పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు | Excise duty on petrol and diesel hiked by Rs 1.50 per litre | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు

Published Thu, Nov 13 2014 2:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

Excise duty on petrol and diesel hiked by Rs 1.50 per litre

ముంబై: పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం పెట్రోల్, డీజిల్ పై లీటరకు రూ.1.50 సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో సాధారణ రకం లీటరు పెట్రోల్ పై ఉన్న రూ.1.20 ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.70 పెంచగా, బ్రాండెడ్ పెట్రోల్ పై ఉన్న సుంకాన్ని రూ.2.35 నుంచి రూ. 3.85కు పెంచింది.

 

డీజిల్ పై కూడా ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అంతకుముందు సాధారణ రకం డీజిల్ పై ఉన్న రూ.1.46  ఎక్సైజ్ సుంకపు విలువను రూ.2.96కు పెంచగా, బ్రాండెడ్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.3.75 నుంచి రూ. 5.25 కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement