మెట్టుగూడలో రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి | Bike Hits Divider At Mettuguda Three People Dead | Sakshi
Sakshi News home page

Nov 20 2018 6:42 AM | Updated on Nov 20 2018 12:35 PM

Bike Hits Divider At Mettuguda Three People Dead - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మెట్టుగూడలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైక్‌ మెట్టుగూడలోని మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న లాలాగూడ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను ఉదయ్‌, పృథ్వీ, ఉదయ్‌రెడ్డిలుగా గుర్తించారు.

ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు బైక్‌పై(నంబర్‌ టీఎస్‌08 ఎఫ్‌టీ 6841) వెళ్తున్న యువకులు మెట్టుగూడ వద్ద మూలమలుపును సరిగా అంచనా వేయకలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతి వేగం కారణంగానే ప్రమాదం చోటుచుసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన యువకులను సూర్యాపేట జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.  

హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు..
లుంబినీ పార్క్‌ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ కారు అదుపుతప్పి హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లింది. అతివేగంతో కారు యూ టర్న్‌ వద్ద మలుపు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నీళ్లలో ఉన్న కారును క్రేన్‌ సాయంతో బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement