న్యూఢిల్లీ: ఐపీవోల ద్వారా సమీకరించే నిధులను చిన్న సంస్థలు దుర్వినియోగం చేయకుండా మార్కెట్ల పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. రూ.500 కోట్లకు మించి నిధులను సమీకరించే ఐపీవోల పర్యవేక్షణ కోసం ఓ ఏజెన్సీని నియమించాలనే నిబంధన ఇప్పటి వరకు అమల్లో ఉండేది. ఇకపై రూ.100 కోట్ల నిధుల్ని సమీకరించే ఐపీవోలు కూడా ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఏజెన్సీ అనేది బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అయినా కావచ్చు.
కొన్ని సంస్థలు ఐపీవో పత్రాల్లో పేర్కొన్న అవసరాలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు నిధులు మళ్లిస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ మార్పులు చేసింది. మరోవైపు ఐపీవోల్లో అర్హతగల సంస్థాగత మదుపరుల (క్యూఐబీ) విభాగంలో పాల్గొనేందుకు ఎన్బీఎఫ్సీ సంస్థలకు సెబీ అర్హత కల్పించింది. దీంతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల మాదిరిగా క్యూఐబీ పోర్షన్లో ఎన్బీఎఫ్సీ సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రూ.500 కోట్ల నెట్వర్త్ కలిగి, ఆర్బీఐ వద్ద నమోదైన సంస్థలకు ఈ అవకాశం ఉంటుంది.
చిన్న సంస్థల ఐపీవోలపై మరింత నిఘా
Published Sat, Jun 3 2017 2:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM
Advertisement
Related news by tags
-
Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..!
ఫిబ్రవరి అంటే ప్రేమికుల నెలమాత్రమే కాదు. మరొకటి కూడా ఉంది. ఫిబ్రవరి 14 వరకు వారంరోజుల పాటు వాలెంటైన్స్ వీక్ సందడి ఉంటుంది. అంతా ప్రేమికులకు, ఓకే చెప్పడానికి అయితే.. తిరస్కరించడానికీ, భగ్న ప్రేమికులకీ ఉండాలిగా అన్నట్టు యాంటీ వాలెంటైన్స్ వీక్ సందడి కూడా షురూ అవుతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి! రోజ్ డే, ప్రపోజల్ డే, లవ్ డే, కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే అంటూ ప్రేమ పక్షులు సందడి చేస్తే ..ఫిబ్రవరి 15నుంచి యాంటీ వాలెంటైన్స్ వీక్ భగ్నప్రేమికులకు, ప్రేమను తిరస్కరించే కిక్కు అన్నట్టు..ఫిబ్రవరి 15న చెంపదెబ్బతో మొదలై, ఫిబ్రవరి 21న బ్రేకప్తో తృప్తి పడతారు వాలెంటైన్స్ వీక్ అంతా. యాంటీ వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 15, స్లాప్ డే: గుండె పగిలిన వారందరూ తమ బాధలన్నింటికీ కారణమైన తమ మాజీలను చెంపదెబ్బ కొట్టడానికి ఈ రోజు అనుమతిస్తుంది. ఒక విధంగా ఇది ఇబ్బంది పెట్టే చెడు ఆలోచనలు, జ్ఞాపకాలను దూరం చేసే రోజు. ఫిబ్రవరి 16,కిక్ డే: ప్రేమలో మోసం చేసిన వారి జ్ఞాపకాలన్నింటినీ వదిలించుకోవడం, జీవితంలో నింపిన విషాదాన్ని, కోపాన్ని వదిలేయడం. అంతేకాదు వాళ్లిచ్చిన గిఫ్ట్స్లు, ఇతర గుర్తులను పూర్తిగా వదిలివేయడం. ఫిబ్రవరి 17, పెర్ఫ్యూమ్ డే: పదే పదే వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, మంచి పరిమళంతో కొత్త ఆహ్లాదాన్ని నింపుకోవడం ఫిబ్రవరి 18, ఫ్లర్ట్ డే: ఈ రోజున కొత్త వ్యక్తిని కలుసుకుని వారితో సరదాగా గడపడం ఫిబ్రవరి 19, కన్ఫెషన్ డే: తప్పులను ఒప్పుకోవడం, ఎదుటివారిని క్షమించమని అడగడం ఫిబ్రవరి 20, మిస్సింగ్ డే : ఎవరైనా తమ వాలెంటైన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటే వాళ్లకి మెమొరీస్ని గుర్తు చేయడం ఫిబ్రవరి 21, బ్రేకప్ డే:ఇది కీలకమైందీ.. చివరి రోజు కూడా అవతలి వారి ప్రేమ నిజమైంది కాదనిపిస్తే..నిస్సందేహంగా వదిలివేయడం హ్యాపీగా ఉండటం. ప్రేమ అందమైందే ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చాలా చాలా అందంగా కనిపిస్తుంది. కానీ తేడా వస్తే విడిపోతే భరించడం కష్టమే. నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది.. కానీ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. మనలాంటివాళ్లని దక్కించుకోలేని దురదృష్టవంతులు అనుకొని వదిలేయాలి. నిజానికి గమనిస్తే.. నిస్వార్థంగా మనల్ని మనంగా ప్రేమించే వాళ్లు చాలామంది ఉంటారు. దాన్ని మనం గుర్తించగలగాలి అంతే. -
ఆకాశానికి నిచ్చెనలు వద్దు..ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్
ఆకాశహర్మ్యాలకు పారిస్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ దగ్గర్నుంచి ఎన్నో భవంతులు నింగికి నిచ్చెన వేసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటాయి. పారిస్ ఇప్పుడు వాటి నిర్మాణానికి బ్రేక్ వేసింది. మొట్టమొదటి ఆకాశాన్నంటే భవనాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు ఇంకా కొన సాగితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై సాధారణ భవనాలదే భవిష్యత్ అన్నది పర్యావరణ వేత్తల మాట. ప్రపంచ పర్యాటక స్వర్గధామం పారిస్. ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కోట్లాదిమంది విదేశీయులు తరలివస్తుంటారు. ఈఫిల్ టవర్, మోపానాసే టవర్, లౌవ్రే పిరమిడ్ వంటి ఆకాశహర్మ్యాలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. అంతస్తుల మీద అంతస్తులు నింగికి నిచ్చెనలా వేసుకుంటూ నిర్మించిన భవనాల అందాలు వర్ణించ వీల్లేదు. 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్ , 210 మీటర్ల ఎత్తయిన మోపానాస్ టవర్ (689 అడుగులు) పారిస్కున్న సిటీ ఆఫ్ లైట్స్కి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. పారిస్లో ఎత్తైన భవన నిర్మాణాలు మనకి ఇక కనిపించవు. వాటి నిర్మాణంపై పారిస్ నగర కౌన్సిల్ నిషేధం విధించింది. స్థానికంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కొత్తగా నిర్మించే భవనాలేవైనా 12 అంతస్తులు లేదంటే 37 మీటర్లకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో అంతటి అందాల నగరం మురికి కూపంలా మారిపోయింది. పారిస్కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలంటే కాలుష్య కారకమైన ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని నిలిపివేశారు. 18వ శతాబ్దంలో పారిస్ అంటే చిన్న చిన్న ఇళ్లతో చూడముచ్చటగా ఉండేది. ఆ దేశ మొట్ట మొదటి అధ్యక్షుడు నెపోలియన్ –3 రాజధానిపై ఎన్నో కలలు కన్నారు. ఆధునిక, చైతన్యవంతమైన నగరంగా పారిస్ను రూపొందించడానికి ప్రత్యేకంగా కొందరు ఇంజనీర్లను నియమించారు. చిన్న చిన్న భవనాలు, ఉద్యాన వనాలు అండర్ డ్రైనేజీ వంటి వ్యవస్థలతో పారిస్ అత్యంత పరిశుభ్రంగా పచ్చదనంతో అలరారేలా మారింది. ఆరు అంతస్తుల రాతి నిర్మాణాలు చూడడానికి అందంగా , నివాస యోగ్యంగా ఉండేవి. ఈఫిల్ టవర్ మినహాయించి మరో ఎత్తైన భవనం లేదనే చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధంలో నగరం చాలా వరకు ధ్వంసం కావడంతో ఆ శిథిలాల నుంచి ఇప్పుడు మనందరం చూస్తున్న సరికొత్త పారిస్ నగరం పుట్టింది. అప్పటికే ఆకాశాన్నంటే భవంతులతో అందరినీ ఆకట్టుకుంటున్న న్యూయార్క్, లండన్ వంటి నగరాల బాటలో పారిస్ నడిచింది. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 59 అంతస్తులు ఇలా కట్టుకుంటూ వెళ్లిపోయింది. 1973లో తొలిసారిగా అత్యంత ఎత్తైన మోపానాస్ టవర్ నిర్మాణం జరిగింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలా మళ్లీ ఆ నాటి నిర్మాణాల వైపు చూస్తోంది. ప్రజలకి తగ్గిన మోజు రానురాను ప్రజలకీ ఈ హంగు ఆర్భాటాల్లాంటి భవనాలపై మోజు తగ్గింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పారిస్గా మారిపోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా అన్నేసి అంతస్తులున్న భవనాల్లో నివాసం మా వల్ల కాదంటూ ఒక దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 50 అంతస్తుల భవనం నిర్మిస్తే పై అంతస్తులో నివాసం కోసం ప్రజలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీనికి పలు కారణాలున్నాయి. పై అంతస్తుల్లో ఉండే వారిలో ఒంటరితనం వెంటాడుతోంది. సమూహం నుంచి దూరంగా ఉన్న భావన పెరిగిపోయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంత ఎత్తు నుంచి కిందకి రావడమే ఒక ప్రసహనంగా మారుతోంది. దీంతో నాలుగ్గోడల మధ్య అధికంగా కాలక్షేపం చేయడంతో శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఎత్తైన భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పర్యావరణానికీ దెబ్బే అతి పెద్ద అంతస్తులు పర్యావరణానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఇంధనం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణ భవనంలో ప్రతీ చదరపు మీటర్కి ఖర్చు అయ్యే ఇంధనానికి ఆకాశహర్మ్యాలలో రెట్టింపు ఖర్చు అవుతుంది. కాలుష్యం 145% అధికంగా విడుదల అవుతుంది. పై అంతస్తులకి నీళ్లు పంప్ చెయ్యడానికి అధికంగా విద్యుత్ వినియోగించాలి. భవనాల నిర్వహణ ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. ఈ భవన నిర్మాణాలతో ఇంధనం 48% , కర్బన ఉద్గారాలు విడుదల 45% , వ్యర్థాలు 25% వస్తూ ఉంటే నీటి వినియోగం 15% ఉంటోంది. భావితరాలు వినియోగించాల్సిన సహజ వనరుల్ని ఇప్పుడే మనం ఖర్చు చేసేయడంపై పర్యావరణవేత్తల్లో ఆందోళన కూడా నెలకొంది.అందుకే ఇక భవిష్యత్ అంతా సాధారణ భవనాలదేనని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా పారిస్ బాటలోనే నడుస్తూ ఎత్తయిన భవన నిర్మాణాలను నిలిపివేసింది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇతర దేశాల్లో అతి పెద్ద నగరాలు కూడా పారిస్ బాటలో నడవక తప్పదు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరేళ్ల లవ్వాయణానికి బ్రేక్, స్టార్ జంట బ్రేకప్!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ లవ్లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతూనే ఉన్నారీ లవ్ బర్డ్స్. అయితే ఉన్నట్లుండి ఏమైందో ఏమో కానీ వీరు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. వాళ్ల మధ్య ఏవో పొరపచ్చాలు వచ్చాయని, ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకుని బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఓ వార్త బీటౌన్లో వైరల్గా మారింది. ఇక దిశా పటానీ టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా! తరచూ వాళ్లింటికి కూడా వెళ్తూ అతడి కుటుంబంతోనూ చక్కగా కలిసిపోయేది. ఏదేమైనా చూడచక్కగా ఉండే ఈ జంట విడిపోవడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించని వీరు సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూ వారి పోస్ట్లకు కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం ఇద్దరూ వారి వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా చోటేమియా సినిమలతో బిజీ ఉన్నాడు. దిశా పటానీ.. ఏక్ విలన్ రిటర్న్స్, ప్రాజెక్ట్ కె, యోధ, కెటినా సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) చదవండి: అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యాన్స్కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్బాస్’ జోడీ -
జస్ట్ రూ.కోటి కారు కొనగలనంతే.. హీరోపై ట్రోలింగ్
Harsh Vardhan Kapoor Gets Trolled For His Sad Reality: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్, ఆయన కుమారుడు హర్షవర్ధన్ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం థార్. ఈ మూవీ మే 6 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలోని విషాదకరమైన వాస్తవాన్ని పంచుకున్నాడు. కానీ అదికాస్త రివర్స్ అయింది. హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోలింగ్కు దిగారు. ఈ ట్రోలింగ్తో నెట్టింట ట్రెండింగ్లో ఉన్నాడు హర్షవర్ధన్ కపూర్. ఇంటర్వ్యూలో 'ప్రేక్షకులకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాకు వస్తువులు కొనేందుకు నా తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టముండదు. నాకు కావాల్సిన వాటిని నా సొంత డబ్బుతో కొనుక్కుంటాను. అందుకే నేను రూ. 3 కోట్ల ఖరీదుగల కారుకు బదులు కోటి రూపాయల లంబోర్గిని కారు కొనాల్సి వస్తుంది. నా దగ్గర ఉన్నదానికంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటారు. నా దగ్గర 5 కార్లు, 30 గడియారాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఇదే నా జీవితంలోని విషాదకరమైన వాస్తవం.' అని హర్షవర్ధన్ తెలిపాడు. చదవండి: నెట్ఫ్లిక్స్లో ఈ వారంలో విడుదలైన చిత్రాలు.. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్ హర్షవర్ధన్ను ఆడేసుకుంటున్నారు. 'నాకు కూడా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ల విచారంగా ఉండాలని ఉంది' అని ఒక యూజర్ ట్వీట్ చేశారు. మరొకరు అతనికున్న షూ వార్డ్రోబ్ చూపిస్తూ 'ఈ షూలన్ని వేసుకుని డ్రైవ్ చేయడానికి అతనికి లంబోర్గిని కారు లేదు. అదే నిజమైన బాధ.' 'ఇది చూసి ఆడిషన్స్కు 125సీసీ బైక్స్పై ఎవరు వెళ్తారు.' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో and this guy has room filled of shoes..... pic.twitter.com/IPKVFosGZP — pretty P (@sassymocha_) May 10, 2022 Strugglers who go to auditions on 125cc bikes reading this pic.twitter.com/hiyVUvCcjk — Sagar (@sagarcasm) May 10, 2022 Siddhant Chaturvedi is a legend 🔥🔥 pic.twitter.com/8bf8IhzEVx — Rahul D / राहुल / راہول (@rdalwale) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా బంధం ముగిసింది: బ్రేకప్పై సుష్మితా సేన్ క్లారిటీ
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రముఖ మోడల్, నటుడు రోహ్మాన్ షాల్ తమ ప్రేమాయణానికి ముగింపు పలికినట్లు ఫిల్మీదునియాలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడిపోయిన నేపథ్యంలో రోహ్మన్ నేడు(డిసెంబర్ 23) సుష్మిత ఇంటి నుంచి బయటకు వచ్చేసి తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సుష్మిత. 'ఫ్రెండ్స్గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్షిప్ ముగిసింది కానీ ప్రేమ మిగిలింది. ఐ లవ్ యూ గయ్స్' అని రాసుకొచ్చింది. దీనికి రోహ్మాన్తో దిగిన ఫొటోను జత చేసింది. ఇక ఈ పోస్ట్పై రోహ్మన్ రియాక్ట్ అవుతూ 'ఎల్లప్పుడూ అలాగే ఉందాం' అని కామెంట్ చేశాడు. కాగా సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్తో మూడేళ్లుగా డేటింగ్ చేస్తోంది. వీరిద్దరి జంటను చూసి ముచ్చటపడిన అభిమానులు బ్రేకప్ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47)
Related News by category
-
ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?!
న్యూఢిల్లీ: మనం చిన్నప్పటి ఫోటోలను మన స్నేహితులకు చూపించి ఈ ఫోటోలో ఉంది ఎవరో చెప్పు అని అడుగుతాం. కానీ వాళ్లు మనమే అని కూడా సరిగా గుర్తు పట్టలేరు కదా. ఎందుకంటే వయసు పెరుగుతుంటే కొంచెం కొంచెంగా శరీరంలో మార్పులు సంతరించుకోవడంతే కొంచెం పోల్చుకోవడం కష్టం అనిపిస్తోంది. మరికొంత మందిని ఈజీగా గుర్తుపట్టేయగలం. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) ఏంటి సోదీ అనుకోకండి ఇక్కడ ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడయోలో పోస్టు చేసి ఇతనెవరో గెస్ చేయండి ప్లీజ్ అంటు కామెంట్ జోడించి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచే మిలిందా ఈసారి తన చిన్ననాటి స్మృతులను తన అభిమానులతో పంచుకున్నాడు. ఇది తాను ఆరేళ్ల వయసులో ఉండగా తీసిన పోటో అంటూ చెప్పుకొచ్చాడు. పైగా తాను ఆ వయసులో మంచి రైతు అవ్వాలని అనుకున్నాడట. కానీ ఇప్పుడు ఈ 50 ఏళ్ల వయసులో కృత్రిమంగా కూరగాయాలు ఎలా పండించాలో తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ప్రస్తుతం మిలింద్ సోమన్ మలైకా అరోరా అనూష దండేకర్తో కలిసి టీవీ రియాలిటీ షో సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ రెండవ సీజన్కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: టైంకి ఎయిర్పోర్ట్కి చేరాలంటే ట్రాక్టర్పై వెళ్లక తప్పదు) -
Shabana Azmi birthday special: వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పీస్
సాక్షి, హైదరాబాద్: వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. ముందుతరం నటీ నటులకు ఆమె ఒక నిఘంటువు. ఒక చిన్న ముఖ కవళిక, అంతకుమించిన విషాదపు విరుపు, కంటినుంచి జారీ జారని నీటి చుక్క.. ఒకపంటి మెరుపు ఇవి చాలు నటనకు అని చాటిచెప్పిన గొప్ప నటి షబానా అజ్మీ. ఏకకాలంలో 12 చిత్రాలలో పని చేసిన ఘనత ఆమె సొంతం. మన హైదరాబాదీ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ షూటింగ్ సమయంలో గంటల తరబడి వేచి చూడటం అంటే తనకు ఎపుడూ ఇబ్బంది కాలేదనీ ఎందుకంటే నిర్మాతలకు మనం ఒక ఎసెట్గా ఉండాలి తప్ప, భారంగా ఉండకూడదనేది తల్లి ఫౌకత్నుంచినేర్చుకున్న గొప్పపాఠం అంటారామె. తానొక గొప్పనటిగా చెప్పుకోను, సరైన సమయంలో సరైన అవకాశాలు దొరకడం తన అదృష్టం. ఈ ఘనత అంతా తనకు లభించిన చక్కటి శిక్షణ, స్క్రిప్ట్, గొప్ప దర్శకులకే దక్కుతుందన్నారు. సినిమా అనేది సంయుక్త కృషి అసలు సినిమా కథకు మించి ఏ యాక్టర్ ఎదగలేడంటూ స్క్రిప్ట్కు పెద్ద పీట వేశారామె. అలాగే సద్విమర్శలను జాగ్రత్తగా గమనించడంతోపాటు తనన పనిని తాను నిజాయితీగా అంచనా వేసుకుంటానంటారు షబానా. సాధించినదానికి పొంగిపోకుండా ఉండాలని ఎప్పటికే భావిస్తున్నాను ఎందుకుంటే నటన అంటే ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడమే అంటారు. యువతకు స్వేచ్ఛ నివ్వాలని, వారి అభిపప్రాయాలను గౌరవించాలంటారు. తమ తల్లిదండ్రులు తనకు, తనసోదరుడు బాబా (సినిమాటోగ్రాఫర్, బాబా అజ్మీ) అలాగే పెరిగామని, అడగకుండా ఎపుడూ ఎలాంటి సలహా ఇవ్వలేదని ఇపుడు తానూ అదేఆచరిస్తున్నానన్నారు. యువత నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని తానునమ్ముతానన్నారు. సైకాలజీని అవపోసన పట్టిన షబానా పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడం ఈజీ అయింది. బార్బరా స్ట్రీసాండ్ ఏ స్టార్ ఈజ్ బోర్న్లో చెప్పినట్లుగా నాకు పెద్దగా కోరికలు లేవు....కానీ ఇంకా చాలా కావాలి. పాడతా.. అన్నీ కావాలి..భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ను సాగిస్తున్న షబానా అజ్మీ తొలి వెబ్ సిరీస్ ‘ది ఎంపైర్’ ఓటీటీలో సందడి చేస్తోంది. -
నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్, హీరో రితేశ్ దేశ్ముఖ్ హోస్ట్లుగా వ్యవహరిస్తున్న "యారోంకి బారాత్" అనే చాట్ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి.. తన చిన్నతనంలో జరిగిన ఆసక్తికర సంఘటనను వెల్లడించింది. తన సోదరుడు, బాలీవుడ్ నటుడు సకీబ్ సలీంకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణమని, ఓ సందర్భంలో అతనితో గొడవ పడ్డప్పుడు కోపంలో అతని ఆరాధ్య దైవమైన సచిన్ పోస్టర్లను చించేశానని పేర్కొంది. దీనికి బదులుగా అతను తన ఫేవరెట్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది ఫోటోలను చించేశాడని వివరించింది. అయితే షో హోస్ట్లు.. నువ్వు సచిన్ పోస్టర్లను చించావా అని ప్రశ్నించడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. తను కూడా సచిన్ వీరాభిమానినేనని.. చిన్నతనంలో అన్న చెల్లెల్ల మధ్య ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతుంటాయని కవర్ చేసుకుంది. తను క్రికెట్ను ఫాలో అవుతున్న రోజుల్లో పాక్ ఆటగాడు అఫ్రిది అరంగేట్రం చేశాడని, అతని దూకుడైన ఆటతీరు, అతని హెయిర్ స్టైల్ తనను బాగా ఇంప్రెస్ చేశాయని చెప్పుకొచ్చింది. 90వ దశకంలో ఆఖర్లో అఫ్రిదికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని, కాబట్టి తాను కూడా అతనికి అకర్షితురాలినయ్యానని తెలిపింది. కాగా, హ్యూమా ఖురేషి 2012లో విడుదలైన "గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్" సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. చదవండి: ఆర్సీబీ అభిమానినే కానీ, కోహ్లి నా ఫేవరెట్ క్రికెటర్ కాదు: రష్మిక -
ఐ లవ్ యూ ప్రియాంక..స్పెషల్ విషెస్
ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున జోధ్పూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో ఒకటయ్యారు ఈ జంట. క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్న ఫోటోలను షేర్ చేసి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా భార్య ప్రియాంకకు సోషల్మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశాడు పాప్స్టార్. దీనిపై ప్రియాంక స్పందించిన తీరు అభిమానుల హృదయాలను దోచుకుంది. అద్భుతమైన, అందమైన స్త్రీని వివాహమాడి సరిగ్గా రెండేళ్లు అయ్యిందని, 'హ్యాపి వెడ్డింగ్ అనివర్సరీ ఐ లవ్ యూ ప్రియాంక' అని నిక్ చేసిన పోస్ట్ పై ప్రియాంక స్పందించింది. (చదవండి: లాక్డౌన్పై కాజోల్ క్రేజీ క్యాప్షన్) 'నువ్వే నా బలం, బలహీనత, ఎల్లప్పుడూ నా వెంటే ఉండే నా ధైర్యం.. ఐ లవ్ యూ నిక్' అంటూ ప్రియాంక సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. 2018 డిసెంబర్ 1న క్రైస్తవ పద్ధతిలో ఒకటైన ఈ జంట డిసెంబర్ 2వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఢిల్లీ, ముంబైలలో గ్రాండ్గా రెండుసార్లు రిసెప్షన్ చేసుకున్నారీ జంట. కుటుంబ సభ్యులు, బాలీవుడ్ నటీనటులు, పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రియాంక చోప్రా ఇటీవల జర్మనీ యాక్టర్ కియానో రీవ్స్తో కలిసి షూటింగ్ ముగించింది. తరువాత నెట్ఫ్లిక్స్లో రానున్న 'ది వైట్ టైగర్'లో కనిపించనుంది. ఈ సినిమా 'అరవింద్ అడిగా' అనే బుక్ ఆధారంగా తెరకెక్కనుంది. రాజ్కుమార్రావ్, ఆదర్ష్ గౌరవ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. హాలీవుడ్లో 'వి కెన్ బీ హీరోస్'లో కూడా ప్రియాంక కనిపించనుంది. ఈ సినిమాను రాబర్ట్ రోడ్రిక్వేజ్ నిర్మించనున్నారు. -
దర్శకుడిగా మారనున్న హీరో..
సాక్షి,ముంబై: ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం నటనకు స్వస్తి చెప్పినా.. త్వరలోనే దర్శకత్వంలోకి రాబోతున్నాడని ఒక ఇంటర్వ్యూలో అతని స్నేహితుడు అక్షయ్ ఒబెరాయ్ చెప్పారు. ఇమ్రాన్ 2008లో ‘జానే తు ... యా జానే నా’... చిత్రంతో మొదటిసారిగా హీరోగా నటించారు. అతని చివరి సినిమా ‘కట్టీ బట్టీ’ 2015లో విడుదలయ్యింది. ఇద్దరం కలిసి ఒకే దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నామని అక్షయ్ తెలిపారు. గుర్గావ్, కలకండి వంటి చిత్రాల్లో అక్షయ్ నటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘బాలీవుడ్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఇమ్రాన్ ఖాన్. నాకు ప్రాణ స్నేహితుడు.. నేను అతనికి తెల్లవారుజామున 4 గంటలకు కాల్ చేయగలను. నేను,ఇమ్రాన్ దాదాపు 18 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. మేము అంధేరి వెస్ట్లోని కిషోర్ యాక్టింగ్ స్కూల్లో కలిసి యాక్టింగ్ నేర్చుకున్నాము.’ అని తెలిపారు. (చదవండి: ప్రేమ విషయాన్ని దాచలేదు: హీరో కూతురు) ‘‘ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతానికి నటనను విడిచిపెట్టారు. నాకు తెలిసినంతవరకు తనలో మంచి రచయిత, దర్శకుడు ఉన్నారు. ఆయన ఎప్పుడు డైరెక్షన్ చేస్తారో నాకు తెలియదు. కానీ ఓ స్నేహితుడిగా నేను ఎటువంటి ఒత్తిడి చేయను. ఆయన అద్భుతమైన చిత్రం చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సినిమాపై అతనికీ చాలా అవగాహన ఉంది” అని అక్షయ్ ఒబెరాయ్ తెలిపారు.
Advertisement