
అగ్ని ప్రమాదం జరిగిన రేబాక టైర్ల పరిశ్రమ
విశాఖపట్నం జిల్లా : అనకాపల్లి మండలం రేబాక టైర్ల కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కార్మికులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడ్డవారు రేబాక చెందిన కోన మధు, సియాద్రి శ్రీను ,గణేష్, గాజువాక డ్రైవర్స్ కాలనీకి చెందిన గోవింద కుమార్, శ్రీను, గోపీలుగా గుర్తించారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విషయం తెలిసి సంఘటనాస్థలానికి బయలు దేరారు.

అంబులెన్స్లో క్షతగాత్రులు

క్షతగాత్రులు
Comments
Please login to add a commentAdd a comment