Anakapalle
-
లోకేష్ను కలిసిన న్యాయం జరగలేదు.. పెట్రోల్ బాటిల్తో టీడీపీ కార్యకర్త నిరసన
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలనలో తనకు న్యాయం జరగలేదంటూ పెట్రోల్ బాటిలతో కలెక్టర్ కార్యాలయం ముందు ఓ టీడీపీ కార్యకర్త నిరసనకు దిగాడు. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని.. న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ టీడీపీ కార్యకర్త బుద్ధా శ్రీను హెచ్చరించాడు.అధికార పార్టీకి చెందిన తనకే న్యాయం జరగలేదని.. ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. లోకేష్ను కలిసిన న్యాయం జరగలేదన్నారు. రికార్డులు తారుమారు వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న బుద్ధా శ్రీను.. న్యాయం జరగకపోతే కుటుంబంతో ఆత్మహత్యే గతి అంటూ వాపోయాడు. -
‘మా పార్టీలో మీ పెత్తనం ఏంటి?’.. టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అనకాపల్లి జిల్లా,సాక్షి: అనకాపల్లి జిల్లా టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల పెత్తనాలు టీడీపీలో ఎక్కువై పోయాయంటూ ఆ పార్టీలోని మరోవర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ చిచ్చు పెట్టింది. జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీనిపై తాతయ్య బాబు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడి ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. పార్టీలు మారి వచ్చిన వారు పెత్తనం టీడీపీలో ఎక్కువైందని మండిపడ్డారు. అనంతరం, ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇదే పరిస్థితి ఉంటే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుంది’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
అనకాపల్లి: వేపాడు దివ్య కేసులో సంచలన తీర్పు
అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్ను దోషిగా ప్రకటించిన చోడవరం కోర్టు.. మరణశిక్షను ఖరారు చేసింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుణశేఖర్కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని.. స్కూల్కి వెళ్లి వస్తున్న ఆరేళ్ల చిన్నారి దివ్యను నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణ శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లపాటు విచారణ జరగ్గా.. చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ తీసేయమని బాబుగారికి చెబితే పోలా..!
‘‘ఈరోజు ప్రపంచం ఇలా ఉందంటే అందుకు కారణం నేనే.. మన చేతుల్లో సెల్ ఫోన్ ఉందంటే అందుకు కారణం కూడా నేనే. సెల్ ఫోన్ తో ప్రపంచాన్ని క్షణాల్లో వీక్షించి వస్తున్నామంటే అందుకు కారణమూ నేనే’’ ఈ తరహా గప్పాలు కొట్టుకోవడం మన బాబుగారికి బాగా అలవాటు. ఏదైనా మంచి విషయం వెలుగులోకి వస్తే చాలు అందుకు ఆద్యుడిని తానే అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి చెప్పుకోవడం అలవాటు. ఇది కేవలం బాబుగారికి మాత్రమే చెల్లిన అలవాటు. పొరపాటున కూడా ఆ అలవాటు మార్చుకోరు మన బాబు గారు. లోకేష్కు సెల్ఫోన్ భయం..మరి ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ కు సెల్ ఫోన్ ను చూస్తే భయవేస్తోందట. ఎవరి చేతుల్లోనైనా సెల్ ఫోన్ చూస్తే అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మన చినబాబు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కార్యకర్తలతో ఈరోజు(సోమవారం) లోకేష్ సమావేశమయ్యారు. వారికి ముందుగా ఒకే ఆజ్ఞ చేశారు చినబాబు. ‘సెల్ ఫోన్ లలో ఏమీ రికార్డు చేయొద్దమ్మా’ అంటూ తన స్టైల్ లో ఆదేశాలిచ్చారు లోకేష్. ఇదంతా ఎందుకంటే తనను ఎవరైనా నిలదీసి అది రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే పరిస్థితి ఏమటనే కోణంలోనే లోకేష్ ముందుగా జాగ్రత్తలు పడ్డారు. ఈ భేటీలో సూపర్ సిక్స్ హామీలపై ఎవరైనా నిలదీసి అది సోషల్ మీడియా వరకూ చేరితే ట్రోలింగ్ గురి కావాల్సి వస్తుందని ముందే గ్రహించిన లోకేష్ దీన్ని మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా రికార్డింగ్ చేస్తే సెల్ ఫోన్స్ అమ్మి కార్యకర్తల నిధికి ఇచ్చేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీనిపై టీడీపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మన లోకేష్ బాబు ఏంటి.. ఇలా మాట్లాడుతున్నారంటే అనుకోవడం అక్కడకు వచ్చిన కార్యకర్తల వంతైంది.లోకేష్ వ్యాఖ్యలను వినడానికి ఫోటోపై క్లిక్ చేయండి..మరి నాన్నగారైన చంద్రబాబు సెల్ ఫోన్ కు రావడానికి కారణం తానేనని, ఆరోజు అప్పటి ప్రధాని వాజ్ పేయికి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సెల్ ఫోన్ వచ్చిందని బాబుగారు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇప్పటికీ. మామూలుగా ఫోన్ చేసుకోవడానికే కాదు.. డబ్బులు సంపాదించుకోవడానికి సెల్ ఫోన్ అవసరం ఎంతో ఉంది. అదొక నిత్యావసర వస్తువంటూ 2023లో ఓ సందర్భంలో కామెంట్స్ చేశారు చంద్రబాబు. భార్య లేకపోతే భర్త ఉంటాడని, భర్త లేకపోతే భార్య ఉంటుందని, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరూ ఉండరంటూ బాబుగారు తన గొప్పను గొప్పగానే చెప్పుకున్నారు. ఇలా సమయం దొరికినప్పుడల్లా బాబుగారు సెల్ ఫోన్ కు ఎక్కువ ప్రమోషన్ ఇస్తూ.. తనను కూడా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.కొసమెరుపు: మరి ఇప్పుడు అదే సెల్ ఫోన్ చూసి లోకేష్ భయపడుతున్నారంటే ఏమనాలి. ఇక నుంచి సెల్ ఫోన్ లో రికార్డింగ్ ఆప్షన్ తీసేయమని ఇప్పుడు బాబుగారికి చెబితే బాగుంటుందేమో మరి. -
మాకు రోడ్లేవి? .. ఏడు గ్రామాల ప్రజల పాదయాత్ర
మాడుగుల(అనకాపల్లి జిల్లా): ఎన్నికలకు ముందు హామీలకు హామీలు కురిపించి అధికారం వచ్చిన తర్వాత వాటిని గాలికొదిలేస్తోంది ఏపీ ప్రభుత్వం. హామీలను అమలు చేయకపోవడంపై ఏపీ ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. తాజాగా అనకాపల్లి జిల్లాలోని ఏడు గ్రామాల గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గ్రామాలకు చెందిన గిరిజనులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు.తమకు రోడ్లేవి అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనిలో భాగంగా 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు ఏడు గ్రామాల ప్రజలు. రోడ్డు కోసం మాడుగల ఎంపీడీవో కార్యాలయం ముందు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో వినతిపత్రం సమర్పించారు గిరిజనులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా తమ రోడ్డు గురించి ఇప్పటివరకూ పట్టించుకోలేదని మండిపడుతున్నారు.. వర్షాలు పడితే వాగులు, వంకలు దాటాల్సి వస్తుందని, గర్భిణీలకు హాస్పిటల్ కు డోలీలు కట్టి తీసుకెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు స్థానికులు కాకపోవడం వలన తమ సమస్యలను పట్టించుకునే వారే లేరంటున్నారు. -
నిర్వాసితునికి జనసేన ఎమ్మెల్యే బెదిరింపులు
మునగపాక: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సహనం కోల్పోయారు. సందర్భాన్ని బట్టి ఓర్పు, సహనంతో నియోజకవర్గ ప్రజలను సముదాయించాల్సిన ఆయన విరుచుకుపడ్డారు. భూసేకరణలో టీడీఆర్ బాండ్లు వద్దు.. నగదు చెల్లించాలని ఓ బాధితుడు కోరడమే ఆయన ఆగ్రహానికి కారణం. జిల్లాలోని మునగపాక జనసేన కార్యాలయం ఆవరణలో గురువారం పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా పరిహారం కింద నగదు అకౌంట్లో జమచేయాలని కోరారు. తిమ్మరాజుపేటకు చెందిన తనకాల జగ్గారావు మాట్లాడుతూ.. తాను టీడీఆర్ బాండ్ల కోసం అనకాపల్లిలో వాకబు చేశానని.. ఈ బాండ్లు అమ్ముకోవడం కష్టతరమని చెప్పారని.. ఇలా అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. పరిహారాన్ని నేరుగా నగదు రూపంలో అందించాలని కోరారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ జోక్యం చేసుకుని.. టీడీఆర్ బాండ్లను ఎక్కడైనా అమ్ముకోవచ్చని, అనకాపల్లిలో తప్ప ఇతర ప్రాంతాల్లో అమ్ముకోలేమని అనడం సరికాదంటూ బెదిరింపు ధోరణలో చెప్పారు.దీంతో.. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుండడంతో ఎమ్మెల్యే సహనం నశించి.. ‘ఉండు.. నువ్వుండు.. ఆగమంటున్నానా.. కౌంటర్ ఇవ్వడం కాదు. నేను తలచుకుంటే నీపై కేసు పెట్టలేనా?’ అని మండిపడ్డారు. నిర్వాసితుల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రవర్తించడం సరికాదంటూ హెచ్చరించారు. విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయే బాధితులకు మెరుగైన పరిహారం అందజేస్తామన్నారు. వీఎంఆర్డీఏ ఎక్కడైనా భూములను సేకరించేటప్పుడు టీడీఆర్ బాండ్లు ఇస్తుందని.. ఇక్కడ కూడా ఇస్తారేమోనని విజయ్ అన్నారు. తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బాధితులకు నగదు రూపంలో పరిహారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
కూటమి పాలనలో ఓ రైతు కన్నీటి గాథ
అనకాపల్లి: కూటమి పాలనలో రైతుల కన్నీటి గాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక వాటికి వారే స్వయంగా నిప్పుపెట్టుకునే పరిస్థితులు రావడంతో కూటమి పాలన ఎలా ఉందో చెప్పడానికి అద్దం పడుతోంది. తాజాగా ఓ రైతు పండించిన చెరుకుకు మంట పెట్టుకున్నాడు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రైతు రొంగలి వెంకటరావు.. ఎకరా చెరుకు పంటకు తానే నిప్పు పెట్టుకున్నాడు. పండించిన చెరుకును సాగు చేద్దామంటే గిట్టబాటు కాదు.. అదే సమయంలో ప్రభుత్వం గిట్టుబాట ధర కూడా లేదు. ఇంకెమీ చేసేది లేక చెరుకు పంటను మంట పెట్టాడు.‘పండించిన చెరుకు గిట్టుబాటు ధర లేదు. ఫ్యాక్టరీకి చెరుకు పంపిన పేమెంట్లు ఇవ్వడం లేదు. నెలల సంవత్సరాల తరబడి పేమెంట్లను అందడం లేదు. చెరుకును ఫ్యాక్టరీకి చెరుకు పంపిన ఎప్పుడు క్రస్సింగ్ జరుగుతుందో తెలీదు. గిట్టుబాటు ధర లేక చెరుకు పంటకు నిప్పు అంటించాను. గతంలో 15 రోజులకు పేమెంటు ఇచ్చేవారు’ అని రొంగలి వెంకటరావు చెప్పుకొచ్చాడు.ఇది ఒక్కరి గాథే కాదు.. ఇది ఒక్క రొంగలి వెంకటరావు పరిస్థితే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. అటు మిర్చి పంటల దగ్గర్నుంచీ చెరుకు పంట వరకూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రైతులకు తాము ఉన్నామనే భరోసా ఎక్కడా కనిపించడం లేదు. కేవలం హామీలకు పరిమితమైన కూటమి సర్కారు.. రైతుల గొంతు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయం అనేది పండుగలా సాగింది. ‘రైతు భరోసా’ తో రైతుల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్ జగన్ అటు రైతుకే కాదు.. ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసిన నాయకుడు వైఎస్ జగన్. ప్రజలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చూసిన తర్వాత ‘వైఎస్ జగన్ పాలనే ఉండి ఉంటే బాగుండేది’ అనే మాట.. ప్రతీ నోట వినిపిస్తోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమాన్ని అందించారు వైఎస్ జగన్. ఇక్కడ పార్టీలను అస్సలు పట్టించుకోలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో జగన్ ముందుకెళితే.. లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. మరొకవైపు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చిత్తూరు జిల్లా వేదికగా జరిగిన సభలో ఏమన్నారో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ వారైతే సంక్షేమం ఇవ్వొద్దనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ప్రకటించారు. వైఎస్సార్ సీపీ వారికి సంక్షేమ పథకాలు ఇవ్వక్కర్లేదు. ఏ స్థాయిలోనైనా ఇదే వర్తిస్తుందని అంటూ అధికారులను అప్రమత్తం చేశాడు. మరి అటువంటప్పుడు రైతుల కన్నీటి గాథలే ఉంటాయి తప్పితే వారికి గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి. -
అనకాపల్లిలో మహిళ దారుణ హత్య
అనకాపల్లి: అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమె రెండు కాళ్లు, రెండు చేతులను నరికి చంపేశారు. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. అయితే బెడ్ షీట్ అనుమానాస్పదంగా రక్తంతో ఉండటంతో స్థానికంగా దాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బెడ్ షీట్ ను ఓపెన్ చేసి చూడగా ఓ మహిళకు చెందిన రెండు కాళ్లు, రెండు చేతులు అందులో ఉండటం చూసి షాక్ అయ్యారు. దాంతో స్థానికంగా కలకలం రేగింది. అసలు హత్యకు గురైంది ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు?, హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. -
Anakapalle: క్వారీ లారీ ఢీకొని రైల్వే ట్రాక్ ధ్వంసం
-
అనకాపల్లిలో తప్పిన రైలు ప్రమాదం.. పలు ట్రైన్స్ ఆలస్యం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. అనకాపల్లి-విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్ను క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో సెఫ్టీ గడ్డర్ ఢీకొనడంతో రైల్వే ట్రాక్ పక్కకి జరిగింది. దీంతో, రైలు ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.వివరాల ప్రకారం.. అనకాపల్లి పెను ప్రమాదం తప్పింది. అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్ను లారీ ఢీకొనడంతో పైన ఉన్న రైల్వే ట్రాక్ పక్కకి జరిగింది. ఇదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలు వచ్చింది. అయితే, ట్రాక్ పక్కకి జరిగిన విషయాన్ని గుర్తించిన గూడ్స్ లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్లను నిలిపేశారు. ఎలమంచిలిలో మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపేశారు. కొంత సమయం తర్వాత మరో ట్రాక్ పైకి నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్కు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఇదిలా ఉండగా.. అనకాపల్లిలో క్వారీ లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీంతో, అడ్డూ అదుపు లేకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. పరిధికి మించి లారీల్లో రాయి NOABకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలకు క్వారీ లారీలు కారణం అవుతున్నాయి. నేడు బ్రిడ్డిని లారీ ఢీకొంది. నిన్న క్వారీ.. ఎల్ఐసీ ఏజెంట్ను ఢీకొనడంతో అతడు మృతిచెందారు. ఇక, ఓవర్ లోడ్ వస్తున్న లారీ కారణంగా గ్రామాల్లో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. లారీల ఓవర్ స్పీడ్ కారణంగా గామాస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
‘ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు’
చోడవరం: రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదని, రాష్ట్రంలోని రైతుల సమస్యలు కూడా పట్టించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రైతులు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాదా? అని బొత్స నిలదీశారు. ఈ రోజు(సోమవారం) చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీని బొత్స సందర్శించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేస్తాం. శాసనమండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలి. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు. ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో క్రసింగ్ జరిగేది. కానీ ఇప్పుడు సంక్రాంతి దాటిన క్రసింగ్ జరగ లేదు. జనవరిలో క్రాసింగ్ జరగడం వలన చెరుకు ఎండిపోతుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను వైఎస్ జగన్ రూ. 90 కోట్లతో ఆదుకున్నారు.షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి తక్షణం గట్టెక్కాలంటే 35 కోట్లు అవసరం. ప్రభుత్వం వెంటనే రూ. 35 కోట్లు విడుదల చేయాలి. ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలి. టన్ను చెరుకుకు రూ. 2500 ఇస్తే ఏమి సరిపోతుంది?, రైతులు మన రాష్ట్ర ప్రజలు కాదా?, దివంగత నేత వైఎస్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నతమైన దశలో ఉన్నాయి. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి. రాజకీయాలు కోసం నేను రాలేదు.. రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నాను.’ అని బొత్స స్పష్టం చేశారు. -
‘అమ్మానాన్నా.. ఐ యామ్ సారీ’
ఎస్.రాయవరం: పరీక్షల ఒత్తిడో...అనారోగ్య కారణమో.... లేత మనసుకు తగిలిన గాయమో...ఓ బాలిక ఉసురు తీసింది. పరీక్షల సమయంలోనే ఓ విద్యా కుసుమం రాలిపోయింది.. కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం(Intermediate second year) చదువుతున్న బాలిక ఉరి పోసుకుని గురువారం మృతి చెందింది. ఎస్ఐ విభీషణరావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు తుని చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని జోగా సృజన జయప్రియ(Srijana Jayapriya) (17) బుధవారం ఇంగ్లిష్ పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నీరసంగా ఉండడంతో ఆమెను ఇంటి దగ్గర ఉంచి, తల్లిదండ్రులు గురువారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్కి వెళ్లారు. ఇంటిదగ్గర ఎవరూ లేని సమయం చూసి సృజన జయప్రియ సూసైడ్ నోట్ రాసి ఉరిపోసుకుని చనిపోయింది. ఈ సూసైడ్ నోట్లో(Suicide note) ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి...నా చావుకి నా ఆరోగ్యమే(Health) కారణం ఈ బాధలు తట్టుకోలేక పోతున్నాను...దేనిమీద దృష్టి పెట్టలేక చాలా బాధపడ్డా.. నా కోరిక తీర్చుకోలేనేమోనని నాలో నేనే చాలా బాధ అనుభవించాను...సారీ అమ్మ ఎందుకు చనిపోయానో కారణం ఎవరికీ చెప్పకండి.. నేను బ్రతికుండి ప్రయోజనం లేదు.. తమ్ముడు చరణ్, చిన్నా మీరు బాగా ఉండండి. మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మని బాగా చూసుకోండి... నాన్నను బాధపెట్టకండి. నాన్న చెప్పిన మాట ఆలకించండి.. నేనే చనిపోతున్నందుకు చాలా బాధగా ఉంది.. లవ్యు అమ్మ, నాన్న అండ్ మై బ్రదర్స్ గుడ్బై..’ అని రాసింది. ఈ లెటర్ చూసి చదివిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో మంచి మార్కులు తెచ్చుకుని అందమైన జీవితం ఉంటుందనుకున్న తరుణంలో కుటుంబ సభ్యులను తీరని దుఃఖ సాగరంలో ముంచి బాలిక మృతి చెందిందని ఆవేదన చెందారు. గ్రామంలో ఈ బాలిక మృతి వార్త విని ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. చదువు ఒత్తిడి, చిన్న ఆనారోగ్యం బాలిక ప్రాణాలు తీశాయని పోలీసులకు తెలిపారు. వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బరితెగించిన పచ్చ సైకోలు.. వైఎస్ జగన్ అభివృద్ధి శిలాఫలకాల ధ్వంసం
-
వైఎస్సార్ సీపీ యూత్ లీడర్ ఈశ్వర్ అరెస్ట్
నర్సీపట్నం(అనకాపల్లి): కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తూ వైఎస్సార్సీపీశ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వరుస అరెస్ట్ లకు తెరతీసింది. ఆదివారం నర్సీపట్నం వైఎస్సార్సీపీయూత్ లీడర్ ఈశ్వర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను మోసం చేశాడని అక్రమ కేసు బనాయింది అరెస్ట్ చేశారు పోలీసులు. ఈశ్వర్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.. ఈశ్వర్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. దీనిలో భాగంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని అయన్న పాత్రుడు పని చేస్తున్నాడు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితోనే అధికారులు పని చేస్తున్నారు. ఈ శ్వర్ పై పెట్టిన కేసు అక్రమ కేసని పోలీసుల మనస్సాక్షికి కూడా తెలుసు. కానీ అయ్యన్న ఒత్తిడి ముందు ఆలోచించి పనిచేస్తున్నారు. చీటింగ్ కేసులో స్వయంగా డీఎస్పీ రంగంలోకి దిగడం ఆశ్చర్యం కల్గించింది’ అని పేర్కొన్నారు.ఇటీవల వైఎస్సార్ సీపీకి చెందిన నేత వల్లభనేని వంశీతో పాటు, ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని సైతం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
కొండలను పిండి చేస్తున్న మైనింగ్ మాఫియా
-
అధికారుల అండతో టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్సీపీ నేత ఇంటి కూల్చివేత
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా పోలీసుల బందోబస్తు మధ్య వైఎస్సార్సీపీ నేత ఇంటిని అధికారులు కూల్చివేశారు.ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలోని నర్సీపట్నంలో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. అక్రమ నిర్మాణం అంటూ వైఎస్సార్సీపీ నాయకుడు, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీను ఇంటిని కూల్చివేశారు. సోమవారం తెల్లవారుజామునే శ్రీను ఇంటి వద్దకు ఎమ్మార్వో, పోలీసులు వచ్చారు. పోలీసులు బందోబస్తు మధ్య శ్రీను ఇంటి కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. ఇక, అదే నియోజకవర్గంలో అంతకుముందు వైఎస్సార్సీపీ నేత చిటికెల కన్నా ఇంటిని కూడా కూల్చివేశారు.ఈ విషయం తెలుసుకున్న వెంటే ఘటనా స్థలానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘స్పీకర్ అయ్యన్నపాత్రుడు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసింది అభివృద్ధి చేయడానికా? లేక ఇల్లు కూలగొట్టడానికా?. ఇంట్లో ఉన్న సామాన్లు బయటికి తీయడానికి అవకాశం లేకుండా ఇంటిని కూల్చివేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఓట్లు వేస్తే చిల్లర పనులు చేస్తున్నారు అని మండిపడ్డారు. -
బాలికలతో టీచర్ అసభ్య ప్రవర్తన
సాక్షి,అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాలో ఓ టీచర్ దారుణానికి పాల్పడ్డాడు. గొలుగొండ మండలం హై స్కూల్లో పీఈటీ టీచర్ కీచక పర్వం తాజాగా వెలుగు చూసింది. ఆటల కోసం వెళ్లిన బాలికలతో పీఈటీ నూకరాజు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికల ఫిర్యాదుతో నూకరాజు బాగోతం బయటపడింది.రాష్ట్రస్థాయి పోటీలకు బాలికలను తమిళనాడు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డాడు నూకరాజు. విద్యార్థినులతో హెడ్మాస్టర్ శ్రీనివాసులు మహిళా టీచర్ను పంపకపోవడాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. తమిళనాడు నుంచి తిరిగి వచ్చి ఇంటికి చేరుకున్న తరువాత తల్లిదండ్రులకు బాలికలు అసలు విషయం చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పీఈటీ దారుణాలపై మండల విద్యాధికారి (ఎంఈవో) విచారణ ప్రారంభించారు. -
మహిళా హత్య కేసును చేధించిన అనకాపల్లిజిల్లా పోలీసులు
-
పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. కార్మికుడి దుర్మరణం
సాక్షి,అనకాపల్లిజిల్లా: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం(జనవరి25) జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: మంటల్లో దగ్ధమైన నివాసాలు.. పలువురికి గాయాలు -
అనకాపల్లి: జిమ్ కు కోటి రూపాయల కరెంటు బిల్లు
-
బాబు సర్కార్ సిత్రాలు.. జిమ్కు ‘కోటి’ కరెంట్ బిల్లు!
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి పాలనలో కొత్త సిత్రాలు వెలుగు చూస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పవర్ బిల్లులు చూపి ప్రజలు అవాక్కవుతున్నారు. తాజాగా జిమ్కు కోటి రూపాయలు కరెంట్ బిల్లు(Power Bill) రావడంతో నిర్వాహకుడు ఖంగుతున్నాడు. సదరు బిల్లుపై అధికారాలను ప్రశ్నించగా.. ఈ విషయం బయటకు చెప్పవద్దని అధికారులు ఆదేశించడం గమనార్హం.వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని జిమ్కు ఏకంగా కోటి రూపాయలు కరెంట్ బిల్లు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరెంట్ బిల్లు చూసి బిల్లు చూసి నిర్వాహకుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ప్రతీ నెలా 18 నుంచి 20వేల బిల్లు వస్తుండేది. ఈనెల కోటి 15వేల రూపాయల కరెంటు బిల్లు రావడంతో ఆశ్చర్యపోయాడు. అనంతరం, బిల్లుపై విద్యుత్ అధికారులకు సమాచారం అందించాడు. అయితే, విద్యుత్ బిల్లుపై మీడియాతో మాట్లాడవద్దని నిర్వాహకుడిని అధికారుల ఆదేశించారు. బిల్లు పెరిగిన విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని హెచ్చరించారు. కాగా, అధికారులు తప్పిదం కారణంగానే తనకు ఇంత బిల్లు వచ్చిందని చెప్పడానికి వెళ్లిన వ్యక్తి మరలా అధికారులే బెదిరించడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్ రూ.1,496 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్ విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు టేబుల్ ఫ్యాన్ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్ బిల్లు వస్తోంది.కిల్లు బాబూరావు మరణించినా, ఆయన పేరుతోనే విద్యుత్ మీటరు ఉంది. ఆయన కుమారుడు భరత్ ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 113 యూనిట్ల విద్యుత్ వినియోగం చూపి రూ.1,496 మైనస్ బిల్లు ఇచ్చారని, ఈ నెలలో 349 యూనిట్ల రీడింగ్ చూపి, రూ.69,314 బిల్లు ఇవ్వడం అన్యాయమని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల వ్యవధిలోనే పెంకుటింటికి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ పాడేరు ఏడీ మురళీ దృష్టికి ‘సాక్షి’ తీసుకు వెళ్లింది. గతంలో వినియోగదారుడి విద్యుత్ వినియోగాన్ని, మీటరును పరిశీలిస్తామని తెలిపారు. ఇక, ఇలాంటి ఘటనలు చాలా చోట్ల వెలుగు రావడం విశేషం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా ఎక్కువ బిల్లు వస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆయుర్వేదంతో.. ఆరోగ్యమస్తు!
ఆయుర్వేదిక్ సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రస్తుత కాలంలో కరోనా తరువాత నుంచి ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. ఆయుర్వేద ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆస్పత్రులకు అధిక నిధులు కేటాయించి ఆధునికీకరణకు బాటలు వేశారు. - సాక్షి, అనకాపల్లి ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుపడుతున్న రోగులు ఎక్కువగా ఆయుర్వేదిక్ వైద్యం పట్ల ఆసక్తి చూపుతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నుంచే అనకాపల్లి జిల్లాలో కొరుప్రోలు, వేంపాడు, కన్నూరుపాలెంలలో ఆయుర్వేదిక్ డిస్పెన్సరీల ద్వారా వైద్యం అందించేవారు. తొలుత దాతల సహాయంతోనే ఈ ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నడిచేవి. దాతలు భూమిని సమకూర్చడంతో పెంకులతో భవనం నిర్మించి, అందులోనే వైద్య సేవలు ప్రారంభించారు. వైద్యునితోపాటు ఆరోగ్య సిబ్బందిని నియమించి సేవలందిస్తూ వచ్చారు. కాలక్రమంలో ఈ డిస్పెన్సరీ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో 2013లో ఎస్ఆర్హెచ్ఎం నిధులతో నూతన భవనాలను నిర్మించారు. జిల్లాలో ఆరు ఆస్పత్రులు అనకాపలి జిల్లాలో ఎన్టీఆర్ ఆసుపత్రిలో, ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు, నక్కపల్లి మండలం వేంపాడు, కశింకోట మండలం కన్నూరుపాలెం, నర్సీపట్నం, ఎం.కోడూరులో 6 ఆయుర్వేద ఆస్పత్రులు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేశారు. గత ఏడాది ఆగస్టులో ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు ఆయుర్వేద కేంద్రాన్ని స్పెషలిస్ట్ వెల్నెస్ అండ్ పంచకర్మ సెంటర్గా అప్ గ్రేడ్ చేశారు. వాటితో పాటుగా ఆరు ఆస్పత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయించారు. ఆరు వెల్నెస్ సెంటర్ల ఆధునికీకరణ జన ఆరోగ్య సమితి కమిటీని ఏర్పాటు చేసి ఆస్పత్రుల భవనాల ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక్కో ఆస్పత్రిని రూ.3.5 లక్షలతో ఆధునికీకరించారు. అదనపు సౌకర్యాలు కల్పిoచి ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలందిస్తున్నారు. కశింకోట మండలంలోని కన్నూరుపాలెం ఆస్పత్రిని ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని ఆయుష్ విభాగంలో మౌలిక వసతులకు రూ.3.50 లక్షలు మంజూరు చేసింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆయుష్మాన్ భారత్ కింద ఆయుర్వేదిక్ ఆస్పత్రులను అభివృద్ధి చేసి, సేవల్ని విస్తృత పరచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని వేంపాడు, కొరుప్రోలు, కన్నూరుపాలెం ఆయుర్వేదిక్ ఆస్పత్రుల అభివృద్ధికి మొత్తం రూ.10.5 లక్షలు వెచ్చిస్తున్నారు. ఎన్నికల సమయంలో నిలిచిన పనులు మూడు నెలలుగా తిరిగి కొనసాగాయి. పంచకర్మ నుంచి జలగ వైద్యం వరకూ... సగటున ఒక్కో ఆస్పత్రిలో నెలకు 900 నుంచి 1000 మంది వరకూ రోగులకు వైద్యసేవలందుతున్నాయి. జిల్లాలోని ఆరు ఆస్పత్రుల్లో 5 వేల నుంచి 6 వేల మందికి వైద్య సేవలందుతున్నాయి. ఆస్పత్రిలో పక్షవాతం, మోకాళ్లు, కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో పాటుగా పంచకర్మ చికిత్సలో అభ్యంగం, స్వేద కర్మ, పిండస్వేద కటివస్తి, జానువస్తి, గ్రీవ వస్తి, క్షారసూత్ర, అగ్రికర్మ, జలగ వైద్యంతో పాటుగా అనేక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ప్రస్తుతం రోజుకు 40 నుంచి 45 మంది వరకూ రోగులు వస్తున్నారు. పంచకర్మ థెరపీ..ఆయుర్వేద పంచకర్మ చికిత్స కోసం కేరళ, తమిళనాడు, కర్ణాటకకు ప్రత్యేకంగా థెరపీ వైద్యం కోసం వెళుతుంటారు. అదే తరహా కేరళ మెడికేటెడ్ ఆయిల్ ద్వారా వైద్యం అనకాపల్లి జిల్లాలో ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లల్లో కూడా అందిస్తున్నారు. పంచకర్మ థెరపీ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. నశ్య, వమన, విరేచన, వస్తి, రక్తమోక్షణ వంటి థెరపీల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు.వమన సొరియాసిస్, రెస్పిరేటరీ వంటి దీర్ఘకాలిక సమస్యలకు అందించే ఆయుర్వేదిక్ వైద్యం. థెరఫిటిక్ మెడిసిన్ ఇచ్చి వాంతులు చేయించి తద్వార శ్వాశకోశ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది.. విరేచన కడుపు ఉబ్బరం, అల్సర్ ఇతర దీర్ఘకాలిక సంబంధిత వ్యాధుల్లో కడుపులో విరేచన ద్వారా క్లీన్ చేయించి ఈ థెరపీ చేస్తారు. దీని ద్వారా కడుపు క్లీనింగ్ అయి లివర్, జీర్ణాశయం, కిడ్నీలు సక్రమంగా పనిచేసేలా థెరపీ చేస్తారు. వస్తి.. మగ,ఆడ వారిలో వెన్నుపూస, స్పైనల్ కార్డు వంటి సమస్యల్లో ఈ థెరపీ వాడతారు. మైక్రో ఛానల్ ద్వారా ఆయిల్ రాసి ఈ చికిత్స అందిస్తారు రక్త మోక్షణ... శరీరంపై వివిధ అవయవాలల్లో ధీర్ఘకాలికంగా పుండ్లుగా ఏర్పడి వాటి నుంచి రసి కారి కుళ్లిపోతే.. అక్కడ ఈ థెరపీ ద్వారా చెడు రక్తం తీసే చికిత్స ఇది. ఈ చికిత్స వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. అవగాహన పెరిగింది.. జిల్లాలో ఆరు ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల ద్వారా వైద్యసేవల అందిస్తున్నాం. చదవండి: పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన అద్భుత మేధావికేరళలో లభ్యమయ్యే మెడికేటెడ్ ఆయిల్తో థెరపీ వైద్యం అందుబాటులో ఉంది. ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు థెరపిస్టుల ద్వారా వైద్యసేవలందిస్తున్నాం. ఆయుర్వేదిక్ వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఎక్కువగా ధీర్ఘకాలికంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు వైద్యం కోసం వస్తున్నారు. పంచకర్మ థెరపీతో పాటు అదనంగా ఐఆర్ థెరపీ ద్వారా మోకాళ్ల నొప్పి వంటి సమస్యలకు వైద్య సేవలందిస్తున్నాం. ప్రజలకు ఆశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఆస్పత్రి ఆవరణలో ఔషధ మొక్కలు, హెర్బల్ గార్డెన్ కూడా పెంచుతున్నాం. – కె.లావణ్య, ఆయుష్ విభాగం వైద్యాధికారి, జిల్లా ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ -
అనకాపల్లి జిల్లాలో దారుణం.. కొడుకును చంపిన తండ్రి
-
AP: మళ్లీ డయేరియా కలకలం.. 15కు చేరిన బాధితుల సంఖ్య
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో డయేరియా బాధితుల సంఖ్యల 15కు చేరుకుంది. వరుస డయేరియా కేసుల కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లావాసులు భయంతో వణికిపోతున్నారు. ఇక, డయేరియా ఎందుకు ప్రబలింది అనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు.వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని పరవాడ మండలం, భరణికం గ్రామంలో డయేరియా విజృంభిస్తోంది. తాజాగా డయేరియా బాధితుల సంఖ్య 15కు చేరుకుంది. ప్రస్తుతానికి ఇద్దరు, ముగ్గురు స్వల్పంగా కోలుకున్నారు. పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో 11 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరో ఇద్దరిని స్థానికంగా ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో డయేరియా కేసుల సంఖ్యల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో డయేరియా ఎందుకు ప్రబలిందో ఇప్పటికే స్పష్టత రాకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డయేరియా కేసులు భారీ పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బారినపడి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, డయేరియా వ్యాధి ప్రబలకుండా చేయడం కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాధితులు, వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అంతకుముందు గుర్లాలో డయేరియా కారణంగా పలువురు ఇబ్బందులు ఎదుర్కొగా.. వ్యాధి కారణంగా మరికొందరు మృతిచెందారు. -
హోంమంత్రి అనిత ఇలాకాలో బెల్ట్ షాపులకు వేలం పాట
-
అనిత ఇలాకాలో బెల్టు షాపులకు వేలం పాట.. దండోరా వేసి మరి..
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో బెల్టు షాపుల దందా కొనసాగుతోంది. ఏకంగా హోం మంత్రి అనిత ఇలాకాలోనే బెల్టు షాపులకు బహిరంగ వేలం పాటకు దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వ అసమర్థత తీరుకు ఇది నిదర్శమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఏపీ హోం మంత్రి అనిత ఇలాకాలో బెల్ట్ షాపులకు బహిరంగ వేలం పాట ప్రకటించారు. ఎస్ రాయవరం మండలంలోని పేట సూదిపురంలో బహిరంగ వేలం పాట నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. బెల్టు షాపు వేలంపాట కోసం ముందు రోజు రాత్రి గ్రామంలో దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ కూటమి నేతల కనుసన్నల్లో బెల్టు షాపులు వేలం పాట జరుగుతున్నట్టు తెలుస్తోంది.అయితే, రాష్ట్రంలో బెల్టు షాపులు లేవని సీఎం చంద్రబాబు, మంత్రి అనిత అడ్డగోలు వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా అంటూ ప్రకటన కూడా చేశారు. మరోవైపు.. తనిఖీల్లో బెల్టు షాపు నిర్వాహకులు దొరికినా ఎటువంటి జరిమానా విధించడం లేదు ఎక్సైజ్ అధికారులు. ప్రభుత్వ పెద్దలు చెప్పేది ఒకటి.. గ్రౌండ్ లెవల్ జరుగుతున్నది మరొకటి అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. -
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ.. ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీక్
సాక్షి,అనకాపల్లి : జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీకయ్యాయి. ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీకవ్వడంతో ఎనిమిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. -
అనకాపల్లిలో రాంగోపాల్ వర్మపై మరో కేసు
-
అనకాపల్లి రైల్వే స్టేషన్లో దారుణం.. రైలు ఎక్కుతుండగా..
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి రైల్వే స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతుండగా కాళ్లు జారి ఒక వ్యక్తి ట్రైన్కి, ఫ్లాట్ ఫారం మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో ట్రైన్ నిలిపివేసి ప్లాట్ ఫారం తవ్వి కోన ఊపిరితో ఉన్న వ్యక్తిని బయటికి తీశారు. ఆ వ్యక్తిని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం
సాక్షి,అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నేత కర్రి శ్రీనివాసరావుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుడు పప్పల అప్పలనాయుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీనివాసరావు తప్పించుకోగా.. ఆయన సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడితో అప్రమత్తమైన బాధితుడి కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయ్యన్నపాత్రుడి అనుచరుల దాడిపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ బాధితుడిని పరామర్శించారు. సర్కార్ గూండాగిరీ.. కి డ్నాపులు.. అక్రమ కేసులు.. దాడులు -
నర్సీపట్నంలో టెన్షన్.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. దీంతో, అక్రమ కేసులను నిరసిస్తూ నేడు వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీస్ యాక్ట్-30 అంటూ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారు.ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడి నియోజకవర్గంలో అరాచకం చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించడమే నేరంగా మారింది. ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు గాను పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై పార్టీ నేతలు నేడు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందంటూ వైఎస్సార్సీపీ నేతలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.శాంతియుత ర్యాలీకి వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. బుధవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నివాసానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇక, మంగళవారం రాత్రి నుంచే వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్పై ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, పోలీసులు తీరుతో అటు సామన్య ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. -
‘ఇసుక దొంగలను వదిలేసి.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులా?’
సాక్షి, అనకాపల్లి: ఇసుక దొంగలను వదిలేసి వైఎస్సార్సీపీ నేతలపై తప్పులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా రాత్రికి రాత్రే తరలించుకుపోతున్నారని ధ్వజమెత్తారు. ఇసుక దొంగలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే, తిరిగి వారి మీదే అక్రమ కేసులు బనాయించారంటూ మండిపడ్డారు.పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. స్పీకర్ అయ్యన్న ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు మేము భయపడం. వైఎస్సార్సీపీ నేతలతో కలిసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. -
రెచ్చిపోయిన టీడీపీ ఇసుక మాఫియా.. జనసేన నేతపై దాడి
అనకాపల్లి : హోం మంత్రి అనిత నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా ఇసుక తరలించే క్రమంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు కోటవురట్ల మండలంలో టీడీపీ, జనసేన నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు.అయితే, ఇసుక అక్రమ రవాణా తరలింపులో కూటమి నేతల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. టీడీపీ నేతలు జనసేన నేత కోన మౌళిపై గొంతుపై బ్లేడ్తో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన కోన మౌళిని అత్యవసర చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇసుక అక్రమ రవాణపై ఇరు పార్టీ నేతలు చేసుకున్న దాడుల్ని భూతగాదా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
చక్కని బొమ్మా.. నిను చెక్కిన చేతులకు సలాం
సాక్షి, అనకాపల్లి: ఏడు దశాబ్దాల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నాలుగు విశ్వకర్మ కుటుంబాలు జీవనోపాధి కోసం లక్కబోమ్మల తయారీ ప్రారంభించాయి. నాడు అవసరం కోసం బీజం పడిన ఈ కళ ఇప్పుడు ఆ గ్రామానికి ప్రపంచపటంలో ఒక గుర్తింపు తీసుకువచ్చిం ది. అంకుడు కర్రలతో లక్కబోమ్మలు తయారు చేసే హస్తకళాకార కుటుంబాలు ఈ గ్రామంలో దాదాపు 150 వరకూ వున్నాయి. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఇక్కడి కళాకారులు కూడా విశేష నైపుణ్యంతో అపురూప కళాఖండాలను తమ మునివేళ్లతో సృష్టించి అబ్బురపరుస్తున్నారు. జార్ఖండ్ నుంచి లక్క దిగుమతి రసాయన రంగులతో పోలిస్తే సహజ రంగులే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే లక్కకి సహజమైన రంగులను కలిపి ఇక్కడి కళాకారులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. చుట్టుపక్కల లభించే ఉసిరి, కరక్కాయ, వేప వంటి వాటితో సహజ రంగులను తయారు చేస్తారు. సహజమైన లక్కను ఎక్కువగా జార్ఖండ్లోని రాంచీ నుంచి దిగుమతిచేసుకుంటారు. అక్కడ ఒక రకమైన సూక్ష్మజీవి విసర్జితాల నుంచి ఇది లభిస్తుంది. స్థానిక గిరిజనులు దాన్ని సేకరించి అమ్ముతారు.ఆ లక్కకి తూర్పుకనుమల్లో దొరికే వివిధ రకాల మొక్కలు, వాటి విత్తనాలు, ఆకులు, వేళ్లు, కాండం నుంచి వచ్చే సహజ సిద్ధమైన రంగులను కలుపుతారు. 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లక్కని వేడిచేసి, రంగుని కలిపి... దాన్ని బొమ్మలకు అద్దుతారు. గది ఉష్ణోగ్రతవద్ద వద్ద ఈ రంగులు ఎంత కాలమైనా పాడవకుండా ఉంటాయి. 1990 వరకు ఏటికొప్పాక బొమ్మలకు రసాయన రంగులే పూసేవారు. గ్రామానికి చెందిన సీవీ రాజు (చింతలపాటి వెంకటపతిరాజు) రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. క్రమంగా గ్రామంలోని కళాకారులందరూ సహజరంగులు వినియోగించడం ప్రారంభించారు. బొమ్మల తయారీలో మహిళలే ఎక్కువ..ఏటికొప్పాకలో దాదాపు ప్రతి ఇంటిలోనూ బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారు. ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా వీరు బొమ్మలు తయారు చేస్తుంటారు. మరికొందరు దీన్నే వృత్తిగా తీసుకుంటారు. కుంకుమ భరిణెలు, ఆభరణాలు దాచుకునే డబ్బాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మహిళలు ధరించే గాజులు, కీచైన్లు, ఫ్లవర్వాజ్లు, దేవతామూర్తుల బొమ్మలు మొదలుకుని గ్రామీణ వాతావరణం, శ్రీ వేంకటేశ్వరస్వామి, రామాంజనేయ యుద్ధ సన్నివేశాలు,పెళ్లి తంతు, పెళ్లి సారె ఇలా ఎన్నో రకాల బొమ్మలు ఇక్కడి కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటాయి. పొట్టకూటి కోసం తయారుచేసిన లక్క బొమ్మ.. కాలాంతరంలో ఆ గ్రామానికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. వంట చెరకుగా కూడా పనికిరాని అంకుడు కర్ర మూలవస్తువుగా, ఆకులూ అలములే సహజ రంగులుగా, కళాకారుడి సృజనాత్మకతే అతిపెద్ద పెట్టుబడిగా తయారవుతున్న ఏటికొప్పాక లక్కబొమ్మ ప్రపంచం నలుమూలలా గొప్ప ఆదరణ పొందుతోంది. వరాహనది ఒడ్డున ఉన్న ఈ ప్రశాంత గ్రామంలో నిరంతరం ఉలి శబ్ధం వినిపిస్తూనే ఉంటుంది. వైవిధ్యమైన బొమ్మల తయారీ కోసం కళాకారులు తమ సృజనకు పదును పెడుతూనే ఉంటారు. చేయితిరిగిన ఇక్కడి కళాకారుడి ఉలి నుంచి జాలువారిన ఒక్కో బొమ్మా ఒక్కో కళాఖండమే.. వందలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఏటికొప్పాక బొమ్మ రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు సైతం అందుకుంది. ఏటికొప్పాక హస్తకళా నైపుణ్యంపై ‘సాగా ఆఫ్ ది విమెన్’ పేరిట ప్రొఫెసర్ బొగాది నీలిమ తీసిన డాక్యుమెంటరీ ప్రపంచ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. విదేశాలకు ఎగుమతి ఏటికొప్పాక లక్కబొమ్మలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. సహజసిద్ధమైన రంగులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం ఎన్నాళ్లయినా ఈ రంగులు సహజత్వాన్ని కోల్పోకుండా ఉండటంతో విదేశీయులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా తెప్పించుకునే వెసులుబాటు ఉండటం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో అందుబాటులో ఉండటంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, ఆ్రస్టేలియా, పోలెండ్, హాలెండ్, స్విట్జర్లాండ్, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఏటికొప్పాక బొమ్మలు ఎగుమతవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఏటికొప్పాక లక్కబోమ్మలను వినూత్న రీతిలో తయారు చేసిన పలువురు కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రధాని మోదీ “మన్ కీ బాత్ఙ్ కార్యక్రమంలో లక్క బొమ్మల విశిష్టత గురించి ప్రస్తావించారు. భారత నౌకాదళం విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2016లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల స్టాల్ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ తన ఫొటోతో తయారు చేసిన లక్క డబ్బాని చూసి ముచ్చటపడి దాని మీద సంతకం కూడా చేశారు.సహజసిద్ధమైన రంగులతో ప్రయోగాలు చేసి, ఏటికొప్పాక బొమ్మకి కొత్త కళను తెచ్చినందుకు సీవీ రాజుకి 2002లో రాష్ట్రపతి అవార్డు, 2012 లో నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఏటికొప్పాకకు చెందిన మరో కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి మైక్రో ఆర్ట్స్లో నిపుణుడు. 2003లో జాతీయ హస్త కళల పోటీలో ఇతను తయారు చేసిన బొమ్మకు ప్రథమ బహుమతి లభించింది. అలాగే బియ్యపు గింజమీద పట్టేంత వీణ, గుండుసూది మీద పట్టేంత తాజ్ మహల్, ఏనుగు, బుద్ధుడు, ఎడ్లబండి, శ్రీరామ పట్టాభిషేకం, తల వెంట్రుక మీద నిలబెట్టగలిగే పక్షులు... ఇలా అనేక మినీయేచర్ ఆర్టులను చిన్నయాచారి తయారుచేసి అవార్డులు పొందారు.కళ అంతరించిపోకూడదనే.. ఒకప్పుడు రూ.400కు దొరికే అంకుడు కర్రల మోపు.. ఇప్పుడు రూ.4వేలకు పెరిగింది. ఇది కళాకారులకు భారంగా మారింది. స్థానికంగా అంకుడు కర్ర డిపో ఏర్పాటు చేస్తే కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. అద్భుతమైన లక్కబోమ్మల తయారీ కళ అంతరించిపోకూడదు. ఇది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన అరుదైన కళ. బొమ్మల తయారీ గిట్టుబాటు కావడం లేదని గతంలో చాలా మంది కళాకారులు ప్రత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. దీనిని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు గ్రామంలో సుమారు 100 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం వారికి ఇది ఉపాధినిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. – శ్రీశైలపు చిన్నయాచారి, కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత -
కన్నా.. అప్పుడే నూరేళ్లు నిండాయా..
దేవరాపల్లి: అప్పటి వరకు తమ కళ్ల ఎదుట ఉన్న కుమారుడు విద్యుత్ ఘాతానికి గురై క్షణాల వ్యవధిలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా.. బిడ్డా అని రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మండలంలోని ములకలాపల్లిలో శనివారం సాయంత్రం విద్యుత్ షాక్ గురై పదేళ్ల బాలుడు మృతి చెందాడు. కుటుంబీలు, స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన వడగళ్ల గణేష్, భవానీ దంపతులకు ఇద్దరు కుమారులు హేమంత్, యశ్వంత్ ఉన్నారు. చిన్న కుమారుడు యశ్వంత్ (10) ఇంట్లో ఫ్యాన్ కోసం ప్లగ్ పెడుతుండగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు బయటకు తీసుకువచ్చి ఇసుకలో వేసి రక్షించే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అప్పటికే ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతదేహం వద్ద తల్లి భవానీ గుండెలవిసేలా రోదించిన తీరు పలువురి హృదయాలను కలచి వేసింది. యశ్వంత్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనకాపల్లి జిల్లాలో విద్యార్థుల ఆందోళన
-
అనకాపల్లిలో బరితెగించిన టీడీపీ నాయకులు
అనకాపల్లి, సాక్షి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులుపై దాడులు ఆగటం లేదు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా టీడీపీ నాయకులు దాడులకు తెగపడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో మరోసారి టీడీపీ నాయకులు బరితెగించారు. బుధవారం అర్ధ రాత్రి వైఎస్సార్సీపీ నాయకులుపై పచ్చ నాయకులు దాడి చేశారు. దేవరపల్లి మండలంలో కరెంట్ కట్ చేసి.. మహిళలపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.రోజు రోజుకీ కూటమి నాయకులు అరాచకాలు పెరిగిపోతున్నాయని బాధితులు రోదిస్తున్నారు. అర్ధ రాత్రి ముషిడిపల్లి కోళ్ల ఫారంపై కూడా టీడీపీ నాయకులు దాడి చేసి పరారైరయ్యారు. టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ సోమిరెడ్డితో పాటు అతని అనుచరులు తమపై దాడి చేశారని బాధితురాలు రామలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
అనకాపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా
-
ఆ ఆత్రమే అగ్గిరాజేసింది
విశాఖ సిటీ: ఎసైన్షియా అడ్వాన్స్›డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో అనేక విస్మయకర విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది. కొత్త డ్రగ్ ఉత్పత్తిని వేగంగా ప్రారంభించాలన్న ఆత్రంలో ట్రయల్ రన్ నిర్వహించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వంటివే ఈ భారీ ప్రమాదానికి కారణమన్న విషయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.ప్రమాద కారణాలతో పాటు కంపెనీలో 6 లోటు పాట్లను హైలెవల్ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అత్యవసర ద్వారాలు, భవనానికి బాహ్య కారిడార్లు లేకపోవడం, ప్రీ స్టార్టప్ తనిఖీలు చేయకపోవడం, విద్యుత్ వైరింగ్ బహిరంగంగా ఉండడం, రసాయనం లీక్ అయిన వెంటనే దాన్ని నిలువరించకపోవడం వంటి కారణాలను నివేదికలో పొందుపరిచింది. ముందస్తు తనిఖీలు నిల్ ఎసైన్షియాలో కొత్త డ్రగ్ ఉతి్పత్తిని ఇటీవలే ప్రారంభించింది. వాస్తవానికి ఏ డ్రగ్ ఉత్పత్తి చేయాలన్నా ముందు తప్పనిసరిగా ట్రయల్ రన్ నిర్వహించాలి. ఈ ప్రక్రియలో అన్నీ సజావుగా ఉన్నట్లు నిర్థారించుకున్నాకే ఉత్పత్తిని ప్రారంభించాలి. సదరు కంపెనీ యాజమాన్యం మాత్రం ముందస్తు తనిఖీలు లేకుండానే, వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ఉపక్రమించింది. ఫలితంగానే ఈ ప్రక్రియలో నెలకొన్న అనేక లోటుపాట్లను గుర్తించలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నత స్థాయి కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. గతంలోనూ ఇదే వైఖరి ఈ కంపెనీ గతంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించినట్లు కమిటీ పరిశీలనలో గుర్తించింది. ప్రీ స్టార్టప్ తనిఖీలు లేకుండానే భారీ స్థాయిలో డ్రగ్ ఉత్పత్తిని చేపడుతున్నట్లు వెల్లడైంది. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో కంపెనీలో వరుసగా అదే తరహాలో ఔషధాల ఉత్పత్తి ప్రక్రియను నిర్వహిస్తోంది.తాజాగా అదే విధానాన్ని కొనసాగించగా.. మిౖథెల్ టెర్ట్ బ్యూటిల్ ఎథర్(ఎంటీబీఈ) రసాయనం లీకై గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎంసీసీ ప్యానల్ మీద పడడంతో భారీ ప్రమాదం సంభవించింది. 17 మంది మృత్యువాత పడ్డారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్న ఉన్నత స్థాయి కమిటీ ఇదే అంశాలపై నివేదిక తయారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. -
సినర్జిన్ ప్రమాదంలో మూడు చేరిన మరణాల సంఖ్య..
సాక్షి, అనకాపల్లి: పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సినర్జిన్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, సూర్యనారాయణ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.కాగా, ఈనెల 22వ తేదీన సినర్జిన్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా ప్రస్తుతం మృతుల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో జార్ఖండ్కు చెందిన లాల్సింగ్ పూరి చికిత్స పొందుతూ ఈ నెల 23న, రొయా అంగిరియా 24న మృతి చెందారు. అదే రాష్ట్రానికి చెందిన ఓయబోం కొర్హకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా సూర్యనారాయణ మరణించారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించకపోవడంతో ప్రభుత్వ తీరును ఎండగడుతూ సాక్షి.. బాధితులకు అండగా నిలిచింది. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన యాజమాన్యం సోమవారం సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు రూ.కోటి చెక్కును అందించింది. -
5 సెకన్లలో 2 పేలుళ్లు
సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం సంభవించిందని, ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ వెల్లడించింది. తొలి పేలుడు జరిగిన 5 సెకన్లలోనే మరో పేలుడు సంభవించిందని తెలిపింది. భారీ పేలుళ్ల ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, మొదటి అంతస్తు శ్లాబు కొంత భాగం కూలడం, ఈ సంస్థ భవనాలకు అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేకపోవడంతో కార్మికులు తప్పించుకోలేక ప్రాణ నష్టం అధికంగా ఉందని వెల్లడించింది.ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఈ నెల 21న జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ, బాయిలింగ్, ఫైర్ సేఫ్టీ, ఏపీపీసీబీ అధికారులు, నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగింది, కారణాలేమిటో క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రాథమిక నివేదిక రూపొందించింది. వారం రోజుల్లో మరో నివేదిక ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.నివేదికలోని ప్రధానాంశాలు..⇒ కొత్త డ్రగ్స్ తయారీకి ప్రయోగాలు ఇక్కడే జరుగుతుంటాయి. బ్యాచ్ల వారీగా పరిశోధనలు చేస్తుంటారు. మూడు నెలల విరామం తర్వాత ఫస్ట్ బ్యాచ్ పరిశోధన ప్రారంభించింది. ⇒ఆ రోజు రియాక్టర్లో 500 లీటర్ల మిౖథెల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ (ఎంటీబీఈ) ద్రావకం తయారీకి వ్యాక్యూమ్ డిస్టిలేషన్ ప్రారంభించారు. ⇒ ఇక్కడ తయారయ్యే వ్యాక్యూమ్ డిస్టిలేషన్ని నైట్రోజన్ ప్రెజర్ ద్వారా రెండో ఫ్లోర్లో ఉన్న 5 వేల లీటర్ల స్టోరేజ్ ట్యాంక్కు పంపింగ్ చేస్తున్నారు. ⇒మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రెండో అంతస్తులో ఎంటీబీఈ లీకై ఘాటైన వాసన వస్తుండటాన్ని ప్రొడక్షన్ టీమ్ గుర్తించింది. ఇది క్రమంగా మొదటి అంతస్తుకూ వ్యాపించింది. ⇒ మొదటి అంతస్తులోని కార్మికులు ఆ వాసనను గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి రెండో అంతస్తుకు వెళ్తున్న ఎంటీబీఈ పైప్లైన్ను పరిశీలించారు. ట్రాన్స్ఫర్ లైన్లో ఎంటీబీఈ వ్యాక్యూమ్ లీకవుతున్నట్లు గుర్తించారు. ⇒ఈ కెమికల్ పైపుల నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విద్యుత్ కేబుల్స్ వెళ్తున్న కటౌట్స్ పైన పడి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎంసీసీ) ప్యానెల్పై పడుతున్నట్లు గుర్తించారు. ⇒ వెంటనే ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్షన్ సిబ్బందికి కార్మికులు సమాచారమిచ్చారు. లంచ్ టైమ్ కావడంతో ఆ సమయంలో ఆ సిబ్బంది అందరూ భోజనం చేస్తున్నారు. దీంతో లీకేజీని అరికట్టేందుకు ఎవ్వరూ రాలేదు. ⇒ బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్ను అనుసంధానం చేసేలా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ (ఏహెచ్యూ) ఉన్నాయి. ఏహెచ్యూ ప్రధాన యూనిట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఏవైనా వాయువులు లీకైతే ఏహెచ్యూ ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. కానీ.. ఆ రోజు లీకైన ఎంటీబీఈ రసాయనం ఆవిరి ఏహెచ్యూ ద్వారా ప్రాసెస్ డెవలప్మెంట్ (పీడీ) ల్యాబ్, కార్యాలయం గదులు, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎస్యూరెన్స్ గదులు, యుటిలిటీ అండ్ మెటీరియల్ నిల్వ ప్రాంతాలకు వ్యాపించింది.⇒ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భోజనం అనంతరం వచి్చన బృందాలు లీకేజీని అరికట్టే ప్రక్రియ ప్రారంభించాయి. ⇒ కానీ.. అప్పటికే ఏహెచ్యూల ద్వారా కమ్ముకున్న ఆవిరి లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ (ఎల్ఈఎల్) స్థాయికి చేరుకుంది. దీంతో హఠాత్తుగా గ్రౌండ్ ఫ్లోర్లోని ఎంసీసీ ప్యానెల్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి గ్రౌండ్ ఫ్లోర్ ప్లెయిన్ సిమెంట్, కాంక్రీట్ (పీసీసీ) గోడలు కూలిపోయాయి. మొదటి అంతస్తు శ్లాబులో కొంత భాగం కుప్పకూలింది. ⇒ వెంటనే కార్మికులు, సిబ్బంది బయటకు వెళ్లిపోయేందుకు ప్రయతి్నంచారు. ⇒ 5 సెకెన్లలోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏహెచ్యూ మెయిన్ ప్యానల్లో రెండో పేలుడు సంభవించింది. దీంతో.. ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఉన్న మొదటి, రెండో అంతస్తుల్లోని అన్ని రూములూ తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ⇒ ఈ పేలుడు తీవ్రత పీడీ ల్యాబ్, యుటిలిటీ, ప్రొడక్షన్ ఏరియాలోనూ తీవ్ర ప్రభావం చూపింది. ⇒ వెంటవెంటనే పేలుళ్లు సంభవించడంతో అత్యవసర మార్గాలు లేక కార్మికులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. ⇒ ఎంటీబీఈ 28 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ (ఎల్ఈఎల్) 1.6 శాతం, అప్పర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ (యూఈఎల్) 15.1 శాతం ఉంది. ఈ ఎంటీబీఈ ఆవిరి అన్ని ప్రాంతాలకూ తీవ్రస్థాయిలో విస్తరించడమే ప్రమాదానికి ప్రధాన కారణం.⇒ దాదాపు బిల్డింగ్లోని అన్ని ప్రాసెసింగ్ ప్రాంతాలకూ ఏహెచ్యూల ద్వారా ఎంటీబీటీఈ వ్యాక్యూమ్ చేరుకుంది. దీనివల్ల పేలుడు తీవ్రత ఎక్కువైంది. ⇒ బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు కూడా ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణం. పీడీ ల్యాబ్, ఆఫీస్ బిల్డింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ పక్కపక్కనే ఉండకూడదు. కానీ.. అన్నీ ఒకేచోట ఏర్పాటు చేశారు. ⇒ అంతేకాకుండా ఈ భవనాలన్నింటినీ ఏహెచ్యూతో అనుసంధానం చేశారు. ప్రాసెసింగ్ ప్రక్రియ చేయని రూమ్లకూ వీటిని అనుసంధానం చేయడం కూడా ప్రధాన లోపమే. ⇒ ముఖ్యంగా.. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు ఒక్కటే మెట్ల మార్గం ఉంది. ఎలాంటి అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేవు. ఉన్న ఒక్క మార్గం మొదటి పేలుడు ధాటికే కూలిపోయింది. ⇒ భవనం చుట్టూ ఎక్స్టర్నల్ కారిడార్లు లేవు. అనుసంధానించే మెట్లు కూడా లేవు. దీనివల్ల కొందరు దూకేందుకు ప్రయతి్నంచినా.. భవన శిథిలాల కింద పడి నలిగిపోయారు. ⇒ ప్రతి ఫార్మా కంపెనీలోనూ ఉత్పత్తి ప్రారంభించే ముందు ప్రతి విభాగాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తారు. దీన్నే ప్రీ స్టార్టప్ చెక్స్ (పీఎస్ఎస్ఆర్) అంటారు. ఈ పరిశ్రమలో అది కూడా చెయ్యడం లేదు. ⇒ రసాయన మిశ్రమాలు, రసాయనిక ఆవిరి వెళ్లే లైన్లు సరిగ్గా విద్యుత్ కేబుల్స్ పైనే వేశారు. దీనివల్ల ఏ చిన్న సాల్వెంట్ లీకేజీ జరిగినా నేరుగా విద్యుత్ కేబుల్ కటౌట్స్పై పడటంతో పాటు ఎంసీసీ ప్యానెల్స్ దెబ్బతినేలా వ్యవస్థ ఉంది. ⇒ ఎంటీబీఈ లీకేజీని గమనించిన తర్వాత తక్షణమే స్పందించేందుకు ఎవ్వరూ లేకపోవడం వల్ల.. ఈ సాల్వెంట్ ఆవిరి వాసన పీల్చి ఉద్యోగులు, కార్మికులు ఇబ్బంది పడ్డారు. అయినా.. ఈ ప్రమాదం జరుగుతుందని ఎవ్వరూ ఊహించకపోవడంతో బయటకు వెళ్లకుండా పనిలోనే నిమగ్నమయ్యారు. ఫలితంగా ప్రాణనష్టం ఎక్కువగా సంభవించిందని ఉన్నతస్థాయి విచారణ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. -
‘భూత్’ బంగ్లా సర్కార్!
మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్ర బాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే! ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొలకెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తు న్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేక పోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి.దేశంలోని ప్రస్తుత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఫోర్–ఓ (4.0) వెర్షన్. పదిహేనేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్లైన్తో తిరిగారు. ఇంతటి అనుభవశాలి ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షో భానికి లోనవుతున్నవి. విజ్ఞత విలుప్తమైపోతున్నది. ఆయన జనంలోకి వెళితే ఈయన జ్వరపీడితుడవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది.విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సంద ర్భాన్నే తీసుకుందాము. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి.మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయా లంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవు తారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొల కెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తున్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. రెండున్నర మాసాల్లోనే ‘95 మోడల్’ చూపెట్టిన చిన్న ఝలక్ మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం.పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేట్ గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. అందుకే ‘రైతు భరోసా’ ఆగిపోయింది. ‘విద్యా దీవెన’, ‘విద్యా కానుక’లు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్లాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసు కున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేదల బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఈ ’95 మోడల్ వచ్చీరాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్ను అటకెక్కించారు. ఇంగ్లిషు మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.పేదలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన ‘95 మోడల్’ భూతంగా పరిగణిస్తున్నది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకనూ దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్ చేయడం, దుష్ప్రచారానికి ఒడి గట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 1848లో కార్ల్ మార్క్స్ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ‘యూరోప్ను కమ్యూనిస్టు భూతం వెంటాడుతున్నది’ అనే వాక్యంతో ప్రారంభమైంది. కమ్యూనిస్టు భావజాలాన్ని భూతంగా భావించే నాటి పాలక ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికగా మార్క్స్ ఈ వాక్యాన్ని రాశారు.ఇప్పుడూ అంతే! ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బయ్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణ గారిన జీవితాలనూ, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట! దాన్నిప్పుడు ప్రైవేట్ పెట్టు బడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట! దయ్యాలు వేదాలు వల్లించడమంటే అచ్చంగా ఇదే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేస్తున్నారు.ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజ కీయమో, ఎవరిది దయ్యాలు – భూతాల రాజకీయమో తేల్చడా నికి ఇంకో చర్చ కూడా ఉన్నది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించినది కాదు. ఎమ్మెల్యేలను గెలిపించిందీ ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి, ఎమ్మెల్యేలను ‘వైస్రాయ్’లో నిర్బంధించి, మీడియాతో కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసు కుని దొడ్డిదారిన అధికార పీఠమెక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవలసి వచ్చింది.అయినా తలొగ్గ కుండా జనంలోకి వెళ్లారు. అలవికాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చినవారా? దొడ్డి దారిన ప్రవేశించిన వారా?ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నాలుగో దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు. కాళ్లావేళ్లా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్లో 68 శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఆ తర్వాత తీరిగ్గా నాలుగు రోజుల సమయం తీసుకొని 81 శాతం పోలైనట్టు ప్రకటించింది. ఇది అసాధార ణమని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే సంస్థ వాదిస్తున్నది. గతంలో ఎన్నడూ ఈ తేడా ఒక శాతం కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5 శాతంగా నమోదైంది. ఈవీ ఎమ్ల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కార ణమని వీఎఫ్డీ ఆరోపిస్తున్నది. ఎన్డీఏ మౌత్పీస్గా పనిచేసే ఓ జాతీయ చానల్ కూడా నిన్న ప్రసారం చేసిన ఒక సర్వే వివరాల్లో చంద్రబాబుకు 44 శాతం ప్రజల మద్దతున్నట్టు తేల్చింది. కూటమికి పడిన 56 శాతం ఓట్లలో ఇది 12 శాతం కోత. వీఎఫ్డీ చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్ సరిపోతున్నది.వీఎఫ్డీ ఈ వ్యవహారంపై ఒక సమగ్రమైన రిపోర్టును విడుదల చేసి, నెలరోజులు దాటినా ఇప్పటివరకూ ఎన్నికలసంఘం స్పందించలేదు. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కార ణంగా కేంద్రంలోనూ, ఏపీ, ఒడిషాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకూ, లెక్కించిన ఓట్లకూ కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలయినట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లలో దయ్యాలు, భూతాలు దూరితేనే సాధ్యమవుతుంది.ఆ దయ్యాలూ, భూతాలు ఎట్లా దూరాయన్న రహస్యం విజేతలకు మాత్రమే తెలుస్తుంది.వారికి అనుబంధంగా పని చేసిన ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు, అనుమానం ఉన్న నియో జకవర్గాల్లో 5 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతున్నది. ఈవీఎమ్లపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అను మానాలకు తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈఅంశంపై నోటికి తాళం వేసుకున్నది. కచ్చితంగా ఏదో జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎమ్ల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలూ, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీట్ పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగు తున్నాయి.vardhelli1959@gmail.comవర్దెల్లిమురళి -
క్షతగాత్రులకు అందని పరిహారం.. చంద్రబాబు సర్కార్ వైఫల్యం
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం ప్రమాద ఘటనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నష్ట పరిహారం అందించడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం చెందింది. ఇద్దరు క్షతగాత్రులకు నష్టపరిహారం అందలేదు. ప్రమాదంలో కెమిస్ట్ తేజేశ్వరరావు కంటి చూపు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ నరేష్ కూడా పరిహారం అందలేదు. ప్రస్తుతం ఆయన ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మరో ఘటనలో పరవాడ సినర్జీస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇండస్ ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతుండగా.. జార్ఖండ్కు చెందిన రొయ్య అంగీర మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీ్హెచ్ మార్చూరీకి తరలించారు.కాగా, ‘అచ్యుతాపురం–పరవాడ’ సెజ్లో వరుస ప్రమాదాలు కార్మికులు, వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జరిగిన ఏడు ప్రమాదాల్లో 22 మంది మృతిచెందారు. రెండు రోజుల కిందట అచ్యుతాపురం సెజ్లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో 17 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే... పరవాడ సెజ్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.పరవాడ సమీపంలోని జేఎన్ ఫార్మాసిటీలో సినర్జిన్ యాక్టివ్ ఇన్గ్రేడియంట్స్–3 యూనిట్లో గురువారం అర్ధరాత్రి రియాక్టరు నుంచి రసాయనాలు వెలువడి పొగతో కూడిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జార్ఖండ్కు చెందిన ముగ్గురు, విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన విశాఖపట్నంలోని ఇండస్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ.. 17 మంది కార్మికుల మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్, ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ పరిశ్రమల శాఖ,సీపీసీబీలతో పాటు కేంద్ర పర్యావరణ శాఖకు కూడా నోటీసులు ఇచ్చింది.అలాగే, రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.కాగా, చిత్తూరు సమీపంలోని మురకంబట్టు ప్రాంతంలోని అపొలో మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యి 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం, 37మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంపై అసహనం వ్యక్తం చేసింది.ఈ 3 ఘటనలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆరోపించింది. 2 వారాల్లో ఈ 3 ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.అచ్యుతాపురం ఘటనలో ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్ట్, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, నష్టపరిహారం వంటి విషయాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా సాయం అందిందా లేదా అనే సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా తమకు తెలపాలని పేర్కొంది. -
అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం: బొత్స
సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులను కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతతో మాట్లాడాలని బొత్స హితవు పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించుకోలేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. ‘‘విషాదం వేళ.. రాజకీయం ఎందుకు?. వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాము. తెల్లవారు జామున జరిగిన కూడా ఎక్కడ సహాయక చర్యలు ఆగలేదు. కరోనా సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదు. స్థాయి మరిచి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. గత ఐదేళ్లలో ఏమి జరగలేదని మాట్లాడుతున్నారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాత సీఎం కేజీహెచ్కు వచ్చారు. ఒక మంచి నీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే మృతిచెందిన వారికి కోటి రూపాయల చెక్కు అందించాము. అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశాము.’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. -
ఏపీ ప్రభుత్వానికి NHRC నోటీసులు వరుస ఘటనలపై సీరియస్
-
ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలు.. ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. అనకాపల్లి అనాథా శ్రయంలో ముగ్గురు విద్యార్థుల మృతి చెందగా, 37 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. మరో ఘటనలో చిత్తూరు అపోలో ఆసుపత్రిలో 70 మంది విద్యార్థులు విషాహారం తిని అస్వస్థత గురయ్యారు.ఈ కేసులను జాతీయ మానవ హక్కుల సంఘం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీ , డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. -
మరో ఫార్మా సెజ్ ఫ్యాక్టరీలో ప్రమాదం
-
జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన అనకాపల్లి
-
ధైర్యంగా ఉండండి.. అచ్యుతాపురం బాధితులకు జగన్ పరామర్శ (ఫొటోలు)
-
అచ్యుతాపురం ఘటనపై YS జగన్ ప్రెస్ మీట్
-
బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్
-
అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి: వైఎస్ జగన్
అనకాపల్లి, సాక్షి: అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అచ్యుతాపురం ఘటన బాధాకరం. ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హోం మంత్రి పర్యవేక్షణకు వెళుతున్నాను అన్న మాటే లేదు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు. ఎంత మంది చనిపోయారో తెలియదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం కనిపించింది. కలెక్టర్ కమిషనర్ ఎప్పుడు వెళ్లారనేది చాలా బాధ కలిగించే విషయం. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారు... ఇలాంటి ఘటనే మా హయాంలో జరిగింది. అదీ కోవిడ్ సమయంలో. ఎల్జీ పాలీమర్స్ ఘటనలో 24 గంటల్లోపే పరిహారం ఇప్పించాం. కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదే. అప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు. నేనే ఉదయం 11 గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లాను. గంట్లలోనే రూ.30 కోట్లు పరిహారం సొమ్ము పంపించాం. గతంలో ఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలా స్పందించలేదు. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోంది. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలి. .. పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలి. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇప్పటివరకు ఒక రూపాయి ముట్టలేదు. ఇవ్వాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోండి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేను వచ్చి స్వయంగా ధర్నా చేస్తాను. బాధితులకు అండగా ఉంటాను... చంద్రబాబు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయాను. ఇష్యూను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రభుత్వం అనేది బాధ్యతతో వ్యవహరించాలి. పరిశ్రమలపై పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్పార్టీ కంపెనీలు అడిట్లు, సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. కానీ, గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయడం మానేశారు. సూపర్ పిక్స్ అమల మీద వీరి దృష్టి లేదు. వీళ్ల ధ్యాస అంతా రెడ్ బుక్ అమలుపైనే. రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ.. ఇలాంటి వాటి మీద పెట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవికావు. కార్మికులు చనిపోయేవారు కాదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోంది. .. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. ఇంటి వద్దకు వచ్చే పెన్షన్, ఉచిత రేషన్ ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడం లేదు. పిల్లలకు సంబంధించి ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడి కింద ఒక్క రూపాయి సాయం ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు. స్కూల్స్, ఆస్ప్రతులు, పరిశ్రమలు.. అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. కొట్టడం, చంపడం ఆస్తుల ధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వ పాలనలో కనిపిస్తుంది’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అచ్యుతాపురం బాధితులకు వైఎస్ జగన్ భరోసా..
-
హాస్పిటల్ లో బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
ఉషా ప్రైమ్ హాస్పిటల్ కు చేరుకున్న వైఎస్ జగన్
-
Watch Live: అనకాపల్లిలో వైఎస్ జగన్ పర్యటన
-
అచ్యుతాపురం బయల్దేరిన జగన్
-
అనకాపల్లి: సినర్జిన్ ప్రమాదంపై తలోమాట!
విశాఖపట్నం, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఘోర ప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే.. అనకాపల్లిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అచ్యుతాపురం ఘటన తర్వాత.. పరిహార ప్రకటన, బాధిత కుటుంబాలతో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఇప్పుడు ఫార్మా సిటీ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వ నేతలు తలోమాట చెబుతూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఎంపీ సీఎం రమేష్ ఏమన్నారంటే.. సీనియర్ కెమిస్ట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగింది. సీనియర్ కెమిస్ట్ డ్రగ్ పౌడర్ మిక్స్ చేస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. హోం మంత్రి అనిత ఏమన్నారంటే.. ఇది మరో దురదృష్టకరమైన ఘటన. జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో ఉద్యోగికి.. మొత్తం నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులకు సేఫ్టీ సూట్లు ఇవ్వాలి. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక కమీటి వేసి,పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.అధికారులు ఏమన్నారంటే.. మానవ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు ఆధారంగా గుర్తించాం. వేపర్ క్లైండ్ బరస్ట్ కారణంగానే ప్రమాదం జరిగింది. కెమికల్ మిక్సింగ్టైంలో బయటకు ఆవిరి వచ్చి పేలింది. అసలేం జరిగింది?పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ సంస్ధలో గత అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్కు చెందిన ముగ్గురు కార్మికులు, విజయనగరానికి చెందిన మరో ఉద్యోగి(సీనియర్ కెమిస్ట్) తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. హుటాహుటిన నలుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించింది. ఘటనపై ఈ ఉదయం జిల్లా కలెక్టర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. దీంతో హోం మంత్రి అనిత క్షతగాత్రుల్ని పరామర్శించారు. సినర్జిన్ ప్రమాదంలో ఒకరికి 90 శాతం గాయాలు కాగా, మరో ముగ్గురికి 60 శాతం పైగా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో 17 మంది మృత్యువాత పడగా.. మరో ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇంకో నలుగురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. -
YS Jagan: అచ్యుతాపురం సెజ్ బాధితులకు జగన్ పరామర్శ
అనకాపల్లి, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధితులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. శుక్రవారం ఉదయం అనకాపల్లికి వెళ్లిన ఆయన.. ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితుల వివరాలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న జగన్.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వాళ్లకు ధైర్యం చెప్పారు. అలాగే.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఆస్పత్రిలోనే 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. పోలీసుల ఓవరాక్షన్అంతకు ముందు.. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్కు వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన అనకాపల్లి వెళ్తుండగా పోలీసులు అతి ప్రదర్శించారు. జగన్ కాన్వాయ్ వెంట వైఎస్సార్సీపీ నేతలెవరూ వెళ్లకుండా వాళ్ల వాహనాల్ని అడ్డుకున్నారు. ఆప్యాయ పలకరింపుజగన్ రాక సమాచారంతో విశాఖ ఎయిర్పోర్టుకు, అనకాపల్లిలోని ఆస్పత్రి వద్దకు భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్లందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఇక ఆస్పత్రిలో సిబ్బందిని పలకరించిన జగన్.. సిబ్బంది కోరడంతో సెల్ఫీలు కూడా దిగారు. జగన్ ఒత్తిడికి తలొగ్గి.. అచ్యుతాపురం బాధితుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఘటన జరిగిన వెంటనే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. జగన్తో పాటు బాధిత కుటుంబాల ఒత్తిడి మేరకు నిన్న సీఎం చంద్రబాబు కోటిరూపాయల పరిహారం ప్రకటన చేశారు. అలాగే బాధితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు రాగా.. విశాఖలోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తోంది ప్రభుత్వం. చంద్రబాబుది అనైతిక పాలన: వైఎస్ జగన్ -
నేడు అనకాపల్లికి వైఎస్ జగన్..
-
ఏ గుండె తట్టినా ఆవేదనా స్వరాలే..
సాక్షి, విశాఖపట్నం/మహరాణిపేట: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా పరిశ్రమలో విస్ఫోటం 17 మంది ఊపిరితీసింది. యాజమాన్య నిర్లక్ష్యం మృత్యు రూపంలో చేసిన విలయతాండవం ఆ కుటుంబాల ఉసురుతీసింది. ఉత్సాహంగా ఉద్యోగానికి వెళ్లిన తమవారిని.. ఆఖరిచూపు చూసుకునేందుకు కేజీహెచ్కు వచ్చిన కుటుంబ సభ్యుల రోదనలతో.. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపించాయి. కన్నీటి చారికలతో కేజీహెచ్లో విషాద వాతావరణం అలముకుంది.ప్రేమ పెళ్లి చేసుకుని నిండుచూలాల్ని వదిలేసి వెళ్లిపోయిన భర్త కోసం ఆ గర్భిణీ పడుతున్న వేదన కంట తడిపెట్టించింది.. మూడ్రోజుల క్రితం రాఖీ కట్టించుకున్న అన్నయ్య భరోసా ఇకపై ఉండదా అంటూ సోదరి రోదన సాగర ఘోషని మించిపోయింది.. ఉద్యోగమొచ్చింది, కష్టాలు తీరిపోయినట్లే అమ్మా అని భరోసా ఇచ్చిన కొడుకు.. కళ్ల ముందు ఇకపై ఉండవా నాన్నా.. అంటూ తల్లడిల్లుతున్న తల్లిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు.ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మందిని పొట్టన పెట్టుకున్న మృత్యు పరిశ్రమ ఆ కుటుంబ సభ్యులకు అంతులేని వేదనని మిగిల్చింది. చివరికి.. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఆ కుటుంబాలు.. తమ వారి శవ పంచనామా కోసం, ప్రభుత్వం అందించే భరోసా కోసం కూడా ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితులు విశాఖ కేజీహెచ్లో సాక్షాత్కరించాయి. భారమైన గుండెలతో.. తమ వాళ్ల నెత్తుటి ముద్దల కోసం ఎదురుచూస్తున్న ఏ కుటుంబాన్ని చూసినా.. విషణ్ణ వదనాలే కనిపించాయి. ఏ గుండెను కదిలించినా ఆవేదనా స్వరాలే వినిపించాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం.రెండు కళ్లల్లో ఒక కన్ను పోయింది.. అన్నదమ్ములిద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకరు పని ముగించుకుని బయటకొస్తే ఇంకొకరు పనికి కంపెనీలోకి వెళ్లారు. ఎప్పుడూ జనరల్ డ్యూటీకి వెళ్లే పూడి మోహన్ దుర్గాప్రసాద్ బుధవారం బి.షిఫ్ట్కు వెళ్లాడు. కొద్దిసేపటికి భారీ విస్ఫోటం సంభవించి అన్న పూడి మోహన్ దుర్గాప్రసాద్ చనిపోయాడు. ఈ విషయం తెలిసిన ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ‘మాకున్న రెండు కళ్లలో ఒక కన్నుపోయింది. ఇప్పుడెలా?’.. అంటూ మృతుడి తల్లిదండ్రులు శ్యామల, సూర్యారావు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఒక్కో కథ.. కన్నీటి వ్యధ అనకాపల్లి జిల్లాలోని సెజ్ ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులు ఆస్పత్రి వద్ద రోదిస్తున్న తీరు అక్కడున్న వారికి కంటతడిపెట్టిస్తోంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోయే వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా...మరొక మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. వీరి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.. ప్రమాదంలో మరణించిన కొంతమంది మృతుల గురించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు.. – అనకాపల్లి/ఎస్.రాయవరంపెళ్లై ఆరు నెలలు.. భార్య గర్భవతి ఫార్మా ప్రమాదంలో మరణించిన ఎస్.రాయవరం మండలం దార్లపూడి యువకుడు జవ్వాది చిరంజీవికి 6 నెలల క్రితం పెళ్లయింది. అతని భార్య గర్భవతి. ఈ ఘటన ఆ కుటుంబాన్ని కోలుకోలేని స్థితికి తీసుకెళ్లింది. పెళ్లికి ముందు ఒడిశాలో ఉద్యోగం చేసుకుంటున్న చిరంజీవి, ఇటీవల అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ఫిట్టర్గా చేరాడు. ఎక్కువగా జనరల్ షిప్్టకి వెళ్లే చిరంజీవి, బుధవారం బి షిఫ్ట్కి వెళ్లాడు. విధుల్లో చేరుతుండగా ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే మరణించాడు. మృతుడిపైనే భార్య, తల్లి ఆధారపడి జీవిస్తున్నారు.కొండంత ఆసరా అనుకున్నాంఫార్మా ప్రమాదంలో మరణించిన బంగారంపాలేనికి చెందిన పూసర్ల వెంకటసాయి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. తండ్రి ఆటో నడుపుతూ, తల్లి టైలరింగ్ చేసుకుంటూ వెంకటసాయిని చదివించారు. చదువు పూర్తై, ఇటీవల ఫార్మా కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేరాడు. అమ్మానాన్నలను తానే చూసుకుంటానని చెప్పేవాడు. అంది వచి్చన కొడుకు అనంత లోకాలకు చేరడంతో ఆ తల్లిదండ్రుల రోదన గ్రామస్తుల్ని కన్నీరు పెట్టిస్తోంది. మృతుడు వెంకటసాయికి ఇంకా వివాహం కాలేదు.సెపె్టంబర్ 5న పెళ్లి..ఇంతలోనే.. జావాది పార్థసారథి మా మనవడు. మాది పార్వతీపురం మన్యం జిల్లా, డోకిశిల పంచాయతీ, చలమలవలస. పార్థసారథికి సెపె్టంబర్ 5న వివాహం. నిన్ననే బట్టలు కొన్నాం. పావు తక్కువ రెండు వరకు మాతో మాట్లాడాడు. పనిలోకి వెళ్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెళ్లిన అరగంటలోనే ఇలా అయిపోయింది. రాత్రి 7 గంటలకు గానీ మాకు సమాచారం లేదు. యాజమాన్యం మాకు ఏమీ చెప్పలేదు. మా ఎమ్మార్వో ద్వారా వీఆర్వో మాకు చెప్పాడు. మా ఊరి నుంచి 6 గెడ్డలు దాటుకుని, పార్వతీపురంలో కారు బుక్ చేసుకుని బయల్దేరితే రాత్రి 11 గంటలకు ఇక్కడికి చేరుకున్నాం. మృతదేహం ఎక్కడుందో తెలీదు. అడిగితే.. ఎవరి నుంచీ సరైన సమాధానం రావట్లేదు. అధికారులు, నాయకులూ ఎవరూ పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. – జావాది శ్రీరాములనాయుడు, మృతుడి తాతయ్యఫ్యాక్టరీలో చేరి నెలన్నరే..మాది అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం పాశర్లపూడి లంక. నా భర్త సతీష్ ఈ ఫ్యాక్టరీలో చేరి నెలన్నరే అయింది. మా పెళ్లయి మూడేళ్లు. పిల్లలు లేరు. తొలి జీతం అందుకుని, ఇంటికి పంపించి ఇక నుంచి అంతా మంచిగానే ఉంటుందని సంతోషంగా చెప్పారు. ప్రమాద విషయాన్ని కంపెనీ యాజమాన్యం, అధికారులు చెప్పలేదు. నా భర్త ఫ్రెండ్స్ మా మరిదికి చెప్పారు. ముందు సీరియస్గా ఉంది వెంటనే వచ్చేయమన్నారు. మేము ఓ 20 కి.మీ. వచ్చాక ఫోన్ చేస్తే చనిపోయినట్లు చెప్పారు. కారు పురమాయించుకుని రాత్రి 1.30కు కేజీహెచ్కు వచ్చాం. ఇక్కడ అందరినీ బతిమాలగా 2.30కు లోపలికి పంపించారు. ఆయన చేతులు, ముఖం, తల బాగా కాలిపోయింది. భవిష్యత్తును తలచుకుంటే భయమేస్తోంది. – సాయిశ్రీ, మృతుడు సతీష్ భార్య, పాశర్లపూడిలంకప్రేమించి ఇప్పుడెలా వెళ్లిపోయావ్?‘ప్రేమించావ్.. పెళ్లి చేసుకున్నావ్.. ఒక్క క్షణం వదిలిపెట్టను అని అన్నావు కదా.. ఇప్పుడు నన్నొదిలి ఎలా వెళ్లిపోవాలనిపించింది నీకు. పిల్లలంటే ప్రాణమన్నావ్. మన బిడ్డ పుట్టకుండానే వెళ్లిపోయావా. రేపు మన బిడ్డ నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలి. టైర్ పంక్చరైందని ఫోన్చేస్తే వచ్చేసెయ్ అని చెప్పాను. కానీ, శాలరీ కట్ అవుతుందని వెళ్లిపోయావ్. ఇందుకేనా..’ అంటూ తన భర్త జవ్వాది చిరంజీవిని ప్రమాదంలో కోల్పోయి ఆరునెలల గర్భంతో కన్నీరుమున్నీరవుతున్న లీలాదేవిని ఓదార్చడం ఎవ్వరితరం కాలేదు.‘ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లాక ఫోన్చేసి మాట్లాడతాడు. కానీ, ఆ రోజు ఫోన్ రాలేదు. నేను చేస్తే ఎత్తలేదు. ఏం జరిగిందోనన్న ఆందోళనలో ఉన్నప్పుడు ఇంట్లో అందరూ టీవీ చూసి కంగారుపడ్డారు. ఎవరూ ఏం చెప్పలేదు. ఎందుకు ఫోన్ ఎత్తడంలేదని అడిగితే రకరకాలుగా చెప్పారు. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారంలేదు. ఏం జరిగిందో తెలీదు. ‘ఏమండి.. మా ఆయన్ని ఒక్కసారి చూడనివ్వండి. మీ కాళ్లు పట్టుకుంటాను’..పెళ్లి ముచ్చట తీరకుండానే.. ‘కన్నా.. మేమంతా నీ మీదే ఆధారపడి బతుకుతున్నామని తెలుసు కదా. ఉద్యోగం వచ్చింది. ఇక మనకు కష్టాలు తీరిపోయాయని చెప్పావు. ఇప్పుడేమో.. భగవంతుడు కూడా తీర్చలేని కష్టంలోకి మమ్మల్ని నెట్టేసి ఎలా వెళ్లిపోయావు? పెళ్లి చేసేద్దామని అనుకున్నాం కదా.. నువ్వు కూడా సరే అన్నావు. ఆ ముచ్చట తీరకుండా మమ్మల్ని అనాథలు చేసేశావా కొడుకా’.. అంటూ రాజశేఖర్ తల్లిదండ్రులు పైడి ధర్మారావు, తులసమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు.పైడి రాజశేఖర్ (22) స్కూలు, కాలేజీలో టాపర్. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చేసిన రాజశేఖర్ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాడు. ఇటీవలే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనా రెండింటికీ ఇంకా జాయినింగ్ ఆర్డర్ రాకపోవడంతో రెండునెలల క్రితమే ఎసైన్షియాలో ప్రాసెస్ ఇంజినీర్గా చేరాడు. మూడ్రోజుల క్రితం చెల్లెలు రాఖీ కూడా కట్టింది. నిజానికి.. రాజశేఖర్ బుధవారం మధ్యాహ్నం షిఫ్ట్కి వెళ్లాల్సి ఉంది. కానీ, రాత్రికి స్నేహితుడి పెళ్లి ఉండడంతో ఉదయానికి మార్చుకుని విగతజీవిగా మారాడు.మేమెలా బతకాలి కొడకా? ‘మాకు ఆధారం నువ్వే కదా నాయనా.. మీ అమ్మ, నేను ఇప్పుడెలా బతకాలి. నీ జీతం మీదే మన కుటుంబం ఆధారపడి బతుకుతోంది. నీ మీదే ఆశలు పెట్టుకున్న మేం ఇప్పుడెలా జీవించాలి’.. అంటూ మహంతి నారాయణ తండ్రి సత్యం కన్నీరుమున్నీరవుతున్నారు. ‘ప్రమాదంపై కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అక్కడ ఇక్కడ చూసి, టీవీల్లో వస్తున్న కథనాలను చూసిన తర్వాత రాత్రి తెలిసింది. ఇక్కడకొచ్చి విగతజీవిగా నిన్ను చూస్తుంటే బతకాలనిపించడం లేదు’..అంటూ రోదించారు.ఇప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు? నా భర్త ఏమైయ్యాడో తెలియని పరిస్థితి, విధి నిర్వహణకు వెళ్లిన వ్యక్తి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడంలేదు. ఏం జరిగిందో తెలీదు. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారంలేదు. నాకు నాలుగేళ్ల బాబు, రెండు నెలల పాప వుంది. ఏం జరిగిందో నాకూ, నా కుటుంబ సభ్యులకు తెలీక ఆందోళన చెందాం. రాత్రి 9 గంటల వరకు ఎలాంటి సమాచారం తెలీలేదు. భయపడి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. అర్థరాత్రి దాటిన తర్వాత ఎవరో చెప్పడంతో ఉదయం ఇక్కడకు వచ్చాం. తీరా వచ్చాక చూస్తే నా భర్త విగతజీవిగా పడి ఉన్నాడు. ఇప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు’.. అంటూ చనిపోయిన హంస ప్రశాంత్ భార్య హంస జ్యోతి రోదన కంటతడి పెట్టించింది.ఈ వయసులో ఒంటరిగా వదిలేశావా? ఏం భయంలేదే.. ఇంకొన్నేళ్లు పనిచేస్తే పింఛనొచ్చేస్తాది. దాంతో ఇద్దరం ప్రశాంతంగా బతుకుదాం. ఎవ్వరిమీదా ఆధారపడాల్సిన పనిలేదు అని చెప్పావు. ఇప్పుడేమో ఈ వయసులో ఒంటరిగా వదిలేశావా.. ఇప్పుడు నేనెలా బతకాలి.. ఎవరి కోసం బతకాలి.. ప్రమాదం జరిగిందని తెలీగానే నా గుండె ఆగినంత పనైంది. నీకేమైందో తెలీలేదు.ఎవర్ని అడిగినా రాత్రి 11 గంటల వరకూ చెప్పలేదు. ఇరుగుపొరుగు వారిని కనుక్కోమని కాళ్లావేళ్లా పడి బతిమాలి కంపెనీ దగ్గరికి వెళ్తే.. నన్నొదిలి వెళ్లిపోయావని చెప్పారు. ఎక్కడున్నావని అడిగితే కేజీహెచ్కు తీసుకొచ్చేశారని చెప్పారు. నిన్న డ్యూటీకెళ్లినప్పుడు నీ మొహం చూశాను. ఇప్పటివరకూ నువ్వు కనపడలేదయ్యా. నువ్వేసుకున్న బట్టలు చూసి నిన్ను గుర్తుపట్టాను. ఇంక నేనెలా ఈ జీవితాన్ని ఈడుస్తాను? అంటూ వేగి అచ్చియ్యమ్మ తన భర్త సన్యాసినాయుడు (55) కోసం తలచుకుంటూ కుమిలిపోతోంది.చాలా భయపడ్డాం..నా కుమారుడు మహేశ్ ఎసైన్షియా కంపెనీ ఏసీ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే వాడికి ఫోన్ చేసినా స్పందన లేదు. చాలా భయపడ్డాం. మా బంధువులు నేరుగా ప్రమాద స్థలం వద్దకు చేరుకుని వెతికితే నా కుమారుడు గాయాలతో ఉన్నాడు. దీంతో అతడిని అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మెడికవర్ ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదన్నారు. ప్రభుత్వం అన్ని వి«ధాలా ఆదుకోవాలి. –మహాలక్ష్మి, క్షతగాత్రుడు మహేశ్ తల్లిమెరుగైన వైద్యం అందించాలిమా బంధువు దేముడు తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాం. చాలా సమయం వరకు అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో భయపడ్డాం. రాత్రి 12 గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్టు తెలిసింది. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి. –అప్పలరాజు, క్షతగాత్రుడు దేముడు బంధువు -
రేపు ‘అచ్యుతాపురం సెజ్' బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ బాధితులను రేపు (శుక్రవారం) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు.బుధవారం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రేపు ఉదయం 11 గంటలకు పరామర్శించి, వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం తిరుగు పయనమవుతారువైఎస్ జగన్ దిగ్భ్రాంతి అంతకు ముందు అచ్యుతాపురం సెజ్లో బుధవారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని,సానుభూతిని తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2024 -
నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్లోని ఎసైన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు చెల్లించే నష్ట పరిహారం మొత్తం కంపెనీయే భరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 లక్షలు పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 2.34 గంటలకు హెలికాప్టర్ ద్వారా ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీ వద్దకు చేరుకుని, పేలుడు జరిగిన బ్లాకులను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇక్కడి లారెస్ట్ ఫార్మా కంపెనీలో మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్లో ఎసైన్షియా ఫార్మా రెడ్ కేటగిరీ పరిశ్రమ అని, అలాంటి పరిశ్రమల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ కారణంగా ప్రమాదం జరిగిందని, ఎస్వోపీ ఫాలో అవ్వలేదని స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. పేలుడు ఘటనలో 17 మంది చనిపోగా, క్షతగాత్రుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారు మినహా మిగతా అందరూ స్వల్ప గాయాలతోనే ఉన్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. హైలెవెల్ విచారణ కమిటీ ఏర్పాటు..సెజ్లో ప్రమాదంపై హైలెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులందరిపైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎల్జీ పాలీమర్స్ ప్రమాదంపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసినా కఠిన చర్యలు లేని పరిస్థితులు చూశామని చంద్రబాబు అన్నారు. అధికారులు అలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రమాద ఘటన సమయంలో ఫార్మా కంపెనీ యాజమాన్యం అందుబాటులో లేదన్నారు. నూతన పరిశ్రమలు ఏర్పాటుకు సహకరిస్తూనే.. భద్రతా చర్యలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫార్మాకంపెనీల్లో ప్రతీ మూడునెలలకొకసారి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలన్నింటితో తనిఖీలు చేయిస్తే, నిర్లక్ష్యంగా ఉండే కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు వారు ఇచ్చే నివేదికలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామన్నారు. దీంతో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పూర్తి బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలదే అవుతుందన్నారు. భద్రత విషయంలో పరిశ్రమలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలన్నారు. గత ఐదేళ్లలో పరిశ్రమలను లూటీ చేశారని, ఆ కారణంగానే ప్రమాదాలు ఎక్కువయ్యాయని సీఎం అన్నారు. అచ్యుతాపురం–పరవాడ పరిధిలో ఎస్ఈజెడ్, నాన్ ఎస్ఈజెడ్ ప్రాంతాల్లో 119 ప్రమాదాలు జరిగితే 120 మంది మరణించారని వెల్లడించారు. గత పాలకుల పొరపాట్లే ఈ ప్రమాదాలకు కారణమన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, హోం మంత్రి అనిత, ఎంపీ రమేశ్, స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్, అధికారులు పాల్గొన్నారు. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండిబీచ్రోడ్డు (విశాఖ): అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీ దుర్ఘటనలో గాయపడిన వారిని సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని వారిని కోరారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం వెంకోజీపాలెం మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏడుగురు క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కలుషితాహార బాధిత చిన్నారులకు సీఎం పరామర్శమహారాణిపేట: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం ట్రస్టులో కలుషితాహారం తిని కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను కూడా చంద్రబాబు పరామర్శించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం కేజీహెచ్కు వచ్చిన ఆయన చిన్నపిల్లల వార్డును సందర్శించారు. -
అచ్యుతాపురం ఘటన: మళ్లీ మొదటికొచ్చిన రూ.కోటి పరిహారం వ్యవహారం
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్నుసూపరింటెండెంట్ మృతుల బంధువులు నిలదీశారు. నష్టపరిహారం ఇచ్చేవరకు మృతదేహాలను తీసుకువెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరీ వీడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఇదిలా ఉంటే.. కోటి రూపాయల పరిహారం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే రూ. కోటి చెక్కు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు వెళ్లిన తర్వాత అధికారులు మాట మర్చారు. డెడ్బాడీలను ఇంటికి తీసుకెళ్లే సమయంలో దారి ఖర్చులకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తామని అధికారులు అంటున్నారు. రూ కోటి పరిహారం ఇస్తేనేగాని ఇంటికి తీసుకెళ్లమంటున్న బంధువులు.. రూ.10 వేల కోసం కుక్కర్తి పడేవాళ్లలా కనిపిస్తున్నామా అంటూ నిలదీశారు.మరీ ఇంత నిర్లక్ష్యమా!?కాగా, ఎక్కడో మదనపల్లిలో ఓ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని ఫైళ్లు దగ్ధమైతేనే ఏదో భారీ ఉపద్రవం ముంచుకొచ్చినట్లు హడావిడి చేసి, ఆగమేఘాల మీద హెలికాఫ్టర్లో డీజీపీని పంపి సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. విశాఖలో ఇంత పెద్ద ప్రమాదం సంభవిస్తే, ఇంత మంది ప్రాణాలు పోతే స్పందించకుండా తాపీగా ప్రభుత్వ శాఖలపై సమీక్ష చేస్తూ కూర్చోవడం విమర్శలకు తావిస్తోంది.40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ, తనను మించిన విజనరీ, సమర్థుడు ఈ దేశంలోనే లేడని తనకు తానే డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. రియాక్టర్ ప్రమాద ఘటనలో మాత్రం చతికిలబడ్డారు. చంద్రబాబు పరిపాలనలో బేలతనం ఈ దుర్ఘటనతో స్పష్టంగా బయటపడింది.మధ్యాహ్నం 2 గంటల సమయంలో రియాక్టర్ పేలింది. అదే సమయంలో హోం శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలోనే హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసి కూడా సహాయక చర్యలపై వారితో సీఎం చంద్రబాబు సమీక్షించలేదని తెలిసింది. చంద్రబాబు సీఎం సమీక్ష అనంతరం కూడా సచివాలయంలోనే ఉన్న హోం మంత్రి అనిత.. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్పై విమర్శలు చేయడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు.అచ్యుతాపురం ఘటనపై ఆమె కనీసం స్పందించ లేదు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ ప్రెస్ మీట్ పెట్టి ప్రమాదంలో మృతుల వివరాలు కూడా పూర్తిగా చెప్పలేకపోయారు. అంతెందుకు రాత్రి 7 గంటల వరకు అనకాపల్లి కలెక్టర్తో సీఎం చంద్రబాబు మాట్లాడలేదు. సచివాలయంలోనే ఉన్నా, హోం మంత్రి, డీజీపీలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అర్ధరాత్రయినా ప్రమాద స్థలానికి మంత్రులుగానీ, ఉన్నతాధికారులుగానీ చేరుకోలేదు. ప్రెస్ నోట్లు, మీడియాలో దిగ్భ్రాంతులకే పాలనా యంత్రాంగం పరిమితమైంది. -
అచ్యుతాపురం ప్రమాదంపై మృతుల బంధువుల నిరసన
-
సీఎం, డిప్యూటీ సీఎం ఎక్కడ ?.. మా గోడు పట్టించుకునే నాధుడే లేడా
-
అచ్యుతాపురం ఘటనపై బాబు సర్కార్ ఉదాసీన వైఖరి!
విజయవాడ, సాక్షి: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాదంపై చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీన వైఖరి తేటతెల్లమైంది. అంత భారీ ప్రమాదం జరిగితే.. ఏం పట్టనట్లు అధికారిక కార్యక్రమాల్లో మునిగిపోయారాయన. మంత్రుల సంగతి పక్కన పెడితే.. కనీసం అక్కడి ప్రజాప్రతినిధుల్ని కూడా ఆయన ఘటనా స్థలానికి వెళ్లమని ఆదేశించకపోవడం గమనార్హం. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మధ్యాహ్నం 1.30 -2 గంటల మధ్య ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఆ టైంలో హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఆ టైంలో ప్రమాదంపై సమాచారం అందినా.. ఆయన సహాయక చర్యలపై ఏమాత్రం సమీక్షించలేదు. పైగా ఆ మీటింగ్లో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. వాళ్లకూ కనీస ఆదేశాలు ఇవ్వలేదు.చంద్రబాబు సమీక్ష అనంతరం.. 4 గంటలకు హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రమాదంపై కనీసం స్పందించకుండా.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలతో సరిపెట్టారు. ఆ తర్వాత 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి శుభాష్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అయితే ఆయన కూడా ప్రమాదంపై సగం సగం మాట్లాడారు. ప్రమాదంలో కార్మికులు ముక్కలు, చెక్కలైపోయారని అప్పటికే మీడియా ఛానెల్స్లో కథనాలు వచ్చాయి. ఇక పాలనా యంత్రాంగం అంతా ప్రెస్ నోట్లు, మీడియా దిగ్భ్రాంతులకే పరిమితం అయ్యింది. చివరకు.. రాత్రి 7 గంటలు దాటాక ప్రమాదంపై అనకాపల్లి కలెక్టర్తో చంద్రబాబు మాట్లాడారు. అర్ధరాత్రికి హోం మంత్రి అనిత ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నాం చంద్రబాబు అక్కడికి వెళ్లనున్నారు. అదే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ తరహా ఘటనలు జరిగితే.. సత్వర చర్యలు ఉండేవి. స్థానిక ప్రజా ప్రతినిధులు సత్వరమే అక్కడికి పంపించి.. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించేవారు. తద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించే యత్నమూ చేసేవారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున పరిహారం కూడా సత్వరంగా ప్రకటించి.. అదే త్వరగా బాధిత కుటుంబాలకు అందించేవారు. ఇదీ చదవండి: 'అచ్యుతాపురం సెజ్' బాధితులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యే, ఎంపీ.. అఖరికి అధికారులు కూడా సకాలంలో అక్కడికి వెళ్లలేని దుస్థితి నెలకొందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. మరోపక్క.. మదనపల్లె ఫైల్స్ ఘటనలో హెలికాఫ్టర్లో డీజీపీకి గంటలో పంపిన చంద్రబాబుకి.. అచ్యుతాపురం ఘటనలో సత్వరమే స్పందించాలన్న స్పృహ లేకపోవడంపై రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం... ఎసైన్షియా ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్... 18 మంది దుర్మరణం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
అచ్యుతాపురం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఘటన తనను ఎంతో బాధించిందన్న ఆయన.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. Pained by the loss of lives due to a mishap at a factory in Anakapalle. Condolences to those who lost their near and dear ones. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs.…— PMO India (@PMOIndia) August 21, 2024అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం రియాక్టర్ పేలిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 18 మంది మృతి చెందగా.. 35 మంది తీవ్ర గాయాలతో అనకాపల్లి, విశాఖ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
రియాక్టర్ పేలుడుపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(శుక్రవారం) పరిశీలించనున్నారు. రేపు ప్రమాదస్థలానికి సీఎం వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఎల్లుండి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో మాట్లాడిన వైఎస్ జగన్.. వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా కంపెనీలో రియాక్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. -
అచ్యుతాపురం సెజ్లో పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.‘‘అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాను. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలి. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలి. మా పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2024 -
అచ్యుతాపురం సెజ్ ఘటన.. 15కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. మధ్యాహ్నం రియాక్టర్ పేలే సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక గాయపడిన క్షతగాత్రుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు గాయపడ్డ క్షతగాత్రుల సంఖ్య 50 దాటింది. మరణించిన వారిలో చల్లపల్లి హారిక (24), పూడి మోహన్ (23), దుర్గా ప్రసాద్, చిన్నారావులు,రాజశేఖర్ ఉన్నారు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు1. వి. సన్యాసినాయుడు (50), ప్లాంట్ ఏజీఎం2. రామిరెడ్డి, ల్యాబ్ హెడ్3. హారిక కెమిస్ట్4. పార్థసారథి(23), ప్రొడక్షన్ ఆపరేటర్5. వై. చిన్నారావు, ప్లాంట్ హెల్పర్6.పి.రాజశేఖర్ (22)7. మోహన్, ఆపరేటర్8. గణేష్, ఆపరేటర్9. హెచ్. ప్రశాంత్10. ఎం. నారాయణరావు.. మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులకు అందని మెరుగైన వైద్యం👉 ఎసెన్షియా కంపెనీ ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు అందని మెరుగైన వైద్యం👉 అత్యవసర మెరుగైన వైద్యం అందించకపోతే క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం 👉 వైద్యం అందడం లేదని అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్న క్షతగాత్రులు 👉 అటు ఇటు తిరుగుతూ అధికారులు హడావిడి చేస్తున్నారే తప్ప మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవడం లేదని బాధితుల ఆగ్రహం చేతులెత్తేసిన ఫైర్ ఫైటర్స్👉 పెరిగి పోతున్న మృతుల సంఖ్య 👉మృతదేహాల వెలికితీత లో చేతులెత్తిశిన ఫైర్ ఫైటర్స్👉 కైలసపురం నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు👉 గ్యాస్ కట్టర్లతో శిధిలాలను తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు👉శిధిలాల కింద పదుల సంఖ్యలో మృతదేహాలుఅధికారులు పట్టించుకోవడం లేదు👉ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు రాలేదు👉కంపెనీ బస్సులోనే గాయాలతో మేమంతా ఆసుపత్రికి వచ్చాం👉ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించడం లేదు👉నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది అయినా డాక్టర్లు పట్టించుకోవడం లేదు👉అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు👉క్షతగాత్రులు అందరినీ మెరుగైన చికిత్స కోసం వైజాగ్ తరలించవచ్చు కానీ ఆ ప్రక్రియ ఇక్కడ జరగడం లేదు..- నాయుడు, క్షతగాత్రుడు ఏడు అంతస్తుల ఎసెన్షియా కంపెనీలో మూడోఫ్లోర్లో 500 కిలో లీటర్ రియాక్టర్ పేలినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు దాటికి మూడోఫ్లోర్ గోడలు ధ్వంసం అయ్యాయి. దీంతో స్లాబు కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. శిధిలాల కింద చిక్కుకున్న కార్మికుల్ని రక్షించేందుకు పొక్లెయిన్ సహాయంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. 300 మంది కార్మికులు పనిచేస్తున్న ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనకాపల్లి ఉష ప్రైమ్ ఆసుపత్రికి తరలించి, వారికి చికిత్సను అందిస్తున్నారు. వారిలో చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక ఘటనా స్థలానికి చేరుకుంది. 15 ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మరో రియాక్టర్ పేలే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ ఆపరేషన్ను మొదలు పెట్టారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
విషాహారానికి ముగ్గురు విద్యార్థులు బలి.. .. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అనకాపల్లి: ఫుడ్ పాయిజన్తో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో 35 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు రాజగోపాలపురంలో పరిశుద్ధాత్మ అగ్ని స్తుతి ఆరాధన (పాసా) ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆశ్రమంలో శనివారం రాత్రి మిగిలిపోయిన బిర్యానీని తినడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ట్రస్ట్ నిర్వాహకుడు, పాస్టర్ ఎం.కిరణ్కుమార్ ఈ నెల 17న పందూరులో మధ్యాహ్నం జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్కు వెళ్లాడు. అక్కడ మిగిలిపోయిన బిర్యానీని ఆశ్రమానికి తెచ్చి రాత్రి విద్యార్థులకు పెట్టారు. దాన్ని తిన్న విద్యార్థుల్లో ఐదుగురు అదేరోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. తెల్లవారుజామున మరో 15 మంది అస్వస్థతకు గురవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించారు. తల్లిదండ్రులతో విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. తీవ్ర అస్వస్థతతో ఇంటి దగ్గరే మరుసటి రోజు ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో 35 మందిని తల్లిదండ్రులు సమీపంలోని నర్సీపట్నం, పాడేరు ఏరియా ఆస్పత్రులకు, డౌనూరు, చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. నర్సీపట్నంలో చికిత్స పొందుతున్న 16 మందిలో 14 మంది ఆరోగ్యం విషమించడంతో విశాఖలోని కేజీహెచ్కు తరలించారు.ప్రస్తుతం నర్సీపట్నం, పాడేరు, డౌనూరు, చింతపల్లి ఆస్పత్రుల్లో 21 మంది చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వారిలో కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ రెల్లలపాలేనికి గెమ్మెలి నిత్య(భవాని)(8), చింతపల్లి మండలం తిరుమల పంచాయతీ నిమ్మలపాలేనికి చెందిన తంబెలి జాషువా(7), చింతపల్లి మండలం బలభద్రకు చెందిన కొర్రా శ్రద్ధ(7) ఆదివారం రాత్రి ఇంటి వద్దే మృతి చెందారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న జెస్సికాకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. 13 ఏళ్లుగా అనధికారికంగానే..పాస్టర్ కిరణ్కుమార్ 13 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాసా ట్రస్టుకు ఎలాంటి అనుమతుల్లేవు. తొలుత అతను కోటవురట్ల మండలం హనుకు గిరిజన గ్రామంలో చర్చి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో గ్రామస్తులు పంపించేశారు. ఆ తర్వాత ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడున్న 86 మందిలో 80 మంది అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులే.సంఘటన స్థలాన్ని సందర్శించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులతో విచారణకు ఆదేశించారు. పాసా ట్రస్ట్ నిర్వాహకుడు కిరణ్కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ సోమవారం రాత్రి మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించి, ఉన్నతస్థాయి కమిటీ విచారణకు సీఎం ఆదేశించినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ వెల్లడించారు.విద్యా సంస్థల తనిఖీలకు సీఎం ఆదేశంసాక్షి, అమరావతి: రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఇతర విద్యా సంస్థల్లో పరిస్థితులను తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలోని ప్రయివేటు, చైల్డ్ కేర్ సెంటర్లను తనిఖీ చేయాలని సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.విద్యార్థుల మృతి ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
అనాథాశ్రమం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి...
-
కలుషితాహారం తిని విద్యార్థులు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు.చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.కాగా అనకాపల్లి జిల్లా కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో.. కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాషువా, భవాని, శ్రద్ధ మరణించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి ఏరియా ఆసుప్రతిలో 17 మంది విద్యార్ధులకు చికిత్సం అందిస్తుండగా.. నర్సీపట్నం ఆసుపత్రిలో ఏడుగురు విద్యార్ధులకు చికిత్స పొందుతున్నారు. -
అనాధ ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ నలుగురు చిన్నారులు మృతి
-
అనకాపల్లి: అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్.. నలుగురు పిల్లలు మృతి
అనకాపల్లి, సాక్షి: వసతి గృహంలో ఫుడ్పాయిజన్.. నలుగురు చిన్నారుల్ని బలిగొంది. మరో 27 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కైలాసపట్నంలోని ఓ ఆశ్రమంలో 60 మంది విద్యార్థులు.. ఓ ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత వసతితో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఎం. కిరణ్ కుమార్ అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నారు. అయితే.. ఆదివారం మధ్యాహ్నాం వసతి గృహంలో పిల్లలు సమోసా తిన్నారు. వాటితో ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన నిర్వాహకులు.. పిల్లలను వారి వారి స్వస్థలాలకు పంపించి వేశారు. వీళ్లలో చింతపల్లి మండలానికి చెందిన ఇద్దరు పిల్లలు.. వాళ్ల ఇళ్ల వద్ద మృతి చెందారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ డిఈఓ పెన్నాడ అప్పారావు, ఎంఈఓ పి రామారావు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అనకాపల్లి: వరాహపురంలో టీడీపీ దౌర్జన్యం
సాక్షి, అనకాపల్లి: టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. శనివారం అనకాలపల్లి చీడికాడ మండలం వరహాపురం స్కూల్ కమిటీ ఎన్నికలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగపడ్డారు. టీడీపీకి బలం లేకపోవడంతో అక్రమ మార్గంలో గెలిచేందుకు ప్రయత్నం చేశారు. ఎన్నికలో చేతులెత్తే విధానానికి స్వస్తి పలికి సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. స్కూల్ హెచ్ఎంపై టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో వరహపురం స్కూల్ కమిటీ ఎన్నిక గందరగోళంగా మారింది. -
అనకాపల్లిజిల్లా కోనాంలో కోటి రూపాయల కీటకం ప్రత్యక్షం
-
AP: గిరిజనుడికి చిక్కిన కోటి రూపాయల కీటకం!
సాక్షి,అనకాపల్లిజిల్లా: ఆంధ్రప్రదేశ్లోని మాడుగుల నియోజకవర్గం కోనాంలో కోటి రూపాలయ కీటకం ప్రత్యక్షమైంది. అడవికి వెళ్లిన గిరిజనుడికి వింత కీటకం కనిపించడంతో దానిని ఆకులో చుట్టి ఇంటికి తీసుకువచ్చాడు. నిజానికి ఆ కీటకం పేరు స్టాగ్బీటిల్. వింత ఆకారంలో ఉండటంతో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకంగా స్టాగ్బీటిల్కు గుర్తింపు ఉంది. ఔషధ తయారీలో ఈ కీటకాన్ని వాడతారని తెలుస్తోంది. కీటకం విలువ మార్కెట్లో కోటి రూపాయలకుపైగా ఉంటుందని ప్రచారం. అయితే ఆ గిరిజనుడికి ప్రస్తుతం కీటకాన్ని ఏం చేయాలో తెలియక ఇంటివద్దే ఉంచుకున్నాడు. అడవిలో తిరిగే కీటకానికి ఏం తిండి పెట్టాలో తెలియక దాని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. -
జనసేనకు ఝలక్.. ఐదురోజుల్లోనే సొంత గూటికి..
సాక్షి, అనకాపల్లి జిల్లా: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ప్రలోభాలు, మాయమాటలతో మభ్యపెట్టి అయిష్టంగా తమ పార్టీల్లోకి చేర్చుకోవడానికి యత్నించిన కూటమి పార్టీలకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఝలక్ ఇస్తున్నారు. కూటమి పార్టీకు బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదోలా గెలవడానికి ప్రయత్నించిన ఆ పార్టీల నేతలు భంగపడిన ఘటన యలమంచిలి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని జంపపాలెం ఎంపీటీసీ శిలపరశెట్టి ఉమ యలమంచిలి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా పదవిలో ఉన్నారు. ఈ నెల 8న ఉమను మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, మరికొంత మంది జనసేన రాష్ట్ర, స్థానిక నేతల సమక్షంలో జనసేన పార్టీలో చేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. ఈ మేరకు ఉమకు జనసేన పార్టీ కండువా వేసిన ఫోటోలను మీడియాకు పంపించారు. అయితే కేవలం 5 రోజుల్లోనే శిలపరశెట్టి ఉమ తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు.బుధవారం తాడేపల్లిలో పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో జరిగిన యలమంచిలి నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశంలో ఉమ ఆమె భర్త గణేష్తో హాజరయ్యారు. సమావేశంలో భాగంగా మాజీ సీఎం జగన్ను కలిసిన ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. జనసేనలో ఐదు రోజులు కూడా ఇమడలేక తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.ఎంపీటీసీల సమావేశం ఉందని మాయమాటలు చెప్పి బలవంతంగా జనసేన కండువా వేశారని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని శిలపరశెట్టి ఉమ సాక్షికి తెలిపారు. పార్టీ అధినేత జగనన్నతోనే తమ ప్రయాణం ఉంటుందన్నారు. ఈ పరిణామం నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కేవలం ఐదు రోజుల్లోనే జనసేనను వీడడంతో లేని బలం ఉన్నట్టు చూపించుకోవడానికి ప్రయత్నించిన జనసేన నేతలు అభాసుపాలైనట్టయిందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. -
అనకాపల్లి, చోడవరం స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పారా ఒలింపిక్స్కు అనకాపల్లి వాసి
విజయవాడ స్పోర్ట్స్: పారిస్లో ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్కు అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన రొంగలి రవి ఎంపికయ్యారు. షాట్పుట్ విభాగంలో రవి భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రవి.. ఎన్నో అవమానాలు, ఆటుపోట్లను అధిగమించి అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు. ఇందుకోసం అతని తల్లిదండ్రులు మంగ, బాబు తమ వ్యవసాయ భూమిని సైతం అమ్మేశారు. తల్లిదండ్రులు, కోచ్లు ఇచ్చిన స్ఫూర్తితో రవి ఇప్పటివరకు దాదాపు 25కు పైగా పతకాలు సాధించి ప్రపంచ క్రీడా వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేశాడు. ఆదాయ పన్ను విభాగ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న రవి మాట్లాడుతూ.. పారా ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని తెలిపాడు. కాగా, రవిని ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, వి.రామస్వామి అభినందించారు. -
చంద్రబాబు దురాక్రమణ.. 30 ఎకరాల దేవాదాయ భూములపై కన్ను
-
అనకాపల్లిలో 20 ఏళ్ల యువతి కిడ్నాప్, రేప్
-
మానవత్వం చాటుకున్న జగన్
-
AP: అచ్యుతాపురం సెజ్లో పేలిన రియాక్టర్
సాక్షి, అనకాపల్లి జిల్లా: రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలింది. వసంత కెమికల్స్లో రియాక్టర్ పేలి ఒకరు మృతిచెందారు. మృతుడిని ఒడిశాను చెందిన కార్మికుడిగా గుర్తించారు. రియాక్టర్ పేలడంలో కార్మికులు పరుగులు తీశారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. -
రాంబిల్లి మైనర్ బాలిక ఘటనపై
-
ఇంజక్షన్ వికటించి 17 మందికి అస్వస్థత
-
నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. ఇంజక్షన్ వికటించి..
అనకాపల్లి, సాక్షి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. వివిధ అనారోగ్య సమస్యలో ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు చికిత్స నిమిత్తం వైద్యులు మంగళవారం రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్లు ఇచ్చారు.ఆ ఇంజక్షన్లు తీసుకున్న 17 మంది కొద్ది సేపటికే వాంతులు, వణుకుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అత్యవసర చికిత్స కోసం అనకాపల్లి ఏరియా అస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బాధితులంతా నక్కపల్లి జానకయ్యే పేట, వెదుళ్ల పాలెం, తిమ్మాపురం డి ఎల్ పురం, ఉపమాక్ తదితర గ్రామాలకి చెందిన వారని సమాచారం. -
తీరిక లేదా అనితమ్మా!?
సాక్షి, అనకాపల్లి: సొంత జిల్లాలో బాలికను ఒక దుండగుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రధానంగా బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఈనెల 6వ తేదీ సాయంత్రం 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని (14) అనే బాలికను బోడాబత్తుల సురేష్ కత్తితో దాడిచేసి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటివరకు నిందితుడి ఆచూకీ లేదు. మైనర్ బాలిక హత్యకేసు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఎటువంటి భరోసా దక్కలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బాలిక హత్య కేసుపట్ల హోంమంత్రి కనీసం దృష్టిసారించకపోగా.. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పకపోవడంపట్ల గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. దొరకని నిందితుని ఆచూకీ..ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీ దొరకలేదు. నిజానికి.. నిందితుడు సురేష్ ఒక నేరానికి సంబంధించి జైలుకెళ్లి బెయిల్పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు నిఘా పెట్టకపోవడం కూడా ఈ హత్యకు దారితీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెయిల్ మీద వచ్చాక బస్సులో ఒకరోజు బాధితురాలి వెంటపడ్డాడని.. ఈ విషయం వెంటనే పోలీసుల దృష్టికి బాలిక తండ్రి వెంకటరమణ తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు.ఈ విషయమై మంత్రి అనితను మీడియా సమావేశంలో ఒక విలేకరి ప్రశ్నించగా.. అదే నిజమైతే సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ విషయాన్ని విస్మరించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించి అతని ఫొటోలు విడుదల చేశారు. -
నర్సీపట్నం ఇసుక డిపోలో!
సాక్షి, అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఇసుక డిపోలో రూ.5 కోట్ల విలువైన ఇసుక తరలించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ వేశారని.. ఉచిత ఇసుక అంటూ ప్రజల్ని టీడీపీ మోసం చేస్తోందంటూ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మండిపడ్డారు.టన్నుకు కేవలం రూ.175 తగ్గించి ఉచిత ఇసుక అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమ్తెతారు. మా ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇచ్చామని ఉమాశంకర్ అన్నారు. డిపోకి వచ్చిన, అమ్మిన ఇసుక వివరాలు వెల్లడించాలని అధికారులను ఉమా శంకర్ గణేష్ కోరారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. -
అనకాపల్లిలో మైనర్ బాలిక హత్య కేసులో ముమ్మర దర్యాప్తు
-
అనకాపల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం..
-
జైలుకు పంపిందనే కోపంతో బాలికపై దాడి
-
జైలు నుంచి రాగానే బాలికపై..
-
అనకాపల్లి జిల్లాలో దారుణం..
-
నేనంటే లెక్కలేదా..?
ఎస్.రాయవరం: గ్రామస్థాయిలో పింఛన్ల పంపిణీకి తాను వస్తుంటే మండలస్థాయి అధికారులు ఎందుకు హాజరుకాలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె సోమవారం అనకాపల్లి జిల్లా పెదగుమ్ములూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబి్ధదారులకు పింఛను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేదికపై ఉన్న అధికారులను చూసి మండలస్థాయి అధికారులు ఎవరు హాజరయ్యారని అడిగారు.ముందుకొచి్చన ఎంపీడీవో సత్యనారాయణతో.. మండలంలో అధికారులు ఎక్కడ ఉన్నారు? హోం మంత్రి వస్తే తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు రావాల్సిన అవసరం లేదా.. అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పింఛన్ల పంపిణీకి అధికారులు రావలసిన అవసరం లేదా అని ప్రశ్నించారు.అధికారుల తీరు మారలేదని, ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గ్రామంలోకి వస్తే అనేక సమస్యల్ని ప్రజలు తనకు చెప్పారని, ఆ ఫిర్యాదులను తాను ఆఫీస్కు పంపించుకోవాలా అని ఆమె ప్రశ్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి హుటాహుటిన మండల కార్యాలయం నుంచి వేదిక వద్దకు వచ్చారు. -
గండి బాబ్జీ Vs బండారు.. టీడీపీలో మరోసారి ఆధిపత్య పోరు బహిర్గతం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మూర్తి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. బండారుకి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతున్నారు. గతంలో బండారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను ఏ కార్యక్రమానికి పిలవలేదని.. పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తనకు తగిన గౌరవం ఇవ్వాలంటూ గండి బాబ్జీ వ్యాఖ్యానించారు.ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తనకు తెలియకుండా ఏ కార్యక్రమం పెట్టడానికి వీల్లేదన్నారు. గండి బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో నాకు తెలుసు.. గత్యంతరం లేక వేరే పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవలసిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి
సాక్షి, అనకాపల్లి: అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపుపాలెం మండలం రాశిపల్లి శివారు ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కనీ్వనర్ కొల్లి అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆదివారం రాత్రి ఎరకన్నపాలెంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ చేశారు. గ్రామ శివారులో ఉన్న వైఎస్సార్సీపీ బూత్ కనీ్వనర్ అప్పలనాయుడు ఇంటిపై బాణా సంచాకాల్చారు. దీంతో అప్పలనాయుడు ఇంటి సమీపంలోనే ఉన్న పశువులు బెదిరాయి.పశువులు బెదురుతున్నాయని, పక్కనే గడ్డి వాము కూడా ఉందని, బాణాసంచా కాసింత దూరంలో కాల్చుకోవాలని అప్పలనాయుడు వారిని కోరాడు. వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆయనపై కర్రలతో దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన ఆయన తమ్ముడు రామారావు, తల్లి సత్యవతి, తండ్రి అప్పారావును కూడా కర్రలతో కొట్టారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పలనాయుడుకు తలపై తీవ్రమైన గాయం కావడంతో గాజువాక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో, ఆయన తల్లి సత్యవతి, తమ్ముడు రామారావు ఇద్దరూ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రణాళిక ప్రకారమే దాడి అప్పలనాయుడిపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఆయన ఇంటి వద్దకు టీడీపీ ర్యాలీ వచి్చన వెంటనే కరెంటు పోయిందని, అప్పలనాయుడిపై దాడి జరిగిన కొన్ని నిమిషాల్లో కరెంట్ వచి్చందని, ముందస్తుగానే కరెంటు తీసేసి దాడికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారే ముందుగా పోలీసు స్టేషన్కు వెళ్లి తమపై కూడా దాడి చేశారని వెళ్లి ఫిర్యాదు చేశారు.50 మంది టీడీపీ రౌడీలు కర్రలతో దాడి టీడీపీ గూండాలు ఉద్దేశపూర్వకంగానే అప్పలనాయుడు ఆవుల షెడ్పైకి తారాయి జువ్వలు వేశారు. దూరంగా కాల్చుకోవాలని చెప్పిన అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. ఆయన తల పగిలేలా కొట్టారు. అప్పలనాయుడును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచన మేరకు రాత్రి 12 గంటల సమయంలో విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పోలీసు స్టేషన్లో 8 మందిపై కేసు నమోదు చేశారు. – భద్రాచలం, జెడ్పీటీసీ, మాకవరపుపాలెం మండలం -
వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక ఆగిన మరో గుండె
ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ఓటమిని తట్టుకోలేక అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం వెంకటాపురానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రమణ(49) మనస్తాపంతో నిద్రాహారాలు మానివేశాడు.అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటివద్ద గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతదేహాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
కఠినమైన ఆంక్షల మధ్య కౌంటింగ్
-
అనకాపల్లి జిల్లాలో 1529 పోలింగ్ కేంద్రాలు..
-
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం తారువలో ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్ సాయంతో విజువల్స్ తీశారు. దీంతో, అనుమానం వచ్చి స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరా తీశారు. విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు.అనంతరం దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు స్థానికులు కాదని పోలీసులకు తెలిపారు. దీంతో, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న బీజేపీ కండువాలను, జెండాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అక్కడ డ్రోన్ను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాట్లాడుతూ.. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ముత్యాల నాయుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
సీఎం జగన్ చోడవరం ప్రచారసభ.. జనసంద్రంగా కొత్తూరు జంక్షన్
గుంటూరు,సాక్షి: ఎన్నికల ప్రచార సభలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా చోడవరం చేరుకున్నారు. కాసేపట్లో కొత్తూరు జంక్షన్లో జరగబోయే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారాయన.అంతకు ముందు చోడవరం చేరుకున్న సీఎం జగన్కు పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గణేష్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ కొత్తూరు జంక్షన్ కు బయలుదేరారు సీఎం జగన్. జన నేత రాక సందర్భంగా కొత్తూరు జంక్షన్ జనసంద్రంగా మారింది. -
గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని తెలుగు విద్యార్థి దుర్మరణం
కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల వైద్య విద్యార్థి దాసరి చందు కన్నుమూశారు. ఈ విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి చెందిన కిర్గిస్థాన్లో కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీలో పరీక్షలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఆదివారం జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. అయితే గడ్డకట్టిన నీడిలో చిక్కుకుని మృతి చెందాడు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి చేరేలా సాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించినట్లు చందు తల్లిదండ్రులు తెలిపారు. కేంద్ర మంత్రి కిర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, మృత దేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి తెలిపారు. కాగా చందు తండ్రి అనకాపల్లిలో హల్వా అమ్మే భీమరాజు. భీమరాజు రెండో కుమారుడు చందు. -
కూటమికి ఫుల్ కోటింగ్..బాబు గుండెల్లో దడ..దడ..దడ..
-
Anakapalle Memantha Siddham: ‘మేమంతా సిద్ధం’ అంటున్న అనకాపల్లి జన సంద్రం (ఫోటోలు)
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు. మేమంతా సిద్ధం 19వ రోజు (ఏప్రిల్ 20) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ శనివారం ఉదయం 9 గంటలకు గోడిచర్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
రాజధాని హంగులు..సరికొత్త సొబగులు
అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వానికీ మొరపెట్టుకున్నారు... ఓటేసి గెలిపించిన ప్రతి ప్రతినిధికీ వినతులు అందించారు. కాలం మారిపోయింది.. తరాలు తరిగిపోయాయి. కానీ.. జిల్లాను పట్టి పీడిస్తున్న సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఇక ఆశలు వదిలేసుకున్న ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త కాంతులు చూపించింది.ఎవరొచ్చినా తీరదనుకున్న సమస్యలకు సైతం పరిష్కారం లభించింది. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. మామూలు జిల్లాగానే ఉండిపోతుందనుకున్న విశాఖకు రాజధాని యోగం పట్టింది. అందుకు అనుగుణంగా హంగులు సమకూరుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి, అల్లూరిజిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకం పరుగులు పెడుతున్నాయి. –సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి/పాడేరు నగరంలో రోడ్ల విస్తరణ తూర్పు నియోజకవర్గం పరిధి హనుమంతవాక నుంచి కైలాసగిరి కూడలి వరకు పదేళ్లుగా నిలిచిపోయిన రోడుŠడ్ విస్తరణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గంలో జగదాంబ జంక్షన్ నుంచి పాతనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ రాణిబోమ్మ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ, అన్నవరం సత్యదేవుని ఆలయ ఘాట్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొండవాలు ప్రాంతాల్లో రూ.9 కోట్లతో రక్షణ గోడలు నిరి్మంచారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగిలో గోస్తనీ నదిపై రూ.16.50 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హౌసింగ్ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గాజువాక హౌసింగ్ సొసైటీ భూములకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు. జీవో నంబర్ 301, 388 పట్టాదారులకు టైటిల్ డీడ్స్ అందజేశారు. సుమారు రూ.1500 కోట్ల విలువైన భూమిని ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన అందజేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న 7026 మందికి కన్వేయషన్స్ డీడ్స్ అందించారు. 39 మంది ఉక్కు కర్మాగార నిర్వాసితులకు కన్వేయ¯న్స్ పట్టాలు, 40 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలందించారు. పారిశ్రామిక హబ్గా అనకాపల్లి జిల్లా ► కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో ఒక వైపు సంక్షేమం, మరో వైపు నూతన పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. ► మాకవరపుపాలెం మండలం భీమబోయినపాలెంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మా ణం శరవేగంగా జరుగుతోంది. ► అనకాపల్లి మండలం కోడూరులో 70 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు కు స్థల సేకరణ పూర్తయింది. ► నక్కపల్లిలో డ్రగ్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► కోమళ్లపూడిలో మరో ఎస్ఈజెడ్కు స్థల కేటాయింపు పూర్తయింది. భారీ పరిశ్రమలకు శ్రీకారం రాజధానిగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల స్థాపనకు మార్గం సుగమం చేశారు. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ.21,844 కోట్ల పెట్టుబడితో 39,815 మందికి ఉపాధి అవకాశాలు కలి్పంచేలా బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ► గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎనీ్టపీసీ, ఇంధన రంగంలో హెచ్పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్మాల్, టర్బో ఏవియేషన్.. వంటి బహుళ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ► ఇన్ఫోసిస్, టెక్మహీంద్ర, హెచ్సీఎల్, యాక్సెంచర్, రాండ్స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమేజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. మరో 48 ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు 140కి పైగా స్టార్టప్లు నడుస్తున్నాయి. ► ఐదేళ్లలో జిల్లాలో 35 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 120 భారీ పరిశ్రమలున్నాయి. మొత్తం వీటన్నింటి ద్వారా 14,114 మందికి ఉద్యోగాలు. మారిన ఏజెన్సీ రూపు రేఖలు కొత్తగా ఏర్పాటైన అల్లూరి జిల్లాలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు నడవడానికి కూడా దారిలేని గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగింది. విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల పాలనలో సుమారు రూ.100 కోట్లతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన రోడ్లను తారురోడ్లుగా మార్చారు. రూ.10 కోట్లతో జామిగుడ, గిన్నెలకోట గెడ్డలపై భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. మిషన్ కనెక్ట్ పాడేరు పేరుతో రూ.100 కోట్ల ఉపాధి హా మీ పథకం నిధులతో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ► పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీలాంటి అత్యంత మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి రూ.10 కోట్లతో తారురోడ్డు నిరి్మస్తున్నారు. ► రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ► పాడేరు జిల్లా ఆస్పత్రి కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చెందింది. చింతపల్లిలో రూ.20 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిరి్మస్తున్నారు. ఏజెన్సీ పర్యాటకం అద్భుతం ► అనంతగిరిలోని అంజోడ సిల్క్ ఫామ్లో పైన్ ప్లాంటేషన్ ఏర్పాటైంది. నీలగిరి చెట్లు పెరగడంతో అంజోడ పార్కు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. అక్కడ మంచు అందాలు కనువిందు చేస్తూ షూటింగులకు అనుకూలంగా మారింది. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో సుమారు రూ.70 లక్షలతో పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ► బొర్రా గుహల వద్ద గోస్తనీ లోయపై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జిప్లైన్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఏపీటీడీసీ సుమారు రూ.65 లక్షలతో ఇక్కడ సాహసక్రీడల్ని ఏర్పాటు చేసింది. ► ఏజెన్సీ నయాగరాగా చెప్పుకునే చాపరాయి జలపాతం వద్ద రూ.40 లక్షలతో కాటేజీలు, రోప్వేలు ఏర్పాటు చేశారు. -
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
-
అనకాపల్లి డీఎస్పీ ఎదుట విచారణకు సీఎం రమేష్ హాజరు
-
బెడిసికొట్టిన జనసేన మద్యం వ్యూహం
-
సీఎం రమేష్కు 41ఏ నోటీసులు జారీ..
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఇటీవల చోడవరంలో ఓ ఘటనలో కేసు నమోదు కాగా శనివారం నర్సీపట్నంలో కృష్ణా ప్యాలెస్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు చీరల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న నర్సీపట్నం టౌన్ సీఐ క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబుతో పాటు ఎన్నికల యంత్రాంగం అక్కడికి చేరుకుని తీయడంతో సీఎం రమేష్ అధికారులపై చిందులు తొక్కారు. ఓటర్లుకు సింబల్ తెలియజేయడానికి కమలం గుర్తు కలిగిన చీరలు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. ఇవి తాయిలాలు కాదని అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రమేష్కు 41ఏ నోటీసులు జారీ.. అనకాపల్లి జిల్లా చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్లో తనిఖీలు నిర్వహిస్తున్న డీఆర్ఐ అధికారులపై దాడికి దిగడమే కాకుండా, విధులకు ఆటంకం కలిగించిన వ్యవహారంలో సీఎం రమేష్కు శనివారం రాత్రి పోటీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల తొమ్మిదో తేదీన విచారణను హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీవో ఆదేశించారు. కాగా, ఐపీసీలోని 353,342,506,201,188, 143/rw, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజు సహా ఆరుగురి పేర్లను పోలీసుల ఎఫ్ఐఆర్లో చేర్చారు. -
సీఎం రమేష్ ‘పువ్వు’ చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తానని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారని పేదవాడికి కనిపించేంది సీఎం జగన్ మాత్రమేనని తెలిపారు. తమకు మంచి చేసిన వైఎస్ జగన్కే మళ్లీ ఓటువేసి గెలిపించాలని పేదవాడు అనుకుంటాడని పేర్కొన్నారు. సీఎం రమేష్ ఎంపీ నిధులను అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడో అనకాపల్లి ప్రజలు గమనించాలని అన్నారు. బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకునేందుకు వచ్చాడని విమర్శించారు. రమేష్ ఆధార్ కార్డుపై మైదరాబాద్ అడ్రస్ ఉంటుందని దుయ్యబట్టారు. సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు(అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి) లోకల్ అంటూ పేర్కొన్నారు. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదని అమర్నాథ్ సెటైర్లు వేశారు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమేనని ఎద్దేవా చేశారు. అనకాపల్లిలో రాజకీయ శత్రువులను కలిపిందే తానంటూ కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను ఉద్ధేశిస్తూ అన్నారు. వాళ్ల ఇంట్లో తన ఫోటో పెట్టుకోవాలని అన్నారు. అలాంటి వారు తనమీద పడి ఏడుస్తున్నారని విమర్శించారు. -
ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం ఆయన స్పెషల్
ప్రజల విశ్వాసం పొందిన రాజకీయ నాయకులు జీవితాంతం ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తుంటారు. కొందరు నాయకులు అయితే ప్రతి ఎన్నికకు నియోజకర్గాన్ని మారుస్తుంటారు. గెలిచిన చోట ప్రజలకు ఏమీచేయని వారు భయపడి మరో నియోజకవర్గం వెతుక్కుంటారు. టీడీపీలో ఓ నేత ఉన్నాడు. దక్షిణ కోస్తా నుంచి విశాఖకు వలస వచ్చి ఇక్కడ తిష్ట వేశాడు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం, అధికారం కోసం పార్టీల మార్పిడి ఆయన నైజం. ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలసవచ్చిన గంటా శ్రీనివాసరావు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి పోర్టు కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి వేల కోట్లకు పడగలెత్తారు. బాగా సంపాదించాక రాజకీయాలపై ఆసక్తి పెరిగి తెలుగుదేశంలో చేరి 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోని గంటా 2004లో అనకాపల్లి ఎంపీ సీటు వదిలేసి 2004లో చోడవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009లో టీడీపీని వదిలేసి..ప్రజారాజ్యంలో చేరి ఈసారి అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పదవి అనుభవించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అదృశ్యం కావడంతో మళ్ళీ టీడీపీ గూటికి చేరి ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. చదవండి: ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు? రాజకీయాల్లోకి వచ్చాక జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు చోట్ల నుంచి గంటా పోటీ చేశారు. ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం గంటా శ్రీనివాసరావు స్పెషల్ అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. 2014లో భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా అనుభవించిన గంటా శ్రీనివాసరావు అసలా నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అన్న విషయమే మర్చిపోయారు. దీంతో భీమిలి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక భీమిలిలో మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని అర్థం చేసుకున్న గంటా 2019లో విశాఖ సిటీలోని నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. 2019లో భీమిలిని వదిలేసి విశాఖ నార్త్లో పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న గంటా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించారు. అయినా సరే అత్తెసరు మెజార్టీతో విజయం సాధించారు. తనకున్న ఏరుదాటాక తెప్ప తగలేసే అలవాటు ప్రకారం విశాఖ నార్త్ నియోజకవర్గంను మర్చిపోయారు. ఐదేళ్ళ కాలంలో తనను గెలిపించిన ప్రజలకు కనీసం మొహం కూడా చూపించలేదు. కోవిడ్ మహమ్మారి విజృంభించినపుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గంటా శ్రీనివాసరావు కనిపిస్తే విశాఖ నార్త్ నియోజకవర్గంలో మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో గంటా ఈసారి మళ్లీ కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కున్నారు. పదేళ్ళ క్రితం తనను గెలిపించిన భీమిలి నియోజకవర్గంపై మళ్ళీ కన్నేశారు. అక్కడి ప్రజలకు తనపై కోపం పోయింటుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు వందల కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి భీమిలి సీటు సంపాదించుకున్నారు. సీటు కొనుక్కోవడానికి ఎంతైనా పార్టీ ఫండ్ ఇవ్వడం.. గెలవడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడం అలవాటైన గంటా శ్రీనివాసరావు భీమిలి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారు. అధికారం అడ్డం పెట్టుకొని బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటా శ్రీనివాసరావుది. తీసుకున్న అప్పు.. వడ్డీతో కలిపి 400 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో గంటా తనకా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఇటీవల ఇండియన్ బ్యాంక్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు గంటాకు సీటు ఇవ్వడంపై భీమిలిలోని జనసేన, టిడిపిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మొదట ఈ సీటు జనసేనకే అని ప్రకటించారు. దీంతో అక్కడి జనసేన నేతలు సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు గంటా చంద్రబాబు, పవన్లను డబ్బుతో కొట్టి సీటు తన్నుకుపోవడంతో భీమిలి నేతలు బహిరంగంగానే తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. జనసేన సీటు వచ్చిందని భావించి భంగపడ్డ పంచకర్ల సందీప్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఔ పవన్ తీరుతో జనసేన కార్యకర్తలమని చెప్పుకునేందుకే సిగ్గేస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పుడు భీమిలిలో గంటాకు..అటు టీడీపీ నుంచి..ఇటు జనసేన నుంచి సహాయ నిరాకరణ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గంటాకు సీటు విషయంలో పునరాలోచన చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అక్కడి టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. -
ఒక రౌడీని గెలిపిస్తే అనకాపల్లి నాశనం అయిపోతుంది
-
సీఎం రమేష్పై కేసు నమోదు
విశాఖపట్నం, సాక్షి: కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్ఐ(Directorate of Revenue Intelligence) అధికారులపై గుండాయిజం ప్రదర్శించారాయన. ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చోడవరం పీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. డీఆర్ఐ అధికారులకు ఆటంకం కలిగించడంతో పాటు వాళ్ల చేతుల్లో ఫైళ్లను లాక్కునే ప్రయత్నం చేశారు సీఎం రమేష్. దీంతో.. అధికారుల విధులకు ఆటంకం కలిగించే యత్నం చేశారని.. బెదిరింపులకు పాల్పడ్డారని చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 506, 342, 353, 201, 188 red with 149 కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్తో పాటు చోడవరం టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణలతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. అసలేం జరిగిందంటే.. గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్సేల్ టైల్స్, మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం(డీఆర్ఐ) అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరుగురితో కూడిన ఓ బృందం గురువారం తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాపు రికార్డులన్నీ వారు తనిఖీ చేస్తుండగా టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుకు, అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్కు ఫోన్ చేశారు. వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర్నుంచి రికార్డులను సీఎం రమేష్ లాక్కున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. అంతేనా అధికారులని కూడా చూడకుండా పరుషపదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. ఔ ఇదీ చదవండి: బ్యాంకుల మోసగాడు ఎంపీ అభ్యర్థా? -
అనకాపల్లి చోడవరంలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ దాదాగిరి
-
అనకాపల్లిలో సామాన్యుడు బలవంతుడికి మధ్య పోటీ- బూడి ముత్యాలనాయుడు
-
అనకాపల్లి జిల్లా పెందుర్తిలో వాలంటీర్ల రాజీనామా
-
‘ప్రజలు అన్నీ చూస్తున్నారు..’ వలంటీర్ల రాజీనామా
సాక్షి, అనకాపల్లి: ఓ అక్కా.. ఓ చెల్లి.. ఓ అవ్వా.. ఓ తాతా అంటూ ఒకటో తేదీన ఉదయాన్నే తలుపు తట్టి చిరునవ్వుతో ఫించన్ అందించే పరిస్థితికి బ్రేక్ పడింది. సీఎం జగన్ ఆలోచనల్లోంచి పుట్టి.. ఎండనకా వాననకా, ఆఖరికి కరోనాను సైతం లెక్క చేయకుండా నాలుగన్నరేళ్లు నిర్విరామంగా విధులు నిర్వహించారు వలంటీర్లు. అలాంటి వ్యవస్థకు ఆటంకాలు కలగజేయాలని కుట్ర కార్యరూపం దాల్చింది. పెన్షన్దారులు మండుటెండలో మళ్లీ క్యూలు కట్టాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టింది. 2019 అక్టోబర్ 2వ తేదీన పురుడుపోసుకున్న వలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. రెండున్నల లక్షల మందికిపైగా వలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సుమారు 530 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా, సంక్షేమ వారధులుగా వలంటీర్లను సీఎం జగన్ అభివర్ణిస్తుంటారు. అయితే.. ఈ నాలుగున్నరేళ్లలో వలంటీర్లను మానసికంగా వేధించే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు.. ప్రజా సేవకులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అయినా అవమానాల్ని దిగమింగుకుని తమ సేవల్ని వలంటీర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు.. ఈసీ కోడ్ పేరుతో తమ విధులకు విఘాతం కలిగించడాన్ని వలంటీర్లు భరించలేకపోతున్నారు. ఈ ఉదయం పెందుర్తి నియోజకవర్గంలో 23 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తానం గ్రామ వలంటీర్లు సాక్షితో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలలోకి తీసుకునే వెళ్ళే అదృష్టం సీఎం జగన్ మాకు ఇచ్చారు. కానీ, మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మమ్మల్ని అనేక విధాలుగా మానసికంగా హింసించారు. పేదలకు, లబ్ధిదారులకు సేవ చేస్తుంటే.. స్లీపర్ సెల్స్ అని అపవాదు చేశారు. ఇప్పుడు ఇలా విధులకు ఆటంకాలు విధించారు. మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అప్పుడే విధుల్లో చేరతాం’’ అని వలంటీర్లు శపథం చేశారు. ‘ ఏపీ ప్రజలు అన్ని చూస్తున్నారు.. మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించుకునే దిశగా అడుగులేస్తున్నారు’ అని వలంటీర్లు చెబుతున్నారిప్పుడు. పెందుర్తి పరిధిలోనే కాదు.. రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు స్వచ్ఛందంగా తమ విధులకు రాజీనామా చేస్తున్నట్లు తెలస్తోంది. -
పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ దే..
-
బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా సీట్లు పెండింగ్
-
Anakapalle: సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం
పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం అంటే.. కేవలం వారు తలదాచుకోడానికి గూడు కల్పించడమే కాదు.. సమాజంలో సగౌరవంగా తలెత్తుకొని బతికేలా ఆత్మవిశ్వాసాన్ని కల్పించడమే. అందుకే.. సొంత ఇల్లు పేదల ఆత్మ గౌరవానికి సూచిక. మన అక్కచెల్లెమ్మలకు ఒక అన్నగా ఇస్తున్న కానుకే ఈ జగనన్న ఇల్లు’ -ఇదీ.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బడుగుల ఆత్మ గౌరవానికి సౌధాలుగా చెప్పుకునే ఇంటి గురించి చెప్పిన మాటలు. ‘ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టిస్తామని జగన్ చెబుతున్నాడు. ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే ఈ సెంటు భూమిని ఉపయోగించవచ్చు’ -ఇవీ.. 40 ఏళ్లు సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేదల సౌధాలపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు. నిజమే సెంటు స్థలంలో ఇల్లు చిన్నదే. కానీ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబు.. ఎన్ని సెంట్ల స్థలాల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టారో ఆయనకే ఎరుక. సాక్షి, అనకాపల్లి: సొంత ఇల్లు... పేదల ఆత్మగౌరవ సూచిక. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇంటి స్థలం కాగితం చేతికివ్వడం అంటే ఆత్మగౌరవ పతాకాన్ని వారి చేతికిచ్చినట్లే. ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం వెలుగులు నింపుతోంది. ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో 58,626 మంది మహిళల పేరిట ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మింపజేస్తోంది. ఇదంతా ఉచితమే. పేదల మీద భారం లేకుండా సొంత ఇంటి కలను నిజం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. 682 లే అవుట్లలో నిర్మాణాలు అనకాపల్లి జిల్లాలో మొత్తం 682 లేఅవుట్లలో జగనన్న ఇళ్లు నిర్మిస్తున్నారు. 34,431 ఇళ్ల పట్టాలను ఉచితంగా పంపిణీ చేశారు. 24,195 మంది లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాకుండా ఒక్కో ఇంటికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించింది. 18,738 ఇళ్లు పూర్తవ్వగా.. పురోగతిలో 36,029 ఇళ్లు ఉన్నాయి. పూర్తయిన ఇళ్లకు ఇప్పటివరకూ రూ.445.54 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వ్యయం కలిపితే ఇంటి స్థలం, ఇల్లు ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ కాలనీలు ఊర్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. మెరుగైన జీవితం కోసం.. ఒక పేద కుటుంబం అన్ని సంక్షేమ పథకాలనూ అందుకుంటూ సొంత ఇంట్లో ఉంటే... మెరుగైన జీవితం వారికి తప్పకుండా దక్కుతుంది. ఆయా కుటుంబాల అభ్యున్నతికి బాటలు పడతాయి. దశాబ్దం తిరిగేసరికి... సమాజంలో గణనీయమైన మార్పు కచ్చితంగా కనిపిస్తుంది. అభివృద్ధికి నిర్వచనం... నేటి కంటే రేపు బాగుండటం అని వైఎస్ జగన్ పదేపదే చెబుతుంటారు. దానికి సాక్ష్యంగా ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతున్నాయి. సమగ్ర సౌకర్యాలతో... ళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్ను రాయితీపై ఇస్తోంది. ఐఎస్ఐ మార్కు ఉన్న నాణ్యమైన సిమెంట్, స్టీల్, ఇతర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. కేవలం ఇళ్లను నిర్మించి ఇవ్వడమే కాకుండా.. పూర్తిస్థాయి సౌకర్యాల్ని ప్రభుత్వం కల్పిస్తోంది. సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికీ భూగర్భ కేబుళ్లు వేస్తున్నారు. పేదలకు ‘క్వాలిటీ లైఫ్’ అందించడానికి ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞంలా నిర్మాణాలు సాగుతున్నాయి. బాబు హయాంలో బేల చూపులే... 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడు పేదల గురించి ఆలోచించలేదు. అధికారంలో ఉన్నప్పుడు.. సీఎం స్థాయి నుంచి జన్మభూమి కమిటీ వరకూ దోచుకునేందుకు ఎక్కడ దారి దొరుకుతుందో చూడటమే తప్ప.. పేద ప్రజలకు ఒక గూడు ఇద్దామన్న ఆలోచనే వారికి కనిపించలేదు. 2014లో హుద్హుద్ ధాటికి వేల మంది ప్రజలు ఇళ్లు కోల్పోయారు. 2016 ఏప్రిల్ నాటికి బాధితులకు ఇళ్లు అప్పగిస్తామని చెప్పారు. 2019 ఎన్నికలు వచ్చేంత వరకూ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. బాధితుల జాబితా అధికారుల వద్ద ఉన్నా.. దానితో సంబంధం లేకుండా టీడీపీ జన్మభూమి కమిటీలే అర్హుల జాబితాని సిద్ధం చేశాయి. ఇళ్ల కేటాయింపులో 80 శాతం వరకూ టీడీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యమిచ్చారు. ఇతర పార్టీల వారు బాధితుల జాబితాలో ఉన్నా.. వారిని పక్కకు తప్పించారు. ఇలా ఒక్క ఇంటిని కూడా నిరుపేదకు ఇవ్వని చరిత్ర తెలుగుదేశం పార్టీది. సొంతిల్లు.. చీకూచింతా లేని జీవితం నా పేరు వారాది కృష్ణవేణి, నేను ఒంటరి మహిళను. అనకాపల్లి మండలంలోని రేబాక గ్రామంలో నా తల్లితో కలిసి ఉండేదాన్ని. నా తల్లి మరణించాక చాలా కాలం నుంచి ఒంటరి బతుకే నాది. గత ప్రభుత్వంలో బతుకు చాలా భారంగా ఉండేది. జగనన్న ప్రభుత్వంలో నా కష్టాలన్నీ తీరాయి. మా ఊరికి చేరువగానే జగనన్న లేఅవుట్ వేశారు. నాకు సొంతిల్లు లేదని తెలుసుకున్న మా వలంటీర్ నా ఆధార్, ఇతర వివరాలతో మా ఊరి సచివాలయంలో దరఖాస్తు పెట్టారు. రోడ్డుకు ఆనుకుని లేఅవుట్లో ముందు వరుసలోనే నా పేరున స్థలం మంజూరైంది. వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాను. సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ వచ్చి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలు తీసుకునేవారు. నిర్మాణ దశల మేరకు నాలుగు విడతల్లో బి ల్లును నా బ్యాంకు ఖా తాలో జమ చేశారు. ఇసు క, సిమెంట్, ఇనుముతో కలిపి మొత్తం రూ.లక్షా, 80 వేలు లబ్ధి చేకూరింది. దీంతో చాలా వేగంగా నా ఇంటి పనులు పూర్తి చేసుకున్నా. ఇప్పుడు జగనన్న ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న ఇంటిలోనే ధైర్యంగా బతుకుతున్నా. పేదల కోసం ఆలోచించే మనసున్న నాయకుడు జగనన్న. ఈ ప్రభుత్వం నన్ను ఓ ఇంటికి యజమానికి చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే ఒంటరి మహిళ పింఛన్ ఇంటికే వచ్చి వలంటీర్ అందిస్తున్నారు. జగనన్న దయతో ఎలాంటి చీకూచింత లేకుండా సంతోషంగా బతుకుతున్నా. పాకల్లో బతుకులు.. పక్కా ఇంటికి మాది చోడారం మండలంలోని సాయిపల్లి (చాకిపల్లి). నా పేరు పోలేపల్లి లచ్చిమి. మాది సేనా పేద కుటుంబం. నేను, మా ఆయన అప్పలనాయుడు కూలి పనులకు, సెరువు పనికి ఎల్తాం. రోజూ పనికెల్లకపోతే పూట గడివని బతుకులు మావి. మాకు ఇద్దరు పిల్లలు. మా కష్టం మీదే ఆల్లని పోసించుకోవాల. సొంతంగా నాణ్ణెమైన ఇల్లు లేదు. దీంతో పూరిపాకలోనే ఉంతన్నాం. కూలాడితే గానీ కుండాడని మాలాంటోళ్లం సొంతిల్లు కట్టుకోగలమా. ఎన్ని పెబుత్వాలు మారినా మా బతుకులు పాకల్లోనే గడిసిపోతాయనుకునేటోళ్లం. జగనన్న సీఎం అయ్యాక మాలాంటోళ్ల బతుకుల్లో వెలుగులొచ్చాయి. మా ఊర్లో సచివాలయం ఆపీసోళ్లు, వలంటీరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మా పేర్లు రాసుకెళ్లారు. ఇల్లు లేనోళ్లకి ఇంటి స్థలాలు ఇచ్చారు. కొన్ని రోజులకి మా ఊరు చివర్లో ఏసిన జగనన్న కోలనీలో మాకూ ఓ స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకోడానికి లచ్చా ఎనబయ్యేల రూపాయలు, సిమెంటు, తలుపులు, కిటికీలు, దారమందాలు, కరెంటు సామాన్లు అన్నీ ఇచ్చారు. దానికితోడు మావు కష్టపడి దాచుకున్న కొంత డబ్బు జతచేసి మా తాహతు మేరకు ఇల్లు కట్టుకున్నాం. జగనన్న దయవల్ల మాకూ సొంతగూడు ఏర్పడింది. ఇపుడు మీరెక్కడుంతన్నారని మా సుట్టాలడిగితే సాయిపల్లి జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకొని ఉంతన్నామని ధైర్నెంగా సెప్తున్నాం. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. నెరవేరిన సొంతింటి కల నా పేరు పోలమూరి సత్యవతి. మాది మునగపాకలోని తిమ్మరాజుపేట. నేను గృహిణిని. నా భర్త బాబూరావు స్థానిక హైస్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం మాది. ఇద్దరు సంతానం. అమ్మాయికి పెళ్లి చేశాం. కొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మాకు సొంతిల్లు లేదు. ఇరవయ్యేళ్లుగా అద్దె ఇళ్లలోనే ఉంటున్నాం. చాలా సార్లు అద్దె చెల్లించేందుకు మేం పడ్డ కష్టాలు మర్చిపోలేం. గత ప్రభుత్వ హయాంలో సొంతింటి కోసం పనులు మానుకుని తిరగడం తప్ప ఫలితం లేకపోయింది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు వలంటీరే మా ఇంటికొచ్చి, అవసరమైన పత్రాలు తీసుకుని సచివాలయంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేశారు. వెంటనే నాకు ఇంటి పట్టా మంజూరు చేశారు. అధికారులు స్వయంగా వచ్చి హద్దులతో సహా స్థలం చూపించి, మాకు అప్పగించారు. ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకున్నా. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.లక్షా 80 వేలు సాయం అందించింది. దీనికి తోడు ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాల రూపంలో కలిగిన లబ్ధి, ఇతరుల నుంచి కొంత అప్పు తీసుకుని సొంతింటి కల నెరవేర్చుకున్నాం. సీఎం జగన్ పుణ్యమా అని ఏళ్లనాటి కల నెరవేరింది. మాకంటూ శాశ్వత చిరునామా వచ్చిందంటే జగనన్న చలవే. మాలాంటి పేదోళ్లకు మేలు జరగాలంటే మళ్లీ మళ్లీ జగనే సీఎం కావాలి. -
పైల ప్రసాద్ కు టికెట్ ఇస్తే టీడీపీకి మూకుమ్మడి రాజీనామా
-
అనకాపల్లి ఎంపీ టికెట్పై త్వరలో నిర్ణయం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై వైఎస్సార్సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని.. కూటమి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారాయన. అలాగే అనకాపల్లి ఎంపీ టికెట్ అభ్యర్థి పెండింగ్లో ఉండడంపైనా ఆయన స్పష్టత ఇచ్చారు. విశాఖలో మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్లో ఉంచిన అనకాపల్లి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తాం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా అని పేర్కొన్నారాయన. అలాగే.. ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని.. సిద్ధం సభలు జరగని ప్రతీ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారని సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. ‘‘అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నాం. టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది’’ అని పేర్కొన్నారాయన. ఇక చిలకలూరిపేట ప్రజాగళంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. ‘‘వాళ్లు కూటమిగా ఏర్పడి మొదటిసారి మీటింగ్ పెట్టకున్నారు. వాళ్లు ఎంతమందిని పిలిచారో.. ఏం చేశారో మనకు తెలియదు. దేశ ప్రధానికి ప్రోటోకాల్ను అనుసరించే భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశాం’’ అని ఆయన అన్నారు. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు త్వరలోనే బస్సు యాత్ర చేస్తారు. ఎవరు ఏ పక్కన నిలబడ్డారు.. ఏ పార్టీ ఏఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాయి అనేదానిని ప్రజలు ప్రతీ ఒక్కటి గమనిస్తుంటారు. త్వరలో వాళ్ల ఓటు ద్వారా తీర్పు ఇస్తారు అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి గండి రవికుమార్
సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ.. రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. అనకాపల్లి జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పెందుర్తి నేత గండి రవికుమార్ టీడీపీని వీడారు. బుధవారం మధ్యాహ్నాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయన. గండి రవికుమార్తో పాటు స్థానిక టీడీపీ నేత ప్రసాదరావులకు సీఎం జగన్ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరామ్ తదితరులు పాల్గొన్నారు. -
అనకాపల్లిలో టీడీపీ విధ్వంసం..ఫర్నిచర్ ధ్వంసం
-
జగనన్న గొప్ప మనసు.. అనకాపల్లిలో అనారోగ్య బాధితులకు సాయం (ఫొటోలు)
-
అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే మన ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్ చేయూత పథకం నిధులు విడుదల ..ఇంకా ఇతర అప్డేట్స్
-
అనకాపల్లిలో సీఎం జగన్కు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)
-
వైఎస్సార్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్
-
అనకాపల్లిలో వైఎస్సార్ చేయూత నిధులు జమ చేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన అనకాపల్లి
-
అనకాపల్లి పబ్లిక్ మీటింగ్ డ్రోన్ విజువల్స్
-
Watch Live: అనకాపల్లిలో సీఎం జగన్ ఏమన్నాడంటే..
-
Watch Live: అనకాపల్లి సాక్షిగా సీఎం జగన్ సమర నినాదం
అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్సార్ చేయూత సభ సందర్భంగా సీఎం జగన్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు ఈ చిక్కటి చిరునవ్వుల మధ్య నా అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగూ నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని మీ అందరిక సమక్షంలో అనకాపల్లి నుంచి శ్రీకారం చుడుతున్నాం. భారతదేశ చరిత్రలోనే, ఉన్న 28 రాష్ట్రాల్లో అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ది చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా. మహిళా పక్షపాత ప్రభుత్వంగా, ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తర్వాత వైయస్సార్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45-60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజులపాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులందరూ పాలు పంచుకుంటూ అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయి అన్న కథలు ప్రతి సచివాలయంలో, ప్రతి మండలంలో ప్రతి ఒక్కరూ చర్చించుకొనేలా, స్పూర్తిదాయకమయ్యేలా పండుగ వాతావరణంలో ప్రతి అక్కచెల్లెమ్మ మైకు పట్టుకుని మాట్లాడాలని కోరుతున్నా. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్లు పైబడిన నా అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు, వారి కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి, వారికి తోడుగా, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా గత ప్రభుత్వాలు చేయలేదు. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. 45-60 మధ్య వయసున్న నా అక్కచెల్లెమ్మల చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ కుటుంబాలన్నీ బాగుపడతాయని మనస్పూర్తిగా వారి గురించి ఆలోచన చేసి, అదే అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏటా రూ.18750 చేతిలో పెడుతూ, నాలుగేళ్లలో ఏకంగా 75000 ఆర్థిక సాయం నా అక్కచెల్లెమ్మలకు చేస్తానని మాట ఇచ్చాను. ఇదే జిల్లా మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడులో ఇదే చేయూత అనే కార్యక్రమం గురించి చెప్పా. ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం నాలుగో విడత కూడా 75 వేలుగా ఇచ్చే కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే చేస్తున్నామని చెప్పడానికి సంతోషపడుతున్నా. ప్రతి అక్కచెల్లెమ్మకూ క్రమం తప్పకుండా సాయం చేస్తూ, బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ, మల్టీ నేషనల్ కంపెనీలతో తోడ్పాటునిస్తూ, ఏకంగా 1.69 లక్షల మంది కిరాణా షాపులు అక్కచెల్లెమ్మలు పెట్టుకుని నడుపుతున్నారు. 85630 మంది చెల్లెమ్మలు వస్త్రవ్యాపారం, 3,80,466 మంది అక్కచెల్లెమ్మలు గేదెలు, ఆవులు కొన్నారు. 1,34,514 మంది అక్కచెల్లెమ్మలు మేకలు కొన్నారు. 88,923 మంది అక్కచెల్లెమ్మలు ఫుడ్ ప్రాడక్ట్స్ సంబంధిత వ్యాపారాలు చేస్తున్నారు. 3,98,422 మంది అక్కచెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్ వ్యాపారాలు చేస్తున్నారు. మరో 2,59,997 మంది అక్కచెల్లెమ్మలు మిగిలిన రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఇంటిని కూడా నడుపుతున్నారంటే అక్షరాలా 16.55,991 మంది అక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ప్రతి అక్కచెల్లెమ్మ కనీసం రూ.6-10 వేలు సంపాదించుకుంటూ చిక్కటి చిరునవ్వులతో తాను బతుకుతూ, తన కుటుంబానికీ తోడుగా ఉందంటే మార్పు ఒకసారి గమనించాలి. వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగో విడతగా ఈరోజు 22,98,931 మంది నా అక్కచెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు ఈరోజు నుంచి మరో 14 రోజులపాటు పండుగ వాతావరణంలో మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తున్నాడు. దీంతో నా అక్కచెల్లెమ్మలకు ఒక్క వైయస్సార్ చేయూత ద్వారా ఏకంగా 75000 పెట్టినట్లయింది. వైయస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి పంపించినట్లయింది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తున్నాయి. నా అక్కచెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటాను. ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,906 మంది నా అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే, వారిలో నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్కచెల్లెమ్మలు మరో రూ.29,588 వేల కోట్లు లబ్ధి పొందారు. ఇదే అక్కచెల్లెమ్మలు వారి కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే మరో రూ.56,188 కోట్లు కూడా మంచి జరిగింది. ప్రతి అడుగూ కూడా మీ బిడ్డ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా, నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలకు మంచి జరగాలని ఈ 58 నెలల కాలంలో ఆలోచన చేస్తూ విద్యాపరంగా, ఆర్థికపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్ పరంగా, నా అక్కచెల్లెమ్మల భద్రతపరంగా వారందరి సాధికారత లక్ష్యంగా గొప్పగా అడుగులు వేశాం. గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా? అని ప్రతి అక్కచెల్లెమ్మ, వారి కుటుంబాలు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. *నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ, నామినేషన్ పోస్టులు, కాంట్రాక్టులు, 50 శాతం చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. గత ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేయాలని మనసే లేదు. చరిత్రలో తొలిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా పిల్లలను బడులకు పంపిస్తే చాలు మంచి మేనమామగా, అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా స్కూళ్ల రూపురేఖలు మీ బిడ్డ మారుస్తాడు. అమ్మ ఒడి అనే పథకం తీసుకొచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా రూ.15,000 ఇస్తూ అండగా నిలబడిన ప్రభుత్వం. ఇలా చదువులను ప్రోత్సహిస్తూ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎక్కడా చూసిందీ లేదు. కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిన మార్పు. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు. గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మలకు పూర్తి ఫీజులు కడుతూ, పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు, పెద్ద చదువులు చదవాలని, ఏ తల్లీదండ్రీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పిల్లల తలరాతలు మారుతాయనే ఆలోచన చేసి జగనన్న విద్యాదీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెనమొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయినీ అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకే నేరుగా జమ చేస్తూ తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. దేశంలో ఎక్కడా జరగని విధంగా, ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతోంది. వైయస్సార్ ఆసరా ద్వారా, వైయస్సార్ సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మళ్లీ ఊపిరి పోశాం గతంలో పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయి, ఎన్ పీఏలు, ఔట్ స్టాండింగులుగా 18 శాతం చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడేట్టు చేసి ఇప్పుడు ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే మన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు నంబర్ 1లో ఉన్నాయి. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే, మన ప్రభుత్వం ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది. గతానికి, ఇప్పటికి తేడా చూడమని మిమ్మల్ని కోరుతున్నా. గతంలో ఎన్నడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి. వైయస్సార్ చేయూత ద్వారా 45-60 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నామైనార్టీలంటూ తోడుగా ఉంటూ ఆర్థిక పటిష్టతకు ఏకంగా 19,190 కోట్లు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా? 45-60 సంవత్సరాల మధ్య వయసున్న కాపు అక్కచెల్లెమ్మలు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15000 ఇస్తూ, వారి ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు. సొంతిల్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మల పేరుమీద కేవలం ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఒక్క అక్కచెల్లెమ్మకైనా ఇచ్చాడా అంటే... ఇచ్చింది సున్నా. కట్టింది అరకొర ఇళ్లు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం భద్రత విషయంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును, నా అక్కచెల్లెమ్మలకోసం నియమించాం. ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లో ఒక దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలా వ్యవస్థ నెలకొల్పింది మీ బిడ్డ ప్రభుత్వమే. 1.30 కోట్ల అక్కచెల్లెమ్మలు వాళ్ల ఫోన్లలో దిశ యాప్ ఉంది. ఏ అక్కచెల్లెమ్మకైనా ఏ ఆపద వచ్చినా ఫోన్లో ఎస్వోఎస్ బటన్ నొక్కినా, షేక్ చేసినా 10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది, పోలీస్ సోదరుడు వచ్చి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఇలా ఆపదలో ఉన్న 35 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఈ 58 నెలల కాలంలో పోలీసులు వచ్చి తోడుగా నిలబడినందువల్ల మంచి జరిగింది. గ్రామ గ్రామంలోనూ కూడా ప్రతి వార్డులోనూ కూడా సేవా సారథులుగా మన సచివాలయాల్లోగానీ, మన వాలంటీర్ వ్యవస్థ గానీ, ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా అందులో ఏకంగా 50 శాతం చదువుకున్న మన ఇరుగుపొరుగు చెల్లెమ్మలే. గతంలో ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా అందే పరిస్థితి ఉంటుందని 58 నెలల కిందట మీకు ఎవరైనా చెబితే నమ్మి ఉండేవారా? ఈరోజు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, రూ.2.65 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి అందింది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీ కుటుంబ సభ్యులతో మీరంతా బ్యాంకులకు వెళ్లండి. బ్యాంకు మేనేజర్లను 10 సంవత్సరాల మీ స్టేట్మెంట్ ఇవ్వమని అడగండి. 5 సంవత్సరాల చంద్రబాబు పాలన, 5 సంవత్సరాల మీ బిడ్డ పాలన. బ్యాంకు స్టేట్మెంట్లు చూసినప్పుడు చంద్రబాబు 5 సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంటుకు వచ్చింది ఒక్కరూపాయి అయినా కనిపిస్తుందా? అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంటులోకి వచ్చిందో మీరే గమనించండి. ఎప్పుడూ జరగని మార్పు, ఎప్పుడూ చూడని విషయాలు ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తోంది. లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్రరాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి. మహిళా సాధికారత పరంగా, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం. ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని రంగురంగుల కాగితాలు చూపించడం, ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో పడేసే పరిస్థితిని మార్చి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చూపించి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. మరోవంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా, అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తాయి. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. వీరిద్దరూ కలిసి ఇంటింటికీ పంచిన, వీరిద్దరి ఫొటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టోఅని చెప్పి 2014లో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తుకుచేసుకుందామా? రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతో రద్దు చేస్తామన్నారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా విడిపిస్తాం అని వాగ్దానాలు చేశాంరు. టీవీల్లో అడ్వటైజ్ మెంట్ వచ్చేది. ఒక చెయ్యి వచ్చి తాళిబొట్టు లాగేసేవారు, ఇంకో చేయి వచ్చి పట్టుకుని బాబొస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడని అడ్వటైజ్ మెంట్ ఇచ్చారు. ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు 100 చొప్పున సంవత్సరానికి 1200, 5 సంవత్సరాల్లో 6 వేల సబ్సిడీ ఇస్తామని 2014లో ఇద్దరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పారు. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వాగ్దానంచేశారు. ఆడ బిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికో పేరు కూడా పెట్టారు. మహాలక్ష్మి అని అమ్మవారి పేరు పెట్టారు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. పండంటి బిడ్డ అనే పథకం, పేద గర్భిణీ స్త్రీలకు 10 వేలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ 2014లో వీరిద్దరూ కలిసి చెప్పినవి. బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకూ స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు కుటీర లక్ష్మి అని వాగ్దానం చేశారు. ఇవన్నీ ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఫొటోలు పెట్టి సంతకాలు పెట్టి ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానామైనా కూడా ఈ బాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? అని అడుగుతున్నా? ఇద్దరూ కలిసి 2014లో మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పి అక్కచెల్లెమ్మలు నమ్మిన వారిని నట్టేట ముంచి, ఒక్క రూపాయి కూడా పొదుపుసంఘాల రుణాలు తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశారు. అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నావడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే ఇదే చంద్రబాబు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆదుకోవాలని మనసు రాలేదు. గ్యాస్ సిలిండర్ల మీద నెలకు ఐదేళ్లూ కలిసి రూ.6 వేలు సబ్సిడీ అన్న వీరు.. అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయకపోగా, విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించి వీరి జాయింట్ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల జీవితాలను ఛిన్నాబిన్నం చేసింది. ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు డిపాజిట్ చేసిన వీరు.. మీలో ఏ ఒక్కరికైనా, మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కనీసం ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? ఇలాంటి అబద్దాలు, ఇలాంటి మోసాలతో చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది మోసం, మోసం, దగా, దగా. చివరకు అమ్మవారి పేరును కూడా ఆటవస్తువుల్లా ఉపయోగించుకున్నారు. అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్లీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మహాశక్తి అని మోసానికి తెరతీస్తున్నారు. బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్లే ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలికి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చేస్తానన్న రుణ మాఫీ దారుణమైన మోసం. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం. పెన్షన్ కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది వెయ్యి. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే 2 వేలు ఇచ్చేశాం అని ఎక్కడ పడితే అక్కడ ఊదరగొడుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ మొదలు, పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్కచెల్లెమ్మలందరికీ వీరు చేసిన మోసం, దగా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మళ్లీ అక్కచెల్లెమ్మలకు ఇంటింటికీ ఇంత ఇస్తామని, బీసీ అక్కచెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని, మళ్లీ కొత్త అబద్ధాలు, కొత్త మోసాలు. ఇవి మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేశారు. చేసింది మాత్రం ఏకంగా ఒక పెద్ద సున్నా. సామాజిక వర్గాలుగానీ, అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా వీరిని నమ్మడం అంటే కాటేసే పామును,తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ ఆలోచన చేయాలి. పలాన మంచి చేశా కాబట్టి, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాం కాబట్టి, ఇదే మంచి మరోసారి చేస్తాం అని ఓట్లు అడిగే పరిస్థితి వీరిద్దరికీ లేదు. చంద్రబాబు పేరు చెప్పినా, ఆయన పాలన గుర్తుకొచ్చినా ఎక్కడా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచీ లేదు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 58 నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందూ ఉంచడం జరిగింది. ఇదీ మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం, మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. రాబోయే రోజుల్లో ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరకొచ్చి కేజీ బంగారం, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబుతారు. దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకొస్తుంది. చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి పోజులు ఇస్తూ మేనిఫెస్టో మీ ఇంటికి పంపిస్తారు. ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అనుకుంటే మాత్రం.. మీరంతా మీ బిడ్డకు సైనికులుగా, స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలని కోరుతున్నాడు. చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు. చెడిపోయిన వ్యవస్థ మారాలాంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు. దేవుడి దయ ఉండాలి, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే మీ బిడ్డ వ్యవస్థను మార్చగలుగుతాడు దేవుడి చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతున్నా. -
గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదు: సీఎం జగన్
Updates.. సీఎం జగన్ ప్రసంగం: ►మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది ►58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశాం ►అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించాం ►వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరింది. ►14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోంది. ►గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏరోజు ఆలోచించలేదు ►అక్క చెల్లెమ్మలకు చేయూతనిచ్చి చేయి పట్టుకుని నడపిస్తున్నాం ►పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించాం ►అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించినందుకు గర్వపడుతున్నా ►1,68,018 మంది అక్క చెల్లెమ్మలు కిరణా దుకాణాలు నడుపుతున్నారు ►3,80,466 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు కొన్నారు. ►1,34,514 మంది గొర్రెలు, మేకలు పెంపకం చేస్తున్నారు ►అమ్మఒడి పథకంతో 53లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ప్రభుత్వం మనది. ►పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదు. ►గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు. ►గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా? ►వైఎస్సాఆర్ చేయూత వంటి పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు. ►నామినేటెడ్ పోస్టుల్లోనూ మహిళా రిజర్వేషన్లు కల్పించాం. ►మహిళల రక్షణ కోసం దిశా యాప్, దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశాం. ►కోటి 30 లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ యాప్ ఉంది. ►మహిళా సాధికారత లక్ష్యంగా అడుగులు వేశాం. ►వైఎస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం. ►99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే పొదుపు సంఘాలు నెంబర్ వన్గా ఉన్నాయి. ►చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75వేలు ఇస్తున్నాం. ►31 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చాం. ►గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి పనులు జరిగాయా?. ►ఎక్కడా లంచాలు లేవు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీరిద్దరి పేర్లు చెబితే ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే ఆయన మోసాలు.. పవన్ కల్యాణ్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతారు. 2014లో వీరిద్దరి మేనిఫెస్టోలో ఏం చెప్పారు.. 2014లో పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. ఆడ బిడ్డ పుట్టిన వెంనే రూ.25వేలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామన్నారు. దీనికి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు. కానీ, వారు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా నియమించలేదు. ►పిసినికాడ చేరుకున్న సీఎం జగన్ ►అనకాపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ ►అనకాపల్లి బయలుదేరిన సీఎం జగన్ ►గన్నవరం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్ ►తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ‘వైఎస్సార్ చేయూత’ నాలుగో విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. ►రాష్ట్రవ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు గురువారం నుంచి నాలుగో విడత వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ►వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి మహిళకు రూ.56,250 చొప్పున అందజేసింది. ►నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్టవుతుంది. 4వ విడతగా అందించే రూ.5,060.49 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్టవుతుంది. 14 రోజులపాటు ఉత్సవంలా.. ►ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యే నాలుగో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమం ఉత్సవాల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి గురువారం బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార దిగ్గజాల ద్వారా అదనపు తోడ్పాటు ♦ వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలు ఆ మొత్తాలను వారివారి ఇష్టం మేరకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ♦ లబ్దిదారుల్లో ఎవరైనా ప్రభుత్వం అందజేసే సాయంతో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసేందుకు ముందుకొస్తే వారికి అదనపు తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం గతంలోనే హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్ గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంది. ♦ మూడు విడతల్లో లబ్ధి పొందిన మహిళల్లో ఇప్పటివరకు 16,55,591 మంది వివిధ రకాల వ్యాపారాలు ప్రారంభించి ప్రతి నెలా స్ధిర ఆదాయం పొందుతున్నారు. ♦ ఈ ఏడాది కొత్తగా జీవనోపాధులు ఏర్పాటుకు ముందుకొచ్చే లబ్దిదారులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా లేదంటే స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద ఇప్పించేందుకు మండల అధికారులు తగిన చర్యలు చేపడతారు. ♦ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఇప్పటికే వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి విజయగాధలను ఇతర లబ్దిదారులకు తెలియజేసేలా కార్యక్రమాలను, ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. -
నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్
-
YSR Cheyutha: రేపు సీఎం జగన్ అనకాపల్లి పర్యటన
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. సీఎం ప్రత్యేక విమానంలో ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.45 గంటలకు కశింకోట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో 10 నిమిషాల పాటు ముచ్చటిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి 11.15 గంటలకు పిసినికాడ వద్ద గల సభావేదిక వద్దకు చేరుకుంటారు. 11.20 గంటలకు వేదికపై మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. 11.40 గంటల నుంచి 12.40 గంటల వరకు గంట పాటు సీఎం ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్ చేయూత చివరి విడత నిధుల పంపిణీని బటన్ నొక్కి ప్రారంభిస్తారు. మహిళామార్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి కశింకోటలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. గంటసేపు ప్రజాప్రతినిధులతో ముచ్చటించిన అనంతరం 2.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 2.35 గంటలకు విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు తిరుగుపయనమవుతారు. -
అనకాపల్లి–గుంటూరు మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, గోరంట్లలో ఈనెల 7 నుంచి 10 వరకు జరిగే క్రైస్తవ మహాసభలు (గుడారాల పండుగ)కు తరలివచ్చే భక్తుల సౌకర్యం కోసం అనకాపల్లి–గుంటూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ఒక ప్రకటలో తెలిపారు. అనకాపల్లి–గుంటూరు ప్రత్యేక రైలు (07225) ఈనెల 6న రాత్రి 7.40 గంటలకు అనకాపల్లిలో బయలుదేరి, మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈరైలు (07226) ఈనెల 10న రాత్రి 10.30 గంటలకు గుంటూరులో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. ఈ రైలు తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. -
వేలు చూపించి అయ్యన్న భార్య బెదిరింపులు
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా సాగింది. వైఎస్సార్సీపీ సభ్యులపైకి టీడీపీ సభ్యులు దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సభ్యులపై అయ్యన్న సతీమణి పద్మావతి, కుమారుడు రాజేష్ బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల పొడియం వైపు వెళ్లి టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యం చేశారు. వేలు చూపిస్తూ.. అయ్యన్న సతీమణి పద్మావతి బెదిరించారు. వైఎస్సార్సీపీ సభ్యులపైకి కుమారుడు రాజేష్ దూసుకెళ్లాడు. దౌర్జన్యంగా కౌన్సిల్ సమావేశంలోకి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రవేశించారు. -
భారీగా చేయూత సభ
అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలోని పిసినికాడ గ్రామంలో ఈనెల 7న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించే “చేయూత’ సభ భారీ ఎత్తున విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. స్థానిక రింగ్రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ పార్టీ నాయకులు, శ్రేణులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సభను ఎన్నికల శంఖారావ సభగా పరిగణించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారిలో చాలామందికి అవకాశాలు లభించాయని, మిగిలిన వారికి కూడా పార్టీలో తగిన న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలందరికీ అందాలంటే మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఈ ప్రయత్నానికి పునాది అనకాపల్లిలోనే పడాలని ఆయన అన్నారు. ఇతర పార్టీల నుంచి మన పార్టీలోకి రావడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారని, వారిని స్వాగతించాలన్నారు. ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం సభలు విజయవంతం అవుతున్నాయని, పిసినికాడ సభ గొప్పగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీఐడబ్ల్యూఏ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ మరోసారి సీఎంగా జగన్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, పార్టీ అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్కుమార్, పార్టీ వైద్యవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డేడ లక్ష్మీనరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
అనకాపల్లి నుండి నాగబాబు పరార్
-
ఆరని మంటలు.. బాబుకు చెమట్లు!
సాక్షి, అనకాపల్లి/సాక్షి, అమలాపురం/ అయినవిల్లి/మడకశిర/పెనుకొండ/ఉదయగిరి: రాష్ట్రంలో టికెట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అభ్యర్థుల ఖరారు విషయంలో అధినేత అనుసరిస్తున్న వైఖరిపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా జెండా మోసినవారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చినవారికి అందలం ఎక్కించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అనకాపల్లిలో పెల్లుబికిన నిరసనలు అనకాపల్లి స్థానాన్ని టీడీపీ–జనసేన కూటమి తరఫున కొణతాల రామకృష్ణకు కేటాయించడంపై అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లుగా తాను పార్టీకోసం కష్టపడితే తనను పార్టీ అధిష్టానం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అక్కడి అభ్యర్థి కొణతాల తనను పట్టించుకోకుండా తన వ్యతిరేక వర్గమైన బుద్ధా నాగ జగదీశ్ను కలవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని పీలాపై ఆయన వర్గీయులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. బాబు సతీమణి భువనేశ్వరి అడ్డగింత ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరిని యలమంచిలి వెళ్లే దారిలో కూండ్రం వద్ద పీలా గోవింద వర్గీయులు అడ్డుకున్నారు. అనకాపల్లి రూరల్ మండల అధ్యక్షుడు పచ్చికూర రాము ఆధ్వర్యంలో నాయకులు సుమారు 10 నిమిషాలపాటు రోడ్డుకు అడ్డంగా నిలబడి పీలా గోవిందకే అనకాపల్లి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే భువనేశ్వరి కారు దిగి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో వారంతా తప్పుకున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు ‘బొల్లినేని’ నిర్ణయం నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థిగా తనను నియమించనందుకు ఇక తాడోపేడో తేల్చుకోవాలని అక్కడి టీడీపీ ఇన్చార్జి బొల్లినేని వెంకట రామారావు నిర్ణయించుకున్నారు. పన్నెండేళ్లుగా పార్టీని, కేడర్ను కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కు టికెట్ కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆత్మీయుల వద్ద వెలిబుచ్చి కన్నీటిపర్యంతం కావడంతో కేడర్ ఉద్రేకానికి లోనైంది. ఒక్క మాట చెబితే కాకర్లను ఉదయగిరిలో నామినేషన్ కూడా వేయనివ్వమని తేల్చిచెప్పింది. గురువారం కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయులతో మాట్లాడుతూ తనకు టికెట్ విషయంలో న్యాయం జరగకపోతే కార్యకర్తల అభీష్టం మేరకు మార్చి రెండో తేదీన అధినేతను కలసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. పెనుకొండలో కొనసాగుతున్ననిరసనలు అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కాదని అన్నా క్యాంటీన్ అంటూ హడావుడి చేసిన సవితకు టికెట్ ఇవ్వడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలు రోజూ బీకే ఇంటి వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. పార్థసారథికి టికెట్ ఇవ్వకుంటే టీడీపీని ఓడిస్తామని నేతలు చెబుతున్నారు. సునీల్ను మార్చకుంటేరాజీనామా శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్కుమార్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గురువారం మరోసారి తిప్పేస్వామి వర్గీయులు నిరసనకు దిగారు. సునీల్ను మార్చకుంటే తామంతా రాజీనామా చేయడానికి వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. -
అనకాపల్లి: చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం
సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ వదులుకుంది. పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు జనసేనకు కేటాయించింది. జనసేన నుంచి ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీకి దింపింది. టీడీపీ కార్యకర్తలను కొణతాల అనేక రకాలుగా వేధించారని ఇప్పుడు ఆయనతో కలిసి ఎలా పని చేయమంటారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు, అనకాపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో జనసేనకు సీటు కేటాయించడంపై పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో పీలా గోవింద్ సమావేశం నిర్వహించారు. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని గోవింద్పై టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
విశాఖ: నాగబాబు ఐరన్లెగ్ అంటూ..
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై స్పష్టత లేకపోయినా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలో హంగామా చేస్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి తానే బరిలో ఉంటానంటూ అనుచరగణంతో లీకులు ఇప్పిస్తున్నారు. ఆ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఇదే స్థానం నుంచి టీడీపీ తరఫున తన కుమారుడు విజయ్ను నిలపాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తలపోస్తుండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారి దిలీప్ చక్రవర్తిని బరిలోకి దించాలని మరో వర్గం ప్రయత్నిస్తోంది. ఆయన ఈ టిక్కెట్టును ఆశిస్తూ వివిధ రూపాల్లో డబ్బు పంపిణీ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇంతలో ఇటీవలే జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాగబాబు వారం పది రోజులుగా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ, కార్యకర్తలతో సమావేశమవుతూ హడావుడి చేస్తున్నారు. వారం తిరగకుండానే గురువారం మరోసారి వచ్చారు. ఈసారి ఆయన యలమంచిలిలోనే నివాసం ఉండబోతున్నానని కూడా ప్రకటించారు. దీంతో జనసేన నుంచి అనకాపల్లి లోక్సభ అభ్యర్థిని తానేనని చెప్పకనే చెప్పారు. గురువారం రాత్రి పార్టీ సమన్వయకర్తలతో రాంబిల్లి మండలం వెంకటాపురంలో సమావేశమయ్యారు. ఒకపక్క పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే పర్యటనలు కొనసాగిస్తున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటే యలమంచిలిలో నివాసం ఉండాల్సిన అవసరం ఎందుకని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి నాగబాబు అభ్యర్థిత్వం ఖరారైందనే భావన కలిగించేందుకే ఈ సంకేతాలిస్తున్నారని వీరంటున్నారు. అయ్యన్నకు చెక్ పెట్టడానికే నాగబాబుకు ఈ సీటు ఖాయం చేశారన్న ప్రచారం కూడా టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ముందుకొచ్చిన సుందరపు బ్రదర్స్.. నాగబాబుతో సన్నిహితంగా ఉంటున్న యలమంచిలి ప్రాంతానికి చెందిన సుందరపు బ్రదర్స్ (విజయ్కుమార్, సతీష్కుమార్) నాగబాబుకు నివాసం సమకూరుస్తున్నారని జనసేన నాయకులు చెబుతున్నారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఇటీవల నిర్మించిన భవనాన్ని నాగబాబు తాత్కాలిక నివాసానికి ఇస్తారని అంటున్నారు. అలా కానిపక్షంలో జనసేనలో మరో నాయకుడు పీవీజీ కుమార్ కూడా తన ఇంటిని ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐరన్ లెగ్ అంటున్న శ్రేణులు..? ఒకపక్క నాగబాబు అనకాపల్లిపై హంగామా చేస్తుంటే జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ఆయనకు షాకిచ్చేలా చర్చించుకుంటున్నారు. నాగబాబుది ఐరన్ లెగ్ అని, అనకాపల్లి నుంచి పోటీ చేస్తే ఓటమి ఖాయమని, ఇక్కడ కాకుండా మరెక్కడ నుంచైనా పోటీ చేసుకోవడం మంచిదని గుసగుసలాడుకుంటున్నారు. దీనిని బట్టి నాగబాబు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం వీరిలో చాలామందికి ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోంది. మొత్తమ్మీద నాగబాబు చేస్తున్న హడావుడి ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణుల్లో అలజడి రేపుతోంది.