బయటపడ్డాడు. బాలకృష్ణకు భార్య, కుమార్తె ఉన్నారు. గౌరీశంకర్కు వివాహం కాలే దు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్ద అగ్రహారంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. -
Gangamma Jaatara: వేషధారణతో గంగమ్మను దర్శించుకున్న భక్తులు..(ఫొటోలు)
-
చరిత్ర వెలుగు చూసేనా!
రాజంపేట: నందలూరు–ఆడపూరు మధ్య ఉన్న కొండల్లో రాయలసీమలో తొలిసారిగా బౌద్ధారామాలు బయల్పడ్డాయి. వీటి వద్ద ఉన్న సొరంగ మార్గంలో జరిపిన తవ్వకాలకు నాలుగు దశాబ్దాలుగా బ్రేక్ పడింది. 1979 సెప్టెంబర్లో జరిపిన తవ్వకాల్లోనే సొరంగమార్గం బయటపడింది. తర్వాత తవ్వకాల ప్రయత్నాలు ముందుకుసాగలేదు. ఫలితంగా గుహల చరిత్ర వెలుగులోకి రాలేకపోయింది. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర, పురావస్తు శాఖలు సంయుక్తంగా తవ్వకాలు జరపాలని చరిత్రకారులు కోరుతున్నారు. రాజరికాలను ప్రతిబింబిస్తూ... నందలూరును కేంద్రంగా చేసుకుని చోళ, పాండ్య, పల్లవ రాజులే కాకుండా, కాకతీయ, విజయనగర రాజులు పాలించారు. వారు ఈ సొరంగమార్గం ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. నాటి రాజుల రాజరికాలను ప్రతిబింబిస్తూ ఇది బయల్పడింది. ఈ ప్రవేశద్వారం నుంచి లోపలికి వెళ్లగానే విశాలమైన హాలు, మండపం ఉన్నాయి. లోపలిభాగంలో చీకటి నింపుకుని భూ మార్గం ఉంది. దీని గురించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సొరంగమార్గం నందలూరు నుంచి సిద్ధవటం రాజమహల్ వరకు ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా.. ► బౌద్ధారామాలు భద్రత పేరుతో ప్రభుత్వం, పురావస్తుశాఖ అధికార్లు తవ్వకాలను అర్ధంతరంగా ఆపివేశారు. తవ్వకాలు నిలిపివేసి నాలుగు దశాబ్దాలవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా దివంగత సీఎం వైఎస్రాజశేఖరరెడ్డి పాలనలో బౌద్ధారామాలను పునరుద్ధరించారు. కొంతమేర అభివృద్ధి పనులు చేపట్టారు. అమరావతి ఆంద్రప్రదేశ్గా రూపుదిద్దుకున్న క్రమంలో రాజరికానికి రూపంగా నిలిచిన బైరాగి గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చరిత్రకారులు అంటున్నారు. ► బౌద్ధమత ఔన్నత్యానికి సజీవ తార్కాణాలుగా రాయలసీమలోనే తొలిసారిగా బయల్పడిన నందలూరు బౌద్ధరామాలు నిలిచాయి. బౌద్ధమతానికి పెద్దపీట వేసే దేశాలు రాజధాని నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న క్రమంలో ఆ మతానికి సంబంధించిన ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువెళుతోంది. ► నందలూరు మండలం బహుదా(చెయ్యేరు)నదీ తీరాన ఉన్న బౌద్ధారామాల వల్ల రాయలసీమతో కూడా బౌద్ధుల జీవనం ముడిపడిఉందని ఇక్కడి ఆరామాలు స్పష్టీకరిస్తున్నాయి. నందలూరు గ్రామశివార్లలో బైరాగిగుట్ట వద్ద క్రీస్తు పూర్వం మూడో శతాబ్ధానికి సంబంధించిన బౌద్ధరామాలు, బౌద్ధమత అవశేషాలు, రాచరికపు చిహ్నాలు బయల్పడ్డాయి. లభ్యమైన ఆధారాలు ఇవే.. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో 17 చిన్నబౌద్ధరామాలు, 30 వెండినాణేలు, 24 రాగినాణేలు, 116 చిన్న చిన్న మట్టిపాత్రలు, రాతి చెక్కడపు బొమ్మలు, పెంకులు, 13వ కాలంనాటి స్థూపాలు లభ్యమయ్యాయి. బౌద్ధమత ప్రాముఖ్యానికి నిదర్శనంగా ఒక బౌద్ధారామ మంటపానికి సంబంఽధించిన అవశేషాలు బయల్పడ్డాయి. వీటిని కడపలోని భగవాన్మహావీర్ పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం 1978లో జరిపిన తవ్వకాల్లో అనేక ఆధారాలు లభ్యమయ్యాయి. అవి కడప మహావీర్ మ్యూజియంలో ఉన్నాయి. మళ్లీ తవ్వకాలు చేయాలనే ప్రతిపాదన ఇప్పటి వరకు పురావస్తుశాఖ పరిగణలో లేదు. అయితే నందలూరు బౌద్ధారామాల వద్ద తవ్వకాలు చేపట్టాలనే అంశం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. –శివకుమార్, ఏడీ, రాష్ట్ర పురావస్తుశాఖ, తిరుపతి తవ్వకాలు జరిపించాలి బౌద్ధారామాలు రాయలసీమలో తొలిసారిగా బయల్పడింది నందలూరులోనే. 1978లో తవ్వకాల విషయం తానే అప్పటి పురావస్తుశాఖ అధికారులు డా.రామచంద్రమూర్తి, వెంకటేశుల దృష్టికి తీసుకెళ్లాను. తవ్వకాలు జరిపారు. తర్వాత ఆగిపోయాయి. ప్రస్తుతం మళ్లీ చేపట్టాల్సిన అవసరం ఉంది. భావితరాలకు పురావస్తు, వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పాలకులపై ఉంది. – విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, చరిత్రపరిశోధకుడు, కడప -
రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు.. ఫార్మింగ్.. చూసి కళ్లు తెరవండయ్యా
సాక్షి ప్రతినిధి, కడప: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా అంటేనే ఫ్యాక్షన్ చరిత్రకు పర్యాయపదంగా చెప్పుకునేవారు అనేకమంది. కాలక్రమంలో ఫ్యాక్షన్ హత్యలు కనుమరుగయ్యాయి. హత్యలే కాదు, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. 1990 దశకంలో 119 ఫ్యాక్షన్ గ్రామాలు జిల్లాలో ఉంటే, ప్రస్తుతం 60 గ్రామాల్లో మాత్రమే ఫ్యాక్షన్ వాసన అడపాదడపా కనిపిస్తోంది. 2022లో ఒక్క ఫ్యాక్షన్ హత్య కూడా జిల్లాలో నమోదు కాలేదన్న వాస్తవాన్ని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి ఫ్యాక్షన్ క్రమేపీ తెరమరుగవుతుందన్నది సుస్పష్టం. అందుకు ప్రధాన కారణం విద్యాధికులు పెరగడమే. పుష్కరకాలం క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రధాన తోడ్పాటుగా నిలిచింది. రైతు కుటుంబాల నుంచి వేలాది మంది విద్యావంతులయ్యారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో ఆర్థిక పరపతి పెరగడం, ఆయా కుటుంబీకులు పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు. ప్రధానంగా హార్టికల్చర్ పంటల సాగు గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ఆదాయం గడిస్తుండడంతో ఫ్యాక్షన్ మూలాలను వదిలేశారు. పైగా మెట్ట ప్రాంతానికి కృష్ణా జలాలు వచ్చి చేరడంతో జిల్లా ‘కల్చర్’ పూర్తిగా మారిపోయిందనడంలో సందేహం లేదు. నాడు నెత్తుటి మరకలు.. నేడు పచ్చని పంటలు.. అడవిచెర్లోపల్లె ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామం. ఇప్పుడు ఆ గ్రామంలో విదేశాల్లో పండించే డ్రాగన్ ఫ్రూట్ పంటను యువరైతు గంగిరెడ్డి పండిస్తున్నాడు. తన సోదరుడు అస్వస్థతకు గురైతే చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లిన గంగిరెడ్డికి డిశ్చార్జి సందర్భంగా డాక్టర్లు డ్రాగన్ ఫ్రూట్స్ వాడడం చాలా మంచిదని చెప్పారు. వారి సూచన మేరకు కొనుగోలు చేస్తే ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ ధర రూ.150 పలికింది. ఆ పండు ధర గంగిరెడ్డి మదిలో పడింది. పంట సాగుపై అధ్యయనం చేశాడు. ఎలాంటి రకం పెడితే మన ప్రాంతంలో దిగుబడి సాధించవచ్చో తెలుసుకున్నాడు. తమిళనాడు నుంచి మొక్కలు తెప్పించి సక్సెస్ఫుల్గా దిగుబడి సాధిస్తున్నాడు. ప్రస్తుతం టన్ను రూ.1.5 లక్షలు ధర పలుకుతుండగా, ఎకరాకు 7 టన్నులు తక్కువ లేకుండా దిగుబడి సాధిస్తున్నాడు. ఫ్యాక్షన్ గ్రామంలో ఆదర్శ రైతుగా గంగిరెడ్డి నిలుస్తున్నాడు. ఈ విధంగా యువకులు, విద్యాధికులు హార్టికల్చర్ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పులివెందుల అరటి.. విదేశాలకు ఎగుమతి.. పులివెందుల ప్రాంతంలో పండించే అరటి పంట మంచి నాణ్యత కలిగి ఉంటోంది. అరటి రైతులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రతి రోజు కొన్ని వందల టన్నులు తరలివెళ్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ దేశాలలో మంచి డిమాండ్ ఉంటోంది. ప్రతి ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రైతులు వారు పండించిన పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తారు. మన దేశంలో ఢిల్లీ, హర్యా నా, పంజాబ్, మహరాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు పులివెందుల ప్రాంత అరటి వెళ్తోంది. ఈ ప్రాంత అరటికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు దక్కింది. సాధారణంగా అరటి పండ్లు ఏడు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇక్కడి అరటి పండ్లు 14రోజుల వరకు నిల్వ ఉంటాయని రైతులు వివరిస్తున్నారు. కృష్ణాజలాల రాకతో.. ‘మెట్ట ప్రాంతంలో కృష్ణాజలాలు పారించిన రోజు నా జన్మ ధన్యం’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి రిజర్వాయర్ శంకుస్థాపన సందర్భంగా ప్రకటించారు. వాస్తవంగా కృష్ణా జలాలు రాయలసీమకు రావడంతో సీమ ప్రజల తలరాత మారుతోంది. ఎప్పుడూ కరువు విలయతాండవం చేసే అనంతపురం జిల్లా పంటలతో కళకళలాడుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో గండికోట, వామికొండ, సర్వరాయసాగర్, బ్రహ్మంసాగర్లో నీరు పుష్కలంగా ఉంది. కృష్ణా జలాల కారణంగా ఆక్వా ఉత్పత్తుల పట్ల సైతం జిల్లా వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా చేపల పెంపకంపై దృష్టి సారించారు. చాపాడు, వీరపునాయునిపల్లె, కొండాపురం, ముద్దనూరు, బి.మఠం, బి.కోడూరు మండలాల పరిధిలో చేపల పెంపకం సాగిస్తున్నారు. క్రమేపీ ఈ రంగంలోనూ రైతులు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధులయ్యారు. ఎప్పుడూ రక్తచరిత్ర పేరుతో బురద చల్లే సినీ ప్రముఖులకు కూడా జిల్లా వాసులు సవాల్ విసురుతున్నారు. మా కల్చర్ మారిందని నిరూపిస్తున్నారు. యువ రైతు పేరు మూలి గంగిరెడ్డి. వీరపునాయునిపల్లె మండలం అడవిచెర్లోపల్లె గ్రామం. ఇతర దేశాల్లో పండించే డ్రాగన్ ఫ్రూట్ పంటపై దృష్టి పెట్టాడు. ఎకరాకు రూ.4లక్షలు పెట్టుబడి వెచ్చించి, 4 ఎకరాల్లో పంట సాగు చేశాడు. రాయలసీమ ప్రాంతానికి అనువైన తైవాన్ పింక్ రకం వేస్తే ఇక్కడి వాతావరణానికి తట్టుకోగలదని తెలుసుకొని తమిళనాడు నుంచి మొక్కలు తెచ్చుకున్నాడు. పట్టువదలని గంగిరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ పంట దిగుబడిలో సక్సెస్ అయ్యాడు. దిగుబడికి తగ్గట్టుగా ధర ఎప్పటికీ తగ్గకుండా ఉండడంతో గణనీయంగా ఆదాయం గడిస్తున్నాడు. ప్రస్తుతం ఆసక్తి ఉన్న రైతులకు ఆయనే అంట్లు కట్టి మొక్కలను అందిస్తున్నాడు. జి.పవన్కుమార్రెడ్డి ఎంబీఏ చదివాడు. అమెరికాలో వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగించేవాడు. స్వగ్రామం అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం యనమవాండ్లపల్లె. అమెరికాలో ఎంత సంపాదిస్తున్నా తృప్తిలేదు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు మట్టి వాసనపై మమకారం పోలేదు. వ్యవసాయంపై మక్కువతో అమెరికా నుంచి వచ్చి సంబేపల్లె మండలంలోని దేవపట్లకు చెందిన తన బావ ఆవుల హర్షవర్దన్రెడ్డి పొలంలో 30 ఎకరాలు బొప్పాయి పంటసాగు చేశాడు. నాణ్యమైన పంట కోసం మహరాష్ట్ర నుంచి 786 రకం బొప్పాయి నారు తెప్పించాడు. ఒక కోతకు 60 టన్నులు పంట దిగుబడి రానున్నట్లు అంచనా వేస్తున్నాడు. ఒకసారి పంట సాగుచేస్తే 10 నుంచి 15 కోతలు రానున్నాయి. పంటల సాగులో ఆదర్శంగా నిలుస్తుండటంతో మండల రైతులు శభాష్ అంటున్నారు. -
రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సముద్రమట్టం నుంచి సగటున 0.9 కి.మీ. ఎత్తులో ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. శుక్రవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదవుతాయని, శని, ఆదివారాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కాస్త తక్కుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 42.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్, నల్లగొండలో 24.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్పింది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం అత్యధికంగా జగిత్యాల జిల్లా గొదురులో 44.2 డిగ్రీ సెల్సియస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో 44.1 డిగ్రీ సెల్సియస్, ములుగు జిల్లా లక్ష్మి దేవిపేటలో 43.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
ఏపీకి వర్షసూచన.. నాలుగు రోజులు వానలే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మరో నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో చెదురుమదురుగా వానలు పడుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, కర్ణాటకల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ గురువారం తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేటలో 2.6 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లా నూతనకల్వలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వదలని వానలు.. మరో మూడురోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దాదాపు వారం రోజుల నుంచి వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీగాను వర్షాలు పడుతున్నాయి. అంతర్గత తమిళనాడు నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రస్తుతం రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్ వరకు తెలంగాణ, ఒడిశాల మీదుగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం అనకాపల్లి, కాకినాడ, ఎస్పీఎస్సార్ నెల్లూరు, కృష్ణాజిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సామర్లకోటలో 7.8 సెంటీమీటర్లు, యలమంచిలిలో 7.7, కావలిలో 4.6, గుడివాడలో 4.2, మల్లాదిలో 3.7, ఉప్పలపాడులో 3.5 సెంటీమీర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
టీడీపీ కట్టల్లోకి వైఎస్సార్సీపీ ఓట్లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్ అధికారి కేతన్గార్గ్ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు. ఇంతమంది కౌంటింగ్లో ఉన్నప్పుడే ఇలా తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపేయడం దారుణమన్నారు. తొలి, రెండో రౌండులో వెయ్యి ఓట్లకు పైగా మెజారిటీ వస్తే, మూడో రౌండు నుంచి 20, 30 ఇలా తూకమేసినట్టు మెజారిటీ రావడంపైనా అనుమానాలున్నాయన్నారు. కాగా, ఒకసారి కౌంటింగ్ పూర్తయి బండిల్స్ను కలిపేస్తే తిరిగి లెక్కించడం కుదరదని, అభ్యంతరం వ్యక్తం చేసిన ఏ బాక్స్ అయినా తిరిగి లెక్కిస్తామని రిటర్నింగ్ అధికారి చెప్పారు. -
తుంగభద్రను రక్షించుకుందాం
తిరుపతి అర్బన్: కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టుపై ఎగువభద్ర పేరుతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుండడం రాయలసీమకు శాపంగా మారనుందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కశాశాలలో శుక్రవారం ‘తుంగభద్రను కాపాడుకుందాం– సిద్దేశ్వరం అలుగుతో మనసీమను సస్యశ్యామలం చేద్దాం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాయలసీమకు కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టును కాపాడుకోవడం కోసం విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తుంగభద్రకు సంబంధించి బచావత్ నీటి కేటాయింపులు లేకపోయినా, సుప్రీంకోర్టులో స్టే ఉన్నా ఎగువ రాష్ట్రం అయిన కర్ణాటక నిబందనలు ఉల్లంఘించి తుంగభద్ర ప్రాజెక్టుపై ఎగువన ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం దుర్మార్గమని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా రాయలసీమకు అన్యాయం చేస్తూ కర్ణాటకలో అనుమతులు లేని ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా నిధులు మంజూరు చేయడం అన్యాయమన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలని సదస్సులో తీర్మానించారు. ఆచార్య జయచంద్రా రెడ్డి, ఆచార్య సుబ్రమణ్యం, ఆచార్య నరేన్ కుమార్, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
రాయలసీమ రైతుల గొంతు కోసింది చంద్రబాబే
అనంతపురం టవర్క్లాక్: రాయలసీమ జిల్లాల్లోని రైతుల గొంతు కోసింది టీడీపీ అధినేత చంద్రబాబేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అడ్డగోలు వ్యవహారాల వల్లే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విమర్శించారు. గురువారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోనే కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయన్నారు. అప్పట్లో ప్రాజెక్టుల ఎత్తు పెంచినా నోరు మెదపలేదన్నారు. రెండో విడత అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చినా అభ్యంతరం చెప్పలేదన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఉన్నప్పుడు అప్పర్ భద్రకు ఎలాంటి కేటాయింపులు, అనుమతులు రాలేదని గుర్తు చేశారు. 2010లో 9 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తే 2011లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చిందన్నారు. ఈరోజుకు కూడా అప్పర్భద్ర ప్రాజెక్టుకు కేటాయింపులు లేవన్నారు. 2017లో టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు కోసం స్టేజ్–2 అనుమతులు వచ్చాయన్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖలు పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు అధికార యావకు నేడు రాయలసీమలో రైతులు నష్టపోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కపటనాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. తొలి నుంచి జలవనరుల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో మాయ మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చాడని విమర్శించారు. -
అప్పర్భద్రతో రాయలసీమకు నీటి గండం
సాక్షి,అమరావతి/తిరుచానూరు(తిరుపతి జిల్లా): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ పట్ల చూపుతున్న వివక్షతతో రాయలసీమకు తీవ్ర నీటిగండం ఎదురయ్యే ప్రమాదం ఉందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మంగళవారం ఫోరం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి, ప్రయాగతో కలిసి పురుషోత్తంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటన చేస్తూ నిధులు మంజూరు చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చట్టబద్ధత లేని ఎగువ భద్రను నిలువరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా జాతీయ హోదాను ప్రకటించడం ద్వారా ఫెడరల్ స్ఫూర్తిని తంగలో తొక్కిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై సమష్టి పోరాటం సాగించాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏపీకి చెందిన సభ్యులు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కాగా, ఎగువన ఉన్న కర్ణాటక తుంగభద్రపై అదనంగా మరో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దిగువనున్న రాయలసీమలోని తుంగభద్రపై నికర జలాలు కలిగి ఉన్న ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ, కేసీ కెనాల్, గుండ్రేవుల ప్రమాదంలో పడతాయి. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గి తుంగభద్ర నీరే ప్రధానం అవుతున్న నేపథ్యంలో కర్ణాటక నిర్మించే ఎగువ భద్రతో గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీలకు సైతం ప్రమాదం ఏర్పడుతుంది. -
అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారే: మేధావుల ఫోరం
తిరుపతి: రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతిలో సమావేశమయ్యింది. తుంగభద్ర నదిపై అప్పర్ భద్ర ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని సమావేశంలో తీర్మానించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఎడారి అవుతుందని మేధావుల ఫోరం పేర్కొంది. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు తాగునీటి కష్టాలు తప్పవని చెప్పారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను స్వాగతిస్తున్నామని రాయలసీమ మేధావుల ఫోరం తెలిపింది. -
Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?
రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో తొలి అంకం ముగిసింది. గత నెల 30న తుది ఓటరు జాబితా ఖరారైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రధాన పారీ్టలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థులతో పాటు ఆశావహులు ప్రచారపర్వంపై దృష్టి సారించారు. ఆరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లతో సమావేశమవుతున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. – సాక్షి ప్రతినిధి కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్రెడ్డి, కత్తి నరసింహారెడ్డిల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వీటి భర్తీకి ఉపక్రమించింది. ఇప్పటికే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు విస్తృత ప్రచారంలో తలమునకలవుతున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులతో.. యూనియన్ల వారీగా, శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. పట్టభద్రుల కోటాలో 3,28,807 ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో 2.52లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే 76వేల ఓట్లు అధికం. పెరిగిన ఓట్లు ప్రభుత్వ పనితీరును, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు ‘అనంత’ నుంచి పోటీ చేస్తోన్న బీసీ నాగరాజు మధ్య ప్రధాన పోటీ ఉండే అకాశం ఉంది. వీరితో పాటు బోరంపల్లి ఆంజనేయులు, గైబున్నీసా, బోయ నాగరాజు, పట్టుపోగుల పవన్ కుమార్తో పాటు పలువురు పోటీలో ఉన్నా, పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నపూస రవీంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తనయుడు కావడం సానుకూలాంశం. రాంగోపాల్రెడ్డి పులివెందుల నియోజవకర్గ వాసి. ఎవ్వరికీ తెలియని వ్యక్తి! రవీంద్రారెడ్డి అభ్యరి్థత్వాన్ని ఆరు జిల్లాలలోని 26మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్చార్జీలు ఏకగ్రీవంగా సమర్థించారు. బాధ్యత తీసుకుని గెలుపునకు కృషి చేస్తున్నారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఓడిపోయామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభావం తప్పదని, పోటీ వద్దని టీడీపీ ఇన్చార్జీలు భావించారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పారీ్టగా వైఎస్సార్సీపీ ఉండి ఎమ్మెల్సీ గెలిచిందని, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి కనీసం పోటీ చేయకుంటే ఆ ప్రభావం కేడర్పై బలంగా పడుతుందని నామమాత్రపు పోటీకి సిద్ధమైంది. పోటీకి అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో రాంగోపాల్రెడ్డిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో తెలిసిందే. అక్కడ టీడీపీకి ఎలాంటి విజయాలు లేవు. అలాంటి నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలపడం చూస్తే ఈ ఎన్నికలను టీడీపీ ఎంత సీరియస్గా తీసుకుందో అర్థమవుతోంది. రవీంద్రారెడ్డి 28 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తరచూ సమావేశాలు నిర్వహించి ఓటర్లను కలుస్తున్నారు. రాంగోపాల్రెడ్డి చంద్రబాబు పర్యటనలో మినహా ఎక్కడా కనిపించని పరిస్థితి. వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూల అంశాలు ►సచివాలయాల ఏర్పాటుతో వేలాది నిరుద్యోగులకు సర్కారు కొలువులు. ►ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు పర్మనెంట్ చేయడం. ►పోలీస్రిక్రూట్మెంట్ ద్వారా 6,900 పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు. ►అభ్యర్థుల వినతి మేరకు వయస్సు సడలింపు నిర్ణయం. ►న్యాయశాఖ పరిధిలో 3వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ►గ్రూప్–1 నోటిఫికేషన్కు చర్యలు. ►వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలన్నీ భర్తీకి నిర్ణయం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలోనూ త్రిముఖ పోరే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 27,716 ఓట్లు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఓట్లు కూడా పెరిగాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో పాటు బీజేపీ నేత ఒంటేరు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, అనిల్కుమార్రెడ్డితో పాటు పలువురు పోటీ చేస్తున్నారు. కత్తి, ఒంటేరు, రామచంద్రారెడ్డి మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. కత్తి ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయ ఎన్నికల్లో యూనియన్లు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థి గెలుపోటములను యూనియన్లే ప్రభావితం చేయనున్నాయి. దీంతో అభ్యర్థులంతా యూనియన్ల నేతలు, సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
అభివృద్ధి దిశగా పర్యాటక రంగం
కడప కల్చరల్ : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా వెళుతోందని నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఎంఎం ఆస్పత్రి అధినేత డాక్టర్ మహబూబ్పీర్ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్రాజు ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయలసీమ టూరిజం సంస్థ ఇటీవల మరికొన్ని సంస్థలను కలుపుకుని బలోపేతం కావడం సంతోషదాయకమన్నారు. ఇటీవల గండికోటలో ఒబెరాయ్ సంస్థ హోటల్స్ నిర్మించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. సభాధ్యక్షుడు లయన్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మానస చిన్నపరెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు రాయలసీమ సంస్థ ఒక్కటే జిల్లా పర్యాటకాభివృద్ధికి కృషి చేసిందని, ఇప్పుడు లయన్స్ క్లబ్తోపాటు పలు ప్రముఖ సంస్థలు కూడా ముందుకు వస్తుండడం సీమ సంస్థ పట్ల గల విశ్వాసమే కారణమన్నారు. ప్రత్యేక అతిథి, యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య ఎన్.ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో పర్యాటక ప్రాంతాలను కలుపుతూ బస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంస్థ ప్యాట్రన్ పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ తాను మిత్రుల ప్రోత్సాహంతో రాసిన ట్రావెలాగ్ను త్వరలో ఆవిష్కరిస్తున్నామన్నారు. చీఫ్ ప్యాట్రన్ పోతుల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా రాయలసీమ సంస్థ జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. రిటైర్డ్ ఇంజినీరు వెంకటరెడ్డి, సంస్థ ప్యాట్రన్ పద్మప్రియ చంద్రారెడ్డి, కోశాధికారి బాలగొండ గంగాధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను రాసిన కథకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ బహుమతి రావడంతో సంస్థ సభ్యుడు షబ్బీర్ హుసేన్ను ఘనంగా సత్కరించారు. -
పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే..
మదనపల్లె సిటీ: ఎంతో అత్రుతగా ఎదురుచూసే అనపకాయల సీజన్ వచ్చేసింది. మార్కెట్ను అనపకాయలతో ముంచెత్తుతుంది. అన్నమయ్య జిల్లాలోని పడమటి మండలాల్లో ఖరీఫ్ సీజన్లో వేరుశనగతో పాటు అనపకాయలు పండిస్తారు. నవంబర్ నుంచి జనవరి చివరి వరకు సీజన్ ఉంటుంది. రామసముద్రం, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం, పీలేరు ప్రాంతాల్లో అనపకాయలు పండిస్తున్న రైతులు మార్కెట్కు తెస్తున్నారు. కిలో రూ.30 వంతున విక్రయిస్తున్నారు. అనపకాయలతో చేసే పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. భోజనప్రియులు పితికిపప్పు కూరను ఎంతో ఇష్టంగా తింటారు. సంక్రాంతి వరకు ఘుమఘుమలే అనపకాయలు సంక్రాంతి దాకా విరివిగా లభ్యమవుతాయి. దీంతో ఇళ్లల్లో వారానికి మూడు సార్లయినా పితికిపప్పు రుచి చూడాల్సిందే. కేవలం వర్షా«ధారంగా చేళ్లల్లో పండిన నాటు అనపకాయలు మాత్రమే చాలా రుచిగా ఉంటాయి. వీటిని ముట్టుకోగానే బంకగా ఉండి, వాటి వాసన గంటసేపు ఉంటుంది. అబ్బా దాని రుచే వేరు అనపగింజలను గింజల కూర, చారు, సాంబారు చేస్తారు. అనపకాయలు ఒలిచి గింజలను గిన్నెలో నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు గింజలను పితికి పప్పు కూరలు, చారుగా చేస్తారు. ఉదయమే దోసెల్లో పితికిపప్పు ఇష్టంగా తింటారు. కొందరు పితికిపప్పును ఎండబెట్టి నూనెలో వేపుడు చేసి తింటారు. పొరుగు రాష్ట్రాలకు.. మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో అనపకాయలకు మార్కెట్ ఉంది. రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం ప్రాంతాల నుంచి మార్కెట్కు రైతులు ప్రతి రోజు సాయంత్రం అనపకాయలు సంచుల్లో తెస్తారు. ఇక్కడి నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి చెన్నై, వేలూరు, బెంగళూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్కు ప్రతి రోజు 5 వేల కేజీల అనపకాయలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అనపకాయలకు మంచి డిమాండ్ ఉంది. రుచిగా ఉండటంతో వీటిని బాగా ఇష్టపడతారు. వర్షాలకు పంట దెబ్బతినింది అనపచెట్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పురుగు పట్టడం వల్ల దిగుబడి తగ్గింది. ఎకరాలో అనపపంట సాగు చేశాను. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. – మణి, రైతు, ఒంటిమిట్ట వారానికి రెండు, మూడు సార్లు వండుతా ఇది సీజన్. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే కాయలు. అందుకే మదనపల్లె మార్కెట్కు వెళ్లి అనపకాయలు తెచ్చుకుంటా. వారంలో మూడురోజులైనా పితికిపప్పు కూర వండుతాం. పిల్లలు ఇష్టంగా తింటారు. – మంజుల, గృహిణి, సిటిఎం పోషకాలు మెండు ఈ సీజన్లో మాత్రమే లభించే అనపకాయలు, పితికిపప్పు మంచి పోషకాలు ఉంటాయి. క్రిమిసంహారక మందులు లేకుండా వర్షాధారంగా చేలల్లో పంట పండుతుంది. ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. – డాక్టర్ సరస్వతమ్మ, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె -
ఏది నిజం?: ప్రాజెక్టులనడుగుదాం.. నీళ్లెవరిచ్చారో?
విశాఖలో రాజధాని కోసం స్థానికులంతా గర్జిస్తే... అప్పుడు రామోజీరావుకు విశాఖలో భూ కుంభకోణాలు కనిపించాయి. రాయలసీమ వాసులంతా ఏకమై మాకు ‘న్యాయ’ రాజధాని కావాలని ఇప్పుడు నినదిస్తే... రామోజీకి సడెన్గా రాయలసీమ వెనకబాటుతనం గుర్తుకొచ్చింది. పూర్తికాని ప్రాజెక్టులు మాత్రమే కనిపించాయి. కానీ... చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు 17.85 టీఎంసీల నీళ్లు నిండటం ‘ఈనాడు’కు కనిపించలేదు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు 10 టీఎంసీలను నిల్వచేయటం ప్రస్తావించనే లేదు. ఇక గండికోట రిజర్వాయర్లో గరిష్ఠ సామర్థ్యానికి తగ్గట్టు 26.85 టీఎంసీల నీరు నిల్వచేయటం కూడా రామోజీకి పట్టదు. ఎందుకంటే... ఇవన్నీ చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో చెయ్యలేని పనులు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ మూడున్నరేళ్లలోనే సాధించిన విజయాలు. లీకేజీలకు అడ్డుకట్ట వేస్తే బ్రహ్మం సాగర్ బాగుపడుతుందని, పునరావాసం కల్పిస్తే గండికోటలో గానీ, చిత్రావతిలో గానీ గరిష్ఠంగా నీటిని నిల్వ చేయొచ్చని చంద్రబాబు నాయుడికి తెలియదా? మరెందుకు చేయలేదు? అప్పుడెందుకు రామోజీరావు ఇలాంటి కథనాలు రాయలేదు? ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వంపై కూడా పనిగట్టుకుని ఎందుకు విమర్శలు చేస్తున్నారు? దీనికి సమాధానం ఒక్కటే. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి... ‘న్యాయ’ రాజధానిగా చేస్తానని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెప్పటం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు. బాబుకు ఇష్టం లేనిదేదైనా... రామోజీకీ నచ్చదు కదా!!. ‘సీమ’ంతైనా మేలు చేశారా... అంటూ వండివార్చిన కథనంలో నిజమెంత? ఏది నిజం? చూద్దాం... ఒక్క నీరే కాదు. పరిశ్రమలు, వైద్య కళాశాలలు... ఇలా రాయలసీమ సమగ్రాభివృద్ధికి అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడంతో పాటు ఐదు వైద్య కళాశాలలు, రెండు క్యాన్సర్ ఆసుపత్రులను కొత్తగా ఏర్పాటు చేస్తుండటం ద్వారా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నడుంకట్టారు. ఒకటీ అరా పరిశ్రమలు కాదు... ఏకంగా పారిశ్రామిక క్లస్టర్లతోనే సీమ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమ సస్యశ్యామలమైతే.. అక్కడ రాజకీయంగా తమకు నూకలు చెల్లినట్లేనన్నది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన. అప్పుడు తమ డీపీటీకి (దోచుకో..పంచుకో..తినుకో) శాశ్వతంగా తెర పడుతుందనే రామోజీరావు బాధ. అందుకే వికృతరాతలకు ప్రాణంపోస్తూ.. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికిపుడు రాయలసీమలో బ్రహ్మంసాగర్, గండికోట, సీబీఆర్, వెలుగోడు.. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు ఇలా ఏ ప్రాజెక్టును చూసినా ఇపుడు నిండుకుండను తలపిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందుతున్నాయి. కానీ చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టుల్లో నాలుగో వంతు కూడా నిండని పరిస్థితి. కొన్నిటికి లీకేజీలు... మరికొన్నిటికి నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవటం... ఇలా అన్నీ సమస్యలే. వాటికి నిధులు ఖర్చుచేసి ప్రాజెక్టుల్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపాల్సిన ప్రభుత్వం ఆ ఊసే గాలికొదిలేసింది. ‘సీమం’తైనా న్యాయం చేయలేకపోయింది. కాకపోతే చంద్రబాబు ఏం చేసినా కరెక్టేనని చెప్పటమే తమ బాధ్యతగా భావించే ‘ఈనాడు’, దాని తోక పత్రిక, ఇతర ఛానెళ్లు ఈ వాస్తవాలను ఎన్నడూ చెప్పలేదు. ఇపుడు మాత్రం అకస్మాత్తుగా వాటికి రాయలసీమ గుర్తుకొచ్చింది. అమ్మో... సీమ అన్యాయమైపోతోందంటూ గుండెలు బాదుకుంటున్నాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్రహ్మంసాగర్ రిజర్వాయరు గరిష్ఠ సామర్థ్యం 17.85 టీఎంసీలు. కానీ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు ఉండటంతో నిల్వ సామర్థ్యం నాలుగైదు టీఎంసీలకు పడిపోయింది. 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు... ఎన్నడూ లీకేజీలకు అడ్డుకట్ట వేసి గరిష్ఠ సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేద్దామనే ప్రయత్నాలు చేయలేదు. రాయలసీమను సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. ఆ నాలుగైదు టీఎంసీల నిల్వతోనే నెట్టుకొచ్చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... యుద్ధప్రాతిపదికన బ్రహ్మంసాగర్ మట్టికట్టలో లీకేజీలున్న చోట రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ను నిర్మించారు. లీకేజీలకు అడ్డుకట్ట వేసి ఏకంగా 17.85 టీఎంసీలను నిల్వ చేసి... ఆయకట్టు చివరి భూములక్కూడా నీళ్లిచ్చారు. ఖరీఫ్ పూర్తయినా ఇప్పటికీ బ్రహ్మంసాగర్లో 15.11 టీఎంసీల నీరు నిల్వ ఉందనే విషయం రామోజీకి తెలియదా? ఎందుకు రాయరు? గండికోట రిజర్వాయర్ గరిష్ఠ సామర్థ్యం 26.85 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో ఐదారు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని దుస్థితి ఉండేది. పునరావాసం కల్పించే ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. గత రెండేళ్లుగా గరిష్ఠంగా నీటిని నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రిజర్వాయర్లో 26.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇలాంటి వాస్తవాలను రాస్తే రాయలసీమకు చేస్తున్న మేలు బయటపడుతుందని... అబద్ధాలు రాయటానికే అలవాటు పడ్డారు రామోజీరావు!!. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ది (సీబీఆర్) కూడా గండికోట లాంటి కథే. దీని గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఫలితంగా నాలుగైదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేని పరిస్థితి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. రెండేళ్లుగా సీబీఆర్లో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం సీబీఆర్లో 9.61 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇదీ వాస్తవం. బ్రహ్మంసాగర్ రిజర్వాయరు గాలేరు–నగరి వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు సొరంగాలను తవ్వాలి. ఇందులో ఒకటి మహానేత వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగంలో మిగిలిన 162 మీటర్ల పనులను ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేక చేతులెత్తేశారు. ఫాల్ట్ జోన్లోని ఆ సొరంగం పనులను అధునాతన సాంకేతిక పరి/ê్ఞనంతో ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేయిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సొరంగం పూర్తి కాబోతున్నది కూడా. అప్పుడు గాలేరు–నగరి ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించడానికి మార్గం సుగమం అవుతుంది. రాయలసీమ కరవు నివారణ పథకంలో భాగంగా గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడంలో భాగంగా అవుకు వద్ద పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో సొరంగాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. తాకట్టు పెట్టిన బాబే గొప్పా..? రాయలసీమ తాగు, సాగునీటికి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం. శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువ నుంచి అక్రమంగా నీటిని తరలించడానికి 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపడితే నాటి సీఎం చంద్రబాబు అడ్డుకోలేకపోయారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయిన బాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎడమ గట్టు కేంద్రం ద్వారా తెలంగాణ సర్కార్ ఎడాపెడా నీటిని తోడేస్తే.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతుంది. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువన ఉంటే కృష్ణా బోర్డు కేటయింపులున్నా సరే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని సరఫరా చేయడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో 854 అడుగులకు దిగువన ఉన్నా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షణకు నడుం బిగించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్. దీనిపై తెలంగాణ సర్కార్ ఎన్జీటీని ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నాకనే రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించాలని ఎన్జీటీ ఆదేశించడంతో.. ఆ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసిన ప్రభుత్వం.. ఆ అనుమతిని తెచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. కాకపోతే కబోదిలా మారిన రామోజీకి ఇవేవీ కనిపించవు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాలనే ఆలోచన కూడా చేయని చంద్రబాబే రామోజీకి ఆదర్శ నాయకుడు. ఎందుకంటే.. తన అక్రమాలకు రక్షకుడు కాబట్టి. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం పెంచే పనులను రాయలసీమ కరవు నివారణ పథకంలో భాగంగా రూ.43,336 కోట్ల వ్యయంతో చేపట్టారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్. అదీ... సీమకు చేతల్లో చేస్తున్న న్యాయం. వైద్యంతో పాటు ‘న్యాయం’... వైద్య సౌకర్యాలలోనూ రాయలసీమ ముందుండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏకంగా ఐదు మెడికల్ కాలేజీలను, రెండు క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో వైద్య విద్య సీట్లు పెరగటమే కాదు... మెరుగైన వైద్యమూ అందుబాటులోకి రానుంది. ఇక శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుతో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఇప్పటికే ఈ నిర్ణయంలో భాగంగా లోకాయుక్త, వినియోగదారుల కోర్టుతో సహా కొన్ని న్యాయాధికార ప్రాంగణాలు అక్కడ కొలువుదీరాయి. హైకోర్టు రావాలంటూ యావత్తు రాయలసీమ ఉద్యమిస్తోంది కూడా. కాకపోతే రామోజీరావుకు ఈ వాస్తవాలతో పనిలేదు. అందుకే అసలు రాయలసీమ వాసులెవ్వరికీ అక్కడ న్యాయస్థానం రావాలని లేదని, అందరూ అమరావతికే కట్టుబడి ఉన్నారనే ప్రచారాన్ని చంద్రబాబు మొదలెట్టారు. తాను కర్నూలు వెళ్లి అడిగానని, అక్కడి వారంతా అమరావతి రాజధానిగా ఉండటానికే అంగీకరించారని చెప్పటం ఆరంభించారు. దానికి కొనసాగింపుగానే... రామోజీ ఈ వంకర రాతలు మొదలెట్టారు. ఇదీ.. గురుశిష్యుల గూడుపుఠానీ. సీమలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి... వెనుకబడిన రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంపైనా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మహానేత వైఎస్ హయాంలో శ్రీ సిటీ రాకతో రాయలసీమ రూపు రేఖలు మారగా...... సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి వద్ద, కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రెండు భారీ పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టారు. వాటిని పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూడన్నరేళ్లలో వివిధ రంగాలకు చెందిన 29 భారీ ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టబడుల ప్రోత్సాహక కమిటి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ 29 ప్రాజెక్టులు ద్వారా రూ.88,333.66 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 76,992 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వీటిలో తిరుపతి జిల్లా ఇనగలూరు వద్ద హిల్టాప్ (అపాచీ) సెజ్ భారీ పాదరక్షల తయారీ, పులివెందులలో సుమీత్ ఫుట్వేర్, కొప్పర్తి వద్ద నీల్కమల్, పిట్టి లామినేషన్స్, నాయుడుపేట వద్ద గ్రీన్టెక్ ఎనర్జీ, చిత్తూరు జిల్లా ఎలకటూరు వద్ద అమ్యప్పర్ టెక్స్టైల్, తిరుపతి జిల్లా తమ్మినపట్నం వద్ద జిందాల్ స్టీల్, పులివెందుల వద్ద ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, బద్వేల్ వద్ద సెంచురూ ప్యానల్స్, కొప్పర్తి వద్ద కాసిస్ ఎలక్ట్రిక్ బస్సులు తయారీ వంటి పలు ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. కర్నూల్ జిల్లా్ల ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు రూ.428 కోట్లతో 74 ఎంఎల్డీ నీటి సరఫరా, కొప్పర్తికి రూ.150 కోట్లతో 46 ఎంఎల్డీ నీటి సరఫరా ప్రాజెక్టులను ఏపీఐఐసీ చేపట్టంది. ఎండాకాలంలో నీటి ఎద్దటి లేకుండా కొప్పర్తి వద్ద రూ.38 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ నిక్డిక్ట్ సహకారంతో ఓర్వకల్లు వద్ద 4,742 ఎకరాలు, కొప్పర్తి వద్ద 2,595 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇది కాకుండా రూ.750 కోట్లతో కొప్పర్తి వద్ద వైఎస్ఆర్ ఈఎంసీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే వైఎస్ఆర్ ఈఎంసీలో డిక్సన్ యూనిట్లను ఏర్పాటు చేసింది. సెంచురీ ప్లై యూనిట్కు నీటి సరఫరా కోసం గోపవరం వద్ద రూ.45 కోట్లతో నీటి తరలిపంపు ప్రాజెక్టును అభివద్ధి చేస్తోంది. పీఎం గతిశక్తి కింద రూ.31 కోట్లతో కృష్ణపట్నం నుంచి కొప్పర్తికి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టింది. -
చీమంతైనా నిజముందా రామోజీ?
నాడు: కడలిలో కలుస్తున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత వైఎస్సార్ 2006లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంపు పనులను చేపడితే చంద్రబాబు ధర్నాలకు దిగి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టారు. జలయజ్ఞానికి విఘ్నాలు కల్పించే రాక్షసమూకకే ‘ఈనాడు’ బాకాలూదింది. నేడు: శ్రీశైలానికి వరద వచ్చే 30 – 40 రోజుల్లోనే కృష్ణా వరద జలాలను తరలించి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 80 వేల క్యూసెక్కులకు పెంపు, కాలువల ప్రవాహ సామర్థ్యాన్నిపెంచడంతోపాటు కొత్త ప్రాజెక్టులను సీఎం జగన్ చేపట్టారు. రాయలసీమ కరువు నివారణ పథకం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడుతుంటే రామోజీ వంతపాడుతున్నారు. సాక్షి, అమరావతి: రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా నిండుకుండను తలపిస్తోంది. భూగర్భ జలమట్టం పెరగడంతో ఎండిన బోర్లకూ జలకళ వచ్చింది. ఎన్నడూ లేని రీతిలో భారీ ఎత్తున రైతులు పంటలు సాగు చేస్తుండటంతో కూలీలకు సమృద్ధిగా పని దొరుకుతోంది. రైతులు, కూలీలు సంతోషంగా ఉంటే కొందరికి మాత్రం రుచించడం లేదు. న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటైతే రాయలసీమ సమగ్రాభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతో గర్జన సభ నిర్వహిస్తున్న రోజు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘సీమంతైనా మేలు చేశారా’ అనే శీర్షికతో ‘ఈనాడు’ అబద్ధాలను కుమ్మరించింది. పేజీలకు పేజీలు అచ్చోసినా అందులో చీమంతైనా నిజం లేదు! రాయలసీమ కరువు నివారణ పథకం(ఆర్డీఎంపీ) కింద రూ.43,336 కోట్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 33 ప్రాజెక్టులను చేపట్టి నిధుల సమీకరణకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. అవి పూర్తైతే టీడీపీకి పుట్టగతులు ఉండవనే భయంతో చంద్రబాబు అడ్డుకునే కుట్రలకు వ్యూహం రచించారు. సీమ ఎత్తిపోతలకు బ్రేక్ వేసిన ఎన్జీటీ ఈనాడు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 80 టీఎంసీలను తరలించే ఉద్దేశంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పడకేసింది. వాస్తవం: శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువన ఉన్నా సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ చేపట్టారు. దీనిపై తెలంగాణ సర్కార్ ఎన్జీటీలో కేసు వేయడంతో పర్యావరణ అనుమతి పొందాకే పనులు చేపట్టాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. యుద్ధప్రాతిపదికన పర్యావరణ అనుమతి సాధించి ఎన్జీటీ అనుమతితో ఎత్తిపోతలను పూర్తి చేయడానికి సిద్ధమైంది. నిండుకుండల్లా ప్రాజెక్టులు.. ఈనాడు: బ్రహ్మంసాగర్ ఎత్తిపోతల, కుందూనదిపై జోలదరాశి, రాజోలి రిజర్వాయర్ల నిర్మాణం నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించకపోవడం వల్ల అవుకు రెండో సొరంగం పనులు ఆగిపోయాయి. వాస్తవం: గాలేరు–నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. ఈ కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండు టన్నెళ్లు తవ్వాలి. ఇందులో ఎడమ సొరంగంలో మిగిలిన 45 మీటర్లను తవ్వలేక నాడు టీడీపీ సర్కార్ తాత్కాలికంగా లూప్ వేసింది. కుడి టన్నెల్ 162 మీటర్లలో ఫాల్ట్ జోన్(పెలుసు పొరలు)లో పనులు చేయలేక చేతులెత్తేసింది. ఆ పనులను అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనంతో సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టింది. మరో రెండు మూడు నెలల్లో ఈ టన్నెల్ పూర్తవుతుంది. అప్పుడు 20 వేల క్యూసెక్కులను వరద కాలువ ద్వారా తరలించవచ్చు. గండికోట నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి గరిష్టంగా 26.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పునరావాసం ద్వారా చిత్రావతిలో గరిష్టంగా 10 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఖరీఫ్ పూర్తయింది. రబీ ఆరంభంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టును చూసినా నిండుకుండను తలపించడం కానరావడం లేదా? అవార్డు నోటిఫై చేయలేదని తెలియదా? ఈనాడు: ఆర్డీఎస్ కుడి కాలువ పనులు ఆగిపోయాయి. భూసేకరణ ఇబ్బందులతో ప్రాజెక్టు పనులు ముందుకు కదలడంలేదు. వాస్తవం: ఆర్డీఎస్ కుడి కాలువకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 4 టీఎంసీలు కేటాయించింది. ట్రిబ్యునల్ అవార్డును కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫై చేసే వరకూ పనులు ఆపేయాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. ట్రిబ్యునల్ అవార్డును నోటిఫై చేయగానే రూ.1,985 కోట్లతో ఆర్డీఎస్ కుడి కాలువను పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజక వర్గాల్లో 45 వేల ఎకరాలకు నీళ్లందించనుంది. సమస్యలను అధిగమిస్తూ ముందుకు.. ఈనాడు: భూసేకరణలో జాప్యం, కాంట్రాక్టర్కు రూ.వంద కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల వేదవతి ఎత్తిపోతల ఆగిపోయింది. వాస్తవం: వేదవతి ఎత్తిపోతల పథకంలో భూసేకరణ సమస్యలను అధిగమించి రూ.1,942 కోట్లతో పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదోని, ఆలూరు నియోజకవర్గాల పరిధిలో 80 వేల ఎకరాలను వేదవతి ఎత్తిపోతలతో సస్యశ్యామలం చేసే పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టింది. గుండ్రేవులపై గట్టిగా పోరాటం ఈనాడు: కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణతోపాటు మరో రెండు లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లందించేందుకు రూ.5,400 కోట్లతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వానికి డీపీఆర్ను పంపారు. కానీ.. ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. వాస్తవం: తుంగభద్రపై నిర్మించే గుండ్రేవుల రిజర్వాయర్తో కర్నూలు జిల్లాలో కొంత, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కొంత భూమి, గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక, తెలంగాణను ఒప్పించేందుకు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశాల్లో ప్రభుత్వం చేసిన పోరాటం కనపడలేదా? కర్ణాటక, తెలంగాణలో ముంపు గ్రామాల ప్రజలను ముంచేసైనా గుండ్రేవుల కట్టాలా రామోజీ? ఇవేం పనులు? ఈనాడు: సాగునీటి కోసం రైతులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పనుల్లేక రైతు కూలీలు వలస బాట పట్టాల్సి వస్తోంది. వాస్తవం: బ్రహ్మంసాగర్ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు ఏర్పడటంతో నాలుగైదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేని దుస్థితి. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు బ్రహ్మంసాగర్కు మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక డయాఫ్రమ్వాల్ నిర్మించి లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. ప్రాజెక్టులో 17.74 టీఎంసీలకుగానూ 15.11 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కమీషన్లతో ప్రజాధనం మట్టిపాలు ఈనాడు: కర్నూలు పశ్చిమ ప్రాంతంలో హంద్రీ–నీవా నీటితో 68 చెరువులు నింపే పనులను చేపట్టి 52 శాతం పనులను టీడీపీ సర్కారే పూర్తి చేసింది. మూడున్నరేళ్లలో 24 శాతం పనులే పూర్తయ్యాయి. వాస్తవం: టీడీపీ హయాంలో కమీషన్లు అధికంగా వచ్చే మట్టి తవ్వకం పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంప్హౌస్లతోపాటు కాంక్రీట్ పనులను చేపట్టింది. మిగతా 33 శాతం పనులను 2023 మార్చి నాటికి పూర్తి చేసే దిశగా వేగవంతం చేసింది. 2023 ఖరీఫ్కు నీళ్లందించే దిశగా ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించింది. ఇది తెలుసుకోకుండా తప్పుడు కథనాలు రాస్తే ఎలా? అక్రమాలను సరిదిద్దడం వల్లే జాప్యం ఈనాడు: జీడిపల్లి–పేరూరు(అప్పర్ పెన్నార్) పథకంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమైంది. రూ.240 కోట్లతో చేపట్టాల్సిన మడకశిర బైపాస్ కెనాల్ను అటకెక్కించేశారు. వాస్తవం: అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులో చంద్రబాబు భారీ అక్రమాలకు పాల్పడ్డారు. వాటిని సరిదిద్ది ప్రాజెక్టును సమూలంగా ప్రక్షాళన చేయడం వల్లే జాప్యం చోటుచేసుకుంది. కొత్త డిజైన్ మేరకు పనులు చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.240 కోట్లతో మడకశిర బైసాస్ కెనాల్ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఏడీబీ నిధులివ్వట్లేదని ఏడుపు రాతలు ఈనాడు: రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం వాటా చెల్లించేందుకు సమ్మతిపత్రం ఇవ్వకపోవడం వల్లే రూ.513 కోట్ల ఏడీబీ నిధులతో చేపట్టిన కేసీ కెనాల్ సింప్ పథకం వెనక్కి వెళ్లిపోయింది. వాస్తవం: ఏడీబీ ఆర్థిక సహకారంతో కేసీ కెనాల్ ఆధునికీకరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఏడీబీ రుణానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదం అవసరం. ఆ తరువాత ఏడీబీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంటుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగుతోంది. నాలుగు దశలలో నిధులను ఏడీబీ సర్దుబాటు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం వాటా నిధులను ఇచ్చేందుకు సమ్మతిపత్రం ఇవ్వకపోవడం వల్ల ప్రాజెక్టు వెనక్కివెళ్లిపోయిందని మీరేమైనా కలగన్నారా రామోజీ? -
న్యాయ రాజధాని కోసం కదం తొక్కిన సీమ వాసులు
అప్డేట్స్ 01:08PM రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ గర్జనకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. దీనికి రాయలసీమ వాసులు భారీగా తరలివచ్చారు. విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు రాయలసీమ గర్జన సభలో పాల్గొన్నారు. 12:00PM చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదు: గుమ్మనూరు జయరాం మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: గుమ్మనూరు జయరాం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం జగన్ ముందకెళ్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా 11:48AM రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు: ఎమ్మెల్సీ ఇక్బాల్ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయరాజధాని: ఎమ్మెల్యే రాంభూపాల్రెడ్డి న్యాయ రాజధాని కోసం ఎంతకైనా పోరాడతాం 11:52AM రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉంది: బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశారు రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారు అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాలి 11:20AM నారాసుర భూతం దిష్టిబొమ్మను దగ్థం చేసిన సీమజనం రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు 10:30AM మంత్రి బుగ్గన కామెంట్స్ వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మా దృష్టిలో రత్నాల సీమ రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్ వికేంద్రకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదు స్వప్రయోజనాలకోసమే చంద్రబాబు ఆరాటం రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు: మంత్రి ఉషశ్రీ చరణ్ వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుంది: మంత్రి ఉషశ్రీ చరణ్ చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే శ్రీదేవి చంద్రబాబులాంటి ప్రతిపక్షనేతలు ఉండటం దురదృష్టకరం: ఎమ్మెల్యే శ్రీదేవి వికెంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రీదేవి 10:00AM కర్నూలులో ప్రారంభమైన జేఏసీ రాయలసీమ గర్జన సభ కర్నూలు న్యాయ రాజధాని కోసం గళం విప్పిన సీమ వాసులు రాయలసీమ జిల్లాల నుంచి సభాస్థలికి భారీగా తరలివచ్చిన జనం శ్రీబాగ్ ఒప్పంద ప్రాకరం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ సభా స్థలికి చేరుకున్న ప్రజాప్రతినిధులు, మేధావులు రాయలసీమ గర్జన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నేతలు గర్జనకు హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్ సభకు హాజరైన ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ ‘మా నినాదం ఒక్కటే.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడమే’ అంటూ సీమ వాసులు కదం తొక్కారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి.. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైఎస్సార్సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. -
‘సీమ’ గర్జన: 1937 పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే..
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు రాయలసీమ వాసులు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల భారీ బహిరంగ సభకు వేదిక కానుంది.దీనికి మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే.. వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉండేది. ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మ కంతోనే ఆంధ్రరాష్ట్రం సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్ను కూడా కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదు చేరింది. సీమలోని సిద్ధేశ్వరంను వదిలేసి నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టారు. శ్రీ బాగ్ ఒప్పందం అటకెక్కింది. దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలని, కేవలం పాలనా రంగంలోనే కాక జల వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల కోసం అడుగు ముందుకు వేయాలనే సంకల్పంతో నేడు(సోమవారం) చేపట్టిందే రాయలసీమ గర్జన. రాష్ట్ర విభజన సమయంలో సైతం ఇక్కడ ప్రజల డిమాండ్ను పట్టించుకోలేదు. అధికార వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలు ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని తుంగలోకి తొక్కారు. -
రేపు కర్నూలు లో రాయలసీమ గర్జన సభ
-
YSRCP: డిసెంబర్ 5న కర్నూలులో సీమ గర్జన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: డిసెంబర్ 5న కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీమ గర్జనను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఇన్చార్జ్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ కడపలో రాయలసీమ గర్జన పేరుతో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీమ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ సలహా మండలి ఛైర్మన్ తిరుపాల్రెడ్డి హాజరయ్యారు. చదవండి: (అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు) -
రాయలసీమ ప్రగతికి మరో ‘హైవే’.. రూ.1,500.11 కోట్లతో 4లేన్ల రహదారి
సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రగతి పథానికి మరో జాతీయ రహదారి దోహదపడనుంది. కడప–రేణిగుంట మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారి (ఎన్హెచ్–716)ని నిరి్మంచాలని కేంద్ర రవాణా–జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. దేశంలోని పశ్చిమ–తూర్పు ప్రాంతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న షోలాపూర్–చెన్నై ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణా–జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్గడ్కరీ గురువారం ట్వీట్ ద్వారా వెల్లడించారు. 120 కి.మీ.. రహదారి దేశంలో మౌలిక సదుపాయాల అనుసంధానానికి కేంద్రం ప్రారంభించిన గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా కడప నుంచి తిరుపతి సమీపంలోని రేణిగుంట కూడలి మధ్య నాలుగు లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మిస్తారు. రూ. 1,500.11 కోట్లతో 120 కి.మీ. రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ హైవే నిర్మాణానికి అవసరమైన 1,066 ఎకరాల సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేగవంతం చేసింది. రెండు ప్యాకేజీల కింద టెండర్ల ప్రక్రియ నిర్వహించి 2024 నాటికి హైవేను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. చదవండి: (వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా: చంద్రబాబు) పోర్టుల అనుసంధానం.. ఈ నాలుగు లేన్ల రహదారి ప్రధానంగా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలను రేణిగుంట విమానాశ్రయంతో అనుసంధానిస్తుంది. ఈ రహదారి నిర్మాణంతో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టుల నుంచి షోలాపూర్ పారిశ్రామిక ప్రాంతానికి సరుకు రవాణా సులభతరం కానుంది. దీంతో ఈ మధ్య ప్రాంతంలో ఉండే రాయలసీమలో అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం రోజూ సగటున 18 వేల వాహనాలు ప్రయాణిస్తున్న ఈ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నాలుగు లేన్ల జాతీయ రహదారితో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆధ్యాత్మిక టూరిజం కూడా అభివృద్ధి చెందనుంది. -
ఏపీలో వర్షాలు.. రానున్న రెండు రోజుల్లో..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న రెండురోజుల్లో మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి. గురువారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. మరోవైపు డిసెంబర్ నాలుగో తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం విలీనం కానుంది. తరువాత అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్ -
కొనసాగుతున్న తూర్పు, ఈశాన్య గాలులు.. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం పొడి వాతావరణం మొదలయ్యాక రాష్ట్రంలో చలి ప్రభావం అధికమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా శనివారం తిరుపతి జిల్లా ఇనుగుంటలో 7.6 సెం.మీల భారీ వర్షం కురిసింది. -
National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరిన్ని జాతీయ రహదారుల అభివృద్ధికి ముందడుగు పడింది. రాష్ట్రంలో కొత్తగా 9 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. వీటికి ఏకంగా రూ.9,009 కోట్లు కేటాయించింది. మొత్తం 411 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదించింది. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారులను ప్రతిపాదించింది. పొడవైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని పోర్టు ఆధారిత పరిశ్రమలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో రెండుసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై జాతీయ రహదారులపై ప్రతిపాదనలను సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం వాటిని ఆమోదించింది. తొలి దశలో గత ఏడాది కేంద్ర మంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.15 వేల కోట్లతో నిర్మించనున్న జాతీయ రహదారులకు విజయవాడలో భూమి పూజ చేశారు. రెండో దశ కింద రాయలసీమలో జాతీయ రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు కొత్తగా 9 రహదారులతో పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వీటికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 28న తిరుపతిలో భూమిపూజ చేయనున్నారు. ఇప్పటికే రూ.204 కోట్లతో 19 కిలోమీటర్ల మేర నిర్మించిన రెండు జాతీయ రహదారులను ఆయన ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన ఇలా... కేంద్ర మంత్రి గడ్కరీ ఈ నెల 27, 28 తేదీల్లో తిరుపతిలో పర్యటిస్తారు. ఆయన 27వ తేదీ రాత్రికి తిరుమల చేరుకుని తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. అనంతరం 28న తిరుపతిలో నిర్వహించే కార్యక్రమంలో, జాతీయ రహదారుల భూమిపూజలో పాల్గొంటారు. -
Rain Alert: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం అదే తీవ్రతతో నెమ్మదిగా కొనసాగుతూ రానున్న 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అనంతరం క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణ కోస్తా–తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి బాగా పెరిగే అవకాశం ఉంది. అల్లకల్లోలంగా సముద్రం వాయుగుండం ప్రభావంతో ఆదివారం తిరుపతి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసనలు
కర్నూలు: చంద్రబాబు చేపట్టిన కర్నూలు జిల్లా పర్యటనకు ఎక్కడ చూసిన నిరసన గళమే వినిపిస్తోంది. గురువారం, శుక్రవారాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. రెచ్చిపోయి మాట్లాడారు. చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడటంతో టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జేఏసీ నేతలపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై టీడీపీ నేతల గూండా వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా శనివారం ఆందోళనలు మిన్నంటాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే కర్నూలులో విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చింది. కాగా, నిన్నటి పర్యటనలో చంద్రబాబు రెచ్చిపోతూ, ఊగిపోతూ మాట్లాడారు. ‘తమ్ముళ్లు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాళ్లు పతనమవడం ఖాయం. నాకు వచ్చిన కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అది నా సభ్యత. నాకు çహుందాతనం ఉంది’ అని అంటూనే పచ్చి బూతులు, రెచ్చగొట్టే మాటలతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘పనికి మాలిన వ్యక్తుల్లారా.. నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా.. రేయ్ వాన్ని తన్ను.. రేయ్ రారా చూపిస్తా.. మా ఆఫీసుకే వస్తార్రా మీరు.. ఎంత ధైర్యం రా నీకు.. ధైర్యం ఉంటే రాండ్రా గాడిదల్లారా.. బోడి నా కొడుకులు తమాషాలాడుతారా.. రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమికొట్టిస్తా.. గుడ్డలిప్పదీసి కొట్టిస్తా.. పోలీసులు చొక్కాలిప్పేసి నిద్రపోండి.. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం.. మీతో కాకపోతే నేనే తేల్చుకుంటా’ అంటూ సహనం కోల్పోయారు చంద్రబాబు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు మరింత పేట్రేగిపోయారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై భౌతిక దాడులు చేసేందుకు యత్నించారు. -
బాబుకు నిరసన సెగ..
-
మీకు చెప్పు చూపించాలి: ఊగిపోయిన చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘తమ్ముళ్లు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాళ్లు పతనమవడం ఖాయం. నాకు వచ్చిన కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అది నా సభ్యత. నాకు çహుందాతనం ఉంది’ అని అంటూనే పచ్చి బూతులు, రెచ్చగొట్టే మాటలతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘పనికి మాలిన వ్యక్తుల్లారా.. నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా.. రేయ్ వాన్ని తన్ను.. రేయ్ రారా చూపిస్తా.. మా ఆఫీసుకే వస్తార్రా మీరు.. ఎంత ధైర్యం రా నీకు.. ధైర్యం ఉంటే రాండ్రా గాడిదల్లారా.. బోడి నా కొడుకులు తమాషాలాడుతారా.. రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమికొట్టిస్తా.. గుడ్డలిప్పదీసి కొట్టిస్తా.. పోలీసులు చొక్కాలిప్పేసి నిద్రపోండి.. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం.. మీతో కాకపోతే నేనే తేల్చుకుంటా.. దద్దమ్మ సీఎం.. పనికి మాలిన సీఎం.. రౌడీ సీఎం.. ఇదేమన్నా పులివెందుల అనుకుంటున్నావా?’ అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. కర్నూలులో పర్యటిస్తూ.. కర్నూలుకు న్యాయ రాజధాని వద్దని, అన్నీ ఒక్క అమరావతిలోనే ఉండాలని చెప్పడం భావ్యం కాదని విన్నవించడానికి వచ్చిన న్యాయవాదులు, విద్యార్థులను చూసి చంద్రబాబు ఇలా రెచ్చిపోయారు. అడుగడుగునా నిరసనలే మూడు రోజుల కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు తొలిరోజు నుంచీ అడుగడుగునా నిరసన సెగ తగులుతూనే ఉంది. దేవనకొండ సర్కిల్, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరులో బాబు పర్యటనకు అడ్డుపడిన న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, జేఏసీ నేతలు.. చివరి రోజు శుక్రవారం తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఉదయం ఓ హోటల్లో టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు మధ్యాహ్నం 2.40 గంటలకు టీడీపీ ఆఫీసుకు బయల్దేరారు. బుధవారపేటకు రాగానే ‘న్యాయ రాజధాని’ని కాంక్షించే ప్రజలు, విద్యార్థులు కాన్వాయ్కి అడ్డుతగిలారు. అక్కడి నుండి కలెక్టరేట్ సర్కిల్కు రాగానే వందలాది విద్యార్థులు కాన్వాయ్కి అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా లాగేశారు. అక్కడి నుండి గాయత్రి ఎస్టేట్లోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు చేరుకున్నారు. ఇక్కడ కూడా న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, జేఏసీ సభ్యులతో పాటు కుల, ప్రజా సంఘాల నేతలు భారీగా తరలివచ్చి టీడీపీ ఆఫీసులోకి చొరబడే ప్రయత్నం చేశారు. నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. నల్లజెండాలు చేతపట్టుకుని, రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని ప్ల్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. చంద్రబాబు వీరందరినీ చూస్తూ ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ‘మన ఏకైక రాజధాని అమరావతే. తమ్ముళ్లూ ఇదే విషయం వారికి చెప్పండి. వారిని తన్నండి.. బట్టలూడదీసి కొట్టండి. మీ చేతకాకపోతే నేను వస్తా.. వారి కథ తేలుస్తా’ అని కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు అమరావతే రాజధాని అంటూ నినాదాలు చేశాయి. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జేఏసీ నేతలపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. ఇదంతా చూస్తున్న చంద్రబాబు.. వారిని మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో జేఏసీ నేతలు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దశలో పోలీసులతో పాటు జిల్లా ఎస్పీపై కూడా చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ‘పోలీసులూ నిద్రపోండి. మీరు బట్టలిప్పేయండి. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం. ఎస్పీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరికి కాపలా కాస్తున్నారు? రౌడీలకు అండగా ఉంటారా? నీకు ఐపీఎస్ ఇచ్చిందే దండగ’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. మందు, బిర్యానీ ఇచ్చింటారు.. ‘ఇది పేటీఎం బ్యాచ్.. క్వార్టర్ మందు, బిర్యానీ ఇస్తారు. దీంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ రోజు కూడా వీరందరికీ క్వార్టర్, బిర్యానీలు ఇచ్చి ఉంటారు’ అని చంద్రబాబు.. జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, ఇతర సంఘాల నేతల ఉద్యమాన్ని హేళన చేస్తూ మాట్లాడారు. ‘నేను పార్టీ ఆఫీసుకు వస్తే నలుగురు వచ్చి బెదిరించాలని చూస్తారా? రౌడీయిజాన్ని అణిచివేస్తా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా. నేను కుప్పానికి వెళ్లినా రౌడీలను తీసుకొస్తున్నారు. ఎక్కడికి వస్తారా? నన్ను రాయలసీమ ద్రోహి అంటారా? రాయలసీమను రతనాల సీమగా మార్చే పార్టీ టీడీపీ. రాయలసీమను దోపిడీ చేసిన వ్యక్తి జగన్. కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుని నువ్వు రాజకీయం చేస్తావా? మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా ప్రాణాన్ని లెక్క చేయను. 23 బాంబులకే భయపడలేదు. నేను కనుసైగ చేస్తే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు బట్టలు ఊడదీయిస్తారు. పోలీసు వ్యవస్థ నాశనమైంది. పతనమైంది. నా పర్యటనలకు వస్తున్న స్పందన చూసి వైఎస్సార్ సీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే నన్ను అడ్డుకోవాలని ఐదు, పది మంది వస్తున్నారు. మా తమ్ముళ్లు కన్నెర్ర చేస్తే వీరు పారిపోవడం ఖాయం. కర్నూలును అభివృద్ధి చేసింది నేనే’ అని చెప్పుకొచ్చారు. నువ్వా.. మూడు రాజధానులు నిర్మించేది? ‘టిడ్కో ద్వారా 10 వేల ఇళ్లు ఇచ్చా. చేతనైతే వాటిని పూర్తి చేసి పేదలకు ఇవ్వు. 90 శాతం నేను పూర్తి చేస్తే 10 శాతం పూర్తి చేయలేకపోయావు. 10 శాతం ఇళ్లు పూర్తి చేయలేని నువ్వు మూడు రాజధానులు కడతావా? ఏమి మనిషివయ్యా.. నీ పుట్టుకే అబద్ధాల పుట్టుక. నీ చరిత్రే నేర చరిత్ర. నేరగాళ్లను పట్టుకునే పార్టీ టీడీపీ. జగన్ అమరావతి రాజధానిగా ఒప్పుకున్నాడా? లేదా? ఓడిపోతాననే పిరికితనంతో ఇప్పుడు మూడు ప్రాంతాల్లో చిచ్చుపెట్టి పచ్చని కాపురాలు నాశనం చేయాలనుకుంటున్నావు. నాలుగేళ్ల నీ పాలనలో ఒక్క రూపాయి పనైనా కర్నూలులో చేశావా? మద్యం, భూములు, భూగర్భ సంపద మీకే కావాలి. పేరు రాయలసీమది, దోపిడీ జగన్ది’ అంటూ సీఎంపై నోరు పారేసుకున్నారు. నాతో ఎవరైనా పెట్టుకుంటే అదే వారికి చివరి రోజు. రాజశేఖరరెడ్డి లాంటోళ్లే నాతో పెట్టకోలేదు. వీరెంత.. అవసరమైతే కర్నూలులోనే బస చేస్తా.. ఎవరెవరు ఏం చేశారో చెబుతా.. నువ్వేం చేశావో చెప్పే ధైర్యం ఉంటే పేపర్కు ఇవ్వు.. నేనేం చేశానో ఇస్తా.. కర్నూలు ప్రజలే నిర్ణయిస్తారు. రాయలసీమలో ముఠా నేతలను అణిచి వేసిన పార్టీ టీడీపీ’ అని అన్నారు. అంతకు ముందు ఆయన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని, తాండ్రపాడులోని చెరువును పరిశీలించారు. చదవండి: (మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు) -
Sribagh Pact: వికేంద్రీకరణ శ్రీబాగ్ ఒప్పందంలోనే ఉంది
మద్రాసు నగరంలోని స్వాతంత్య్ర సమర యోధుడు కాశీనాథుని నాగేశ్వరరావు నివాస గృహం పేరే ‘శ్రీ బాగ్.’ ఆ భవనంలో 1937 నవంబర్ 16న ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం జరగింది. అదే ‘శ్రీ బాగ్ ఒప్పందం’గా జన వ్యవహారంలో నిలిచిపోయింది. ఈ ఒప్పందం ప్రకారం... 1. విశ్వవిద్యాలయం, రాజధాని, హైకోర్టు ఒకచోట కేంద్రీకృతం కాకుండా విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో అలాగే ఉంచి.. హైకోర్టు, రాజధానిలలో ఏది కావాలో కోరుకొనే అవకాశం సీమవాసులకు ఇవ్వాలి. 2. కృష్ణ, తుంగభద్ర, పెన్నానదీ జలాల వినియోగంలో రాయలసీమ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 3. అనంతపురంలోనూ ఆంధ్ర విశ్వ విద్యాలయ కేంద్రం ఉంచాలి. 4. శాసన సభలో జనరల్ స్థానాలు జిల్లాల వారీగా సమాన నిష్పత్తిలో ఉండాలని నిర్ణయించారు. ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మ కంతోనే ఆంధ్రరాష్ట్రం సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్ను కూడా కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదు చేరింది. సీమలోని సిద్ధేశ్వరంను వదిలేసి నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టారు. శ్రీ బాగ్ ఒప్పందం అటకెక్కింది. దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలి. కేవలం పాలనా రంగంలోనే కాక జలవికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల కోసం అడుగు ముందుకు వేయాలి. (క్లిక్ చేయండి: ఉత్తమాంధ్రగా నిలుపుతామంటే...) – డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, అనంతపురం (నవంబర్ 16 శ్రీ బాగ్ ఒప్పందం జరిగిన రోజు) -
కర్నూలును న్యాయరాజధాని చెయ్యాల్సిందేనంటూ రాయలసీమ గర్జన
-
న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాల్సిందే
కర్నూలు (సెంట్రల్): కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ప్రకటించింది. తక్షణమే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు, మహిళలు, న్యాయవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నేతలు మంగళవారం రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. కర్నూలులోని రాజ్విహార్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది. మూడు రాజధానులకు మద్దతుగా తక్షణమే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న సీఎం వైఎస్ జగన్ ఆశయంతో ఏకీభవిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అంగీకరించాలని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో వారి భరతం పడతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. కలెక్టరేట్ ఎదుట మానవహారంగా ఏర్పడి న్యాయ రాజధాని ఆకాంక్షను తెలియజేశారు. ర్యాలీ జరుగుతున్న సమయంలో భారీ వర్షం కురిసినా ర్యాలీ నిర్వహించడం విశేషం. జేఏసీ నిర్వహించిన ర్యాలీకి బార్ అసోసియేషన్ నాయకులు ఎంఆర్ కృష్ణ, ఓంకార్, నారాయణ విద్యాసంస్థల డీన్ లింగేశ్వరరెడ్డి, సీవీ రామన్ విద్యాసంస్థల అధినేత చంద్రశేఖర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎంవీఎస్ అధ్యక్షుడు వెంకటేష్, కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏసుదాసు, రిటైర్డ్ ఉద్యోగులు రోషన్ అలీ, అజయ్కుమార్ మద్దతు ప్రకటించారు. ఈ నెల చివరి వారంలో లక్ష గొంతుకల పొలికేక కాగా కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో నవంబర్ చివరి వారంలో లక్ష గొంతుకల పొలికేక సభను నిర్వహిస్తామని విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు ప్రశాంత్, శ్రీరాములు, చంద్రప్ప, సునీల్రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, బార్ అసోసియేషన్లను ఆహ్వానిస్తామన్నారు. రాయలసీమకు సీఎం వైఎస్ జగన్ హయాంలో తప్ప న్యాయం జరగదన్నారు. ఇప్పుడు సాధించుకోలేకపోతే మరెప్పుడూ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు రాదన్నారు. శ్రీబాగ్ ఒడంబడికకు ప్రాణం పోసిన నేత వైఎస్ జగన్ 1953లో మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఆర్ కృష్ణ తెలిపారు. అయితే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక శ్రీబాగ్ ఒడంబడికను విస్మరించి కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్కు తరలించారన్నారు. 2014లో ఏపీ, తెలంగాణ విభజన సమయంలో మళ్లీ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరితే సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. అమరావతిపై ప్రేమతో రాజధానితోపాటు హైకోర్టును అక్కడే పెట్టేందుకు చర్యలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత మళ్లీ శ్రీబాగ్ ఒడంబడికకు ప్రాణం పోశారని.. అందులో భాగంగానే కర్నూలును న్యాయ రాజధానిని చేశారని కొనియాడారు. -
శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ మిలియన్ మార్చ్
సాక్షి, కర్నూలు: న్యాయ రాజధానికి మద్దతుగా రాయలసీమ జేఏసీ(నాన్ పొలిటికల్) ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన ఈ మిలియన్ మార్చిలో మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రాయలసీమ ఉద్యమకారులు పాల్గొన్నారు. కాగా సీమ ముఖద్వారం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. రాయలసీమ ఉద్యమకారులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు ఒక్కటై నినదిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించుకోలేమని ఉద్యమబాట పడుతున్నారు. రాయలసీమకు 70 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి న్యాయ రాజధానే సరైన పరిష్కారమని నమ్ముతున్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేయాల్సిందే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకొచ్చారు. రాజధానుల వికేంద్రీకరణలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టుతోపాటు న్యాయ సంబంధిత సంస్థలన్నింటీని స్థాపించి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వికేంద్రీకరణ నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కర్నూలులో తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. అలాగే వారం రోజుల క్రితం వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ‘న్యాయ’ గళాన్ని వినిపించారు. అక్టోబర్ 30వ తేదీన రాయలసీమ జేఏసీ(నాన్ పొలిటికల్) ఆధ్వర్యంలో 129 ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కర్నూలులో వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు జరిగాయి. ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోటా న్యాయ రాజధాని కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్పై సంపూర్ణ నమ్మకం మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ అమరావతికి జై కొట్టింది. దీంతో రాయలసీమ ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు అడ్డుపడుతున్న టీడీపీ నాయకులపై ఉద్యమకారులు ఆగ్రహంతో ఉన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 2014లో రాయలసీమలో రా జధాని ఏర్పాటు చేయాలని, లేదంటే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరితే చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. ప్రస్తుతం కర్నూలును న్యాయ రాజధాని చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రిపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, త్వరలోనే తమ ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావాన్ని రాయలసీమ వాసులు వ్యక్తం చేస్తున్నారు. -
‘సీమ’ గుండె చప్పుడిది
వికేంద్రీకరణకు మద్దతు దిశగా యావత్ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తోంది. మొన్న విశాఖ దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తే, ఇప్పుడు తిరుపతి జనసంద్రంగా మారి కదంతొక్కింది. రాయలసీమ గుండె చప్పుడు ప్రతిధ్వనించింది. పదులు.. వందలు కాదు.. వేలాది మంది ఆధ్యాత్మిక నగరిలో మూడు రాజధానులకు మద్దతుగా పెద్ద పెట్టున నినదించారు. మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు.. ఇలా ఒక్కరేంటి, అన్ని వర్గాల వారు రోడ్డుపైకి వచ్చి తమ ఆకాంక్షను బలంగా చాటారు. ‘సీఎం జగనన్న వికేంద్రీకరణ బాటలో నడుద్దాం.. న్యాయ రాజధాని సాధిద్దాం.. మన ఆత్మగౌరవం కాపాడుకుందాం.. స్వార్థ రాజకీయాలకు చరమగీతం పాడుదాం..’ అంటూ ప్రతినబూనారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఇటు రాయలసీమకు, అటు ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలి. అది ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు. రాయలసీమను రతనాల సీమగా మార్చే సత్తా సీఎం వైఎస్ జగన్కు మాత్రమే ఉంది. మనం కొంత కాలంగా పోగొట్టుకున్న దానిలో కొంతైనా తిరిగి ఇవ్వాలని కోరడం కోసమే ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన. ఇది రాయలసీమ గుండె చప్పుడు’ అని వికేంద్రీకరణను కాంక్షిస్తూ వేలాది మంది ప్రజలు నినదించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తిరుపతి నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులకు మద్దతుగా.. రాయలసీమ హక్కులు, కర్నూలులో న్యాయ రాజధాని సాధనే లక్ష్యంగా సాగిన ఈ మహా ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన గాంధీ రోడ్డు మీదుగా నాలుగు కాళ్ల మండపం, తిలక్ రోడ్డు, తిరుపతి మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. తిరుపతి నగరంలోని ప్రతి గడప నుంచి ప్రజలు తరలి వచ్చారు. స్థానికులు, మేధావులు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ కళాశాలల విద్యార్థులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల రాకతో నగరం జనసంద్రంగా మారింది. ప్ల కార్డులు చేతబట్టి.. ‘కర్నూలును న్యాయ రాజధాని చేయాలి’ అని కొందరు, జై జగన్ అంటూ మరి కొందరు.. పదండి ముందుకు మూడు రాజధానుల కోసం’ అంటూ ఇంకొందరు నినదిస్తూ ముందుకు సాగారు. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. దారి పొడవునా ప్రజలు మిద్దెలపై నుంచి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గాందీరోడ్డులో సాగుతున్న రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన తిరుపతి వేదికగా సీమ రాజధానికి విత్తనం తిరుపతి వేదికగా రాయలసీమ రాజధానికి విత్తనం నాటాం. మిగిలిన జిల్లాల వారూ నీరు పోస్తారు. తద్వారా రాజధాని మొక్క మహావృక్షమై కల సాకరమవుతుంది. సీఎం వైఎస్ జగన్ పాలన పట్ల, నిర్ణయం పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనేందుకు ఈ మహా ప్రదర్శనే నిదర్శనం. తిరుపతి చరిత్రలో మునుపెన్నడూ రానంతగా జనం ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడం సీఎం జగన్కే సాధ్యం అని సీమ ప్రజలు నమ్ముతున్నారు. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాష్ట్రానికి, రాయలసీమకు చేసింది శూన్యం. సీమ గడ్డమీద పుట్టిన చంద్రబాబు సీమకే ద్రోహం చేశారు. ఈ రోజు సీమ ప్రజలు నీరు తాగుతున్నారంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రజలంతా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానుల దిశగా ముందుకు వెళ్తున్నారు. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం లక్ష్యం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాయలసీమ మనోభావాలను గౌరవిస్తూ న్యాయ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దాన్ని వ్యతిరేకిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే ప్రాంతంలో అభివృద్ధి మొత్తం కేంద్రీకరించాలనుకోవటం దుర్మార్గం. లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రాంతంలో ఖర్చు చేసి, తన అనుయాయుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొమ్ముకాసే విధంగా రాయలసీమలోని పుట్టి పెరిగిన చంద్రబాబు వ్యవహరించటం శోచనీయం. దుష్టచతుష్టయం సహకారంతో రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటుతున్న చంద్రబాబుకు, ఆయన కోటరీకి ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన చెంపపెట్టు. మన పిల్లల ఉద్యోగ, ఉపాధి కోసం సీఎం జగన్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఐటీ కాన్సెప్ట్ సిటీని నిర్మించనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా 7 సెజ్లు నిర్మిస్తున్నారు. – మద్దెల గురుమూర్తి, తిరుపతి ఎంపీ సీమ ఆకాంక్షకు ఈ ప్రదర్శనే సాక్ష్యం రాయలసీమకు న్యాయ రాజధాని కావాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. అందుకు ఈ ఒక్క నగరంలో ఈ మహా ప్రదర్శనే సాక్ష్యం. అమరావతి యజమానుల వద్ద బానిసలుగా ఉన్న తిరుపతిలోని కొందరు రాయలసీమ ఆకాంక్షను గుర్తించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలియజెప్పాలి. ఇక్కడికి వచ్చిన ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. తిరుపతిలో శుక్రవారం సమావేశమైంది అఖిలపక్షం కాదు.. ఆ పేరుతో 2024లో పోటీ చేయనున్న మిత్రపక్షాలు. ఈ ప్రాంత వాసులై ఉండీ, ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా పావులు కదపడం సిగ్గుచేటు. ముసుగు తీసి బయటకు వచ్చి, మా అజెండా ఇదీ అని చెప్పుకునే ధైర్యం లేని మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 85 ఏళ్ల క్రితం రాయలసీమకు కృష్ణా, గోదావరి జలాల్లో అధిక వాటా ఇస్తామని చెప్పి, ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు. రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. రాయలసీమ ప్రజల గొంతు ఎండిపోకుండా ఉండేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. – శైలుకుమార్, మానవ వికాస వేదిక కన్వీనర్ -
మూడు రాజధానుల కోసం .. తిరుపతి గర్జన
-
రాయలసీమ ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని కోరుతూ..
-
MV Ramana Reddy: మనకాలం వీరుడు ఎమ్వీఆర్
2001వ సంవత్సరం. అమీర్ పేటలో ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసు. ఉదయం పది గంటలకి ఎం.వి. రమణారెడ్డి ఫోన్ చేశారు. ‘హైద రాబాద్ బస్టాండ్లో వున్నా. అర గంటలో మీ ఆఫీసుకి వస్తాను’ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెన్రీ షారియర్ నవల ‘పాపిలాన్’ని ఆయన అనువ దించారు. కవర్ పేజీ బొమ్మ కోసం వస్తున్నారు. ఆయన చాలా రోజుల ముందే చెప్పినా మోహన్ బొమ్మ వేయలేదు. తాపీగా ఒక ఎ4 సైజ్ బాండ్ పేపర్ తీసుకుని, రెక్కలతో ఒక మనిషి ఎగురుతున్న ఒక చిన్న బొమ్మ వేశాడు. దాన్ని స్కాన్ చేసి, పచ్చని అడివి వున్న ఒక బ్రోషర్ తీసి ఇచ్చి, దాన్ని బ్యాక్ గ్రౌండ్గా వాడమని కంప్యూటర్ ఆపరేటర్కి చెప్పాడు. ఆ పని అయ్యేలోగా ‘రెక్కలు సాచిన పంజరం – ఎం.వి. రమణారెడ్డి’ అని అక్షరాలు రాసిచ్చాడు. కవర్ పేజీ పైన అడివి, కింద సముద్రం అలలు, మధ్యలో ఎగిరే స్వేచ్ఛాజీవి– 20 నిమిషాల్లోనే రెడీ అయింది అందమైన కవర్ డిజైన్. ఎమ్వీఆర్ వచ్చారు. హాయిగా నవ్వి ‘బాగుంది’ అన్నారు. నాకు ఒకటే ఆశ్చర్యం. ప్రొద్దుటూరు ఫ్యాక్షనిస్టూ, హత్య కేసులో జైలుకెళ్లిన మనిషీ, వైద్యం చేసే డాక్టరూ, ఉద్యమాలూ నడిపి, నిరాహార దీక్షలు చేసి, ఎమ్మెల్యేగా గెలిచి రాయలసీమ కోసం గొంతెత్తినవాడూ, పుస్తకాలు రాసినవాడూ ఈయనేనా? సౌమ్యంగా, వినమ్రంగా, సంస్కారవంతంగా, స్నేహశీలిగా ఉన్న ఈ నిరాడంబరమైన బక్కపలచని మానవుడేనా? ఎమ్వీఆర్గా ప్రసిద్ధుడైన మల్లెల వెంకట రమణా రెడ్డి తెలుగు సాహిత్యానికి కొన్ని అరుదైన కానుకలు ప్రసాదించిన ప్రతిభామూర్తి. విప్లవ కారుడూ, తిరుగుబాటుదారుడూ అయిన ఎమ్వీఆర్ మహాభారతాన్ని లోతుగా అధ్యయనం చేసినవాడు. ‘గుడిపాటి వెంకటచలం వచనం నాకిష్టం. ఆ ప్రభావం నా మీద వుంది’ అని ప్రకటించినవాడు. ఎంత విస్తృ తంగా చదువుకున్నాడో ఆయన రచనల్లోని వైవిధ్యమే మనకి చెబుతుంది. మార్గరెట్ మిషెల్ ‘గాన్ విత్ ది విండ్’, గోర్కీ ‘అమ్మ’, ఆర్కె నారాయణ్ ‘పెద్దపులి ఆత్మకథ’, ‘మాటకారి’ నవలలు తేట తెలుగులోకి అనువదించారు ఎమ్వీఆర్. ‘ఆయుధం పట్టని యోధుడు’ టైటిల్తో మార్టిన్ లూథర్ కింగ్ జీవిత చరిత్ర రాశారు. భారతంలో ద్రౌపది ప్రాధా న్యాన్నీ, విశిష్టతనీ తెలియజెప్పే ‘తెలుగింటికొచ్చిన ద్రౌపది’ ఒక అరుదైన రచన. ఎమ్వీఆర్ రాసిన ‘రాయల సీమ కన్నీటి గాథ’ ప్రజాదరణ పొందిన ఒక సీరియస్ డాక్యుమెంట్. జీవిత చరమాంకంలో రాసిన ‘తెలుగింటి వ్యాకరణం’ ఒక అసాధారణమైన రచన. ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ అని ఏకంగా నాలుగు సంపుటాలు రాసిన మన హెచ్.జి. వెల్స్ ఎమ్వీ రమణారెడ్డి. నవ చైనా సామాజిక జీవితం గురించి ఒక బ్రిటిష్ డాక్టర్ రాసిన పుస్తకాన్ని ‘పురోగమనం’ పేరుతో అనువదించారు. ఎనిమిది ఉత్తమ తెలుగు చిత్రాలకు ఆయన రాసిన సమీక్షలు ఎప్పటికీ మరిచిపోలేనివి. ‘తెలుగు సినిమా స్వర్ణయుగం’లో మల్లీశ్వరి, జయభేరి, దొంగరాముడు, దేవదాసు, బంగారు పాప, పాతాళ భైరవి, మాయాబజార్, విప్రనారాయణలను ఆయన సమీక్షించిన తీరు పాఠకుల్ని పరవశుల్ని చేస్తుంది. అవి డాక్టోరల్ థీసిస్కు ధీటైన పరిశోధన చేసి రాసినవని ముళ్ళపూడి వెంకట రమణ కితాబిచ్చారు. (క్లిక్: కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎందుకు రాశారు!?) ఎమ్వీ రమణారెడ్డి అనే పదహా రణాల ప్రజల మనిషి, అక్షరాలా ఉత్తమ సాహితీవేత్త మన సాహిత్యానికి చేసిన కంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. కడప జిల్లా ప్రొద్దుటూరు అంటే ఆనాడు ‘శివతాండవం’ చేసిన పుట్టపర్తి నారాయణాచార్యులవారు, ప్రొద్దుటూరు అంటే తెలుగు సాహితీ పతాకాన్ని నీలాకాశం చేసి ఎగరేసిన ఎమ్వీ రమణారెడ్డి... అనే మనకాలం వీరుడు. ఉద్యమం, అధ్యయనం, ఆదర్శం కలిసి ప్రవహిస్తే... అదే ఉజ్వలమైన, ఉత్తేజకరమైన ఎమ్వీఆర్ జీవితం. (క్లిక్: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) - తాడి ప్రకాష్ సీనియర్ జర్నలిస్ట్ (సెప్టెంబర్ 30న ప్రొద్దుటూరులో ఎమ్వీఆర్ విగ్రహ ఆవిష్కరణ) -
కరువు ప్రాంతాల్లో అనుసంధానం
-
ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వానలు కురవనున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, అక్కడక్కడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమూ ఉందని పేర్కొంది. -
Papaya Fruits Packing: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!
గుర్రంకొండ: అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయిని ప్రత్యేక పద్ధతుల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి లోడింగ్ అన్నిటికంటే భిన్నంగా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇందుకోసం కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలివైపు ప్యాకింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.18 వరకు పలుకుతోంది. దీంతో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయి కాయలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఇక్కడే మకాం సాధారణంగా పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు జులై నెలలో ఇక్కడికి చేరుకొంటారు. ముఖ్యంగా మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మకాం వేస్తుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ నెల వరకు ఇక్కడే ఉండి బొప్పాయి కొనుగోలు చేసి ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏజెంట్లను నియమించుకొని బొప్పాయి సాగు చేసిన రైతుల వివరాలు సేకరించి తోటలవద్దకు వెళ్లి వారే నేరుగా రైతుల వద్ద నుంచి కాయల్ని కొనుగోలు చేస్తారు. లోడింగ్ కూలీల ప్రత్యేకత కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాలకు చెందిన కూలీలు ఈ తరహా కటింగ్, లోడింగ్ కోసం వస్తుంటారు. బొప్పాయి తోటల్లో వెళ్లే కూలీలు ఎగుమతికి పనికొచ్చే కాయలను చెట్టునుంచి కింద పడకుండా కిందికి దించుతారు. ఆ తరువాత ప్రతి కాయను పేపర్తో చుడతారు. లారీలోకి బొప్పాయి కాయల్ని లోడ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. లారీ లోపల, కింద భాగంలో నాలుగువైపులా ఎండుగడ్డిని ఏర్పాటు చేస్తారు. పేపర్ చుట్టిన కాయల్ని లారీల్లో లోడ్ చేసి మళ్లీపైన కూడా ఎండుగడ్డిని ఎక్కువగా వేసి లోడ్ చేయడం వీరి ప్రత్యేకత. వందలాది మంది కూలీలు బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతుండడం గమనార్హం. ఢిల్లీ కటింగ్కు ప్రత్యేకం సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. ఢిల్లీ కటింగ్కు మాత్రం ఎంతో తేడా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న బొప్పాయి సన్నని సూది లావు అంత లేత పసుపు రంగు వర్ణం రాగానే వాటితో పాటు వాటిపైనున్న రెండు కాయల్ని కోత కోస్తారు. ఇందుకోసం అనుభవం కలిగిన కోత కూలీలను ఏర్పాటు చేసుకొంటారు. లోడింగ్ చేసేందుకు అనుభవం ఉన్న బయట ప్రాంతాల హమాలీలను తీసుకొస్తుంటారు. ఢిల్లీ కంటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరి మరీ కోస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయడం కూలీల ప్రత్యేకత. బొప్పాయికి భలే డిమాండ్ బయట రాష్ట్రాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గతంలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.18 వరకు ధర పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. (క్లిక్: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్) తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముందుగా తమను సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. – సుధాకర్రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె మూడు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ. 18 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీఖర్చు, మార్కెట్కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. – రామయ్య, బొప్పాయి రైతు, కొత్తపల్లె -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనించింది. ఆదివారం రాత్రికి జార్ఖండ్ వైపుగా వెళ్లి జంషెడ్పూర్కు 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం వరకు ఈ వాయుగుండం అదే దిశలో కదులుతూ.. అదే తీవ్రతను కొనసాగిస్తుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం జార్ఖండ్ వైపు మళ్లడంతో దాని ప్రభావం రాష్ట్రం పైన, ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తగ్గిందని తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. -
Rain Forecast: రాయలసీమలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో 13 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. జూపాడు బంగ్లా మండలంలో 11.5, అన్నమయ్య జిల్లా బీరొంగి కొత్తకోట మండలంలో 10.6, అనంతపురం జిల్లా డి.హీరేలాల్ మండలంలో 10.4, విడపనకల్ మండలంలో 10.2, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో 8.8, కర్నూలు అర్బన్, అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో 8.3, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 7.4, అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 3 రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
సాక్షిప్రతినిధి కర్నూలు: రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రకటించాయి. వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి తనయుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ తరఫున భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి బరిలో నిలవనున్నారు. వామపక్షపార్టీలు శనివారం తమ అభ్యర్థిని ప్రకటించనున్నాయి. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు పోటీ చేయనున్నారు. వీరంతా ఇప్పటికే మూడు జిల్లాలలోని ఎమ్మెల్యేలు, కీలక నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. ప్రత్యేక సమావేశాలు రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్రెడ్డి కొనసాగుతున్నారు. 2023 మార్చికి ఈయన పదవీకాలం ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఆపై ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన రాజకీయపార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన వారితో పాటు బరిలో నిలవాలనుకుంటున్న స్వతంత్రులు కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలలో జోరుగా తిరుగుతున్నారు. ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర ఉద్యోగులతో కూడా యూనియన్ల వారీగా, శాఖల వారీగా కలిసి మద్దతు కోరుతున్నారు. నామమాత్రపు పోటీ టీడీపీ తరఫున బరిలో దిగుతున్న రామగోపాల్రెడ్డి పులివెందుల నియోజకవర్గవాసి. ద్వితీయశ్రేణి నాయకుడు కావడంతో మూడు జిల్లాల్లో ఎవ్వరికీ పరిచయం లేదు. పైగా మూడు జిల్లాలలోని 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వైఎస్సార్ జిల్లాతో పాటు కర్నూలులోనూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు. కేవలం హిందూపురం, ఉరవకొండలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా ఉంటుంది. టీడీపీ తరఫున బరిలో ఉన్నా పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని, వైఎస్సార్సీపీ అభ్యర్థికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీలో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు సీపీఐ తరఫున వైఎస్సార్ జిల్లా నుంచి ఈశ్వరయ్య బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా ఈయన పోటీ చేసి ఓడిపోయారు. ఈ దఫా కూడా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. అలాగే సీపీఎం తరఫున అనంతపురం నుంచి రాంభూపాల్రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న సీపీఎం దీనిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది. గత ఎన్నికల్లో సీపీఎం తరఫున గేయానంద్ పోటీ చేశారు. అనారోగ్య కారణాలతో ఈయన ఈ దఫా బరిలో ఉండటం లేదు. ఈ క్రమంలోనే రాంభూపాల్ను బరిలోకి దింపేయోచనలో ఆపార్టీ ఉంది. ముఖ్య నేతలతో మంతనాలు రవీంద్రారెడ్డితో పాటు రామగోపాల్రెడ్డి ఇప్పటికే రాయలసీమలోని ముఖ్య నేతలను కలిశారు. మూడు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలను రవీంద్రారెడ్డి స్వయంగా కలిసి మద్దతు కోరారు. ఉపాధ్యాయులు, ఎన్జీవో సంఘాలతో కూడా రవి కలిశారు. వీరంతా రవికి సానుకూలంగా స్పందించారు. అలాగే రామగోపాల్రెడ్డి టీడీపీ ఇన్చార్జ్లను కలిశారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాగోలేదని, పోటీ వద్దన్నా పార్టీ వినలేదని, పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీకి దూరంగా ఉంటే గౌరవంగా ఉంటుందని వైఎస్సార్ జిల్లాలోని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు రామగోపాల్రెడ్డితోనే అన్నారు. దీన్నిబట్టే టీడీపీ నేతలు ఈ ఎన్నికల్లో ఏమేరకు పనిచేస్తారు? ఎలాంటి ప్రభావం ఉండబోతోందనేది ఇట్టే తెలుస్తోంది. గెలుపు నల్లేరుమీద నడకే! వెన్నపూస రవీంద్రారెడ్డి, రామగోపాల్రెడ్డి వైఎస్సార్సీపీ, టీడీపీ తరఫున బరిలో నిలవనున్నారు. అలాగే అనంతపురం జిల్లా నుంచి పోతుల నాగరాజు, బోరంపల్లి ఆంజనేయులు, వైఎస్సార్ జిల్లా నుంచి బ్లడ్ టూ లివ్ వ్యవస్థాపకుడు పట్టుపోగుల పవన్కుమార్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వెన్నపూస రవీంద్రారెడ్డి అనంతపురం జిల్లా వాసి కాగా, భూమిరెడ్డి వైఎస్సార్ జిల్లాకు చెందిన వారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కావడం వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రధాన బలంగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆపై జరిగిన స్థానిక, పుర పోరులో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ప్రజల్లో ఆపార్టీకి ఉన్న ఆదరణతో అలాంటి ఫలితాలు వచ్చాయి. పైగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి చరిత్రలో ఎన్నడూ లేనవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించింది. వేలాదిమంది పట్టభద్రులు ప్రభుత్వ కొలువులు సాధించి, జీవితాల్లో స్థిరపడ్డారు. ప్రొబిషన్ పూర్తయిన ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. మూడు జిల్లాలలో 30 వేలమంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వానికి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. వెన్నపూస రవీంద్రారెడ్డి తండ్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉద్యోగుల కోసం సుదీర్ఘంగా పోరాడిన వ్యక్తి. రాయలసీమలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రవీంద్రారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం నల్లేరుమీద నడకే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెరగనున్న ఓటర్ల సంఖ్య గత ఎన్నికల్లో పట్టభద్రుల కోటాలో 2.53 లక్షలమంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఓటు హక్కు, నమోదుపై పట్టభద్రుల్లో మరింత చైతన్యం పెరగడమే ఇందుకు కారణం. మూడు జిల్లాల్లో 90 వేలకు తక్కువ లేకుండా కొత్త ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. -
జైహింద్ స్పెషల్: వలస పాలన సీమ గర్జన
1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటంతో ఈస్టిండియా కంపెనీ పాలన పోయి భారతదేశం నేరుగా బ్రిటీషు రాణి ఏలుబడిలోకి వచ్చింది. తర్వాత 28 సంవత్సరాలకు బ్రిటీషు పాలనను విభేదించే ఉద్దేశ్యంతో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. 1885 డిసెంబరు 28న అప్పటి బొంబాయిలో జరిగిన తొలి సమావేశంలో దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహిస్తూ 72 మంది సభ్యులు పాల్గొన్నారు. అలా పాల్గొన్న వారిలో అనంతపురం జిల్లా నుంచి పట్టు కేశవ పిళ్లై ఒకరు. 1860 అక్టోబరు 8న జన్మించిన కేశవ పిళ్లై గుత్తి మునిసిపాలిటి సభ్యుడుగా ఎంపికయి, తర్వాత మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కూడా అయ్యారు.ఆయన తన 22 సంవత్సరాల వయసు నుంచి ‘ది హిందూ’ పత్రికకు గుత్తి నుంచి విలేఖరిగా పనిచేసి గుత్తి కేశవ పిళ్లై పేరుగాంచారు. జపాన్కు బళ్లారి విద్యార్థి 1891లో నాగపూర్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షులుగా ఎన్నికయిన తిరుపతికి చెందిన పనబాకం ఆనందాచార్యులు 1906 కలకత్తా సమావేశంలో స్వదేశీ తీర్మానం ప్రవేశపెట్టారు. మదనపల్లె వాస్తవ్యులు ఆదిశేషాచలం నాయుడు పూనాలో గోపాల కృష్ణ గోఖలే ప్రారంభించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులయ్యారు. వీరే 1907లో సూరత్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో ఆహ్వానితులుగా పాల్గొన్నారు. స్వదేశీ ఉద్యమం, వందేమాతరం ఉద్యమం ఉద్ధృతంగా జరిగినపుడు విదేశీ వస్త్రాలు బహిష్కరిస్తూ ఎన్నో సభలు రాయలసీమ ప్రాంతంలో జరిగాయి. నిజానికి అప్పట్లో రాయలసీమ అనే పేరు లేదు. స్థానిక ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేకమైన అంగళ్లు జమ్మలమడుగులో మొదలయ్యాయి. దేశవాళీ మగ్గాలు మెరుగుపడటానికి జపాన్ తోడ్పాటు తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. గాజు, గడియారాల తయారీ గురించి నేర్చుకోవడానికి బళ్లారి చెందిన విద్యార్థి శ్యాంజీ రావును జపాన్ పంపారు. దీనికి చాలామంది వ్యక్తులతోపాటు మద్రాసు నేషనల్ ఫండ్ అండ్ ఇండస్టియ్రల్ అసోసియేషన్ కూడా ఎంతో ఆర్థిక సాయం చేసింది. డయ్యర్కు గాడిచర్ల ‘బులెట్’ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చినప్పుడు, ఆయన ప్రసంగాన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు తెలుగులోకి అనువదించారు. వీరే రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారనే కారణం మీద బహిష్కరణకు గురైన తొలి విద్యార్థి అయ్యారు. స్వదేశీ ఉద్యమ లక్ష్యాల వ్యాప్తి కోసం తాలూకా స్థాయిలో అసోసియేషన్లు కర్నూలు, ప్రొద్దుటూరు, కడప, వాయల్పాడు, మదనపల్లె వంటి చోట్ల ఏర్పడి వార్తా పత్రికలు చదువుకునే వీలుకల్పించాయి. అనిబిసెంట్ తను మద్రాసులో ప్రారంభించిన దివ్యజ్ఞాన సమాజం ద్వారా 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఇందులో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన గాడిచర్ల 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ నిర్వహించిన అమానుష ఘాతుకాన్ని ఖండిస్తూ తన వారపత్రిక ‘ది నేషనలిస్టు’లో ‘ది కల్ట్ ది బుల్లెట్’ అనే గొప్ప వ్యాసం రాశారు. ముల్తాన్ జైలుకు శేషయ్య చెట్టి దండి సత్యాగ్రహం సమయంలో ఢిల్లీలో వైస్రాయ్ నివాసం ముందు సత్యాగ్రహం చేసిన కర్నూలు వ్యక్తి శేషయ్య చెట్టిని అరెస్టు చేసి (ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న) ముల్తాన్ జైలుకు పంపారు. అదే కాలంలో ఉప్పునీటి బావుల దగ్గర ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరిస్తూ రాయలసీమ ప్రాంతంలో నిరసన ప్రయత్నాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో చౌడు భూముల్లో ఉప్పు తయారు చేసి, ఆ ఉప్పును వేలం వేసేవారు. పాకాల, తిరుపతి వంటి చోట్ల ఉప్పు తయారుచేయడానికి శిక్షణా తరగతులు నిర్వహించారు. 1930లో గుజరాత్ లోని దర్శన్ డిపో మీద దాడి చేసిన వారిలో అనంతపురం జిల్లా వాసి అయిన వాలంటీర్ కూడా ఉన్నారు. గాంధీజీ అనంతపురం జిల్లా పర్యటనకు అప్పటి జిల్లా కలెక్టర్ గెల్లిట్టి సతీసమేతంగా సరిహద్దు దాకా వెళ్లి ఆహ్వానించడమే కాక లాంఛనంగా ఒక రూపాయి విరాళం ఇవ్వడం చాలా పెద్ద విశేషం! ఇలాంటి ఎన్నో సంగతులు కె. మద్దయ్య రచించిన ‘ఫ్రీడమ్ మూవ్ మెంట్ ఇన్ రాయలసీమ’ పుస్తకంలో కనబడతాయి. పికెట్లు, టికెట్లెస్ ట్రావెళ్లు 1938లో మదనపల్లిలో జరిగిన ‘రాజకీయ ఆర్థిక పాఠశాల’.. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడికి వ్యతిరేకంగా సామ్యవాదపు ఆలోచనలు విస్తరించడానికి దోహదపడింది. ఇలాంటి పాఠశాలల్ని కర్నూలు ప్రాంతంలో కాల్వబుగ్గ, ఇంకా అనంతపురం జిల్లాలో హిందూపురం వద్ద కూడా నిర్వహించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో లాయర్లు, విద్యార్థులు పికెటింగ్ భారీ ఎత్తున చేశారు. టికెట్లెస్ ట్రావెల్.. రైళ్లలో ఆ కాలంలోనే మొదలైంది. నగరి ఆర్డినెన్స్ కేసు, అనంతపురం ఆర్ట్స్ కళాశాల కెమిస్ట్రీ ల్యాబ్ తగులబట్టడం, గగన్ మహల్ ధ్వంసం వంటి సంఘటనలు కూడా జరిగాయి. అలాగే గాంధీ – జిన్నాల మధ్య చర్యలు విజయవంతం కావాలని మదనపల్లెలో రంజాన్ 27వ రోజున మసీదులలో ప్రార్థనలు జరిగాయి. ఇలా భారత స్వాతంత్య్ర పోరాటంలో రాయలసీమ ప్రాంతపు వ్యక్తులు, సంస్థలు పోరాడి వేకువ చుక్కలుగా స్ఫూర్తినిచ్చారు, చైతన్యం నింపారు! – డా. నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
Andhra Premier League: ఏపీఎల్లో ఆడే ఆరు జట్ల పేర్లు తెలుసా?
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ పోటీల ఫ్రాంచైజీ లోగోలను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పోటీలు జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖలో జరుగుతాయి. పోటీలకు ఆరు ఫ్రాంచైజీలను ఎంపిక చేశారు. ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీఎల్కు శ్రీరాం గ్రూప్ స్పాన్సరర్గా వ్యవహరిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగస్వామ్యం అవుతున్న ఆరు ఫ్రాంచైజీ జట్ల అధినేతలు లోగోలను ఆవిష్కరించారు. క్రికెటర్ల వేలం ఈనెల 24న వైఎస్సార్ స్టేడియంలో జరుగుతుందని ఏసీఏ సీఈవో శివారెడ్డి తెలిపారు. ఏసీఏ కోశాధికారి ఎస్ఆర్ గోపీనాధరెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, సభ్యుడు ఆర్వీసీహెచ్ ప్రసాద్, ఆరు ఫ్రాంచైజీల అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎల్లో ఆరు జట్లు ఇవే! ►ఉత్తరాంధ్ర లయన్స్ ►రాయలసీమ కింగ్స్ ►గోదావరి టైటాన్స్ ►కోస్టల్ రైడర్స్ ►బెజవాడ టైగర్స్ ►వైజాగ్ వారియర్స్ చదవండి: Rishabh Pant: నేనైతే పంత్ కెప్టెన్ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని! ధోని ఏమో అలా.. కోహ్లి ఇలా! -
ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్న్యూస్.. రెండు, మూడు రోజుల్లో..
సాక్షి, అమరావతి: రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, తర్వాత నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కోస్తా జిల్లాల్లో మాత్రం పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగుతోంది. చదవండి: AP: అందరి చూపు మనవైపే.. దేశంతోనే పోటీ పడుతున్నాం.. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నా, ఎక్కువ ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిలా ఉండగా మంగళవారం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 41 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంటలో 34, అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయిలో 22.5, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం మంగోలులో 21, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో 13.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కొండాయిగూడెంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
SPL 2022: ఆద్యంతం ఉత్కంఠభరితం..
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్(ఎస్పీఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు స్థానిక కేఎల్ యూనివర్సిటీలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర, రాయలసీమ సీనియర్, జూనియర్ పురుషుల జట్లు ఈ చాంపియన్షిప్ కు ప్రాతినిధ్యం వహించాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఆరు జట్లు ఈ టోర్నీలో హోరాహోరీగా తలపడ్డాయి. సీనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు జట్టు రెండు ప్రత్యర్థి జట్ల చేతిలో ఓడి వెనుకంజ వేయగా, జూనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర జట్లు చెరో రెండేసి పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. ఈ మ్యాచ్లను సాక్షి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ అప్పన్న పర్యవేక్షించారు. సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ విజయకేతనం జూనియర్స్ విభాగం తొలి మ్యాచ్లో ఉత్తరాంధ్ర(సాయిగణపతి పాలి టెక్నిక్ కాలేజీ, విశాఖపట్నం) జట్టుపై, మధ్య ఆంధ్ర(సీఆర్ రెడ్డి పాలి టెక్నిక్ కాలేజీ, ఏలూరు) జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి రెండు పాయింట్లను సాధించింది. టాస్ గెలిచిన మధ్య ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 58 పరుగులు మాత్రమే చేసింది. బ్యాట్స్మెన్లు మధుసూదన్ 12, అవినాష్ 11 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు 8.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి 60 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్మెన్లు సంజయ్ 19 రన్స్ చేయగా సాయిచరణ్, సాయిశశికుమార్ చెరో 15 రన్స్ చేసి జట్టు విజయానికి దోహదపడ్డారు. 19 రన్స్ చేసి, ఒక వికెట్ తీసిన సంజయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో ఎంజీవీఆర్ కాలేజీ గెలుపు సీనియర్స్ విభాగం తొలి మ్యాచ్లో ఉత్తరాంధ్ర(ఎంజీవీఆర్ కాలేజీ, విజయనగరం), మధ్య ఆంధ్ర(నారాయ ణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూ రు) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 57 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు తవ్సీఫ్, వెంకటేశ్లు తొలి నాలుగు ఓవర్లు నిలకడగా ఆడి 28 పరుగులు చేశారు. అయితే ఆ తరువాత ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో మధ్య ఆంధ్ర జట్టు తక్కువ స్కోర్ను సాధించింది. ఉత్తరాంధ్ర బౌలర్లు రవికిరణ్, సంతోష్ చెరో రెండు కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు కేవలం 7.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్లు రవికిరణ్ 18, సాయిప్రణీత్ 10 పరుగులతో రాణించి జట్టు విజయానికి దోహదపడ్డారు. రెండు వికెట్లు తీసి, 18 రన్స్ చేసిన ఉత్తరాంధ్ర బ్యాట్స్మెన్ రవికిరణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉత్తరాంధ్ర జట్టు రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. తిరుపతి సీకామ్ డిగ్రీ కాలేజీ విజయదుందుభి సీనియర్స్ విభాగంలోనే మరో మ్యాచ్లో మధ్య ఆంధ్ర(నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూరు) జట్టును ఓడించిన రాయలసీమ(సీకామ్ డిగ్రీ కాలేజీ, తిరుపతి) జట్టు రెండు పాయింట్లను సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయలసీమ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 98 పరుగులు సాధించింది. బ్యాట్స్మెన్లు అఖిబ్ 20, ఫయాజ్అలీ 17, మనోజ్ 13, డి.సాయి12 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 63 పరుగులు మాత్రమే చేసింది. 13 రన్స్, ఒక వికెట్ తీసిన రాయలసీమ జట్టు ఆల్రౌండర్ మనోజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజీ విజయం జూనియర్స్ విభాగంలోనే రెండో మ్యాచ్లో రాయలసీమ(ఎస్ఎస్బీఎన్ జూనియర్ కాలేజీ, అనంతపురం), ఉత్తరాంధ్ర(సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజీ, విశాఖపట్నం) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయలసీమ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 70 పరుగులు చేసింది. బ్యాట్స్మెన్లు విఘ్నేష్ 26, ప్రశాంత్ 20 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు 9.3వ ఓవర్ వద్ద ఐదు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్మెన్లు నూకేష్ 22, అవినాష్ 19 పరుగులతో రాణించారు. ఆరు పరుగులు, రెండు వికెట్లు తీసిన బి.కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉత్తరాంధ్ర జట్టు రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. నేడు విజేతలకు ట్రోఫీల ప్రదానం సీనియర్స్ విభాగంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జట్లు బుధవారం తలపడతాయి. జూనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్ర, రాయలసీమ జట్లు తలపడతాయి. పోటీల అనంతరం సాయంత్రం జరిగే బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేస్తారు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్లో బెంగళూరు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆయనే ఒక చరిత్ర
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఎంవీ రమణారెడ్డి (ఎంవీఆర్) పేరు వింటున్నాను. మా ఊరు ప్రొద్దుటూరుకు పక్కనే ఉండటంతో రమణారెడ్డి గురించి ప్రచారమయ్యే ప్రతి విషయం నాకూ తెలిసేది. ప్రొద్దుటూరులోని షావుకార్లకు, మిల్లుల యజమానులు ఆయనంటే భయపడేవారు. బీదలకు, కార్మికులకైతే ఆయన దేవుడు. రాయలసీమ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. దాన్ని కష్టాల నుంచి విమోచనం చేయడానికి ఉద్యమించాడు. ముల్కీ ఉద్యమం 1968లో మర్రి చెన్నారెడ్డి వల్ల తెలంగాణా ఏర్పాటు ఉద్యమంగా ఊపందుకున్నప్పుడు, దాన్ని పలుచన చేసేందుకు అప్పటి కాంగ్రెస్ నేతలు ప్రొద్దుటూరులో ‘రాయలసీమ మహాసభలు’ నిర్వహిం చారు. ఆనాటి సభల్లోనే యువకుడైన ఎంవీఆర్ మైకును స్వాధీనం చేసుకొని– ‘రాయలసీమ అభివృద్ధి కోసం నిర్దిష్ట ప్రతిపాదనలతో పదవులను వదులుకొని ఉద్యమం చేయగలరా?’ అంటూ పెద్దలను ప్రశ్నించాడు. ఆ పెద్దల నోట మాటలేదు. 1983లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో ఉన్నా, ఆయన పదవులకోసం తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ‘తెలుగు గంగ’ ప్రాజెక్టు రాయలసీమ నేలకు చుక్క నీరివ్వదని తెలుసుకున్న వెంటనే ఎన్టీఆర్ను ప్రశ్నించాడు. ఆ తర్వాత ఎదిరించాడు. ‘రాయలసీమ విమోచన సమితిని’ స్థాపించి రాయలసీమ కోసం నాలుగు జిల్లాలూ తిరుగుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు. వంచనతో ఆ దీక్షను ముఖ్యమంత్రి వివరమింపజేయడంతో, తెలుగుదేశం పార్టీని వీడి ‘రాయలసీమ విమోచన సంస్థ ’ అభ్యర్థిగా 1985 శాసనసభ ఎన్నికల్లో పోటీచేశాడు. ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఓడిపోవడానికి, ప్రజాభిమానం లేని నాయకుడు గెలవడానికి ఈ ప్రజాస్వామ్యంలో ఎంత అవకాశం వుందో చూపడానికి 1985 ఎన్నికల నాటి ప్రొద్దుటూరు ఎన్నిక ఒక కొండగుర్తు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా, ఆ తరువాత ఆయన గానీ, ఆయన భార్య గానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ప్రతి ఎన్నికలో 25 వేల ఓటు బ్యాంక్ తనకుందని నిరూపించుకున్నారు. ఓడిపోయాక కూడా ఆయన రాయలసీమపై తనకున్న ప్రేమను చంపుకోలేదు. రాయలసీమ అభివృద్ధి కోసం ఏ పార్టీలు, ఏ ప్రజాసంఘాలు ఉద్యమించినా తను ప్రోత్సహించేవాడు. చిన్నాపెద్ద చూడకుండా ఆ నిరసనలలో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైనప్పడు... ఆంధ్ర, రాయలసీమల్లో జరిగిన ‘సమైక్యాంధ్ర’ ఉద్యమాన్ని ఆయన వ్యతిరేకించాడు. దాన్ని నడిపిస్తున్న శక్తులెవరో, రాయలసీమకు మరెంతగా అన్యాయం జరుగుతుందో వివరించాడు. (చదవండి: గ్రహణం పట్టిన భాస్కరుడు) రాజధాని కర్నూలు కావాలనీ, గుంతకల్లు రైల్వేజోన్ చేయాలనీ ప్రజాసంఘాలు చేసిన నిరసనల వెనుక వెన్నుదన్నుగా ఉండటమే కాకుండా, ఆరోగ్యం సహకరించకపోయినా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపన, రైల్వే డబ్లింగ్ పనులు వంటి ఒకటి రెండు మినహా, ఎంవీ రమణారెడ్డి ఎప్పుడో గుర్తించిన రాయలసీమ సమస్యలు దాదాపు అన్నీ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రాజెక్టులు కొన్ని పూర్తయినా నీటి కేటాయింపులు లేవు. (చదవండి: ఒక తరపు పోరాట గాథ) తొలినాళ్ళలో తీవ్రవాద మావోయిస్టు – లెనినిస్టు పార్టీతో ఎంవీఆర్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత కాలంలో మార్టిన్ లూథర్ కింగ్ అహింసా పోరాటాన్ని ‘ఆయుధం పట్టని యోధుడు’ పేరుతో మనకందించడం చూస్తే ఆయనలో వచ్చిన సైద్ధాంతిక మార్పు తెలుస్తుంది. రాయలసీమ కన్నీటిగాథపై ఆయన రాజేసిపోయిన నిప్పు ఆయన లేకపోయినా రాజుకుంటూనే ఉంటుంది. - పాలగిరి విశ్వప్రసాద్ వ్యాసకర్త కథా రచయిత (ఏప్రిల్ 4న ఎంవీ రమణారెడ్డి జయంతి) -
సీమవాసుల గోడు వినరా?
ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల ఏర్పాటుకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతుండటంతో ఇక రాయలసీమకు న్యాయం జరగదా అనే అనుమానం సీమవాసుల్లో నెలకొంటున్నది. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రాయలసీమ ప్రత్యేక ఉద్యమం మాటా తరచుగా వినిపిస్తోంది. ఉన్న తెలుగు జాతి ఐక్యంగా సాగేందుకు అనువైన పరిస్థితులను, నమ్మకాన్ని కేవలం ప్రభుత్వమే కాక కొన్ని జిల్లాల కోస్తాంధ్ర సోదరులూ కలిగించాలి. ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సమగ్రంగా, వెనుకబడిన ప్రాంతానికి ప్రయోజనాలు కలిగే విధంగా కొత్త వికేంద్రీకరణ బిల్లును తక్షణమే అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలి. వాటితోపాటు ఇతర రాయలసీమ అభివృద్ధి అంశాలపై కూడా అసెంబ్లీ సాక్షిగా విధాన నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఉప ప్రాంతాలలో మూడు పాలనా వ్యవస్థలు (శాసనసభ, సచివాలయం, న్యాయస్థానం) ఉండేలా తక్షణమే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. ఒక ప్రాంతంలో ఒక ప్రధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తే అనుబంధంగా ఇతర వ్యవస్థలుండాలి. రాయలసీమలో రాజధాని కావాలనే ప్రజల ఆకాంక్షలను కాదని హైకోర్టు ఏర్పాటే అంతిమ ఉద్దేశం అయితే... కర్నూలులో హైకోర్టుతో పాటు సీమలోని వివిధ కేంద్రాలలో ఒక మినీ సెక్రటేరియట్, ఒక సెక్షన్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేలా కొత్త వికేంద్రీకరణ చట్టంలో పేర్కొనాలి. కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలో అనుమతించిన ప్రాజెక్టులుగా విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ తదితర కరువుపీడిత ప్రాంత ప్రాజెక్టులతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్దాపురం ప్రాజెక్టులను చేర్చాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్ సెషన్లో నిధులు కేటాయించాలి. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలి. తుంగభద్ర సమాంతర కాలువ, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్ట్లు, సిద్దేశ్వరం అలుగు, రాయలసీమ ఎత్తి పోతల పథకం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీని కోరాపుట్–బుందేల్ ఖండ్ తరహాలో రూ. 30 వేల కోట్లతో అమలు చేయాలి. గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలోని ఎయిమ్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీలను రాయలసీమలో నెలకొల్పాలి. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలోని కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పటికే శ్రీశైలంలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయ చరిత్ర, పురావస్తుశాఖ క్యాంపస్కే యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్నీ మార్చాలి. రాయలసీమ సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య, కళారంగాల అభివృద్ధికీ, అధ్యయనానికీ ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. పరిశ్రమల స్థాపనలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేపాక్షి నాలెడ్జ్ హబ్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలి. రాయలసీమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అదనంగా కర్నూలు జిల్లాలో ఆదోని జిల్లా, ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాలు ఏర్పాటు చేయాలి. (క్లిక్: ఈ వర్గపు ఆగడాలకు అంతం లేదా?) శ్రీ బాగ్ ఒప్పందం, శ్రీ కృష్ణ కమిటీ, శివరామన్ కమిటీ, జీయన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ తదితర నివేదికలు వికేంద్రీకరణ విషయమై చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకొని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధికి తోడ్పడాలి. (క్లిక్: బాబు బ్రాండ్ రాజకీయాలు) - డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత -
Rayalaseema: పారిశ్రామిక ‘సీమ’
సాక్షి, అమరావతి: చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు విరబూస్తున్నాయి. పరిశ్రమలతో కళకళలాడుతున్నాయి. కడప నగరానికి కూత వేటు దూరంలోని కొప్పర్తి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నాడు పది లక్షలు.. నేడు రూ.కోటిన్నర రెండేళ్ల క్రితం కొప్పర్తి కనుచూపు మేరంతా తుప్పలతో నిండిన చౌడు భూములే కనిపించేవి. ఒక్క భవనమూ లేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే పరిస్థితి మారింది. రెండేళ్లలోనే రెండు పెద్ద పారిశ్రామిక వాడలు వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ రూపుదిద్దుకున్నాయి. గత డిసెంబర్లో సీఎం జగన్ వీటిని ప్రారంభించి పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. వివిధ పరిశ్రమల నిర్మాణంతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది. ఇది మార్పునకు స్పష్టమైన సంకేతమని దేవేంద్ర సిమెంట్స్ అధినేత మహేందర్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి కూడా పనికిరాని ఈ భూములు ఏడాది క్రితం వరకు ఎకరా రూ.10 లక్షలు ఉండగా ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన ఎకరం రూ.1.5 కోట్లు పలుకుతోందని తెలిపారు. వలస వెళ్లాల్సిన దుస్థితి తప్పిందని కొప్పర్తి పక్కన ఉన్న అంబాపురం వాసి కుంపటి ఓబిలేసు ఆనందంగా చెప్పాడు. భార్య భర్తకి కలిపి రోజుకు రూ.1,200 తక్కువ కాకుండా కూలి వస్తోందని తెలిపాడు. మారుతున్న సీమ రూపురేఖలు రాయలసీమలో మూడు భారీ పారిశ్రామిక పార్కులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని రకాల మౌలిక వసతులతో 36,133 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం అభివృద్ధి చేస్తోంది. విశాఖ–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కొప్పర్తి నోడ్, చిత్తూరు నోడ్, ఓర్వకల్ నోడ్లను ఆసియా అభివృద్ధి బ్యాంకు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్డిట్) నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. కొప్పర్తి నోడ్ కొప్పర్తి వద్ద 3,157 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్ఆర్ ఈఎంసీ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వైఎస్ఆర్ జగనన్న ఎంఐహెచ్ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులతో పాటు 75,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇప్పటికే 47 పరిశ్రమలకు 430 ఎకరాలు కేటాయించారు. రూ.1,837 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. 8,941 మందికి ఉపాధి లభిస్తుంది. 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీని రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా రూ.9,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. చిత్తూరు నోడ్ శ్రీకాళహస్తి వద్ద 23,538 ఎకరాల్లో ఏడీబీ నిధులతో ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. రెండు దశల్లో రూ.1,577.21 కోట్లతో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓర్వకల్లు కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిక్డిట్ నిధులతో 10,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 62,000 మందికి, పరోక్షంగా 77,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ రూ.37,300 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 3 ఎంఎంఎల్పీలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో కలిసి అనంతపురంలో భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు ఓర్వకల్లు, కొప్పర్తి వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. పారిశ్రామిక విప్లవం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూన్ నుంచి ఇప్పటివరకు 50కి పైగా భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.27,530 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 37,204 మందికి ఉపాధి లభించింది. కియా కార్ల కంపెనీ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడమే కాకుండా విస్తరణ పనులు వేగంగా చేపడుతోంది. హీరో మోటోకార్ప్, టాటా స్మార్ట్ఫుడ్జ్, టోరే, అపోలో టైర్స్, టీహెచ్కే ఇండియా లాంటి పలు సంస్థలు ప్రభుత్వ సహకారంతో విజయవంతంగా ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 43 భారీ పరిశ్రమలు రాయలసీమలో పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ దశల్లో ఉన్న ఈ యూనిట్ల ద్వారా రూ. 42,421 కోట్ల పెట్టుబడితోపాటు 1,26,396 మందికి ఉపాధి లభిస్తుంది. ఇందులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్, సెంచరీ ఫ్లైవుడ్స్, నీల్కమల్, పిత్తి లామినేషన్స్, రామ్కో సిమెంట్స్, ప్రిజిం సిమెంట్స్ , సుమిత్ ఫుట్వేర్, భారత్ ఎలక్ట్రానిక్స్, నాసీన్, బ్లూస్టార్, హావెల్స్ ఇండియా, ఆంబర్ ఎంటర్ప్రైజెస్, ఆల్ల్రాటెక్ సిమెంట్ వంటి సంస్థలున్నాయి. ఇదే సమయంలో రాయలసీమలో 5,923 ఎంఎంస్ఎంఈలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.1,671 కోట్ల పెట్టుబడులతో పాటు 45,171 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది. అభిప్రాయాలు రాష్ట్రమంతా అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అభివృద్ధి వికేంద్రీకరణను ప్రభుత్వం చేపట్టింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలను విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. – జవ్వాది సుబ్రమణ్యం, వీసీఎండీ, ఏపీఐఐసీ ఏపీలో సరికొత్త నినాదం.. ‘‘రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు’’ – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ శంకుస్థాపన సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్శర్మ అంతకు మించి.. తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక మరిన్ని కంపెనీలు తీసుకొస్తాం పెట్టుబడి ప్రతిపాదన అందజేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు ఇతర కంపెనీలను కూడా తీసుకొస్తాం. – పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ ప్రకటన -
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేయాలి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాజధాని నిర్మాణంపై హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును యథావిధిగా అమలు చేయడం వల్ల రాయలసీమకు రాజధాని, హైకోర్టు, కీలక కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న న్యాయమైన ఆకాంక్ష తీరకుండా పోతుందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి అన్నారు. ఎస్వీయూలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఎంపిక సమయంలో మాజీ సీఎం చంద్రబాబు ఏకపక్షంగా.. ఒక వర్గానికి మేలు జరిగేలా వ్యవహరించారన్నారు. 1872 కాంట్రాక్టు యాక్టు, విభజన చట్టం ప్రకారం రాజధాని ఎంపిక జరగలేదన్నారు. విభజన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిందని, రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను రాజధాని ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తాను ముందు అనుకున్న నిర్ణయం మేరకు రాజధానిని ఎంపిక చేశారన్నారు. ఇది విభజన చట్టానికి వ్యతిరేకం కాదా? చట్టం ప్రకారం కేంద్రం ఏ సలహా ఇచ్చింది? శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదని ప్రశ్నించారు. ఒప్పంద ప్రయోజనాలు సహజ న్యాయసూత్రాలకు లోబడి ఉండాలన్నారు. మహానగర నిర్మాణం పేరుతో రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల రైతులతో ఎలా అవగాహన చేసుకుంటారన్నారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల నివేదికలను దృష్టిలో పెట్టుకుని రాజధానిలో న్యాయమైన భాగస్వామ్యం రాయలసీమకు ఉండేలా తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, మస్తానమ్మ, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాయలసీమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం
-
అన్యాయమని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
మహబూబ్నగర్ క్రైం: జిల్లాకేంద్రంలో ఇటీవల కిడ్నాప్కు గురైన బాధిత కుటుంబాలు మంగళవారం తెలంగాణ చౌరస్తాలో ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఎన్పీ వెంకటేశ్ మాట్లాడుతూ.. మహబూబ్నగర్ను మరో రాయలసీమ ప్రాంతంగా మార్చడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 23న నాగరాజు, 24న విశ్వనాథ్, యాదయ్య కిడ్నాప్ కాగా, ఈ నెల 25న హైదరాబాద్లోని బషీర్బాగ్ పోలీసులు రిమాండ్ చేశారన్నారు. గులాం హైదర్ అనే వ్యక్తిపై కత్తులతో దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్లో ఎస్వీఎస్ లాడ్జి సమీపంలో అరెస్టు చేసినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. మహబూబ్నగర్లో ఓ వీఐపీకి గులాం హైదర్ సన్నిహితుడని.. రాఘవేందర్రాజు చేసే అక్రమాలను హైదర్ ఎత్తి చూపుతున్నందుకు ఆయనను హత్య చేసేందుకు వచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చారని, ఇది సరికాదన్నారు. గులాం హైదర్కు, యాదయ్య, విశ్వనాథ్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. 23న టీఆర్ఎస్ పార్టీకి చెందిన అమర్ కొడుకును పోలీసులు తీసుకెళ్లారని.. 24న అమర్ తండ్రి దొరికాడని కొడుకును విడిచిపెట్టారని ఆరోపించారు. అన్వర్ అనే వ్యక్తి ఈనెల 24న కిడ్నాప్ అయ్యారని తెలిపారు. వీళ్లు దేశ ద్రోహులా, లేక టెర్రరిస్టులా..ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. ఈనెల 23న తన భర్త కిడ్నాప్ అయ్యాడని టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే.. సదరు సీఐ ‘‘నీ భర్త రెండు రోజుల్లో వస్తాడని, పెద్దపెద్ద రాజకీయ నేతలతో మీకు ఎందుకు’’అని ప్రశ్నించినట్లు నాగరాజు భార్య గీత చెప్పారు. మళ్లీ తర్వాత రోజు స్టేషన్కు వెళితే మీ భర్తను చర్లపల్లి జైలుకు పంపించారని చెబితే, జైలు దగ్గరికి నేను వెళ్లి కలిసేందుకు ప్రయత్నిస్తే అవకాశం ఇవ్వలేదని, రాత్రి 9 గంటలకు భర్తతో మాట్లాడించారని చెప్పింది. -
పోరాటాల పురిటిగడ్డ ఇది!
వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరికంబం ఎక్కి రేపటికి 175 ఏళ్లు. 19వ శతాబ్దం ప్రారం భంలో అంకురించిన చిత్తూరు పాలెగాళ్ళ పోరాటం దగ్గర నుంచి 1847 ఫిబ్రవరి 22న పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్వాళ్లు ఉరితీయడం వరకు... రాయలసీమ పోరాటాలతో ఎరుపెక్కింది. ఈ పోరాటాలలో ఉరికంబం ఎక్కిన అమరవీరులు రాయలసీమ పాలెగాళ్ళు. బ్రిటిష్ మహావృక్షాన్ని మొక్క దశలోనే తుంచేయాలని పోరాటాలు చేసిన తొలి స్వతంత్ర పోరాట యోధులు వీరు. క్రీ.శ. 1801 నుంచి 1805 వరకు చిత్తూరు జిల్లా పాలెగాళ్ళు– బ్రిటిష్ వారికి మధ్య జరిగిన పోరాటంలో... యాదరాకొండ పాలెగాడు ముద్దు రామప్ప నాయుణ్ణి పట్టుకుని కల్లయ్య బండ అడవుల్లో ఉరితీశారు. మిగిలిన పాల్యాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనాటి బ్రిటిష్ సైనిక చట్టం ప్రకారం చిత్తూరు పాలెగాళ్లను కొందరిని ద్వీపాంతరం పంపారు. మరికొందరిని ఉరితీశారు. (చదవండి: మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం) క్రీ.శ.1600– 1800 వరకు రాయలసీమలో బలమైన రాజుల పాలన లేదు. రాయలసీమను రక్షించినది పాలెగాళ్లే. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట, పరాయి రాజుల వశమైనప్పటికీ... బురుజులు మాత్రం పాలెగాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. విజయనగరం రాజుల కాలంలోనే (క్రీ.శ.1336 –1680) పాలెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాలెగాళ్లు విజయనగర రాజులకు పన్నులు వసూలు చేయడంలోనూ, అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. క్రీ.శ.1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో సుల్తానుల చేతుల్లో పరాజయం పొందిన విజయనగరం రాజులు తమ రాజధానిని హంపీ నుంచి ప్రస్తుత అనంతపురం జిల్లాలోని పెనుగొండకు క్రీ.శ.1591లో మార్చారు. అప్పటి నుంచి 1800 సంవత్సరంలో బ్రిటిష్వారికి రాయలసీమ ప్రాంతం ధారాదత్తం అయ్యేదాకా ఇక్కడ ముప్ఫై యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల న్నిటిలో సీమ ప్రజలకు ధన, మాన, ప్రాణ, నష్టం జరగకుండా చూసింది పాలెగాళ్లే. క్రీ.శ. 1800 నాటికి రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళు ఉండేవారు. వీరి కింద 30,000 మంది సైనికులు ఉండేవారు. రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ వాళ్లకిందికి వచ్చిన తర్వాత పాలెగాళ్లు నామమాత్రులయ్యారు. బ్రిటిష్ వారి దోపిడీ పతాకస్థాయికి చేరుతుండటంతో పాలెగాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఐదు వేలమంది సాయుధులతో, ఇతర పాలెగాళ్లు, జమీందారుల సహకారంతో వాళ్లపై 1846లో తిరుగుబాటును ప్రారంభించాడు. అనేక సంఘర్షణల అనంతరం 1846 అక్టోబర్ 6న నరసింహారెడ్డిని బ్రిటిష్వాళ్లు పట్టుకున్నారు. 200 మంది అనుచరులతో రెడ్డి ఎర్రమల కొండలను వదిలి పెరసోమలలోనికి పోయినట్లు అనుమానించి పెరసోమల గ్రామం వద్ద బ్రిటిష్వాళ్లు ఆయన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఉయ్యాలవాడను చివరకు 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. దీనిని కలెక్టర్ కాన్క్రేన్ పర్యవేక్షించాడు. మృతదేహం తలను నరికించి... ఆ తలను కోయిలకుంట్ల బురుజుకు వేలాడదీయించాడు. అలా 1847 నుంచి 1877 వరకు కోయిలకుంట్ల బురుజుకు ఆయన తల వేలాడుతూనే ఉంది. (చదవండి: ప్రజల గుండె చప్పుడు) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి త్యాగ ధనులు పుట్టిన రాయలసీమపై కొందరు... ఫ్యాక్షన్ ముద్రవేసి దాని గౌరవాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి! - డాక్టర్ ఏనుగొండ నాగరాజ నాయుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి (ఉయ్యాలవాడ ఉరికంబమెక్కి రేపటికి 175 ఏళ్లు) -
ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు.. టీడీపీ ద్రోహం
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు గత తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నాయో వివరిస్తూ ఐదేళ్ల కాలంలో రూ.24,350 కోట్లు ఇవ్వాలని అధికారులు సవివరమైన నివేదికను కేంద్రానికి సమర్పించారు. కానీ, నాటి ముఖ్యమంత్రి ఈ నిధుల సాధనలో పూర్తిగా చతికిలపడ్డారు. స్వయాన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రే ఇటీవల రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంతో ఈ విషయం తేటతెల్లమైంది. అధికారులు రూపొందించిన లెక్కల ప్రకారం నిధులు సాధించాల్సిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. జిల్లాకు ఏడాదికి కేవలం రూ.50 కోట్లు ఇస్తామంటే ఆయన ఓకే చెప్పారు. అంటే ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు కేంద్రం ఇస్తానంటే చంద్రబాబు అందుకు సరేనన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మూడేళ్లపాటు రూ.350 కోట్ల చొప్పున విడుదల చేయగా ఆ నిధులనూ టీడీపీ సర్కారు సక్రమంగా వినియోగించలేదు. వాటి వినియోగ పత్రాలు సమర్పిస్తేనే తదుపరి నిధులు ఇస్తామని స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం.. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి వాటి విడుదలను నిలుపుదల చేసింది. అలాగే.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కూడా పైసా ఇవ్వలేదు. ఒక రకంగా వేల కోట్ల రూపాయలు ఆ జిల్లాలకు రాకుండా చేయడమే కాక, కేంద్రం ఇస్తానన్న అరకొర నిధులు కూడా రాకుండా చంద్రబాబు ఆ ప్రాంతాలకు తీరని ద్రోహం చేశారు. ఈ జిల్లాల్లో అక్షరాస్యత పెంచడంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులను వినియోగించాల్సి ఉండగా అప్పటి టీడీపీ ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యహరించింది. టీడీపీకి భిన్నంగా వైఎస్సార్సీపీ.. అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన 2019–20లోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు రూ.350 కోట్లను కేంద్రం నుంచి సాధించింది. అలాగే.. 2020–21 ఆర్థిక ఏడాదిలో కూడా మరో రూ.350 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించింది. అంతేకాక.. సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సమయంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కోరిన విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదిరి వెనుకబడిన జిల్లాల నిధుల విడుదల వివరాలను వెల్లడించారు. -
మా కోరిక వికేంద్రీకరణే!
1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే, 2014లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం! 1953లో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. శ్రీబాగ్ ఒప్పందంలోని ఒక్క అంశం, ఆ రకంగానైనా ఆనాడు ఆచరణలోకి వచ్చింది. దానిని ఇప్పుడు కొనసాగించమనేదే మా గట్టి డిమాండ్. మూడు రాజధానులు కాదు, మూడు వికేంద్రీకరణలు మాత్రమే! కర్నూలులో పరిపాలనా రాజధాని, అసెంబ్లీ, గుంటూరులో ఓ హైకోర్టు, విశాఖలో శీతకాలపు అసెంబ్లీ సమావేశాలు ఉండాలనేది మా అభిప్రాయం. విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా వెలుగొందుతుందని మా విశ్వాసం. (చదవండి: ‘ఒకే దేశం, ఒకే ఎలక్షన్’లో మర్మం?) అంతే కాకుండా... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలి. తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. నదుల అనుసంధానంలో భాగంగా కేంద్ర ప్రణాళికలోని ‘ఆల్మట్టి నుంచి బుక్కపట్నం లింక్ కెనాల్ గురించి కేంద్రంతో, కర్నాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలి. గాలేరు–నగరి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) ఎర్ర చందనం స్మగ్లింగ్ను అడ్డుకుని, నిల్వ ఉన్న దుంగలను వేలం వేసి ఆ డబ్బును రాయలసీమ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కడపజిల్లాలో ఉక్కు కర్మాగారం, మల్లవరంలో బీహెచ్ ఈఎల్ ఏర్పాటు, పులరిన్ ఖనిజం వెలికితీత, ఆ ఖనిజాధారిత పరిశ్రమల ఏర్పాటు తదితరాలు మా తక్షణ డిమాండ్లు. శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించే నీళ్ల వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ జరగాలని మేం కోరు కుంటున్నాం. రాజీలేని మా వైఖరి, ఏ అపార్థాలకూ తోవచూపరాదని విశ్వసిస్తూ... – రాయల సీమ కవులు, రచయితలు (కేతు విశ్వనాథరెడ్డి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణ స్వామి, భూమన్, శాంతినారాయణ, వేంపల్లె షరీఫ్, రాసాని వెంకట్రామయ్య, మధురాంతకం నరేంద్ర, తదితరులు) -
రాయలసీమ ప్రజలకు క్షమాపణలు: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: హత్యలు చేసే కడప వాళ్లకు ఎయిర్పోర్టా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు. 'రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన' అని సోమువీర్రాజు అన్నారు. చదవండి: (పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్) ఇదిలా ఉండగా, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు నిర్మించాలన్న ప్రణాళికలో ఉన్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ జిల్లాలకు ఎయిర్పోర్టులు ఎందుకంటూ వ్యాఖ్యానించారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో.. ‘జిల్లాకో ఎయిర్పోర్టు ఎందుకు? కర్నూలులో ఎయిర్పోర్టు.. బస్సులు వెళ్లడానికి దారిలేనటువంటి కర్నూలులో ఎయిర్పోర్టు.. రాయలసీమకు ఎయిర్పోర్టులంట.. కడపలో ఎయిర్పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్పోర్టు.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు. మేం ఎయిర్పోర్టు వేస్తాం. ఏం వేస్తారండి ఎయిర్పోర్టు.. మీరు రోడ్లు వెయ్యండి..’ అంటూ రాయలసీమ ప్రజలను కించపరిచే విధంగా వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. వీర్రాజు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో అన్ని వర్గాల ప్రజలు మండిపడుతుండడంతో తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గారు. -
3 రాజధానుల నుంచి జనం దృష్టి మరల్చేందుకే..
నర్సీపట్నం: చింతకాయల అయ్యన్నపాత్రుడు పిచ్చి ప్రేలాపన మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్ హెచ్చరించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరస్థుడైన అయ్యన్నపాత్రుడే ఆర్థిక నేరాల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఎన్ని ఆస్తులున్నాయో.. రాజకీయాల్లోకి వచ్చాక వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలని డిమాండ్ చేశారు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి, రాయలసీమ ప్రజల మూడు రాజధానుల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పిచ్చి తుగ్లక్ లాంటి అయ్యన్నపాత్రుడితో చంద్రబాబు, లోకేశ్లు పిచ్చి ప్రేలాపనలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాకు మేత కోసమే అయ్యన్నపాత్రుడు మందు కొట్టి మాట్లాడుతున్నారని.. ఆయనవి మత్తు మాటలు.. మందు మాటలు.. మతిలేని మాటలంటూ ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం మంత్రిగా వెలగబెట్టిన అయ్యన్నపాత్రుడు నర్సీపట్నాన్ని గంజాయి అడ్డాగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా అతను ఏం చేశాడన్నది చూస్తే.. గంజాయి రవాణా తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. తండ్రీకుమారులు ఇద్దరి చేతిలోనూ ఓడిపోయారు.. సిగ్గు లేదా చంద్రబాబు? 2019 ఎన్నికల్లోనే కాక.. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓడిపోయినందుకు, వైఎస్సార్ చేతిలో, ఆయన కుమారుడు వైఎస్ జగన్ చేతిలో ఓడినందుకు సిగ్గుతో రాజీనామా చేయాల్సింది చంద్రబాబేగానీ, ప్రతి రూపాయినీ ప్రజల కోసమే ఖర్చు చేస్తున్న సీఎం జగన్ కాదని ఉమాశంకర్గణేశ్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు, లోకేశ్లు రూ.241 కోట్లను అప్పనంగా కొట్టే్టశారని ప్రజలు గుర్తించారని, సంతకం పెట్టిందెవరన్నది కాదు.. బస్తాల్లో డబ్బులు పట్టుకుపోయిందెవరన్నదే ముఖ్యమన్న విషయాన్ని అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలంటూ ఉమాశంకర్ గణేశ్ హితవుపలికారు. -
రాయలసీమకు మరో రెండు రహదారులు
సాక్షి, అమరావతి: రాయలసీమకు మరో రెండు ప్రధాన రహదారులు మంజూరయ్యాయి. వైఎస్సార్ జిల్లాను అనంతపురం, కర్నూలు జిల్లాలతో మరింతగా అనుసంధానిస్తూ రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గతంలో ఎన్నడూలేని రీతిలో 2021–22 వార్షిక ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.6,421కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రణాళికలో భాగంగా చేపట్టే పనుల్లో ఆర్ అండ్ బీ శాఖ ఈ రెండు రోడ్లను కూడా తాజాగా ప్రతిపాదించింది. అందుకోసం రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికను ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించే ప్రక్రియను చేపట్టింది. ►ముద్దునూరు– హిందూపూర్ మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. ఈ రహదారిని పులివెందుల, కదిరి మీదుగా హిందూపూర్ వరకూ 159 కి.మీ. మేర నిర్మిస్తారు. అందుకు రూ.1,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రహదారి నిర్మాణానికి డీపీఆర్ వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం మూడు ప్యాకేజీల కింద టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ►కర్నూలు జిల్లా నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు ‘పావ్డ్ సోల్డర్స్(డబుల్ లైన్ల రోడ్డుకి రెండు వైపులా మరో 3 మీటర్లు కలిపి కలిపి అదనంగా.. 7+3) రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 88 కి.మీ.మేర నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం డీపీఆర్ను రూపొందిస్తున్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. చదవండి: (ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం: పేర్ని నాని) -
రాయలసీమలోనే రాజధాని కావాలి..
తిరుపతి రూరల్: శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేసి రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యంరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి(ఆప్స్) అధ్యక్షుడు రఫీహిందూస్థానీ అధ్యక్షతన తిరుపతి యూత్ హాస్టల్లో ‘మూడు రాజధానులు – వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి’ అనే అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీమ ప్రాంతానికి చెందిన పలువురు మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత ఈ సమావేశంలో పాల్గొని సీమ ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజలు అడగకున్నా స్వార్థం కోసమే గత పాలకులు అమరావతి పేరుతో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ముందుగానే లీకులివ్వడంతో వందలాది ఎకరాలను గత పాలకులు మింగేశారని ఆరోపించారు. స్థిరమైన నగరాల్లోనే రాజధానిని అభివృద్ధి చేయాలని ఎస్వీయూ ప్రొఫెసర్ కృష్ణమోహనరెడ్డి కోరారు. అమరావతి ప్రాంత రైతులను టీడీపీ మోసం చేసి.. వారిని రోడ్డుపాల్జేసిందంటూ మండిపడ్డారు. రాయలసీమ రాజధాని ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసేందుకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఏ కమిటీ కూడా అమరావతిలోనే రాజధానిని పెట్టాలని సూచించిన దాఖలాల్లేవని సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ తెలిపారు. రాయలసీమకు వచ్చి సీమ వాసులు ఏర్పాటు చేసుకున్న మూడు రాజధానుల ఫ్లెక్సీలను చించిన దౌర్జన్యకారులకు టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలకడం దారుణమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఆప్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ, గిరిజన ప్రజా సమాఖ్య అధ్యక్షుడు శంకరనాయక్, సాహిత్య అకాడమీ కన్వీనర్ డాక్టర్ మస్తానమ్మ, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: 'త్రి'కేంద్రీకరణే కావాలి
మూడు రాజధానులకు మద్దతుగా గురువారం తిరుపతిలో ప్రజలు, విద్యార్థులు కదం తొక్కారు. ‘పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి’, ‘అమరావతి ఒక్కటే వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. రాయలసీమ ప్రజల మనోభావాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమంటూ గొంతెత్తారు. గతంలో రాజధానిని వదులుకున్న కర్నూలు ప్రజలదే గొప్ప త్యాగమని నినాదాలు చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ మండిపడ్డారు. యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): పరిపాలన వికేంద్రీకరణ – మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డిగ్రీ, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, ఎస్డీహెచ్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి, అంబేడ్కర్ న్యాయ కళాశాల చైర్మన్ ఆర్.తిప్పారెడ్డిలతో పాటు విద్యార్థి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన ర్యాలీ.. నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ సాగింది. అమరావతి వద్దు.. 3 రాజధానులు ముద్దు.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి.. అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 18న నిర్వహించే రాయలసీమ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. అమరావతి ఒక వర్గానికే చెందిన రాజధాని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు.. 13 జిల్లాలని చెప్పారు. రాయలసీమ ప్రాంతం తీవ్రంగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, అవసరాలను గుర్తించాలని కోరారు. సీమలో ఉన్న కొందరు నాయకులు అమరావతిని సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చామని చెపుతున్న అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని.. అది వ్యాపారమని, శ్రీశైలం ప్రాజెక్ట్, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ను ప్రోత్సహిస్తున్నారని పురుషోత్తంరెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్వీయూ ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ఎస్డీహెచ్ఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ డి.రామసునీల్రెడ్డి, సీకాం విద్యాసంస్థల చైర్మన్ సురేంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్.రాజశేఖర్రెడ్డి, రచయిత్రి మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బాబు రాయలసీమ ద్రోహి
తిరుపతి కల్చరల్: తన పుట్టుకకు, ఉన్నతికి దోహదపడిన రాయలసీమ అంటే గిట్టకుండా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు నాయుడని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్) రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ హిందూస్థాని విమర్శించారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధి, మూడు రాజధానుల ఏర్పాటు కోరుతూ ఆప్స్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతిలో ర్యాలీ చేపట్టారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఆంధ్రా బ్యాంక్ సర్కిల్ నుంచి ఎంఆర్ పల్లి సర్కిల్ వరకు విద్యార్థులు, యువకులు నినాదాలు చేస్తూ ర్యాలీ సాగించారు. రఫీ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని పేరుతో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు రైతుల వేషంలో టీడీపీ, కమ్యూనిస్టులు, జనసేన నేతలు తిరుపతిలో యాత్ర సాగించడం రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. కర్నూలులో హైకోర్టు పెడితే చంద్రబాబుకు నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కార్పొరేట్ యాత్రకు కథా, స్క్రీన్ప్లే, దర్శకత్వం చంద్రబాబేనని విమర్శించారు. అలాగే, సీమ అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరిన కమ్యూనిస్టులు కూడా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని రఫీ అన్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుపతి నగరంలో పాదయాత్ర చేయడం భావ్యం కాదన్నారు. ఆప్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహ్మద్ రఫీ, రచయిత్రి డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధికి యువత ముందుకు రావాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచి్చన టీడీపీ శ్రీభాగ్ ఒప్పందానికి విఘాతం కలిగించిందన్నారు. అనంతరం ఎంఆర్ పల్లి సీఐ సురేంద్రరెడ్డి అనుమతి లేదంటూ ర్యాలీని అడ్డుకుని 20 మంది ఆప్స్ నేతలను అరెస్టు చేశారు. -
హైకోర్టును కర్నూలుకు తరలించాల్సిందే..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర హైకోర్టును తక్షణమే అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ ధర్నా చౌక్లో రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ‘రాయలసీమ ధర్మ దీక్ష’ జరిగింది. దర్మ దీక్షకు న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ధర్మదీక్షలో పాల్గొన్న వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో నెలకొల్పాలని కోరారు. కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనానంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ రాజధానితో పాటు అన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేసి శ్రీబాగ్ ఒప్పందానికి విఘాతం కలిగించిందన్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాయలసీమకు హైకోర్టు కేటాయిస్తే సాంకేతిక అంశాలను సాకుగా చూపి కోర్టుల్లో కేసులు వేశారన్నారు. కాగా, ధర్మ దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు వెంకటేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. -
హైకోర్టు, నీటిప్రాజెక్టులు రాయలసీమకు అవసరం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే రెండుసార్లు రాజధానిని కోల్పోయామని, మరోసారి ఇందుకు సిద్ధంగా లేమని రాయలసీమ మేధావుల ఫోరం పేర్కొంది. రాయలసీమకు హైకోర్టు రావాలని, నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో రాయలసీమ మేధావుల ఫోరం ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమ ప్రయోజనాలు’ అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించింది. ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకుని, నూతనంగా సమగ్ర అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని చెప్పారు. రాయలసీమకు ప్రయోజనాలు కలిగేలా బిల్లులో ఎలాంటి అంశాలు ఉండాలన్న అంశంపై చర్చ జరగాలని అన్నారు. అమరావతి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కూలంకష చర్చ జరగాలని తెలిపారు. అమరావతి రైతులు భూములిచ్చింది వారి ప్రయోజనాల కోసమేనని చెప్పారు. దానిని త్యాగం అంటూ, రాష్ట్రం కోసం అంటూ విచిత్ర వాదనలు తెస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం, రైతులకు ఇవ్వాల్సిన భూమి పోను మిగిలిన భూమి 10 నుంచి 15 వేల ఎకరాల దాకా ఉంటుందన్నారు. అందులో గత ప్రభుత్వం ప్రైవేటు, విదేశీ సంస్థలకు ఇచ్చినప్పుడు అభ్యంతరం తెలపలేదని, ఇప్పుడు 5 వేల ఎకరాల్లో విజయవాడ, గుంటూరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. అక్కడ పేదల ఇళ్లు ఉంటే వారి ప్లాట్లకు మంచి మార్కెట్ ఉండదనే బెంగే కారణమన్నారు. తీవ్ర కరువు, నీటి సమస్యతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు నేడు కావాల్సింది మరో కొత్త నగరంతో కూడిన రాజధాని నిర్మాణం కాదన్నారు. ఉన్న పరిమిత వనరులతో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అవసరమని చెప్పారు. తిరుపతి, హిందూపురం నగరాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పాలన సాగిస్తోందని, అలాంటి సమయంలో అన్ని వ్యవస్థలు ఒకేచోట ఉండాలని కోరుకోవడం సరికాదని అన్నారు. అమరావతి కేంద్రంగా కేంద్రీకృత అభివృద్ది జరిగితే మరో విభజన తప్పదని హెచ్చరించారు. అధ్యాపకులు సుబ్రమణ్యం ఆచారి, హిమబిందు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చిరపుంజిలా మారిన సీమ
సాక్షి, విశాఖపట్నం: కరువు సీమలో ఈ ఏడాది కుంభవృష్టి కురిసింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడగా 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో 2.66 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. సకాలంలో నైరుతి రుతుపవనాల రాక, ఈశాన్య రుతుపవనాలు కూడా అదే రీతిలో జోరందుకోవడంతో వరుసగా మూడో ఏడాది కూడా వర్షాలు పుష్కలంగా కురిశాయి. వీటికి తోడు అల్పపీడనాలు, వాయుగుండం, తుపాన్లతో కుండపోత వానలు పడ్డాయి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 950 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది 2.66 శాతం అధికంగా 975.29 మి.మీ. వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతంతో పోలిస్తే రాయలసీమలోని మూడు జిల్లాలు అత్యధిక వర్షపాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అనంతపురం జిల్లాలో సగటు వర్షపాతం కంటే 36.36 శాతం అత్యధికంగా వర్షాలు కురవగా వైఎస్సార్ కడప జిల్లాలో 33.81 శాతం, చిత్తూరులో 27.17 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. కడపలో 150 ఏళ్లలో తొలిసారి.. ప్రధాన నగరాల వారీగా చూస్తే కడపలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కడపలో 150 ఏళ్లలో తొలిసారిగా ఏకంగా 1,764 మి.మీ. వర్షపాతం నమోదైంది. 1,663 మి.మీ.తో విజయవాడ రెండోస్థానంలో ఉంది. విజయనగరంలో 1,476, కాకినాడలో 1,433, విశాఖపట్నంలో 1,421, రాజమండ్రిలో 1,412, తిరుపతిలో 1,395, గుంటూరులో 1,121, నెల్లూరులో 1,061, అమరావతిలో 951 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు నగరంలో అత్యల్పంగా 538 మి.మీ. వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడించాయి. రాష్ట్రమంతటా పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. ప్రతి ప్రాంతంలో నీటివనరులు నిండుకుండల్లా తొణికిసలాడుతుండటం శుభపరిణామమని పేర్కొంటున్నారు. -
'రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే రావాలి'
సాక్షి, తిరుపతి: మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. మంగళవారం ఎస్వీయూలో రాయలసీమ మేధావుల ఫోరం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమరావతి రైతు నాయకులు రాయలసీమ వాసులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ వాసులు వారి ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే రావాలి. చదవండి: (సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం) రాయలసీమలో గ్రామీణ వాతావరణం కలిగిన పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అమరావతి రైతులు విశాల హృదయం, విశాల త్యాగం చేసినవారు. అమరావతి రైతు నాయకులు రాయలసీమవాసులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, వామపక్షాలు కర్నూలుకు హైకోర్టు రావాలని ఒప్పుకున్నాయి. రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రాయలసీమకు హైకోర్టు రాకూడదని ఎస్వీయూలో బహిరంగ సభ పెట్టాలంటే మేం ఎందుకు అనుమతించాలి. రాయలసీమ ప్రజలందరూ ఈ విషయంపై స్పందించాలి. రేపటి నుంచి రాయలసీమకు రాజధాని అంశంపై విద్యార్థుల్లోకి వెళ్తామ’ని పురుషోత్తం రెడ్డి అన్నారు. -
విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం: శంకర నారాయణ
సాక్షి, అనంతపురం జిల్లా: హంద్రీనీవాను ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. బాబు పూర్తి చేశారని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హంద్రీనీవాకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు ఇప్పటికి రైతులు గుర్తొచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం అని దుయ్యబట్టారు. (చదవండి: వారికి ఎవరి రికమండేషన్ అవసరం లేదు: పేర్ని నాని) టీడీపీ నేతలు డ్రామాలు: తలారి రంగయ్య రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోలేదని ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. ఇప్పుడు సీమ ప్రాజెక్టుల భవిష్యత్ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాయలసీమలో తాగు,సాగునీటి కష్టాలు తొలగేలా సీఎం జగన్ పకడ్బందీ చర్యలు చేపట్టారని తలారి రంగయ్య అన్నారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
సంతృప్తికర స్థాయిలో వర్షాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలో సంతృప్తికర స్థాయిలో వర్షాలు కురిపించాయి. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో తొమ్మిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో మూడు తీవ్ర అల్పపీడనాలుగా మారాయి. జూన్లో ఒకటి, జూలైలో మూడు, ఆగస్టులో రెండు, సెప్టెంబర్లో మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ చివరలో గులాబ్ సెప్టెంబర్లో ఏర్పడ్డ రెండు వాయుగుండాల్లో ఒకటి తీవ్ర వాయుగుండంగా బలపడింది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసే సమయంలో సెప్టెంబర్ చివరలో గులాబ్ తుపాను ఏర్పడింది. మొత్తంగా సెప్టెంబర్లోనే ఒక తుపాను, ఒక వాయుగుండం, ఒక తీవ్ర వాయుగుండం, రెండు తీవ్ర అల్పపీడనాలు, ఒక అల్పపీడనం ఏర్పడడం విశేషం. వీటన్నింటిలో గులాబ్ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ల్లో వచ్చే తుపానులు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో తీరం దాటుతాయి. అక్టోబర్, నవంబర్ల్లో వచ్చే తుపానులు ఎక్కువగా మన రాష్ట్రంలో తీరం దాటుతాయి. గత కొన్నేళ్ల వాతావరణ విశ్లేషణలు ఈ అంశాలను స్పష్టం చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా ఈ సెప్టెంబర్లో వచ్చిన తుపాను మన రాష్ట్రంలోని కళింగపట్నం దగ్గర తీరం దాటి తీవ్ర ప్రభావం చూపింది. విస్తారంగా వర్షాలు ఈ నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 514 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సివుండగా 613.3 మి.మీ వర్షం కురిసింది. 19 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. దీన్ని వాతావరణ శాఖ సాధారణ వర్షపాతంగానే (20 శాతం వ్యత్యాసం ఉంటే సాధారణమే) పరిగణిస్తుంది. వైఎస్సార్, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో 49 శాతం అధిక వర్షపాతం కురవగా వైఎస్సార్ జిల్లాలో 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో 37 శాతం, విజయనగరం జిల్లాలో 36 శాతం, గుంటూరు జిల్లాలో 33 శాతం, తూర్పుగోదావరిలో 29 శాతం, కృష్ణాలో 28 శాతం అధిక వర్షాలు కురిశాయి. అనంతపురం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మిగిలిన జిల్లాల కంటె కొంచెం తక్కువ వర్షం కురిసింది. స్వల్పంగా లోటు వర్షం కురిసినా అది పది శాతంలోపే కావడంతో సాధారణంగానే పరిగణిస్తున్నారు. మొత్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ నెల 6 నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. రాయలసీమకు భారీ వర్ష సూచన సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 14న వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనించనుంది. ఇది 15వ తేదీన తుపానుగా బలపడే సూచనలు పుష్కలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చెబుతోంది. నిష్క్రమిస్తున్న నైరుతి రుతు పవనాలు క్రమంగా మన రాష్ట్రం వైపు వస్తుండటంతో వారం రోజుల పాటు వర్షాలు పుంజుకోనున్నాయి. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులు, అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఆదివారం దక్షిణ కోస్తాలోని ఒకట్రెండు చోట్ల, సోమవారం రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. కె.బిట్రగుంటలో 90.25 మి.మీ., ప్రత్తిపాడులో 63.5, కిర్లంపూడిలో 62.7, గోరంట్లలో 60, జగ్గంపేటలో 59, పమిడిలో 57, పలగలపల్లిలో 52.5, పెద్దతిప్పసముద్రంలో 45, ఓబుళదేవర చెరువు, శంఖవరంలో 44.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, వైఎస్సార్ జిల్లాను శనివారం వర్షం ముంచెత్తింది. కడప, పులివెందుల, రాయచోటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని ప్రధాన నదులైన పాపాగ్ని, మాండవ్య నదులు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. వీరబల్లి మండలంలోని గడికోట వద్ద మాండవ్య నది దాటుతూ కాకినాడకు చెందిన గోవిందరావు (45) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. -
పర్యాటక హబ్గా రాయలసీమ
తిరుపతి అర్బన్(చిత్తూరు జిల్లా): రాయలసీమను పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో హెలి టూరిజాన్ని వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతితో పాటు అవసరమైన ప్రధాన కేంద్రాల్లో స్టార్ హోటళ్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలున్న పట్టణాలకూ ఇదే పద్ధతిని అవలంభిస్తామని చెప్పారు. కరోనా కారణంగా తగ్గిన ఆదాయం.. ప్రస్తుతం పెరుగుతోందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారని, తిరుపతితో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ఆలయాలనూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యేకంగా 20కి పైగా టూరిజం బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను హబ్గా మార్చి, మెరుగైన వసతులు కల్పించి.. పర్యాటకులను ఆకర్షించేలా పలు సంస్కరణలు చేపట్టనున్నట్టు మంత్రి అవంతి వెల్లడించారు. -
‘రాయలసీమ’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు రిజర్వు చేసింది. రాయలసీమపై గతంలో ఎన్జీటీ ఇచి్చన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ను దాఖలు చేసింది. వీటిని తాజాగా సోమవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. జియాలజిస్టుల సూచనలు, డీపీఆర్ అవసరాల మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు. ఎన్జీటీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేపట్టం లేదని స్పష్టం చేశారు. ఆదేశాల ధిక్కరణ పిటిషన్ల విచారణ ఎన్జీటీ పరిధిలో లేదంటూ పలు కేసులు ప్రస్తావించారు. ఎన్జీటీని ఏపీ తప్పుదోవ పట్టించలేదని పేర్కొన్నారు. డీపీఆర్ పరిధి దాటి పనులు చేస్తే దానిపై చర్యలు తీసుకొనే అధికారం విషయంలో చట్టపరంగా ఎక్కడా స్పష్టత లేదన్నారు. అదనపు పనులపై చర్యలు తీసుకొనే అధికారం పర్యావరణ శాఖకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరఫు మరో న్యాయవాది మాధురి దొంతిరెడ్డి, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్లు హాజరయ్యారు. -
బహుముఖ యోధుడు
ఎం.వి. రమణారెడ్డి (1944–2021) అనారో గ్యంతో బాధపడుతూ మరణించారు. వైద్యుడిగా, రాయలసీమ వాదిగా, సాహితీవేత్తగా ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. 1969లో, పాతికేళ్ళ వయసులోనే ‘ప్రభంజనం’ పత్రికను ప్రారంభించి, మూడు నాలుగేళ్ళు నడిపారు. విరసంలో చేరి, ప్రథమ మహాసభలలో కార్యవర్గ సభ్యునిగా ఎన్నికై పని చేశారు. తర్వాత కాలంలో విరసం నుంచి దూరమై తనవైన కార్యకలాపాలను సాగించారు. తెలుగు దేశం, కాంగ్రెస్, వైసీపీ వంటి ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. రాయలసీమ విమోచనా సమితిని స్థాపించి, రాయలసీమ హక్కుల కోసం గళ మెత్తారు. ఆయనది బహుముఖమైన వ్యక్తిత్వం గనుక వేర్వేరు విషయాలు గుర్తుకువస్తాయి. ఆయన వాదనలతో అంగీకరించని వాళ్ళు సైతం ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలలోని మౌలికత్వాన్ని గుర్తిస్తారు. రాజకీయ కృషి చేస్తూనే, సాహిత్య సృజనని నిరాఘాటంగా కొనసాగించారు. ‘ఆయుధం పట్టని యోధుడు’ అంటూ మార్టిన్ లూథర్కింగ్ గురించి రాసినా; చెరసాలలను ధిక్కరించి, నిర్బంధం నుంచి తప్పించుకు తీరాలన్న తపనతో పెనుగు లాడిన హెన్రీ షారియార్ ప్రసిద్ధ రచన ‘పాపి యాన్’ను ‘రెక్కలు చాచిన పంజరం’గా అనువాదం చేసినా; ఆయన సాహిత్య కృషి విలువైనది. మార్గరెట్ మిషెల్ ప్రఖ్యాత రచన ‘గాన్ విత్ ద విండ్’ నవలను ‘చివరకు మిగిలింది’ పేరుతో అనువదించి ప్రచురించారు. ఇవి కాక, రాయలసీమ కన్నీటి గాథ, తెలుగింటి వ్యాకరణం, తెలుగింటి కొచ్చిన ద్రౌపది, ప్రపంచ చరిత్ర వంటి స్వతంత్ర రచనలు ఆయన విలువైన సాహిత్య సృజనకు తార్కాణం. అనువాదం కోసం ఎంచుకున్న పుస్తకాలు ఆయన అభిరుచికీ, వ్యక్తిత్వానికీ అద్దం పడతాయి. తిక్కన పద్యాలపైన, పదాలకి అర్థాల పైన చేసిన వ్యాఖ్యానాలు ఆయన పరిశీలనా శక్తికీ, పరిశోధనా పటిమకీ నిదర్శనంగా నిలబడతాయి. భాష పట్లా, రాయలసీమ కన్నీటి గాథల పట్లా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన లోతైన అవగాహననీ, ఆలోచనల విస్తృతినీ వెల్లడిస్తాయి. తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతూ కూడా నాలుగు సంపు టాల ప్రపంచ చరిత్ర పుస్తకం తేవాలన్న తాప త్రయం తన పట్టుదలకీ, ధీశక్తికీ సాక్ష్యమిస్తుంది. మొత్తం మీద చూస్తే– రచయితగా, సాహిత్య వేత్తగా, రాజకీయవాదిగా మరొకరితో పోల్చలేని అరుదైన, విలక్షణమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. రాజకీయాల నుంచి సాహిత్యంలోకి మళ్ళినవారూ, సాహిత్య సృజనకర్తలుగా, రాజకీయవేత్తలుగా ఏక కాలంలో కొనసాగుతున్నవారూ చాలామందే ఉన్నారు. కాలక్రమంలో వారిలో సాహితీవేత్త పార్శ్వమో, రాజకీయవేత్త పార్శ్వమో ప్రధానంగా ముందుకొస్తుంది. రమణారెడ్డి గారిలో బహుశా రెండు పార్శా్వలనూ సమపాళ్లలో చూడవచ్చునేమో. యూరప్ వికాస యుగపు ప్రతినిధుల గురించి చర్చిస్తూ ఎంగెల్స్ ఒక విలువైన పరిశీలన చేస్తాడు. మానవ జాతి చరిత్రలోనే అతిగొప్ప ప్రగతిశీల యుగంగా వెలుగొందిన ఆ కాలం– ఆలోచనలో, ఆశయాలలో, ఆవేశాలలో, వ్యక్తిత్వంలో, విశ్వజ నీనతలో, విజ్ఞానంలో మహా ప్రతిభావంతులని సృష్టించిందని అంటాడు. లియోనార్డో డా వించి, అల్బ్రెక్ట్ డూరర్, మాకియవెల్లి, మార్టిన్ లూథర్ వంటి వారిని ప్రస్తావిస్తూ, వ్యక్తులను ఒకే పార్శా్వ నికి పరిమితం చేసే శ్రమ విభజన ప్రభావానికి ఆనాటి ప్రతిభావంతులు ఇంకా లోబడలేదని చెబు తాడు. వైద్య వృత్తి నుంచి, రాజకీయాలు, సాహిత్య సృజన, విభిన్న ఆసక్తుల దాకా విస్తరించిన రమణా రెడ్డిని కూడా ఈ కోణం నుంచే అంచనా వేయా లేమో. తెలుగుసీమలోని రాజకీయ, సాహిత్య ఉద్య మాల వికాసంతో, ఉత్థాన పతనాలతో సన్నిహితంగా ముడిపడిన ఆయన ప్రస్థానాన్ని, తాను వేసిన విలక్షణమైన ముద్రనుంచి విడ దీసి చూడలేము. – సుధా కిరణ్ ఈ–మెయిల్ : sukira2001@yahoo.com -
Rayalaseema: సీమ రోడ్లకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాయలసీమలోని నాలుగు జిల్లాలను అనుసంధానిస్తూ మెరుగైన రోడ్ కనెక్టివిటీని అభివృద్ధి చేయనున్నారు. మొత్తం రూ.7,392 కోట్లతో 528 కి.మీ. మేర నాలుగు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించేందుకు కన్సల్టెన్సీలను నియమించారు. అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టి వచ్చే ఏడాది పనులు పూర్తి చేయాలన్నది ప్రణాళిక. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదన పట్ల జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సానుకూలంగా స్పందించింది. ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ‘సాక్షి’కి తెలిపారు. రాయలసీమలో నాలుగు లేన్లుగా నిర్మించనున్న రహదారులు ఇవీ... ► వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి బద్వేలు మీదుగా నెల్లూరు వద్ద చెన్నై–కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 149 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారిని అభివృద్ధి చేస్తారు. అందుకోసం రూ. 2,086 కోట్లతో ప్రతిపాదనలకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. ► అనంతపురం నుంచి మైదుకూరు వరకు 154 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ. 2,156 కోట్లతో ప్రతిపాదనలకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. ► కర్నూలు నుంచి డోర్నాల వరకు 131 కి.మీ నాలుగు లేన్ల రహదారి నిరి్మస్తారు. ఇందుకోసం రూ.1,834 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ► చిత్తూరు జిల్లాలో మదనపల్లి నుంచి తిరుపతి వరకు 94 కి.మీ.మేర నాలుగు లేన్ల రహదారిని రూ. 1,316 కోట్లతో నిరి్మస్తారు. రూ.2,205 కోట్లతో రోడ్ల మరమ్మతులు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడా రాష్ట్రానికి రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సమ్మతించడంతో అందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో దాదాపు 9 వేల కి.మీ. మేర రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ(ఆర్డీసీ) కొన్ని నెలల కిందట టెండర్ల ప్రక్రియ చేపట్టింది. బ్యాంకు నుంచి రుణ సాయంతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది. రోడ్ సెస్ ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దాంతో రోడ్సెస్ నిధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్క్రో ఖాతాను గ్యారంటీగా చూపి.. రుణాల కోసం ఆర్డీసీ వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొచ్చింది. ఆ బ్యాంకుతో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు జరిపిన చర్చలు ఫలించాయి. మొత్తం 9 వేల కి.మీ మేర.. రూ.2,205 కోట్లతో మరమ్మతులు చేసేందుకు ఆర్డీసీ సన్నాహాలు వేగవంతం చేసింది. అందుకోసం పిలిచిన టెండర్ల ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చే పనిలోపడింది. ఇప్పటికే 33% పనులకు కాంట్రాక్టర్లు బిడ్లు వేశారు. ప్రస్తుతం బ్యాంకు రుణం మంజూరు కావడంతో మిగిలిన 67% పనులకూ కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతారు. దీంతో మొత్తం టెండర్ల ప్రక్రియను త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని ఆర్డీసీ ఎండీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. -
సీమ కరువు నివారణకు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంత కరువు నివారణకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సలహాదారు అవినాశ్ మిశ్రాకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, గాలేరు–నగరి సుజల స్రవంతి కడప ఎస్ఈ ఎం.మల్లికార్జునరెడ్డి, ఎస్ఆర్బీసీ సర్కిల్–1 నంద్యాల ఎస్ఈ షేక్ కబీర్ బాషాలతో కలిసి అవినాశ్ మిశ్రాతో రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. రాయలసీమలో కరువు నివారణకు 19 నీటి పారుదల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి క్రిషి సించాయి యోజనలో చేర్చాలని కోరారు. 15 లక్షల ఎకరాల స్థిరీకరణకు రూ.29 వేల కోట్ల ఆర్థిక సాయంపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన అవినాశ్ మిశ్రా డీపీఆర్ల తయారీకి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. డీపీఆర్లను నెలరోజుల్లోగా కేంద్ర జల సంఘానికి అందించాలని సూచించారు. సమావేశం సానుకూలంగా జరిగిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. -
కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు
-
నేడు రాయలసీమలో విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: కోస్తా, రాయలసీమల్లో సోమవారం, మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా రాయలసీమలో సోమవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అరేబియా సముద్రానికి సమీపంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనివల్ల తేమగాలులు రాయలసీమ వైపు కదులుతున్నాయి. అదేవిధంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత 24 గంటల్లో పెద్దపల్లిలో 8.9, చంద్రగిరిలో 6.7, రామచంద్రాపురంలో 6.6, తిరుపతిలో 6.2, కుప్పంలో 5.0, పెద్దారవీడులో 4.9, శ్రీరంగరాజపురంలో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట
సాక్షి, అమరావతి: రాయలసీమను శాసన రాజధాని అమరావతితో అనుసంధానిస్తూ రాచబాట రూపొందనుంది. అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 417.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనల మేరకు ‘ఎన్హెచ్ 544డి’ నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ ఆమోదం తెలిపింది. ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయం అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్ప్రెస్ హైవే కోసం ఎన్హెచ్ఏఐ గతంలో ప్రతిపాదించింది. అందుకోసం భారీగా అటవీ భూములను సేకరించాల్సి ఉంది. అటవీ భూములను సేకరిస్తే అంతకు రెట్టింపు భూములను అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. అటవీ భూముల కేటాయింపునకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు ఇచ్చేందుకు 2018లోనే నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రాయలసీమ నుంచి శాసన రాజధాని అమరావతికి సరైన రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమను అమరావతితో అనుసంధానించే రహదారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం – అమరావతి అనుసంధానానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను రూపొందించింది. అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహిస్తోంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనంతపురం – గుంటూరు మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆ శాఖ ఆమోదం తెలిపింది. అనంతపురం నుంచి గుంటూరు వరకు 417.91 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 544డి నిర్మాణానికి ఆమోదించింది. 4 ప్యాకేజీల కింద నిర్మాణం 417.91 కిలోమీటర్ల ఈ రహదారిని రూ.9 వేల కోట్లతో నాలుగు ప్యాకేజీల కింద నిర్మించాలని నిర్ణయించారు. 1. అనంతపురం నుంచి బుగ్గ వరకు 69 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఇప్పటికే అనంతపురం నుంచి తాడిపత్రి వరకు నాలుగు లేన్ల రహదారి ఉంది. తాడిపత్రి నుంచి బుగ్గ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం భూసేకరణ పూర్తిచేశారు. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతారు. అందుకోసం రూ.2,130 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను ఆమోదించారు. 2. బుగ్గ నుంచి కర్నూలు జిల్లా మీదుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందిస్తున్నారు. 154.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.4,550 కోట్లతో నిర్మిస్తారు. 3. గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు పేవర్డ్ సోల్డర్స్తో రెండు లేన్ల రహదారి నిర్మాణాన్ని ఇప్పటికే వేగంగా కొనసాగిస్తున్నారు. 112 కిలోమీటర్ల మేర ఈ రహదారి కోసం రూ.845 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. అందులో 108.37 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి గత డిసెంబరు 25నే పీసీసీ జారీచేశారు. 4. వినుకొండ నుంచి గుంటూరు వరకు 82 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం రూ.1,475 కోట్లతో ప్రతిపాదనలను ఆమోదించారు. దీనిపై డీపీఆర్ను రూపొందిస్తున్నారు. ఆ తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు. రాయలసీమ నుంచి అమరావతికి మెరుగైన కనెక్టివిటీ అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణంతో రాయలసీమతో అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుంది. తక్కువ వ్యయ, ప్రయాసలతో మెరుగైన ప్రయాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ ఆమోదించింది. డీపీఆర్ పూర్తయిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మిస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్యకార్యదర్శి, రహదారులు, భవనాలశాఖ -
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ విచారణ
న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పర్యావరణ ఉల్లంఘనలు, ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నివేదిక నిబంధనల ప్రకారం దాఖలు చేయాలని ఎన్జీటీ వెల్లడించింది. ఆగస్టు 27కల్లా నివేదిక దాఖలు చేయాలని కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. కేఆర్ఎంబీ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. అయితే జులై 7వ తేదీనే పనులు నిలిపివేసినట్టు ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపింది. కేఆర్ఎంబీ నివేదికపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏపీ న్యాయవాదులకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం సూచించింది. -
ఏపీలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇప్పటివరకు నైరుతి నుంచి వాయువ్యం మీదుగా వీచిన గాలులు.. నేటి నుంచి దిశ మార్చుకొని నైరుతి నుంచి ఈశాన్యం మీదుగా వీచే అవకాశాలున్నాయి. ఫలితంగా.. వాతావరణంలో మార్పులు రానున్నాయి. ఎండ తీవ్రత క్రమంగా తగ్గనుంది. బుధవారం మాత్రం ఎండలు ఠారెత్తించాయి. అనేక చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా ఎండలు ఇదే రీతిలో ఉండే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 16న కోస్తా తీరంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 16 నుంచి వర్షాలు జోరందుకునే సూచనలున్నట్లు తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. -
సన్నాహకాలు మాత్రమే చేశాం
సాక్షి, అమరావతి/పగిడ్యాల/జూపాడు బంగ్లా: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి అవసరమైన సన్నాహకాలను మాత్రమే తాము చేస్తున్నట్టు కృష్ణా బోర్డు కమిటీకి బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల స్థాయి నుంచే సాగునీటి ప్రాజెక్టులు, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 6.9 టీఎంసీలను తెలంగాణ సర్కార్ తరలిస్తుండటం వల్ల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోతోందని తెలిపారు. కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా సరే.. తెలంగాణ చర్యలతో శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువకు పడిపోవడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన కర్నూలు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ద్వారా నీటిని అందించలేని దుస్థితి నెలకొందన్నారు. అలాగే చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో తమ వాటా నీటిని వినియోగించుకుని ఆయా ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం తలపెట్టామన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణ మండల బెంచ్–చెన్నై ఆదేశాల మేరకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే అధ్యక్షతన.. ఎల్బీ మూయన్తంగ్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ దర్పన్ తల్వార్ సభ్యులుగా కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం కర్నూలు జిల్లాలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన అలైన్మెంట్ను రద్దు చేశామని బోర్డు కమిటీకి తెలిపారు. పర్యావరణపరంగా సమస్యలు రాని కొత్త అలైన్మెంట్ ప్రకారం సీమ ఎత్తిపోతల పథకానికి సన్నాహకాలు చేపట్టామన్నారు. ఈ ఏడాది శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పుడే తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిరంతరాయంగా కొనసాగించిందన్నారు. ఒకానొక దశలో శ్రీశైలం ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసిందని గుర్తు చేశారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ల దృష్టికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకెళ్లారని వివరించారు. ఏపీ హక్కులను తెలంగాణ సర్కార్ కాలరాస్తుండటంతో.. తమ హక్కులను పరిరక్షించుకోవడానికే తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించిన అంశాలు.. క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ నెల 16న ఎన్జీటీకి నివేదిక ఇస్తామని కమిటీ చైర్మన్ డీఎం రాయ్పురే చెప్పారు. పర్యావరణ సమస్యలకు ఆస్కారం లేదు.. పర్యావరణ సమస్యలకు ఆస్కారం లేకుండా సంగమేశ్వరం నుంచి భవనాశి నది ప్రవాహమార్గంలోనే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వరకూ 8 కి.మీల పొడవునా అప్రోచ్ చానల్ తవ్వి... అక్కడ పంప్ హౌస్ నిర్మించి.. నీటిని ఎత్తిపోసి.. 500 మీటర్ల దూరంలోని ఎస్సార్ఎంసీలోకి తరలించేలా అలైన్మెంట్ను మార్చామని అధికారులు కమిటీకి తెలిపారు. ఈ అలైన్మెంట్ ప్రకారం పనులు చేస్తే పర్యావరణపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవని, ఇదే అంశాన్ని ఎన్జీటీకి వివరించామని చెప్పారు. ముచ్చుమర్రి నుంచి రాయలసీమ ఎత్తిపోతల ప్రతిపాదిత ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు కమిటీని జలవనరుల అధికారులు తీసుకెళ్లారు. అక్కడ పంప్ హౌస్ పునాది కోసం చేసిన ఏర్పాట్లను కమిటీ పరిశీలించింది. జియాలజిస్టుల సూచనల మేరకు నేల స్వభావాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు వివరించారు. ఇవన్నీ ఎత్తిపోతల పథకం చేపట్టడానికి సన్నాహకాలు మాత్రమేనని తేల్చిచెప్పారు. ఎన్జీటీ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం విషయమై డీపీఆర్, పర్యావరణ అనుమతులకోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతులు మంజూరయ్యాకే నిర్మాణ పనులు చేపడతామన్నారు. కాగా, రాయలసీమ కరువు ప్రాంతం కాబట్టి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని మీడియా అడిగిన ప్రశ్నకు కమిటీ సభ్యులు సమాధానం దాటవేశారు. ఆ అలైన్మెంట్ రద్దు.. కృష్ణా బోర్డు కమిటీని జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్రెడ్డిలు తొలుత ముచ్చుమర్రి ఎత్తిపోతల వద్దకు తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించేందుకు తొలుత ముచ్చుమర్రి వద్దే పంప్ హౌస్ నిర్మించి.. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోస్తామన్నారు. వాటిని 22 కి.మీల పొడవునా తవ్వే కాలువ ద్వారా తరలించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు దిగువన శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్సార్ఎంసీ)లో 4 కి.మీ వద్ద పోసేలా రాయలసీమ ఎత్తిపోతలను తలపెట్టామని కమిటీకి వివరించారు. కానీ ఈ అలైన్మెంట్ ప్రకారమైతే పర్యావరణానికి విఘాతం కలుగుతుందని తెలంగాణకు చెందిన వ్యక్తి ఎన్జీటీని ఆశ్రయించారని చెప్పారు. ఎన్జీటీ అభిప్రాయం మేరకు ఆ అలైన్మెంట్ను రద్దు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా బోర్డు సభ్య కార్యదర్శి రాయ్పురే నీటి వినియోగంపై ఆరా తీశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు, మల్యాల లిఫ్ట్ల నుంచి ఎంత నీటిని తీసుకుంటున్నారని ప్రశ్నించగా చీఫ్ ఇంజనీర్ మురళీనాథ్రెడ్డి కోర్టు ఉత్తర్వుల మేరకే నీటిని వాడుకుంటున్నామని వివరించారు. -
గాంధీజీ రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ..
గాంధీజీ ఒకసారి మూడో తరగతి రైలుపెట్టెలో రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ రైలు కిటికీలోంచి పొలాలు దున్నుకుంటున్న రైతులను చూసి, వారు మొలచుట్టూ ఒక ఖద్దరు వస్త్రాన్ని మాత్రమే ధరించి, తక్కిన శరీరమంతా నిరాచ్ఛాదనగా చెమట లోడుస్తూ ఎండలో కష్టపడుతూ కనపడగా– రత్నగర్భ నా దేశంలో ప్రజలందరికీ తినటానికి తిండి, కట్టడానికి బట్టలేక పోవటం ఎంత దురదృష్టకరం, దుఃఖకరం అని బాధపడి తాను కూడా ఈ దేశ దౌర్భాగ్య చిహ్నంగా మొలకు అంగవస్త్రం మాత్రమే ధరించాలని కృతనిశ్చయుడైనట్లూ, స్వాతంత్య్రం వచ్చినదాకా అర్ధనగ్నంగానే జీవించాలని నిర్ణయించినట్లూ భోగరాజు పట్టాభిసీతారామయ్య రచించిన సమకాలీన భారతదేశ చరిత్రలో ప్రసక్తమైంది. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు కూడా స్వీయ చరిత్ర (జీవిత నౌక)లో తాను ఇంగ్లండు మొదటిసారి వెళ్లినప్పుడు ఏదో గొప్ప హోటలులో గాంధీజీని యాదృచ్ఛికంగా చూసినప్పుడు మిస్టర్ మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీ ఫుల్సూట్లో, నెక్టైతో సహా కనపడిన ఉదంతం ప్రస్తావించారు. ఆ సూట్ చాలా ఖరీదైనదిగా కూడా ఆంధ్రకేసరి అభిప్రాయపడ్డారు. కాబట్టి స్వరాజ్యోద్యమ తీవ్ర కాంక్ష కలిగించినవారు బక్కచిక్కిన తెలుగు రైతులు అనుకోవద్దా?! స్వరాజ్య ఫలసిద్ధి ఉద్యమంలో తెలుగువారి పాత్ర గణనీయమైనది; వ్యక్తులు, సంస్థలు, ఉద్యమాలు తెలుగునాట స్వరాజ్య సంపాదన ఉద్యమాన్ని ముమ్మరం చేశాయి. భారతదేశ స్వతంత్ర పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు వారికే కాక అఖిల భారతదేశానికి మాననీయుడు. ఒకప్పుడు అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులు న్యాపతి సుబ్బారావు, కార్యదర్శి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అప్పుడు అఖిల భారత కాంగ్రెసు కార్యస్థానం బెజవాడకు వచ్చింది. తెలుగునాట గాంధీ మైదానాలెన్నో ఉన్నవి. ‘హిందూ’ పత్రిక సంస్థాపనంలో న్యాపతి సుబ్బారావు పంతులు సహ భాగస్వామి. అయినా ‘హిందూ’ పత్రిక ఆ విషయం ప్రస్తావించదు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతికి తెలుగు వారంటే గొప్ప ఆదర్శం. తెలుగు భాషనాయన ‘సుందర తెలుంగు’ అని ప్రస్తావించాడు. ఆయన ఒక్కడే కాదు భగవాన్ రమణ మహర్షి ‘తెలుగు మధురమైన భాష, మీ పిల్లలకు నేర్పండి’ అని ఉద్బోధించాడు. ఈ విధంగా తెలుగువారు అనేక త్యాగాలు చేసి, సంస్థలు నిర్మించి, జైళ్ల పాలై స్వరాజ్యోద్యమంలో పాల్గొన్నారు. పెదనందిపాడు రైతుల సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, సైమన్ కమిషన్ను వెనక్కి వెళ్లిపోవల్సిందన్న గర్జన, పల్నాటి మించాలపాటి పన్నుల నిరాకరణ తెలుగువారు స్వరాజ్యోద్యమంలో నిర్వహించిన పాత్ర స్మరణీయమైనవి. వాటి గూర్చి ఇటువంటి ఉత్తేజకర సంగతులు తెలుసుకుందాం. తెలుగువారిలో గాంధీలు, తిలక్లు, బోసులు, నెహ్రూల పేర్లు ఉన్నంతగా భారతదేశం ఇతర ప్రాంతాలలో ఉన్నాయో, లేదో?! – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవం సందర్భంగా)