మళ్లీ సైరన్ మిస్త్రీకే టాటా గ్రూప్‌ పగ్గాలు.. | Cyrus Mistry Restored As Tata Sons Chairman | Sakshi
Sakshi News home page

మళ్లీ సైరన్ మిస్త్రీకే టాటా గ్రూప్‌ పగ్గాలు..

Published Wed, Dec 18 2019 3:46 PM | Last Updated on Wed, Dec 18 2019 6:00 PM

Cyrus Mistry Restored As Tata Sons Chairman - Sakshi

టాటా చీఫ్‌గా మళ్లీ సైరస్‌ మిస్త్రీ పగ్గాలు చేపట్టాలని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ వెల్లడించింది.

ముంబై : టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ నియామకం అ‍క్రమమని, గ్రూప్‌ చీఫ్‌గా సైరస్‌ మిస్త్రీ తిరిగి పగ్గాలు చేపట్టాలని నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. టాటా గ్రూప్‌ తనను బోర్డు నుంచి తప్పించడాన్ని సవాల్‌ చేస్తూ మిస్త్రీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన క్రమంలో అప్పీల్‌పై తుది నిర్ణయం వెలువడేవరకూ షేర్లు విక్రయించాలని ఆయనను టాటా సన్స్‌ ఒత్తిడి చేయరాదని ట్రిబ్యునల్‌ గత ఏడాది ఆదేశించింది. 2016 అక్టోబర్‌లో మిస్త్రీని టాటా గ్రూప్‌ బోర్డు నుంచి తొలగించారు. ఇక రతన్‌ టాటా స్ధానంలో డిసెంబర్‌ 2012లో మిస్త్రీ టాటా గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement