మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన సీఐ | ci vehicle collided..six injured | Sakshi
Sakshi News home page

సీఐ వాహనం ఢీకొని ఆరుగురికి గాయాలు

Published Tue, Jan 30 2018 4:54 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

ci vehicle collided..six injured - Sakshi

ట్రైనింగ్‌ సీఐ గిరీష్‌ రావు

మేడ్చల్ జిల్లా : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో అంబర్ పేట్ ట్రైనింగ్ సీఐ గిరీష్ రావు బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో తన ఇన్నోవా కారు(ఏపీ 10ఎస్‌ 6678)తో దారిన పోతున్న పాదచారులను ఢీకొన్నాడు. ఈ ఘటనలో బిక్షపతి, సత్య లక్ష్మీ అనే ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరో నలుగురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. సీఐ గిరిష్ రావుపై సెక్షన్-337,338,185 మోటారు వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకుని సీఐని రిమాండుకు తరలించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో కారు నడిపి జనాలను గాయపరించినందుకు గానూ సీఐ గిరీష్ రావును సస్పెండ్ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement