డీజీపీ దినేష్రెడ్డిపై అసత్య కథనాలు ప్రసారం చేసిన కేసులో 'జీ 24 గంటలు’ చానల్ జర్నలిస్టులు రవి, అక్తర్ బుధవారం చంచల్గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.
హైదరాబాద్ : డీజీపీ దినేష్రెడ్డిపై అసత్య కథనాలు ప్రసారం చేసిన కేసులో 'జీ 24 గంటలు’ చానల్ జర్నలిస్టులు రవి, అక్తర్ బుధవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. చానల్లో తప్పుడు కథనాలు ప్రసారం చేసినట్టుగా వచ్చిన ఆరోపణలపై చానల్ విలేకర్లు రవికుమార్, అక్తర్లను అరెస్ట్ చేసి హుస్సేనీఆలం పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.
డీజీపీ గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని ఫతేదర్వాజాలో ప్రముఖ ముస్లిం మత గురువు హజ్రత్ హబీబ్ ముజ్తబా అల్ హైద్రూస్ను కలవడంపై అవాస్తవాలు ప్రసారం చేశారంటూ ‘జీ 24 గంటలు’ చానల్పై రెండు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. డీజీపీ వెళ్లి హైద్రూస్ను కలవడంపై ‘జీ 24 గంటలు’ చానల్లో ‘స్పెషల్ స్టోరీ’ ప్రసారం చేసింది.