రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం | Four People Died In Road Accident YSR Kadapa District | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

Dec 11 2019 9:24 AM | Updated on Dec 11 2019 2:34 PM

Four People Died In Road Accident YSR Kadapa District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవాను లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా... మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. పొద్దుటూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాయచోటికి చెందిన అర్షద్‌, హజీరా, చిత్తూరు జిల్లాకు చెందిన హరుణ్‌ బాషా, అఫిరాలు మృత్యువాతపడ్డారు. హజీరా, అర్షద్‌లు రాయచోటికి చెందిన స్టార్‌ పైపుల షాపు యజమాని కూతురు, అల్లుడు అని సమాచారం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement